madagoni surendar

Mar 29 2023, 20:18

ఏపీ :అమరావతి: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు

అమరావతి:

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన అభిలషించారు. భద్రాద్రి, ఒంటిమిట్ట ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని ముఖ్యమంత్రి అభిలషించారు.

madagoni surendar

Mar 29 2023, 20:09

ఎన్టీఆర్ జిల్లా :జగ్గయ్యపేట: పోటా పోటీగా ప్రచారం, గెలుపుపై ఇరువురు ధీమా. జగ్గయ్యపేట: జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తంగా మారాయి.

జగ్గయ్యపేట:

రసవత్తంగా జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు.

_పోటా పోటీగా ప్రచారం, గెలుపుపై ఇరువురు ధీమా.

జగ్గయ్యపేట: జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తంగా మారాయి. జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ లో మొత్తం 69 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు ప్రెసిడెంట్ పదవికి, మరో ఇద్దరు జనరల్ సెక్రెటరీ పదవికి పోటీలో ఉన్నారు. మిగిలిన పదవులకు ఏకగ్రం అయ్యాయి. వీటిలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అన్నేపాక సుందర్ రావు, అన్నేపాక కాంతారావులు పోటీ పడుతుండగా, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అభ్యర్థులుగా ఎలమంచిలి నాగ రాజేంద్రప్రసాద్, మెట్టెల వీరాంజనేయులు పోటీపడుతున్నారు. ఒకరికొకరు నేను గెలుస్తా అంటే నేను గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నేపాక సుందర్ రావు గతంలో ఐదు సంవత్సరాలు పాటు బార్ ప్రెసిడెంట్ గా చేసిన అనుభవంతో పాటు గతంలో చేసిన అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయని ధీమాతో ఉండగా, అన్నెపాక కాంతారావు గతంలో ప్రెసిడెంట్ గా పోటీ చేసి ఓడిపోవడం, మరోమారు జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. సీనియర్ న్యాయవాదిగా, న్యాయవాదులతో తనకున్నటువంటి సన్నిహిత సంబంధం దృశ్య తాను గెలుస్తానని గెలుపు దేమాతో అన్నారు.

_తను గతంలో చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుంది: అన్నపాక సుందర్ రావు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభ్యర్థి.

గతంలో తాను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో కోర్టు మొక్క ముఖ ద్వారం వద్ద ఆర్చి ఏర్పాటుతోపాటు బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందని, బార్ అసోసియేషన్ కు రెండు వైపులా కారిడార్ ఏర్పాటుతోపాటు, కోర్టు గ్రీన్సు ఏర్పాటు చేయడం, న్యాయవాదులకు 35 కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు అసోసియేషన్ టేబుల్స్ పై క్లాత్ లు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీళ్లు నిరంతరాయంగా మినరల్ కూల్ వాటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది. తాను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో బార్ అసోసియేషన్ స్థలం కేటాయింపు జరిగింది. తాను ప్రస్తుతం ప్రెసిడెంట్ గా గెలుపొందితే పైన గల ఏ డి ఏం కోర్టు ప్రక్కన న్యాయవాదులు, కక్ష దారుల సౌకర్యార్థం షెడ్డు ఏర్పాటు చేయటంతో పాటు ప్రతి ఒక్క న్యాయవాదికి కోర్టులో కూర్చోవడానికి కుర్చీలను ఏర్పాటు చేస్తానని, కోర్టులో ఇతర అభివృద్ధితో పాటు న్యాయవాదులకు మంచినీటి సౌకర్యం కల్పిస్తామన్నారు. కోర్టులో సిబ్బంది తక్కువగా ఉండటం జరిగిందని, దీంతో సిబ్బందిపై పని భారం పెరిగినందున వారు పడుతున్న ఇబ్బందులను గౌరవ న్యాయమూర్తుల దృష్టికి తీసుకువెళ్లి సిబ్బందిని ఏర్పాటు చేయుటకు కృషి చేస్తానన్నారు. గతంలో తాను ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో మంజూరైన బార్ అసోసియేషన్ స్థలం నందు బిల్లింగ్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. న్యాయవాదులకు ప్రభుత్వం నుండి గాని ప్రభుత్వేతర సంస్థల నుండి గాని లబ్ధి చేకూర్చేలా కృషి చేస్తానన్నారు. ఈ పనులు తప్పక చేయగలరని కాబట్టి తనపై నమ్మకం ఉంచి న్యాయవాదు మిత్రులందరు తనకు, జనరల్ సెక్రెటరీగా పోటీ చేయుచున్న ఎలమంచిలి నాగ రాజేంద్రప్రసాద్ కు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరారు.

_బారు సభ్యుల ఆత్మగౌరవాన్ని కాపాడుతా. అన్నేపాక కాంతారావు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభ్యర్థి.

తాను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైతే న్యాయవాదులు యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడతానని, ప్రతి న్యాయవాది సంరక్షణ కోసం బార్ కు కావలసిన అన్ని వసతులు, న్యాయవాదులకు వచ్చినటువంటి కష్టాన్ని బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి తీర్చుటకు ప్రయత్నం చేస్తానన్నారు. బార్ కు బెంచ్ కు తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా ఉండేటట్లు చూడటం, న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు ప్రభుత్వం నుండి రావలసిన సౌకర్యాలను న్యాయవాదులు అందించడం, బార్ లో కావలసిన వసతులు న్యాయవాదులందరుతో కలిసి సమిష్టిగా పనిచేసి వాటిని సంపాదించుకోవడం జరుగుతుందని కాబట్టి తనను బార్ ప్రెసిడెంట్ గా గెలిపించాలని న్యాయవాదులను కోరారు. ఇప్పటికే ప్రచారం గడువు ముగియగా ఎవరికి వారే గెలుపు దీమాతో ఉన్నారు. 69 మంది న్యాయవాదులలో 9 మంది న్యాయవాదులు న్యూట్రల్ గా ఉండటం జరిగింది. ఈ తొమ్మిది మంది న్యాయవాదులు ఓట్లు ఎవరికి పడితే వారే గెలుస్తారని తెలుస్తుంది. గెలుపు ఓటములు తెలియాలంటే ఈనెల 31 సాయంత్రం ఐదు గంటల వరకు వేచి చూడాల్సిందే.

madagoni surendar

Mar 29 2023, 20:05

ఏప్రిల్ 5 న ఢిల్లీ లో కార్మిక, కర్షక ర్యాలీని జయప్రదం చేయండి - సిఐటియు*

ఏప్రిల్ 5 న ఢిల్లీ లో కార్మిక, కర్షక ర్యాలీని జయప్రదం చేయండి - సిఐటియు

Streetbuzz news :

ఏప్రిల్ 5న చలో ఢిల్లీ జయప్రదం చేయాలని

వీరులపాడు మండలం జుజ్జూరు లో కరపత్రాలు పంపిణీ చేస్తూ వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ

ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎ.కమల మాట్లాడుతూ

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం 65శాతం ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారని అని తెలిపారు. వ్యవయసాయ రంగాన్ని కార్పొరేట్ పరం చేసేందుకు తెచ్చిన మూడు నల్ల చట్టాలు, విద్యుత్ బిల్లు రద్దుకై రైతులు సంవత్సరం పైగా నడిపిన చారిత్రాత్మక ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిన చట్టాల రద్దు ప్రకటించినా దొడ్డి దారిన అమలు జరపాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు

కార్మికుల హక్కులను కాలరాస్తు 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికుల రక్త మాంసాలను, రైతు హక్కులను, చట్టాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. రాష్ట్రాల హక్కులను హరించి వేస్తుందన్నారు. రాజ్యాంగానికి పెను ప్రమాదం పొంచివుందన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం యన్టీఆర్ జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్,సిఐటియు నాయకులు, ఆశా వర్కర్లు సునీత, ఎం రాణి, సుజాత ,ఎస్.కె దిలీషా, సుబ్బమ్మ, కోటేశ్వరి, వి.ఒ.ఎ సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎస్ కే బేగం , షేక్ బాజీ మున్నీ కౌలు రైతుల సంఘం వీరులపాడు మండల కార్యదర్శి చాట్ల.రవి తదితరులు పాల్గొన్నారు

madagoni surendar

Mar 29 2023, 17:39

ఏపీ :అమరావతి:: వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష.

అమరావతి.

వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష.

రబీ ధాన్యం సేకరణ

ఏప్రిల్‌15 నుంచి రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ చేయడానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్న సీఎం.

అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యూమరేషన్‌

అకాల వర్షాలు వల్ల పంట నష్టంపై ఎన్యుమరేషన్‌ స్ధితి గతులను అడిగి తెలుసుకున్న సీఎం.

ఎన్యుమరేషన్‌ జరుగుతోందని, ఏప్రిల్‌ మొదటి వారంలో నివేదిక ఖరారుచేస్తామని, ఏప్రిల్‌ రెండో వారానికి నష్టపోయిన రైతుల జాబితాలను విడుదలచేస్తామని సీఎంకు తెలిపిన అధికారులు.

వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలన్న ముఖ్యమంత్రి.

రబీ సన్నాహకాలపైన సీఎం సమీక్ష.

ఇప్పటికే 100శాతం ఇ క్రాపింగ్‌ పూర్తైందని వెల్లడించిన అధికారులు.

నాణ్యతలేని ఎరువులు, పురుగుమందులు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగుమందులు లేకుండా చూడాలని అధికారులకు సీఎం ఆదేశం.

ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందించేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సీఎం ఆదేశం.

ఇక్కడ జరిగే పొరపాట్లు వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమంపై మరింత శ్రద్ధపెట్టాలన్న సీఎం

సీఎం ఆదేశాల మేరకు ఆర్బీకేల ద్వారానే నాణ్యమైన ఎరువులను పంపిణీచేస్తున్నామన్న అధికారులు.

ఈ ఏడాది ఆర్బీకేల ద్వారా 2023–24లో 10.5లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పిన అధికారులు.

ఎరువులతో పాటు ఏపీ ఆగ్రోస్‌ ద్వారా రైతులకు అవసరమైన స్థాయిలో పురుగుమందుల పంపిణీకి కూడా చర్యలు చేపట్టినట్టు వెల్లడించిన అధికారులు.

నకిలీ, నాణ్యతలేని పురుగుమందులు లేకుండా చేయడానికి ఇది దోహదపడుతుందన్న అధికారులు.

పొలంబడి శిక్షణ

పొలంబడి శిక్షణ కార్యక్రమాల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయన్న అధికారులు.

ఆర్బీకేల ద్వారా ఆయా రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తున్నామన్న అధికారులు.

ఈ శిక్షణ కార్యక్రమాల వల్ల వరి, వేరుశెనగలో 15శాతం, పత్తిలో 12 శాతం, మొక్కజొన్నలో 5శాతం పెట్టుబడి ఖర్చులు తగ్గాయన్న అధికారులు.

పత్తిలో 16శాతం, మొక్కజొన్నలో 15 శాతం, వేరుశెనగ 12 శాతం, వరిలో 9శాతం దిగుబడులు పెరిగాయన్న అధికారులు.

పూర్తి సేంద్రీయ వ్యవసాయ పద్దతుల దిశగా అడుగులు వేయడానికి ఇది తొలిమెట్టు అన్న అధికారులు.

26 ఎఫ్‌పీవో(ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌)లకు జీఏపి (గుడ్‌అగ్రికల్చర్‌ ప్రాక్టీస్‌) సర్టిఫికెట్‌ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న అధికారులు.

వ్యవసాయ పరికరాల పంపిణీ

రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ షెడ్యూల్‌కు సీఎం గ్రీన్‌సిగ్నల్‌

యాంత్రీకరణ పెరిగేందుకు దోహదపడుతుందన్న సీఎం.

ఏప్రిల్‌లో ఆర్బీకేల్లోని 4225 సీహెచ్‌సీలకు యంత్రాల పంపిణీ.

జులైలో 500 డ్రోన్లు, డిసెంబర్‌ కల్లా మరో 1500 డ్రోన్లు పంపిణీ.

జులై లో టార్పాలిన్లు, జులై నుంచి డిసెంబర్‌ మధ్య మూడు విడతలుగా స్ప్రేయర్లు పంపిణీ.

మిల్లెట్స్‌ సాగుపై చర్యలు

రాష్ట్రంలో మిల్లెట్స్‌ సాగును ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం ఆదేశాలమేరకు అనేక చర్యలు తీసుకున్నామన్న అధికారులు.

19 జిల్లాల్లో 100 హెక్టార్ల చొప్పున మిల్లెట్‌ క్లస్టర్లు పెట్టామన్న అధికారులు.

3 ఆర్గానిక్‌ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడి.

ఎగుమతికి ఆస్కారం ఉన్న వరి సాగును ప్రోత్సహిస్తున్నామన్న అధికారులు.

2022 ఖరీఫ్‌లో 2.74 లక్షల హెక్టార్లలో ఎగుమతిచేయదగ్గ వరి రకాలను సాగుచేస్తున్నామన్న అధికారులు.

దాదాపు 6.29 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అయ్యిందని వెల్లడి.

2022–23 రబీలో 1.06 లక్షల హెక్టార్లలో ఎగుమతి వెరైటీలను సాగుచేశారని, 3.79 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి ఉందని వెల్లడించిన అధికారులు.

ఆర్బీకేల్లో కియోస్క్‌ల సేవలు పూర్తిస్థాయిలో రైతులకు అందాలని, దీనిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలన్న సీఎం.

ఉద్యానవన పంటల మార్కెటింగ్‌ పై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.

కొత్త తరహా ఉత్పత్తులు వస్తున్నకొద్దీ.. మార్కెటింగ్‌ ఉదృతంగా ఉండాలన్న సీఎం.

దీనివల్ల రైతులు తమ పంటలను విక్రయించుకోవడానికి ఇబ్బందులు ఉండవని, మంచి ఆదాయాలు కూడావస్తాయన్న సీఎం.

ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌

ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలోనే ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం.

భూ పరీక్షకోసం నమూనాల సేకరణ, వాటిపై పరీక్షలు, వాటి ఫలితాలను రైతులకు అందించడం, ఫలితాలు ఆధారంగా పాటించాల్సిన సాగు విధానాలపై అవగాహన తదితర అంశాలపై ఒక సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించుకోవాలన్న సీఎం.

ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరీక్షలు చేసేదిశగా చర్యలు తీసుకోవాలన్న సీఎం.

జూన్‌లో ఖరీఫ్‌ నాటికి పరీక్షల ఫలితాలు ఆధారంగా రైతుకు సాగులో పాటించాల్సిన పద్ధతులపై పూర్తి వివరాలు, అవగాహన కల్పించాలన్న సీఎం.

పంటలకు అవసరమైన స్థాయిలోనే ఎరువులు, పురుగుమందులు ఉండాలన్న సీఎం.

ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌... ఆర్బీకేల కార్యక్రమాలను ఒక దశకు తీసుకెళ్తాయన్న సీఎం.

ఈ సమీక్షకు హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు తిరుపాల్‌ రెడ్డి, ఉద్యానవన శాఖ సలహాదారు శివప్రసాద్‌ రెడ్డి, ఏపీ ఆగ్రోస్‌ ఛైర్మన్‌ బి.నవీన్‌ నిశ్చల్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్, ఉద్యానవనశాఖ కమిషనర్‌ ఎస్‌ఎస్‌. శ్రీధర్, మార్క్‌ఫెడ్‌ ఎండీ రాహుల్‌పాండే, ఎపీఎస్‌ఎస్‌డీసీఎస్‌ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌ బాబు, ఏపీ ఆగ్రోస్‌ వీసీ అండ్‌ ఎండీ ఎస్‌.కృష్ణమూర్తి, పలువురు ఉన్నతాధికారులు.

madagoni surendar

Mar 29 2023, 17:18

విజయవాడ:* - *స్నేహితుడి తల్లిని మోసం చేసి భీమా సొమ్ము 20 లక్షలు కొట్టేసిన నలుగురు కేటుగాళ్లు* - సహకరించిన కడీసీసీ బ్యాంక్ మేనేజర్.

విజయవాడ:

- స్నేహితుడి తల్లిని మోసం చేసి భీమా సొమ్ము 20 లక్షలు కొట్టేసిన నలుగురు కేటుగాళ్లు

- సహకరించిన కడీసీసీ బ్యాంక్ మేనేజర్

- పుప్పాల వెంకట గౌరీ కుమారుడు, జనసేన కార్యకర్త చిరంజీవి బ్రెయిన్ ట్యూమర్ తో గత ఏడాది అక్టోబర్ 26న మృతి...

- స్నేహితుడు మహేష్ వద్ద 50 లక్షలకు భీమా పాలసీ కట్టిన మృతుడు

- చిరంజీవి చనిపోవడంతో భీమా సొమ్ము ఇప్పిస్తామని

తల్లి గౌరిని నమ్మించి సంతకాలు చేయించిన మహేష్ ఆతని స్నేహితులు...

- కడీసీసీ బ్యాంక్ మేనేజర్ తో కుమ్మక్కై గౌరీకి అకౌంట్ ఓపెన్ చేయించి సెల్ఫ్ చెక్కులతో 50 లక్షలు విత్ డ్రా చేసిన కేటుగాళ్లు

- విషయం తెలిసి గౌరీ కుమార్తె నిలదీయటంతో 30 లక్షలు వెనక్కి ఇచ్చిన నిందితులు..

- మిగతా 20 లక్షలు ఇవ్వకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు

- నిందితులు నెలిబండ్ల మహేష్, కొడిబోయిన కృష్ణ ప్రసాద్, లక్ష్మణ్ తేజ, అభిషేక్, బ్యాంక్ మేనేజర్ పై కేసు

- 420, 406, 468, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు

- విచారణ చేపట్టిన పటమట పోలీసులు

madagoni surendar

Mar 29 2023, 17:10

తెలంగాణ : ములుగు జిల్లా ::కలుషిత నీరు తాగిన కూలీలు.. 24 మందికి అస్వస్థత..

తెలంగాణ : కలుషిత నీరు తాగిన కూలీలు.. 24 మందికి అస్వస్థత..

వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పేడు గొల్లగూడేనికి చెందిన 24 మంది వ్యవసాయ కూలీలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురయ్యారు..

ఆ గ్రామానికి చెందిన ఓ రైతు మిర్చి తోటలో పనికి వెళ్లిన కూలీలు భోజనం విరామ సమయంలో సమీపంలోని మరో రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోని పైపుల వద్ద నీటిని సేకరించి తాగారు. కొద్దిసేపటికి పలువురు వాంతులు చేసుకోవడం, నాలుక తిమ్మిరిగా ఉండటం, కళ్లు తిరగడంతో ఆందోళన చెందారు.

ఈ క్రమంలో మిగిలిన కూలీలు ఆరాతీయగా రైతు తన పొలంలోని డ్రిప్‌ పైపులను శుభ్రపరిచేందుకు పాస్ఫరిక్‌ యాసిడ్‌ అనే రసాయన మందును ఉపయోగించారని.. ఆ పైపుల నుంచే నీరు విడిచిపెట్టినట్లు తేలింది. అస్వస్థతకు గురైన కూలీలందరినీ ట్రాక్టర్‌పై వెంకటాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు, సిబ్బంది ప్రాథమిక వైద్యం అందించారు. ముగ్గురు కూలీలకు తీవ్రస్థాయిలో వాంతులు కావడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అస్వస్థతకు గురైన కూలీలందరికీ సామాజిక ఆసుపత్రిలోనే సేవలందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

madagoni surendar

Mar 29 2023, 15:43

తాడేపల్లి. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్‌ ప్రెస్‌మీట్‌:

తాడేపల్లి.

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్‌ ప్రెస్‌మీట్‌:

కులాల మధ్య చిచ్చు పెట్టాలని రామోజీరావు కుట్ర

మాల, మాదిగల మధ్య కూడా చిచ్చు పెట్టే కుయుక్తి

దళితులను వైయస్సార్‌సీపీకి దూరం చేయాలన్న లక్ష్యం

అందుకే రోజూ విషపు రాతలు. అదే పనిగా దుష్ప్రచారం

ఈనాడు రాతలపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫైర్‌

చంద్రబాబు హయాంలోనే దళితులకు అన్యాయం

వారిపై యథేచ్ఛగా దాడులు. అవమాన కార్యక్రమాలు

ఆ కాలంలోనే ఎస్సీ, ఎస్టీ కేసులు అత్యధికం

ఎన్‌సీబీ రికార్డుల్లోనే స్పష్టంగా ఆ వివరాలు

మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి

చంద్రబాబు మంచి వ్యక్తి కాదని ప్రజలందరికీ తెలుసు

జగన్‌గారిపైనా అదే ముద్ర వేయాలన్న కుతంత్రం

అందుకే సత్యదూరమైన రాతలు, గత తప్పిన విశ్లేషణ

మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టీకరణ

ఒక పార్టీకి మాత్రమే కొమ్ము కాసేలా రామోజీరావు వ్యవహారం

అది ఆక్షేపణీయం. అత్యంత దుర్మార్గం. అతి హేయం

పత్రికా విలువలు కాలరాస్తూ, ప్రభుత్వంపై నిత్యం విషం

ఇప్పటికైనా మీ వైఖరి, పద్ధతి మార్చుకొండి

లేకపోతే మీ పత్రికకు, టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు

ప్రెస్‌మీట్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి

తాడేపల్లి:

ప్రెస్‌మీట్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఏం మాట్లాడారంటే..:

కుట్రతో వాస్తవాల వక్రీకరణ:

ఈనాడులో దళితుల గురించి అదే పనిగా కథనాలు రాస్తున్నారు. దళితులు, ప్రభుత్వం మధ్య విభేదాల సృష్టించాలని చూస్తున్నారు. మా ప్రభుత్వం గత నాలుగేళ్లుగా దళితుల కోసం చేసిందంతా వక్రీకరించి, వారికి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు వచ్చేలా కుట్ర చేస్తున్నారు. అందుకే ప్రతిరోజూ విషపు రాతలు రాస్తున్నారు. ఈనాడు చంద్రబాబుకు ఒక కరపత్రం మాదిరిగా మారింది. దీన్ని ప్రజలూ గుర్తిస్తున్నారు.

రామోజీగారు టీడీపీని అధికారంలోకి తీసుకు రావాలన్న కార్యక్రమాన్ని మీ భుజాల మీద వేసుకుంటే, చంద్రబాబు ఒక వీరుడు, శూరుడు, విక్రమార్కుడు అని రాసుకొండి. మాకేం అభ్యంతరం లేదు. అంతే కానీ, రోజూ మా ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తే ప్రజలే నీకు, నీ పత్రికకు బుద్ది చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.

ప్రజలంతా జగన్‌గారి వెంటే:

సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.2 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇచ్చారు. ఇది కేవలం ఆయనకు మాత్రమే దక్కే గౌరవం. సీఎంగారి భావజాలన, చిత్తశుద్ధి, పథకాలు, కార్యక్రమాల అమలు వల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అందుకే వారంతా ప్రభుత్వంపైనా, సీఎంగారిపైనా అంతులేని ప్రేమ, ఆప్యాయత చూపుతున్నారు. మళ్లీ ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నారు.

రామోజీ ‘చిచ్చు’ కుట్ర:

అందుకే ఎలాగైనా కులాల మధ్య చిచ్చు పెట్టాలని కుట్ర చేస్తున్నారు. 17 శాతం ఉన్న ఎస్సీలు, 6 శాతం ఉన్న ఎస్టీలు.. ఇద్దరూ కలిపి 23 శాతం. వారికి అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు చూసి, కులాల మధ్య చిచ్చు పెట్టాలని, ప్రధాన వర్గాలైన మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టడంతో పాటు, దళితులను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి దూరం చేయాలన్న కుట్ర చేస్తున్నారు.

ఇవాళ రామోజీరావుకు ఒకటే చెబుతున్నాం. దళితులపై ఎప్పుడైనా దాడులు జరిగాయంటే, వారికి అన్యాయం జరిగిందంటే అది కేవలం చంద్రబాబు హయాంలోనే. ఇంకా ఎస్సీ కమిషన్‌ గురించి కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు హయాంలో ఆ పదవిలో ఉన్న వ్యక్తి, మొత్తం రాజకీయాలు చేశారు. కానీ ఇవాళ ఆ పదవిలో ఉన్న విక్టర్‌ ప్రసాద్‌ ఉన్నారు. ఆయన నీతి, నిజాయితీకి మారుపేరు. ఎక్కడ దళితులకు అన్యాయం జరిగినా వెళ్తున్నారు. ఎవరి తప్పున్నా సరే, ఉపేక్షించడం లేదు. ఎక్కడైనా పోలీసుల తప్పుంటే, వారిపైనా చర్య తీసుకోవాలని కోరుతున్నారు. ఆ దిశలోనే పోలీసులను సస్పెండ్‌ చేయడం జరిగింది.

జగన్‌గారిపైనా అదే ముద్రకు యత్నం:

చంద్రబాబు గురించి రాయడానికి ఏమి లేదని రామోజీరావుకు తెలుసు. ఎందుకంటే చంద్రబాబు దుష్ట బుద్ది, రాజకీయ జీవితంలో ఆయన చేసిన మోసాలు, చిట్టా అంతా రామోజీ దగ్గర ఉంది కాబట్టి.. చంద్రబాబు మంచోడని రామోజీ రాయడానికి ఏమి లేదు కాబట్టి.. చంద్రబాబు మంచోడని చెప్పే పరిస్థితి లేదు కాబట్టి.. జగన్‌గారు కూడా మంచోడు కాదని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు.

‘మార్గదర్శి’ కోసం..:

దళిత సామాజిక వర్గానికి ప్రభుత్వానికి మధ్య ఒక అగాథం ఉందని భ్రమ కల్పించే విధంగా మీరు చేస్తున్న ప్రయత్నానికి అసలు కారణాలు ప్రజలకు తెలియాలి.

మార్గదర్శి చిట్‌ఫండ్‌ చందాదారుల సొమ్ముతో దందా చేసి, డబ్బును పక్క దారి పట్టించి వారి కష్టార్జితాన్ని మీ లాభాపేక్షకు వాడుకుని స్కామ్‌కు పాల్పడిన నేపథ్యంలో సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈరోజు (29వ తేదీ), రేపు (30వ తేదీ), ఏప్రిల్‌ 3, 6 తేదీల్లో విచారణకు రావాలని కోరారు. అందుకే ప్రభుత్వంపైనా, సీఎంగారిపైనా మరింత విషం చిమ్మే కార్యక్రమానికి తెర లేపారు. పత్రికా విలువలను తుంగలో తొక్కి బరి తెగించి అసత్య కథనాలు రాస్తున్నారు. 

అప్పుడే కేసులు ఎక్కువ:

చంద్రబాబు హయాంలో ఎస్సీలకు సంబంధించి ఎక్కువ కేసులు నమోదయ్యాయి. 

2014లో 2,113 కేసులు, 2015లో 2,263 కేసులు 2016లో 2,335 కేసులు, 2017లో 1969 కేసులు నమోదయ్యాయి. అంటే ఏటా సగటున 2,103 కేసులు నమోదయ్యాయి

అదే వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2019–2021 వరకు సగటున 2011 కేసులు నమోదయ్యాయి. 2021లో 2014 కేసులు నమెదయ్యాయని నేషనల్‌ క్రై మ్‌ బ్యూరో (ఎన్‌సీబీ) రికార్డు చెబుతోంది.

ఇక ఎస్టీలకు సంబంధించి 2014లో 390 కేసులు 2015లో 362 కేసులు, 2016లో 405 కేసులు, 2017లో 361 కేసులు నమోదయ్యాయి. అంటే టీడీపీ హయాంలో ఏటా సగటున 365 కేసులు నమోదయ్యాయి. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2021లో 361 కేసులు నమోదు కాగా, 2019–2021 వరకు ఏటా సగటున 337 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ఎన్‌సీబీ రికార్డుల్లో ఉన్నాయి. దీని వల్ల ఎవరి హయాంలో ఎక్కువ కేసులు నమోదయ్యాయన్న విషయం స్పష్టమవుతుంది.

ఇప్పుడు పరిహారం ఎక్కువ:

టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీల సంఖ్య ఎక్కువ ఉండగా, వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వారికి మరింత న్యాయం జరుగుతోంది.

అదెలా అంటే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–2019 వరకు వారికి రూ.52.32 కోట్ల పరిహారం ఇవ్వగా, మా ప్రభుత్వ హయాంలో, 2019–22 మధ్య మూడేళ్లలోనే ఎస్సీ, ఎస్టీలకు రూ.125 కోట్ల పరిహారం అందించారు.

ప్రజలు మిమ్మల్ని నమ్మబోరు:

మీ పత్రిక గత నాలుగేళ్లగా దిగజారుడు రాతలు రాస్తూ పత్రిక విలువలు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా వదిలేసిందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. దళితులపై దమనకాండ అంటూ రాయడానికి కారణం ఏంటి? దళితుల్ని భుజాన వేసుకున్నామని మీరు చెప్పే ప్రయత్నం, వారి కోసం పాటు పడుతున్నామన్న ప్రచారాన్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.

దళితుల భూమి లాక్కుని, రామోజీ ఫిల్మ్‌ సిటీ నిర్మించిన మీరు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నారంటే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. రాష్ట్ర ప్రజలు అంత నిరాక్షరాస్యులు కాదు.

వ్యూహాత్మకంగా దుష్ప్రచారం:

ముందు రోజు రాష్ట్రంలో దళితులకు రక్షణ ఏదని లోకేష్‌ మాట్లాడితే వెంటనే మీరు దానికి సంబంధించి వార్త పతాక శీర్షికలో రాస్తారు. ఆ వెంటనే దుష్ట చతుష్టయం ఎల్లో మీడియాలో చర్చ పెడుతుంది. వాటిలో ఏయే పెయిడ్‌ ఆర్టిస్టులు పాల్గొంటారో అందరికి తెలుసు. ఇదంతా ఒక వ్యూహాత్మకంగా జరుగుతోంది. 

దురుద్దేశంతో దుష్ప్రచారం:

ఇక్కడ ఒకటే విషయం. చంద్రబాబు హయాంలో గరగపర్రు నుంచి జెర్రిపోతులపాలెం వరకు జరిగిన ఘటనలు రామోజీరావుకు ఎందుకు గుర్తు లేవు?. వాటి గురించి ఎందుకు రాయడం లేదు? దళితులగా ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అని అన్న చంద్రబాబు, దానిమీద కనీసం క్షమాపణ కూడా కోరలేదు.

చంద్రబాబు మంచి వ్యక్తి కాదని ప్రజలందరికీ తెలుసు. అందుకే జగన్‌గారు కూడా మంచివారు కాదని ప్రచారం చేసే కుట్ర. అందుకే విషపు రాతలు. దుష్ప్రచారం.

దళితులంటే బాబుకు కోపం:

చంద్రబాబుకు ఏనాడూ దళితులపై ప్రేమ లేదు. నిరుపేదలు, దళితులకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే. దాన్ని అడ్డుకోవడానికి కోర్టుకు వెళ్లాడు. రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే, డెమొగ్రఫిక్‌ ఇంబ్యాలెన్స్‌ వస్తుందని దానిపైనా కోర్టులో కేసు వేశారు. ప్రభుత్వ బడులలో ఇంగ్లిష్‌ మీడియమ్‌ వద్దన్నారు. స్టేట్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా ఒక రాజ్యాంగ నిపుణుడిని నియమిస్తే దానిపైనా కోర్టును ఆశ్రయించాడు. విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్‌ విగ్రహం వద్దంటూ ప్రెస్‌మీట్లు పెట్టిస్తున్నాడు.

ఎస్సీలు శుభ్రంగా ఉండరు. వారు మురికివాడల్లో ఉంటారన్న వారిని మంత్రివర్గంలో కొనసాగించాడు. చుండూరు, కారంచేడు ఘటనలకు బాధ్యులు ఎవరన్నది అందరికీ తెలుసు. చంద్రబాబు ఏనాడూ ఎస్సీల కోసం సబ్‌ ప్లాన్‌ అమలు చేయలేదు. ఆయనకు తెలిసిందల్లా దోచుకోవడమే.

వైఖరి మార్చుకోకపోతే..:

అచ్చెన్న హత్య బాధాకరం. అది దురదృష్టకర ఘటన. ఈరోజు సత్యదూరమైన రాతలు, గత తప్పిన విశ్లేషణ. కేవలం ఒక పార్టీకి మాత్రమే కొమ్ము కాసే విధంగా రామోజీరావు వ్యవహరించడం ఆక్షేపణీయం. దుర్మార్గం. పత్రికా విలువలు కాలరాస్తూ, ప్రభుత్వంపై విషం చిమ్మడమే ధ్యేయంగా పని చేస్తున్నారు. ఇది సరి కాదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొండి. లేదు మేము మారం. తెలుగుదేశం పార్టీ కోసమే రాస్తామని అనుకుంటే, మీ పత్రికకు, తెలుగుదేశం పార్టీకి కూడా ప్రజలు బుద్ధి చెబుతారు.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..

టీడీపీ స్క్రిప్ట్‌ శ్రీదేవి నోట:

అక్కడ దళిత ఎమ్మెల్యే అన్నది కాదు. పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా పని చేయడం అన్నది చూడాలి. పార్టీ నాయకత్వాన్ని బలహీనపర్చే విధంగా ఎవరు ప్రవర్తించినా, వాకు కచ్చితంగా క్రమశిక్షణకు బాధ్యులవుతారు. ఎమ్మెల్యే శ్రీదేవి నిజంగా క్రాస్‌ ఓటింగ్‌ చేయకపోతే, మర్నాడు అసెంబ్లీకి ఎందుకు రాలేదు? ఇక్కడే ప్రెస్‌మీట్‌ ఎందుకు నిర్వహించలేదు. హైదరాబాద్‌లో ఎందుకు మాట్లాడారు? అమరావతి అంశాన్ని భుజానికి ఎందుకు ఎత్తుకున్నారు? అంటే ఆమె తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్‌ను చదివారు.

దృష్టి మళ్లించే కుట్రలు:ఈరోజు చూడండి. రామోజీరావుకు మార్గదర్శి కేసులో సీఐడీ నోటీసులు ఇవ్వగానే దళితులకు అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, విషపు రాతలు రాస్తున్నారు. అలా అందరి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అసెంబ్లీలో ఒకసారి ఇలాగే 2017–18లో అసెంబ్లీలో కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్‌పై చర్చ జరగకుండా.. కావాలని అంబేడ్కర్‌ 125వ జయంతి విషయాన్ని సభలో ప్రస్తావించారు. ఇప్పుడు కూడా దళితులను తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు. అవసరం తీరాక వారిని వదిలేయడం చంద్రబాబుకు, రామోజీరావుకు అలవాటు. ఇప్పుడు శ్రీదేవితోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు.

madagoni surendar

Mar 29 2023, 15:35

దేశంలోని విమానాశ్రయాలకు నేరుగా విమానాలు నడపండి..అంతర్జాతీయ ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు తిరుపతి విమానాశ్రయం సిద్ధం.

దేశంలోని విమానాశ్రయాలకు నేరుగా విమానాలు నడపండి

అంతర్జాతీయ ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు తిరుపతి విమానాశ్రయం సిద్ధం

కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రితో భేటీ అయిన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

ఎట్టకేలకు ఫలించిన ఎంపీ గురుమూర్తి కృషి కువైట్ నుంచి నేరుగా తిరుపతికి విమాన సౌకర్యం

తిరుపతి ఒక ముఖ్యమైన పర్యాటక, ఆధ్యాత్మిక నగరమని, దేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి ప్రతి సంవత్సరం మిలియన్ల సందర్శకులు సందర్శించే ప్రాంతం కావడంతో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి దేశంలోని ఇతర ప్రధాన విమానాశ్రయాల మధ్య మరింత ఎక్కువ కనెక్టివిటీ అవసరమని కేంద్ర పౌర విమాన యన శాఖా మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారిని కలిసి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి వివరించారు. ఈ విషయం గూర్చి ఇదివరకే ఆయనకు లేఖ రాసిన విషయాన్ని కూడా ఆయనకి గుర్తు చేసారు.

విమానాశ్రయం అభివృద్ధి చెందుతున్నప్పటికీ మరియు ప్రత్యక్ష విమానాల సంఖ్య పెరిగినప్పటికీ, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం మరియు భారతదేశంలోని ఇతర ప్రధాన విమానాశ్రయాల మధ్య మరింత కనెక్టివిటీ అవసరమని ఇది పర్యాటక, వ్యాపార రంగాలను ప్రోత్సహించడానికి సహాయపడుతుందని మరియు ప్రాంతం యొక్క మొత్తం అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం మరియు దేశంలోని ఇతర ప్రధాన విమానాశ్రయాల మధ్య నేరుగా విమానాలను నడపడానికి చర్యలు తీసుకొనవలసిందిగా కోరారు. దీని వలన ప్రయాణ సమయం తగ్గి ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందని ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం మరియు వైవిధ్యాన్ని ప్రోత్సహించడానికి కూడా ఇది సహాయపడుతుందని ఆయనకి తెలియజేసారు.

అలాగే తిరుపతి ప్రసిద్ధ పర్యాటక కేంద్రం మాత్రమే కాకుండా అనేక ప్రముఖ విద్యాసంస్థలకు నిలయంగా ఉంటూ ఎకనమికల్ జోన్‌గా కూడా గుర్తించబడిందని అనేక ప్రధాన పరిశ్రమలు మరియు అంతర్జాతీయ కంపెనీలు ఈ ప్రాంతంలో ఉన్నాయని ఆయనకి వివరిస్తూ కస్టమ్స్ నోటిఫికేషన్ జారీ చేయబడి మరియు విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్లు ఏర్పాటు చేయబడ్డాయని. అంతర్జాతీయ ప్రయాణికుల మరియు వారి వస్తువుల రవాణాకు అవసరాలను తీర్చడానికి విమానాశ్రయం సిద్ధంగా ఉందని ఆయనకి వివరించారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం మిడిల్ ఈస్ట్ ప్రత్యేకించి కువైట్‌కు వెళ్లే ప్రయాణీకులకు గేట్‌వేగా ఉపయోగపడుతుందని ఈ విమానాశ్రయం తిరుపతి, నెల్లూరు ప్రకాశం మరియు చిత్తూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణీకుల సంభావ్యత కలిగి ఉందని వారికి ఉపయుక్తంగా ఉంటుందని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తద్వారా కీలకమైన ఆర్థిక, విద్యా మరియు పర్యాటక కేంద్రంగా దాని పూర్తి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సహకరించాలని వారిని అభ్యర్ధించారు.

అంతా సావధానంగా విన్న కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించారని తగు చర్యలు తీసుకొంటామని అందులో భాగంగా త్వరలో కువైట్ నుంచి తిరుపతికి అంతర్జాతీయ విమాన సౌకర్యం కల్పిస్తామని తెలిపారని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తెలియజేసారు. ఈ సందర్భంగా పౌర విమానయాన శాఖ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలను కూడా ఎంపీ కలిశారు.

madagoni surendar

Mar 29 2023, 15:17

ఏపీ :గుంటూరు జిల్లా ::పెద్దలు అడ్డుచెప్పారని.. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య!

ఏపీ : పెద్దలు అడ్డుచెప్పారని.. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య!

చేబ్రోలు: తమ ప్రేమని పెద్దలు కాదనడంతో యువ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి రైల్వేగేటు వద్ద చోటు చేసుకుంది.

స్థానికులు, రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సెలపాడు గ్రామానికి చెందిన ఉయ్యూరు శ్రీకాంత్.. అదే గ్రామానికి చెందిన పులి త్రివేణి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. త్రివేణి రెండురోజుల క్రితం తెనాలిలోని డిగ్రీ కళాశాలకు వెళ్లింది. ఆ తర్వాత శ్రీకాంత్‌తో వెళ్లడాన్ని గమనించిన స్నేహితురాలు.. త్రివేణి తల్లిదండ్రులకు సమాచారమిచ్చింది..

దీంతో మంగళవారం వారు చేబ్రోలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సుద్దపల్లి రైల్వేగేటు వద్ద మృతదేహాలను గ్యాంగ్‌మెన్‌ గుర్తించారు. త్రివేణి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతిచెందింది తమ కుమార్తే అని నిర్ధారించుకుని కన్నీరుమున్నీరయ్యారు. తెనాలి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

madagoni surendar

Mar 29 2023, 13:56

ఏపీ ::దిశా నిర్దేశం చేయండి. నిర్మాణాత్మక సలహాలు అనివార్యం. లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం జి 20 సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

దిశా నిర్దేశం చేయండి.

నిర్మాణాత్మక సలహాలు అనివార్యం.

లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం

జి 20 సదస్సులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి

విశాఖపట్నం :

పేదలకు లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నాం

అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది

స్థిరమైన విధానాలపై చక్కటి సూచనలు ఇవ్వండి

చిరకాలం నిలిచేలా మౌలిక సదుపాయాలు ఏర్పాటుపై తగిన ఆలోచనలు చేయండి

వర్టికల్ గ్రోత్‌ కన్నా హారిజాంటల్‌ గ్రోత్‌ ఉండాలి

దీనికి మార్గనిర్దేశం, సహకారం కావాలి

జి-20 దేశాల ప్రతినిధులను కోరిన సీఎం

విశాఖపట్నం:

విశాఖపట్నం రాడిసన్‌ బ్లూ హోటల్లో జి-20 రెండవ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశం. జి-20 తరఫున వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరు. 

సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌

మౌలిక సదుపాయాలు రంగంమీద జి-20 వర్కింగ్‌ గ్రూపు సమావేశంమయ్యింది:

చాలా మంచి అంశం మీద వర్కింగ్‌ గ్రూపు చర్చిస్తోంది:

మా రాష్ట్రంలో భూమి లభ్యత చాలా ఉంది:

భూమి లభ్యత ఉన్న రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలి:

ఈ లక్ష్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది:

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… మా ప్రభుత్వ పాలనలో చాలా పెద్ద సంఖ్యలో 30లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం:

దాదాపు 22 లక్షల ఇళ్లను కడుతున్నాం:

ఇళ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి:

ఇన్ని లక్షల ఇళ్లకు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది:

డ్రైనేజీ, రోడ్లు, కరెంటు… ఇలా కనీస మౌలికసదుపాయాలను కల్పించడంలో స్థిరమైన విధానాలపై ఈ వర్కింగ్‌ గ్రూపు సమాలోచనలు చేయాలని కోరుతున్నాను:

ఖర్చును తగ్గించే, నాణ్యతమైన నిర్మాణాలు జరిగేలా… అదే సమయంలో అవి చిరకాలం ఉండేలా ఎలాంటి విధానాలను అనుసరించాలన్న దానిపై చర్చ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను:

మీరంతా చర్చించి.. ఈ ప్రశ్నలకు సమాధానాలను కనుగొనేలా… సమిష్టిగా తగిన పరిష్కారాలను చూపుతారని ఆశిస్తున్నాను:

వర్టికల్‌ గ్రోత్‌కు భిన్నంగా … హారిజాంటల్‌

గ్రోత్‌ ఉండాలన్నది నా అభిప్రాయం:

హారిజాంటల్‌ గ్రోత్‌కు కూడా సరైన మార్గనిర్దేశకత్వం, తగిన మద్దతు అవసరం:

అప్పుడే అందమైన ఇళ్లు సాకారం అవుతాయి:

దీనిపై సరైన చర్చలు జరిపి.. సస్టెయినబుల్‌ పద్ధతులను సూచించాలని కోరుతున్నాను:

విశాఖపట్నంలో మీరు ఇక్కడ గడిపే సమయం చెరిగిపోలేని జ్ఞాపకంగా ఉండాలని ఆశిస్తున్నాను: