గంజాయి కేసులో ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ 6 కేజీల గంజాయి స్వాధీనం:
•నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో
గత కొంతకాలంగా నలగొండ పట్టణంలో గంజాయికి బానిసై, జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలని ఐదుగురు యువకులు పథకం వేసి ఒరిస్సా నుండి తెచ్చి లోకల్ లో అమ్మాలని నిర్ణయించుకున్నారు .
ఈ రోజు ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు విద్యుత్ నగర్ కాలనీలోని ఒక రూమ్ లో యువకులు గంజాయి అమ్ముతున్నారని సమాచారం రాగా, నల్గొండ టూ టౌన్ సిఐ చంద్ర శేకర్ రెడ్డి ఆదేశాను సారం నలగొండ టూ టౌన్ SI లు రాజశేఖర్ రెడ్డి ,సైదులు వారి సిబ్బంది శంకర్ ,బాలకోటి , సత్యనారాయణ వెళ్లి అక్కడ ఉన్న ఇద్దరిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, రాకను గమనించి పారిపోతుండగా వెంబడించి పట్టుకొని విచారించి 3kg ల గంజాయి స్వాధీనం చేసుకుని, MRO నాగార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించడం జరిగింది.
వారు చెప్పిన వివరాల ప్రకారం అర్జల బావి దాబా దగ్గర గల ఒక రూములో మరొక ముగ్గురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి మరొక 3 Kg ల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
అరెస్టు కాబడిన వ్యక్తుల వివరాలు
(1) బోట్ల విశ్వంత్ తండ్రి కృష్ణయ్య గ్రామం: వూత్కుర్ , శాలిగౌరారం,
(2) విశ్వనాధుల ఈశ్వర్ తండ్రి Late, బ్రహ్మచారి ,R/o శ్రీరామ్ నగర్, కాలనీ నల్గొండ
(3) వాడపల్లి శివ తండ్రి రాములు ,R/o గాంధీనగర్ ,నల్గొండ
(4) గోసుకొండ శివ తండ్రి జనార్ధన్ R/o పానగల్, నల్గొండ
(5) కొక్కు రమేష్ తండ్రి బిక్షపతి R/o శ్రీరామ్ నగర్ కాలనీ నల్గొండ.
వీరి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్కు పంపనయినది.
పట్టణ ప్రజలకు విజ్ఞప్తి
మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఏవైనా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే వెంటనే 100 నెంబర్ కు గాని పోలీస్ స్టేషన్కు గాని తెలియచేయగలరు.
Mar 02 2023, 17:00