మారకద్రవ్యాల నుండి యువతను కాపాడుదాం
•PYL మండల మహాసభలో ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరు సాగర్
ప్రగతిశీల యువజన సంఘం (PYL)మోతే మండల ప్రధమ మహాసభ రాయిపాడు గ్రామంలో కోడి లింగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముందుగా బిగిపిడికిలి జెండాను పీవైఎల్ జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య ఆవిష్కరించారు. ఈ మహాసభను ప్రారంబిస్తూ ఐఎఫ్ టి యూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య మాట్లాడారు.
అనంతరం జరిగిన మహాసభలో ముఖ్య అతిథిగా పివైఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇందూరు సాగర్ పాల్గొని మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో యువత మద్యం, గంజాయి,గుట్కా, మారకద్రవ్యాలకు అలవాటు పడి చెడు వ్యసనాలకు గురై జీవితాలను కోల్పోతున్నారని, ప్రభుత్వం వీటిని నియంత్రించడంలో ఘోరంగా విఫలం చెందిందని దుయ్యబెట్టారు.
ఎంజీఎం మెడికల్ కళాశాలలో ప్రీతి అనే విద్యార్థిని ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ప్రీతి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని అన్నారు. విద్యాసంస్థలలో డ్రగ్స్, గంజాయి, మారక ద్రావవ్యాలను విక్రయిస్తున్న పోలీసులు చోద్యం చూస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన "షి" టీములు "షో" టీములుగానే మారినాయని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం మేల్కొని రాష్ట్రంలో యదేచ్ఛగా సాగుతున్న మద్యం, గంజాయి గుట్కా తదితర మారక ద్రవ్యాలను నిషేధించాలని, షి టీoలను వివిధ కళాశాలలో నిరంతరం ఉంచాలని డిమాండ్ చేశారు.
ఐఎఫ్ టి యూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య మాట్లాడుతూ దేశంలో,రాష్ట్రంలో మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు నిరుద్యోగులను గాలికి వదిలేసారని, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలం చెందారని అన్నారు. 26 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని ఇప్పటివరకు భారీ నోటిఫికేషన్ ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని, దేశంలో కోటి ఉద్యోగాలు ఇస్తారన్న మోడీ ప్రభుత్వం హిందుత్వం ముసుగులో ప్రజల ఆస్తులను కార్పొరేట్ శక్తులకు, బహుళ జాతి సమస్యలకు అప్పనంగా కట్టబెట్టి ప్రజలను మభ్యపెడుతున్నదని బియ్యబట్టారు. వెంటనే దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకపోతే ప్రగతిశీల యువకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు నల్లగొండ నాగయ్య, కునుకుంట్ల సైదులు, జిల్లా నాయకులు వీరబోయిన రమేష్, భువనగిరి గిరిబాబు, ధరావత్ రవి, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కాకి మోహన్ రెడ్డి, కోట్ల మధుసూదన్ రెడ్డి, ఎర్రబోయిన లింగయ్య, ఎర్రబోయిన పుల్లయ్య, భానోత్ శ్రీకాంత్, ఎర్ర ఎంకన్న, ఇరుగు మల్లయ్య, గుణగంటి నాగరాజు, కోడి లింగరాజు, నాగరాజు తదితరులు హాజరయ్యారు.
Feb 28 2023, 12:56