Karnatka Elections: మోదీ..మోదీ.. నినాదాలతో హోరెత్తిన రోడ్షో..
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) ప్రచారం మరి కొద్ది గంటల్లోనే ముగియనుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బెంగళూరు సిటీలో భారీ రోడ్షోలో (Roadshow) పాల్గొన్నారు..
ప్రజలు రోడ్డుకి ఇరువైపులా పెద్ద సంఖ్యలో మోదీకి స్వాగతం పలికారు. మోదీ...మోదీ నినాదాలు హోరెత్తాయి. ప్రజలకు అభివాదం చేస్తూ మోదీ ఉత్సాహంగా రోడ్షోలో పాల్గొన్నారు. తిప్పసండ్ర రోడ్డులోని కెంపెగౌడ విగ్రం నుంచి ప్రారంభమైన రోడ్షో ట్రినిటీ రోడ్ వద్ద ముగిసింది. గంటన్నర వ్యవధిలో 8 కిలోమీటర్ల మేరకు రోడ్షో జరిగింది.
తొలుత, బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపెగౌడ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం ఈస్ట్, సెంట్రల్ బెంగళూరులోని సుమారు అరడజను అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రోడ్షా సాగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనంలో మోదీ ఈ యాత్ర సాగించారు. ఆయన వెంట కర్ణాటక రాజ్యసభ సభ్యుడు, కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ కూడా వాహనంలో ప్రయాణించారు. రోడ్లపైన, భవనాలపైన పెద్దసంఖ్యలో గుమిగూడిన ప్రజానీకానికి మోదీ అభివాదం చేయడంతో, అందుకు ప్రతిగా వారు...మోదీ మోదీ, భారత్ మాతాకీ జై నినాదాలు చేశారు..
SB NEWS











May 07 2023, 18:06
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.6k