madagoni surendar

Apr 26 2023, 19:43

నల్గొండ జిల్లా:క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న మూట అరెస్ట్. పోలిసుల మెరుపు దాడి లో తొమ్మిది మంది రిమాండ్..

క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న మూట అరెస్ట్.

పోలిసుల మెరుపు దాడి లో తొమ్మిది మంది రిమాండ్..

Streetbuzz NeWS.నల్గొండ జిల్లా :

.

1కోటి 12 లక్షల రూ.. నగదు, రెండు కార్లు

30 లక్షల విలువ గల 14 సెల్ ఫోన్లు, స్వాధీనం

చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

నల్లగొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు..

శనార్తి తెలంగాణ/నల్లగొండ:

ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నా 9 మంది ముఠాను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వ రావు బుధవారం జిల్లా కేంద్రంలోని పోలిస్ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో తెలిపారు..

వీరి వద్ద నుండి 1 కోటి 12 లక్షల రూపాయల నగదు, రెండు కార్లు, 30 లక్షల విలువ గల 14 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అపూర్వరావు వెల్లడించారు..

ఈనెల 25న మిర్యాలగూడ పరిధిలో మయూరి నగర్ హౌసింగ్ బోర్డు లోని ప్లాట్ నెంబర్ 303 సాయి దత్త అపార్ట్మెంట్లో చట్ట విరుద్ధమైన క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు,

సమాచారం మేరకు మిర్యాలగూడ 1 టౌన్ సిఐ రాఘవేందర్, ఎస్సై శివతేజ, కట్టంగూర్ ఎస్సై దాచేపల్లి విజయ్ కుమార్, ట్రాన్స్పోర్ట్ పోలీసులు మూకుమ్మడిగా మెరుపు దాడి చేశారు..

అపార్ట్మెంట్ లోకి ప్రవేశించి ఐపీఎల్ బెట్టింగ్ రాయుళ్లు బంటు రాకేష్, కొల సాయి కూమార్,జీవన్, సత్యనారాయణ, శాఖమూరి ఉదయ్, బంటు సంతోష్, గంధం నవీన్, బంటు శివ, రాజేష్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించమన్నారు ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లో కీలక వ్యక్తి ఏ వన్ అయినా బంటు రాజేష్ కుమార్ గత మూడు సంవత్సరాలుగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తాడు, ఇతను టెలిగ్రామ్ యాప్ ద్వారా హార్థిక్ బుక్‌ ఫైనల్ నుండి మెయిన్ లైన్ యాక్సిస్ ని తీసుకున్నాడు, ఈ లింకును తన బామ్మర్ది అయిన కోల సాయికుమార్ కు ఫార్వర్డ్ చేసి ఇట్టి యాప్ ద్వారా మొబైల్ ఫోన్లకు కనెక్ట్ చేసి ఆన్లైన్ లో చాలామందికి ఆన్లైన్ కమిషన్ ద్వారా పైన తెలిపిన వ్యక్తుల సహాయంతో ఈ నెట్వర్క్ లో జాయిన్ చేసుకొని ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పెడుతూ సులభంగా డబ్బు సంపాదిస్తారు..

ఈ కేసును చాకచక్యంగా డిఎస్పి వెంకటగిరి పర్యవేక్షణలో వన్టౌన్ సిఐ రాఘవేందర్, కట్టంగూర్ ఎస్సై విజయ్ కుమార్, మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, వన్ టౌన్ ఎస్ఐ శివతేజ, పలువురు కానిస్టేబుల్స్ ని జిల్లా ఎస్పీ అభినందించారు..

madagoni surendar

Apr 26 2023, 19:22

నల్గొండ జిల్లా:కేతేపల్లి:రైతులు ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

రైతులు ఆందోళన చెందవద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

.

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.బుధవారం కేతపల్లి మండలం గుడివాడ గ్రామంలో 

మంగళవారం అకాల వర్షానికి పంట నష్టపోయిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా.                    

ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ...                      

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు.దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వలన రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారురాష్ట్రంలోని రైతులు ఆందోళన చెందవద్దని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే చిరుమర్తి తెలిపారు.ఈ మద్యనే కురిసిన ఆకాల వర్షాల నేపద్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతుల విషయంలో అత్యంత సానుకూలంగా ఉండే రైతు ప్రభుత్వమని రాష్ర్టంలో ఉందన్నారు. వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనా వేస్తున్నారని అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు నష్టపోయిన వడ్ల మార్కెట్లను సందర్శించాలని ఆదేశించారు నష్ట పరిహారం త్వరగా అందించేందుకు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, నకిరేకల్ జెడ్పిటిసి మాద ధనలక్ష్మి నాగేష్ గౌడ్, కట్టంగూర్ జడ్పిటిసి తరాల బలరాం,కేతేపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మారం వెంక రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు రాచకొండ భద్రయ్య గౌడ్,గుడివాడ గ్రామ సర్పంచ్ కట్ట శ్రవణ్,ఉప సర్పంచ్ రాచకొండ సైదులు,వార్డ్ నెంబర్లు,సీనియర్ నాయకులు రాచకొండ పురుషోత్తం,వేములకొండ లింగయ్య,వేములకొండ యాదయ్య,రాచకొండ లింగయ్య,రాచకొండ జానయ్య, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 26 2023, 16:15

నల్గొండ జిల్లా:నకిరేకల్:విఓఏ ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం.బిఎస్పి నియోజకవర్గం ఇంచార్జి ప్రియదర్శిని మేడి.

విఓఏ ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం. బిఎస్పి నియోజకవర్గం ఇంచార్జి ప్రియదర్శిని మేడి

.

Streetbuzz news.నల్గొండ జిల్లా:

.

గ్రామ సంఘాలలో పనిచేసే ఐకెపి విఓఏల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిఎస్పి నియోజకవర్గం ఇంచార్జి ప్రియదర్శిని మేడి అన్నారు,బుధవారం నకిరేకల్ పట్టణ కేద్రంలో మరియు కేతేపల్లి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంఎదుట గ్రామ సంఘం వివోఏలు చేపడుతున్న సమ్మె బుధవారం తో 10వ రోజుకు చేరింది,ఈ సమ్మెకు ఆమె మద్దతు తెలిపితూ ఈసందర్బంగా.ఆమె మాట్లాడుతూ..కనీస వేతనం గుర్తింపు లేకుండా సేవలు అందిస్తున్న వివోఏలపై ప్రభుత్వం కక్ష్య సాధింపు సరికాదన్నారు, విఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26000 చెల్లించాలని , సెర్ప్ నుండి ఐడి కార్డులు ఇవ్వాలని, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, అర్హత కలిగిన విఓఏలను సీసీలుగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు, బిఎస్పి తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, నియోజకవర్గ కార్యదర్శి చందుపట్ల శృతి, మండల అధ్యక్షులు ఎడ్ల విజయ్, విఓఏ మండల అధ్యక్షురాలు సుమీల,కార్యదర్శి సత్యనారాయణ,కోశాధికారి రాణి,వాణి,సంధ్య, మట్టయ్య,శ్రీనివాసులు, రామసుశీల, భాగ్యలక్ష్మి,మంగమ్మ,సరిత బిఎస్పి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 26 2023, 06:57

నల్గొండ జిల్లా:తెలంగాణకు గుండె బలాన్నిచ్చిన జెండా గుండె గుండెను ఒకటి చేసిన జెండా ఉద్యమానికి ఊపిరి పోసిన జెండా.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

ఊరూరా గులాబీ జెండా పండుగ.

తెలంగాణకు గుండె బలాన్నిచ్చిన జెండా గుండె గుండెను ఒకటి చేసిన జెండా ఉద్యమానికి ఊపిరి పోసిన జెండా.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి.

.

Streetbuzz. News. నల్గొండ జిల్లా:

.

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల సభ.

నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామాలలో జెండా ఆవిష్కరించి తదుఅనంతరం. ప్లీనరీ సభకు భారీగా నాయకులు కార్యకర్తలు తరలివచ్చిన బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు..

ర్యాలీగా సభా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే చిరుమర్తి..

మొదట పార్టీ జెండా ఆవిష్కరణ,మరియు.అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించాచి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలు వేసి. అనంతరం.

తీర్మానాలు,ఆమోదాలతో పండగ వాతావరణంలో సాగిన ప్లీనరీ సభ.ఈ కార్యక్రమంలో. రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, నల్గొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, షీప్ అండ్ గోట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి,నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్,జడ్పీటీసీలు,ఎంపీపీలు,ఎంపీటీసీలు,సర్పంచులు, ఉపసర్పంచ్లు, వార్డునెంబర్లు,మండల, పట్టణ,గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 25 2023, 14:15

తెలంగాణలో దారుణ ఘటన...

తెలంగాణలో దారుణ ఘటన...

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో యువకుడి దారుణ హత్య...

చుట్టూ పక్కల జనం చూస్తుండగానే ఓ యువకుడిని బండరాయితో కొట్టి చంపిన కుటుంబం...

ఓ పెళ్ళైన వివాహితకు అసభ్యకరమైన మెస్సేజ్ లు చేస్తున్నాడని హత్య చేసిన కుటుంబ సభ్యులు...

దారుణ హత్య వీడియో మొబైల్ లో చిత్రీకరణ...

మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది...

madagoni surendar

Apr 24 2023, 21:03

నల్గొండ జిల్లా :నార్కట్ పల్లి:*రజకుల అభివృద్ధికి బిఎస్పీ పార్టీ నుండి సహాయ సహకారాలు ఉంటాయి

రజకుల అభివృద్ధికి బిఎస్పీ పార్టీ నుండి సహాయ సహకారాలు ఉంటాయి

Streetbuzz news. నల్గొండ జిల్లా :

.

నార్కట్ పల్లి మండలం అక్కేనపల్లి గ్రామం లో రజక సమావేశం జరిగింది..గ్రామంలో నూతనంగా ఏర్పడిన చాకలి అయిలమ్మ రజక సంఘ సర్వసభ్య తొలి సమావేశం అక్కేనపల్లి సత్తయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశం లో రజక వృత్తిదారుల అభివృద్ధి కోసం చేయవల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు.ఈ సమావేశం లో గౌరవ అతిధి హోదాలో బెక్కంటి గణేష్ బీఎస్పీ మండల ఉపాధ్యక్షులు మాట్లాడుతూ రజకుల అభివృద్ధి కి బీఎస్పీ పార్టీ నుండి సహాయ సహకారాలు ఉంటాయని పేర్కొన్నారు. రజక నాయకులు మాట్లాడుతూ.. ప్రతి గ్రామం లో రజక వృత్తిదారుల సంఘం ఏర్పాటు చేయాలని తెలిచేసారు.ఈ సమావేశం లో ఉపాధ్యక్షుడు సత్యనారాయణ , జనరల్ సెక్రెటరీ శ్రావణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ యాదయ్య , సెక్రెటరీ నరసింహ , ముఖ్య సలహా దారులు భద్రయ్య ధనుంజయ , సభ్యులు రాములు కిష్టయ్య బిక్షమయ్య , సత్తయ్య గణేష్ సునీల్ అరుణ్ అంజి తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Apr 24 2023, 17:49

నల్గొండ జిల్లా :నకిరేకల్:పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి*

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి

.

Streetbuzz news. నల్గొండ జిల్లా :

.

చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో మన ఊరు మన బడి కార్యక్రమాలు నిర్వహించారు.ఈ మేరకు పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిని చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వలేకపోతుందన్నారు. ప్రశ్నించిన వారిపై ఈడీ పేరుతో భయబాoత్రులకు గురి చేస్తోదన్నారు.

అనంతరం..

రామన్నపేట మండల కేంద్రంలో రామన్నపేట నుండి అమ్మనబోలు పి.డబ్ల్యు.డి రోడ్ నుండి లక్ష్మ పురం రోడ్డు మరమ్మతులకు రూ.33 లక్షలు మరియు చిట్యాల - భువనగిరి నుండి జైకేసారం వయా సిరిపురం రోడ్డు మరమ్మతులకు రూ. 4 కోట్ల 15 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసిన.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.

madagoni surendar

Apr 24 2023, 17:13

నల్గొండ జిల్లా:నకిరేకల్::ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య   

మన ఊరు-మన బడి కార్యక్రమంతో మారుతున్న తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి* 

.

 Streetbuzz news. నల్గొండ జిల్లా :        

.

        

         

  మన ఊరు మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను బలోపేతం చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం నకిరేకల్ మండలం నోముల గ్రామంలోని ప్రభుత్వ మండల ప్రాధమిక పాఠశాల మరియు నకిరేకల్ పట్టణంలోని మండల ప్రాధమిక (బాలికల) పాఠశాల మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.50 లక్షలతో మౌలిక వసతుల బలోపేత పనుల ప్రారంబోత్సవానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హజరై ప్రారంభించారు.                            ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ....... తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగ రక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి పేద మధ్య తరగతి వర్గాల పిల్లలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుందన్నారు అని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసేందుకు మన ఊరు మన బడి పథకం తో ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు మౌలిక సదుపాయాలు అదనపు తరగతి గదులు, మంచినీటి సౌకర్యం, విద్యుత్తు మూత్రశాలలు, మరుగుదొడ్లు, కిచేన్ షెడ్లు, డైనింగ్ హాల్లు, ప్రహరీ గోడలు,డిజిటల్ క్లాస్ రూమ్స్ ల ఏర్పాటుకోసం లక్షల బడ్జెట్ను పాఠశాల విద్యా కమిటీ ఖాతాల్లో జమ చేసింది అన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.. ఈ కార్యక్రమంలో.నకిరేకల్ జడ్పీటీసీ మాద ధనలక్ష్మినాగేష్ గౌడ్,నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మండల కో ఆప్షన్ నెంబర్ డాక్టర్ ఖాసీం ఖాన్,నోముల గ్రామ శాఖఅధ్యక్షులు ఆలకుంట్ల సైదులు,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,వార్డ్ నెంబర్లు, సీనియర్ నాయకులు యల్మాకంటి జానయ్య గౌడ్,మండల ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు,నోముల గౌడ సంఘం అధ్యక్షులు బాధిని రాము గౌడ్,యువజన నాయకులు బాధిని సైదులు గౌడ్,రాచకొండ గోపి గౌడ్, టీచర్లు,విద్యార్థులు, నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.

madagoni surendar

Apr 23 2023, 16:03

రేపు ఖమ్మంలో జరగబోయే నిరుద్యోగ నిరసన దీక్ష ఏర్పాట్లలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జ్ కొండేటి మల్లయ్య

రేపు ఖమ్మంలో జరగబోయే నిరుద్యోగ నిరసన దీక్ష ఏర్పాట్లలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జ్ కొండేటి మల్లయ్య

Streetbuzz news. నల్గొండ జిల్లా :

.

ఖమ్మంలో జరగబోయే నిరసనదీక్షకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి హాజరవుతుండటంతో ముందుగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్, సమన్వయ సమావేశంలో పాల్గొని ఈ సందర్భంగా కొండేటి మల్లయ్య మాట్లాడుతూ..

రేపు జరగబోయే నిరుద్యోగ నిరసన దీక్షను విజయవంతం అవుతుంది.

రేవంత్ రెడ్డి హాజరయ్యే నిరుద్యోగ నిరసన దీక్షకు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి.

లక్షల మంది నిరుద్యోగులు తరలి వస్తున్నారు, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష దద్దరిల్లబోతోంది.

ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దిపేంతవరకూ ఊరుకోబోం కేంద్రం రాష్ట్రాల్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, నిరుద్యోగులకు, ప్రజలందరికీ మంచి రోజులు రాబోతున్నాయి.

ఈ ఏర్పాట్ల కార్యక్రమంలో

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి కొండేటి మల్లయ్యతో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంతురావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జయప్రకాశ్, ముఖ్యమైన నేతలు పాల్గొన్నారు.*

madagoni surendar

Apr 23 2023, 15:57

నల్గొండ జిల్లా:నకిరేకల్:బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం

బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ నకిరేకల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం

Streetbuzz news నల్గొండ జిల్లా :

నకిరేకల్ పట్టణ కేంద్రంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీద మరియు కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన నిరాధరమైన ఆరోపణలు ఖండిస్తూ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పిలుపు మేరకు నకిరేకల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా జలెందర్ రెడ్డి సూచన మేరకు. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నకిరేకంటి శ్రీను ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొని.నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా. గుండా జలెందర్ రెడ్డి మరియు బొంబాయ్ శ్రీను మాట్లాడుతూ.. తక్షణమే రాజేందర్ క్షమాపణ చెప్పాలని లేదంటే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడికి అక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు...ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు వేదాసు శ్రీధర్ పాల్గొన్నారు.వారి వెంట మాజీ వార్డు మెంబర్ గునగంటి రాజు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొంబాయి శ్రీను,మెడబాయిన నాగరాజు గంగరపు గణేష్ రవి,రాజు,మహేష్,భాస్కర్,అనిల్,రవి,శివ,వినయ్ రమేష్,తదితరులు పాల్గొన్నారు