ఆయుష్మాన్ భారత్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలిి
నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ ను భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గారు ఉరుమడ్లలో పాల్గొని ప్రతి ఒక్కరు ఈ హెల్త్ కార్డును ఉపయోగించుకునే 1100 పైగా అన్ని రకాల వైద్య చికిత్సలు అందే విధంగా పేద ప్రజలకు చేరువగా ఉరుమడ్ల గ్రామంలో బిజెపి బూత్ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసినారు.
ఉరుమడ్ల గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారు ఇస్తున్న ABHA హెల్త్ కార్డ్ ను తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం ఐదు లక్షల వరకు ఉచిత ఆరోగ్య చికిత్సల కోసం ఏర్పాటుచేసిన ఈ కార్డును సద్వినియోగం చేసుకోవాలని ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా రాష్ట్రంలో ప్రతి హాస్పిటల్ లో ఉచితంగా 1100 రకాల ఆరోగ్య పరీక్షలు చికిత్సలు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.
తెలంగాణలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరికోసం ఎదురు చూడకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరూ దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లి వైద్య చికిత్సలు చేయించుకునే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సదా అవకాశాన్ని తెలంగాణ ప్రజలకు అందజేశారన్నారు. కావున ఉరుమడ్ల గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డు పొందాలని ఇట్టి కార్డును ఉచితంగా భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు ఇంటి ఇంటికి వచ్చి అందజేస్తామన్నారు. ఇంత గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఉయ్యాల లింగస్వామి, యువజన నాయకులు పాకాల దినేష్, బూత్ కమిటీ అధ్యక్షులు ఈదుల పవన్, సుంకరి మల్లేష్, గంగాపురం వెంకన్న, మల్లేష్, జగన్, రాంబాబు, లింగస్వామి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Feb 27 2023, 17:20