ప్రమాదవశాత్తు చెరువులో పడి వీఆర్ఎ మృతి.
ప్రమాదవశాత్తు చెరువులో పడి వీఆర్ఎ మృతి.


నిర్మల్ అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్ఎ విధులు నిర్వహిస్తూ ఆదివారం ఉదయం నిర్మల్ పట్టణంలోని ధర్మసాగర్ చెరువులో ప్రమాదవశాత్తు పడి సిద్ధ శ్రీనివాస్ (45) మృతి చెందాడు. నిర్మల్ అర్బన్ తహశీల్దార్ సుభాష్ చందర్ ఆదేశాల మేరకు మృతుని కుటుంబానికి తక్షణ సాయం కింద రూ. 10,000 ఆర్ ఐ ప్రశాంత్ రెడ్డి, విఆర్ఎ ప్రవీణ్ కుమార్లు అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
విద్యార్థిని కుటుంబానికి ఆర్థిక సాయం.

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని గబ్బాయి గ్రామానికి చెందిన ఎలాది రమేష్ కూతురు వెన్నెల ఉట్నూర్ ఏకలవ గురుకులంలో విద్యను భరిస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఆదివారం ఆదివాసి నాయకులు కుటుంబాన్ని పరామర్శించి రూ: 7000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు సిడం సకారం, తలండి లక్ష్మణ్, మడావి వెంకట్రావు, ఏన్క శ్రీహరి ,నైతం సత్తయ్య ఆత్రం మాంతయ్య ,ఏలాది నారాయణ తదితరులున్నారు.