నేడు సూర్యగ్రహణం.. నాలుగు రాశుల వారు ఈ విషయాల్లో జాగ్రత్త
నేడు సూర్యగ్రహణం. ఈ ఏడాది ఏప్రిల్ 20 గురువారం అమావాస్య రోజున సూర్యగ్రహణ ఏర్పడనుంది. ఉదయం 7.05 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 గంటలకు ముగుస్తుంది.
అంటే దాదాపు 5 గంటల 25 నిమిషాల పాటు ఉంటుంది. అయితే ఇది భారత్లో కనిపించదు.
ఇక ఈ సూర్యగ్రహణం రోజు కొన్నిగ్రహాల కలయిక జరుగుతుంది. అందువలన నాలుగు రాశులవారు జాగ్రత్తగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు. ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, ఈ సూర్యగ్రహణం ఏ రాశులపైన ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి :
మేష రాశివారు సూర్యగ్రహణం రోజు శుభకార్యాలు చేయడం, కొత్త పనులు ప్రారంభించడం, కొత్త వస్తువులు కొనడం అస్సలే మంచిది కాదంట. గ్రహణం ప్రభావంతో ఈ రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది.
వృశ్చిక రాశి :
ఈ రాశి వారిపై సూర్యగ్రహణ ప్రభావం అధికంగా ఉంటుంది. దీని వలన వీరు ఆర్థిక సమస్యలు, ఖర్చులు అధికం కానున్నాయంట. అంతే కాకుండా చిన్న చిన్న గొడవలు జరుగుతాయంట. అందువలన ప్రతీ విషయంలో ఆచీ తూచీ అడుగు వేయాలంటున్నారు పండితులు. ఇక వీరు శివనామస్మరణ చేయడం చాలా మంచిదంట.
కన్యరాశి:
ఈ రాశి వారు సూర్యగ్రహణం రోజు కొత్త పనులు ప్రారంభించకూడదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా నడపాలి. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.
మకర రాశి :
ఈరాశి వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే ఆర్ధిక సమస్యలు, ఖర్చులు అధికం కానున్నాయి. చేయాలనుకున్న పనులు అలాగే నిలిచిపోతాయి. ఇక గ్రహణం ఉన్నందున కొత్త పనులేవీ ప్రారంభించకూడదు.













Apr 20 2023, 07:37
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
8.3k