నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 18:49

భూత‌గాదాలు.. పెద‌నాన్న‌ను వేట కొడ‌వ‌లితో న‌రికి చంపిన యువ‌కుడు

సంగారెడ్డి: ఝరాసంఘం మండ‌ల ప‌రిధిలోని బ‌ర్దిపూర్‌లో దారుణం జ‌రిగింది. సొంత పెద‌నాన్న‌ను ఓ యువ‌కుడు వేట కొడ‌వ‌లితో న‌రికి చంపాడు.

మొండెం నుంచి త‌ల‌ను వేరు చేశాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మృతుడిని చంద్ర‌న్న‌(70)గా పోలీసులు గుర్తించారు. అయితే భూత‌గాదాల‌తోనే చంద్ర‌న్న‌ను రాకేశ్ అనే యువ‌కుడు న‌రికి చంపిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. నిందితుడు రాకేశ్ జ‌హీరాబాద్ పోలీసు స్టేష‌న్‌లో లొంగిపోయాడు. మృతుడి నివాసంలో విషాదఛాయ‌లు అలుముకున్నాయి.

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 18:45

‘కేటీఆర్ నిన్ను ఏమనాలి బ్రోకర్, మూర్ఖుడు అనాలా... నాకు సంస్కారం అడ్డొస్తుంది’

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని.. చదువుకున్న వాడిగా కేటీఆర్‌ కు తగదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... మోదీని, బీజేపీని డిఫెండింగ్ చేయడమే పనిగా కేటీఆర్ పెట్టుకున్నారన్నారు. ప్రధాని మోదీ బ్రోకరిజం చేశారని కేటీఆర్ నిరూపించాలన్నారు.

‘‘కేటీఆర్ రాజు అయ్యేది లేదు.. యువరాజు అయ్యేది కూడా లేదు మోదీ వయసు ఎంత ... నీ వయసు ఎంత?. హఫీజ్‌పేట్‌లో భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టులో ఎందుకు అప్పీలు వేయలేదు?. సర్వే నెంబర్ 77లో భూమిని హైకోర్టు ఉత్తర్వులు కాదని ఓ వ్యక్తికి లాభం చేకూరేలా చేయలేదా. నిన్నేమనాలి బ్రోకర్, మూర్ఖుడు అనాలా... నాకు సంస్కారం అడ్డొస్తుంది.

ఈ భూమిలో అపార్ట్‌మెంట్ కట్టేందుకు అనుమతి ఎలా ఇచ్చారు. రూ.500 కోట్ల లబ్ది పొందిన ఆ వ్యక్తి నీకేమీ చేయలేదా. కోర్టు సస్పెండ్ చేసిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ భూమిపై విచారణ కొనసాగుతోంది. ఇక్కడ 8ఎకరాల భూమిని ఓ వ్యక్తి రిజిస్టర్ చేసుకున్నాడు. ఇప్పటి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన కమిటీ అపార్ట్‌మెంట్‌కు అనుమతి ఇచ్చారు. దీన్ని ఏమనాలి.. ఎవరు బ్రోకరిజం చేసారు. మీరు ఎక్కడ నీతిగా , నిజాయితీగా లేరు. హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇక్కడ జరిగిన అవకతవకలపై ఏం మాట్లాడుతారు. గతంలో ప్రధాన మంత్రిని తిడితే బొక్కలో వేయమని డీజీపీకి చెప్పాడు. మరి కేసీఆర్ సూచనల మేరకు మోదీని తిట్టినందుకు డీజీపీ చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. కేసీఆర్‌పై గతంలో ఆరోపణలు వచ్చాయి.. అవి మాట్లాడుతున్నారు’’ అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు..

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 16:04

Andhra news: పులివెందులలో కాల్పుల కలకలం..

పులివెందుల: వైఎస్సార్‌ జిల్లా, సీఎం జగన్‌ సొంత నియోజకవర్గం పులివెందులలో తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. భరత్‌ కుమార్‌ యాదవ్‌ అనే వ్యక్తి తన తుపాకీ తీసుకొని ఇద్దరు వ్యక్తులపై నిర్దాక్షిణ్యంగా కాల్పులకు తెగబడ్డాడు..

ఈ ఘటనలో తీవ్ర గాయాలైన దిలీప్‌, మహబూబ్‌ బాషా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భరత్‌ కుమార్‌ యాదవ్‌, పులివెందుల పట్టణంలోని గొర్రెల వ్యాపారి దిలీప్‌ మధ్య ఆర్థికలావాదేవీలు ఉన్నాయి. గత వారం రోజులుగా ఇద్దరూ డబ్బుల విషయంలో గొడవపడుతున్నట్టు సమాచారం. దిలీప్‌.. భరత్‌కుమార్‌ యాదవ్‌కు అప్పు ఉండటంతో ఆ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పులివెందులలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఈరోజు మధ్యాహ్నం ఇద్దరూ తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగడంతో.. హుటాహుటిన ఇంట్లోకి దూసుకెళ్లిన భరత్‌కుమార్‌ యాదవ్‌ తనవద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దిలీప్‌ ఛాతి, నుదిటిపై కాల్పులు జరిపినట్టు సమాచారం.

ఆ సమయంలోనే అతడి పక్కనే ఉన్న దిలీప్‌ స్నేహితుడు మహబూబ్‌ బాషా అడ్డుకొనే ప్రయత్నం చేయగా.. అతడిపైనా కాల్పులు జరిపినట్టు బాధితులు చెబుతున్నారు. గాయాలతో వీరిద్దరూ ఆలయం మెట్ల వద్ద కింద పడిపోవడంతో భరత్‌కుమార్‌ యాదవ్‌ అక్కడి నుంచి తుపాకీతో పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో బాధితులను చికిత్స నిమిత్తం పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. దిలీప్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో కొద్ది సేపటి క్రితమే అతడిని ప్రాథమిక చికిత్స అనంతరం కడప రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. గతంలో వైఎస్‌ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని, సీబీఐ విచారణకు హాజరైన భరత్‌కుమార్‌ యాదవ్‌కు అసలు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భరత్‌ కుమార్‌ యాదవ్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 15:59

AP High court: కాపు రిజర్వేషన్లపై కౌంటర్‌ దాఖలు చేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అమరావతి: కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది..

ఇదే అంశంపై దాఖలైన అన్నీ పిటిషన్లను కలిపి తదుపరి విచారణలో విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన 10% కోటాలో.. కాపులకు 5% రిజర్వేషన్‌ను అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. 10శాతం రిజర్వేషన్లపై కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టులో కేసు విచారణ ముగిసినట్టు పిటిషనర్ తరఫు న్యాయవాది రాధాకృష్ణ కోర్టుకు తెలిపారు..

కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందని రిజర్వేషన్లు ఇవ్వలేమన్న ప్రభుత్వం.. ఇపుడు కేసు విచారణ ముగిసినా ఇవ్వడంలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది సందిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే నెల 26కి హైకోర్టు వాయిదా వేసింది..

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 15:56

రమాదేవి హత్యలో పోలీసులు నిర్లక్ష్య వైఖరి సరికాదు

•PDSU అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు : మల్లెల ప్రసాద్

అనంతపురం జిల్లా లో సోమవారం నార్పల మండల పరిధిలోని బొందలవాడ గ్రామంలో దారుణ హత్యకు గురైన కడపల రమాదేవి మరియు మరీ ఎందరో గత వైసీపీ పాలన లో S.C S.T లు పై దౌర్జన్యం. దాడులు,హత్యలు మాన భంగాలు జరిగావి మాకు రక్షణ కల్పించలేరాని..?రమాదేవి ఫ్యామిలీ నిలదీశారు.రమాదేవి హత్యలో పోలీసులు నిర్లక్ష్య వైఖరి స్పష్టమని పిర్యాదు చేయడానికి పోయిన తల్లి, దండ్రులను పోలీసులు బెదిరించడం సరికాదన్నారు.

హంతుకుడు జాఫర్ వలికే వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. ఎస్సీ,ఎస్టీల ప్రాణాలంటే ఎందుకు అంత చులకన్నారు. ఎస్సీ,ఎస్టీల పై దాడులను అరికట్టాలి,స్నేహ లత,నల్లపు రమ్య,టేకు లక్ష్మి,ప్రీతి నాయక్ ఇలా సబ్బండ కులాల అడ బిడ్డలను ఎంత మందిని పోగొట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందారు.మా గోడు,ఉసురు తగలక పోదాని శపించారు.

రమాదేవి కిరాతకంగా హత్య చేసిన జాఫర్ వలిని పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వార విచారణ జరిపి ఉరి తీయాలని,కేసు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని,ఈ వైసీపీ ప్రభుత్వం మృతురాలు కుటుంబానికి 50లక్షల ఎక్షగ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షంలో పోరాడి సాధించు కుంటామన్నారు. రమాదేవి నీ కిరాతకంగా హత్య చేసిన జాపర్ వలిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శిక్ష వేయాలని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 15:47

ఎన్టీఆర్ జిల్లా తెదేపా నేతపైన వైసీపీ నాయకులు దాడి..
గంపలగూడెం మం కనుమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు పైన వైసీపీ నాయకుల దాడి.. అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లు అడ్డుకున్న నియోజకవర్గ తెలుగు యువత అధికార ప్రతినిధి రేగళ్ళ బాలకోటిరెడ్డి మరియు ముక్కాల శశి కుమార్ రెడ్డి పై వైసీపీ నాయకులు దాడి.. బాలకోటి రెడ్డి మరియు ముక్కాల శశి కుమార్ రెడ్డి పైన అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఇనప రాడ్ తో దాడి చేసినట్టుగా సమాచారం.. మొన్న ఆదివారం సోషల్ మీడియా వేదికగా కనుమూరు గ్రామంలో జరుగుతున్న ఇసుక మాఫియా గురించి పోస్ట్ పెట్టాడు.. ఈ రోజు ఉదయం సోషల్ మీడియాలో పోస్టు ఎందుకు పెట్టావు అని అడగగా దీనితో గ్రామంలో వైసీపీ తెదేపా వర్గాల మధ్య ఒక్కసారిగా గొడవ వాతావరణం ఏర్పడింది.. సోషల్ మీడియాలో ఇసుక గురించి పోస్ట్ పెట్టినందుకు నా పైన దాడి చేశారు.. ఈ దాడిలో 30 మంది వైసీపీ నాయకులు ముకుమూడి దాడి చేశారు.. గాయపడిన బాలకోటిరెడ్డిని తిరువూ ఏరియా హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలింపు.. హాస్పటల్ లో చికిత్స పొందుతున్న బాలకోటిరెడ్డిని పరామర్శించిన తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ మరియు గంపలగూడెం మండలం తెదేపా నేతలు..

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 15:06

CPI Narayana: టీడీపీ, జనసేనతో కలిసే పోటీచేస్తాం..

CPI Narayana: రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలతో కలిసి సీపీఐ ఎన్నికల బరిలో నిలవబోతుందని ప్రకటించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన..

రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కలవడం అంటూ జరిగితే మా ఓట్లు ఇవ్వడం మాత్రమే కాదు.. మాకు సీట్లు కూడా కావాలని స్పష్టం చేశారు.. ఇక, వీరుడు, సూరుడు అనుకున్న జగన్.. కేంద్రం దగ్గర మొకరిల్లుతున్నాడని విమర్శలు గుప్పించారు.. పోలవరం విషయంలో వాళ్ల నాన్న వైఎస్ లో ఉన్న పోరాట స్ఫూర్తి జగన్ లో కనిపించడం లేదన్న ఆయన.. వాళ్ల నాన్న సిద్ధాంతాలకు కూడా పంగ నామాలు పెట్టిన వ్యక్తి గా జగన్ మిగిలిపోయేలా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు..

రాష్ట్ర ప్రయోజనాల కోసం సలహాలు ఇచ్చినా తీసుకునే తత్వం సీఎం వైఎస్‌ జగన్ కు లేదని విమర్శించారు నారాయణ.. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి.. పోలవరం ఎత్తు పెంచడంతో పాటు నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. పోలవరం విషయంలో విభజన హామీల హక్కులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిపోయిందన్నారు.. మీకు, పోరాడటానికి భయంగా ఉంటే అఖిల పక్షానికి ఢిల్లీ తీసుకువెళ్ళండి, విభజన హామీలు మేం సాధించుకు వస్తాం అంటూఏ ప్రకటించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ..

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 07:29

చిట్యాల ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా

•భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మండల కమిటీ అధ్యక్షులు పొలిమేర రామ్ కుమార్ ఆధ్వర్యంలో

•తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులకు బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని

భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నకిరేకల్ నియోజకవర్గo చిట్యాల మండలంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా మండల కమిటీ అధ్యక్షులు పొలిమేర రామ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులకు బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని చిట్యాల ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు బిజెపి మండల అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్ బిజెపి సీనియర్ నాయకులు చికిలo మెట్ల అశోక్ గార్లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత 5,6 నెలలుగా పెండింగ్ లో ఉన్న పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని, జీవో నెంబర్ 60 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు రూ 16,500/- అదేవిధంగా కారోబార్, బిల్ కలెక్టర్ లకు రూ 19,500/- కంప్యూటర్ ఆపరేటర్లకు రూ 22,750/- వేతనాలు చెల్లించాలని, యాక్ట్ 2/94 ను వెంటనే రద్దుచేసి పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్ లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని వారిని వెంటనే అసిస్టెంట్ కార్యదర్శులుగా నియమించి ప్రభుత్వ గ్రాండ్ ద్వారా వేతనాలు చెల్లించాలని, జీవో నెంబర్ 51నీ సవరించాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని,

మల్టీపర్పస్ విధానం ద్వారా నియమించబడిన కార్మికులు ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే వారి కుటుంబంలో వారసులకు ఉద్యోగాలు కల్పించాలని, అదనంగా నియమించిన గ్రామపంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రస్తుతం చెల్లిస్తున్న 8500 రూపాయల వేతనం అమలు చేయాలని, పి.ఎఫ్, ఈఎస్ఐ ప్రమాద భీమా సౌకర్యాలు అమలు చేయాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో ప్రకటించిన ఎస్క్ డే పేరిట రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని, పంచాయతీ కార్మికులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు, స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణాన్ని ఐదు లక్షల 50 వేలు ఆర్థిక సహాయం చేయాలని, దళిత బంధు పథకాన్ని పంచాయతీ సిబ్బందికి ప్రాధాన్యత ఇచ్చి అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ చిట్యాల మండల ఎస్సీ మోర్చా కమిటీ డిమాండ్ చేస్తా ఉందన్నారు. పంచాయతీ కార్మికుల పక్షాన ఎల్లవేళలా బిజెపి అండగా ఉంటుందని భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో చిట్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, బిజెపి మండల ఉపాధ్యక్షులు పీకే వెంకన్న, సీనియర్ నాయకులు పాపాని వాసుదేవ్, బూత్ కమిటీ అధ్యక్షులు సిద్ధ గాని అశోక్, పామనగుండ్ల వెంకన్న, ఎస్ శ్రవణ్ కుమార్ చారి, జి నరేంద్ర చారి, ఉయ్యాల లింగస్వామి, వరికుప్పల రాములు, పి వెంకన్న, ఈదుల పవన్, రాము, మల్లేష్, అనిల్, మహేష్, నరసింహ, శ్రిను తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 07:20

Kotam Reddy: నెల్లూరు జిల్లాలో పది స్థానాలూ గెలుస్తాం: కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి..

అనంతపురం: రానున్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లా (Nellore District)లో పది స్థానాల్లోనూ టీడీపీ (TDP) విజయం సాధిస్తుందని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి (Kotam Reddy Giridhar Reddy) అన్నారు.

టీడీపీలో చేరిన తాను, సామాన్య కార్యకర్తలా స్థానిక నాయకులందరితో కలిసి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండల కేంద్ర సమీపంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (NaraLokesh)ను సోమవారం ఆయన కలిశారు. యువగళం పాదయాత్రకు సంఘీబావం తెలిపారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ...

తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రను అన్నివర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. ప్రజల ఆదరణ ఉన్నంత వరకూ టీడీపీని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా యువగళం జనప్రభంజనంలా సాగిపోతుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులనూ లెక్కచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

తాను తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగానే చేరానని అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్‌ ఆదేశాలతో, వారు ఏం చెబితే ఆ పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన సోదరుడు, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy)ని వైసీపీ కొత్తగా సస్పెండ్‌ చేసేదేమీ లేదని అన్నారు. తాము అంతకుముందు రెండు నెలలుగా ఆ పార్టీకి దూరంగా ఉన్నామని అన్నారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించకపోవడం, ఫోన్‌ ట్యాపింగ్‌ నేపథ్యంలో తాము జగన్‌తో ఉండకూడదని నిర్ణయించుకున్నామని అన్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 28 2023, 07:19

TTD: తితిదేకి రూ.3 కోట్ల జరిమానా

తిరుమల: విదేశీ మారకద్రవ్యానికి సంబంధించిన అంశంపై తితిదే (TTD)కి ఆర్బీఐ రూ.3 కోట్ల జరిమానా వేసిందని ఛైర్మన్‌ సుబ్బారెడ్డి (Subbareddy) తెలిపారు..

ఆర్బీఐ (RBI) వేసిన జరిమానా చెల్లించినట్లు వెల్లడించారు. భక్తులు హుండీలో వేసిన విదేశీ కరెన్సీని బ్యాంకులో జమచేసే సమయంలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించినట్లు తెలిపారు.

తితిదేకు ఉన్న ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌ 2018తో ముగిసింది. అయితే, ఇప్పటి వరకు దానిని రెన్యువల్‌ చేయకపోవడంతోనే సమస్య తలెత్తిందని సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.3కోట్ల జరిమానా చెల్లించినందున.. లైసెన్సును రెన్యువల్‌ చేయాలని ఆర్బీఐకి కోరినట్లు చెప్పారు. హుండీ కానుకల ద్వారా రూ.30 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ వచ్చిందన్నారు..