జడ్చర్లలో ఘోరం..!
మాటలకందని సభ్య సమాజం తలదించుకునే జైనుల్లబుద్దీన్ బాబా లైంగిక అమాయక హిందూ స్త్రీలే లక్ష్యంగా దుర్మార్గపు స్త్రీల పుట్టుమచ్చల ఆధారంగా జాతకాలు చూస్తామంటూ యువతుల నగ్న (న్యూడ్) వీడియోలు..!!

నగ్నంగా స్త్రీ పూజ చేస్తే సొమ్ములు, కానుకలు కదలి వస్తాయి.

పూజ చేసే సమయంలో ఫోటోలు, వీడియోలు తీసినా డిస్టర్బ్ చేయరాదు.. పూజలో లీనమైపోవాలి.!

అంతకుమించి కనకవర్షం కురియాలంటే హైదరాబాదులోని మా గురువు దగ్గర ఓ రోజు నగ్నంగా గడిపితే చాలు.. కాసుల వర్షం, కనక వర్షం కురుస్తుంది!

అయితే, ఓ షరతు..!! గురువు గారితో గడిపే సమయంలో కించిత్ వేరే భావన మదిలో మెదలకూడదు. పరాయి వారితో గడుపుతున్నామనే భావన ఒక సెకండ్ సమయం కూడా ఆలోచించకూడదు. ఒకవేళ అలాంటి ఆలోచన మనసులో వస్తే.. ఇక అంతే, ధారగా కురిసే కనకవర్షం మధ్యలో ఆగిపోతుంది. ఇక మీ అదృష్టం మరుగున పడి దురదృష్టం ఆవహిస్తుంది.. ఫోటోలు, వీడియోలు తీసినా ఏమీ అనవద్దు.. ఒకవేళ ఏమైనా అంటే ఇక అంతే, మీకు రావాల్సిన అదృష్టం మాయమైపోతుంది.

ఇదంతా వినడానికి విడ్డూరంగా ఉంది కదూ.. కానీ ఇది అక్షరాల సత్యం. ఇది ఎక్కడో మారుమూల అడవి ప్రాంతంలో జనజీవనం లేని నిర్జీవ ప్రాంతంలోని సంఘటన కాదు..అత్యంత రద్దీప్రాంతమైన బెంగళూరు హైవేను అనుకొని.. అనుసంధానం చేసుకొని ఉన్న ఖరీదైన జడ్చర్ల పట్టణంలోనిది ఈ ఘటన. మరో విచిత్రం ఏమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, అటు కర్ణాటక రాష్ట్రం లోని మహిళలు కూడా ఇక్కడ రావడం విశేషం. హిందూ మహిళలకు మాత్రమే జైనుల్లబుద్దీన్ బాబా గారు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. దీంతో జడ్చర్ల లో ఈ బాబా దగ్గరికి క్యూ కడుతున్నారు మహిళలు. రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో( 60 కిలోమీటర్ల దూరంలో) ఉన్న జడ్చర్ల పట్టణంలో మహిళలకు మాయ మాటలు చెప్పి జైనుల్లబుద్దీన్ నగ్న పూజలు చేస్తున్నాడు. చిత్ర విచిత్రంగా ఫోటోలు, వీడియోలు తీస్తున్నాడు. ఆ ఫోటోల ఆధారంగా మహిళలను బ్లాక్ మెయిల్ చేసి రకరకాల రూపంలో వాడుకుంటున్నాడు. డబ్బులు గుంజుతున్నాడు. ఈ విషయం బయటపడితే పరువు పోతుందని.. డబ్బుకు ఆశపడి నగ్నంగా పూజ చేయించుకున్న వందలాది మంది బాధితులు తమ బాధను లో లోపలే దిగమింగుతున్నారు. "చెప్పుకుంటే పరువు పోతుంది.. చెప్పకపోతే ప్రాణం పోతుంది" అన్నట్టు మహిళల బాధ అంతా ఇంతా కాదు. చివరకు ఒకరిద్దరు మహిళలు ధైర్యం చేసి ఈ బాబా నగ్న పూజల ముసుగును తొలగించారు. జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి బాబా నగ్న పూజలను, రాసలీలలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఇంత జరుగుతున్నా ఈ లోకంలో ఏ మీడియా గానీ మిగతా పెద్దలు గాని తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం మరో విశేషం.

ముఖ్యంగా ఈ విషయంపై రాష్ట్ర మహిళా కమిషన్ మరియు జాతీయ మహిళా కమిషన్, ఇతర మహిళా సంఘాలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మహిళ కమిషన్ దృష్టికి రాకపోవడం గమనార్హం.!

నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలి

మహిళలకు మాయ మాటలు చెప్పి లైంగికంగా హింసకు గురిచేసిన బాబా జైనుల్లాబుద్దీన్, అతని అనుచరులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ళకు తలగ్గి పోలీసులు నామ మాత్రం కేసులు నమోదు చేస్తే ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు.

…….FULL DEATILS….

జాతకాలు మారుస్తామంటూ..

– న్యూడ్‌ ఫొటోలు సేకరించిన ముఠాæ

– ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలో ఆగడాలు

– మాయమాటలతో అమాయక ప్రజలకు వల

– జడ్చర్ల పోలీసుల అదుపులో ఇద్దరు..

– మరో ఇద్దరి కోసం గాలింపు

: ‘మీ జాతకాలు చూస్తాం.. హస్తరేఖలు, పుట్టుమచ్చలు, ఇతర మరకల ఆధారంగా ఉన్నది ఉన్నట్లు చెబుతాం.. మీరు కోరినట్లుగా జాతకం మారుస్తాం.. ఆ తర్వాత మీరు అనుకున్నది జరుగుద్ది.. కనకవర్షం కురిపిస్తాం’ అంటూ అమాయక మహిళలకు పలువురు మాయమాటలు చెప్పి న్యూడ్‌ ఫొటోలు సేకరించారు. ఈఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో వెలుగు చూడగా.. తవ్విన కొద్దీ వారి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీసులు ఈ ముఠాలో ఓ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు మరో ఇద్దరి పేర్లు వెలుగులోకి రాగా.. వారి కోసం గాలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో..

జాతకాలు మారుస్తామంటూ పలువురు సుమారు మూడు నెలల క్రితం తమతమ స్థానిక ప్రాంతాల్లో జ్యోతిష్య కేంద్రాలు పెట్టుకున్నారు. ఇలా మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని కోడుపర్తి, హైదరాబాద్, వికారాబాద్‌ జిల్లా ఆమన్‌గల్‌లో ఎవరి ఇళ్ల వద్ద వారు కార్యకలాపాలు ప్రారంభించారు. తమ దగ్గరికి వస్తే మంచి జరుగుతుందంటూ తెలిసిన వారి నుంచి విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రధానంగా పూలు, పండ్లు, కూరగాయలు విక్రయించే అమాయక మహిళలకు వల వేశారు. ఇలా పురుషులు సైతం చాలా మంది వారికి చిక్కినట్లు సమాచారం. శరీరంపై పుట్టుమచ్చలను తాము స్వయంగా చూసి గుర్తిస్తేనే జాతకం పక్కాగా ఉంటుందని చెప్పారు. ఫోటోలను పైకి పంపిస్తామని.. అక్కడ అమ్మవారికి పూజలు చేస్తారని.. మీకు అమ్మవారి పూనకం వస్తుందని.. ఆతర్వాత కనక వర్షం కురుస్తుందని.. అప్పుడే మాకు కొంత ముట్టాజెప్పాలని నమ్మబలికారు. అలా ఒక్కొక్కరి వద్ద న్యూడ్‌ ఫొటోలను సేకరించినట్లు సమాచారం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు రంగారెడ్డి జిల్లాల్లో బాధితులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన క్రమంలోనేనా..

జాతకం పేరిట అమాయక ప్రజలను తమ వద్దకు మూడు పర్యాయాలు రప్పించుకుని.. న్యూడ్‌ఫొటోలు సేకరించిన అక్రమార్కులు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన క్రమంలో వారి బాగోతం బట్టబయలైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒకరు ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. దీని ఆధారంగా విచారించిన ఖాకీలు జైనొద్దిన్ రాములు అనే వ్యక్తులను ఓ పౌల్ట్రీ ఫామ్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని విచారించిన క్రమంలో తిరుపతి, శంకర్‌ పేర్లు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వారిని పట్టుకునేందుకు ఓ పోలీస్‌ బృందాన్ని కేటాయించినట్లు వినికిడి. దీనిపై పోలీస్‌ అధికారులను సంప్రదించగా.. ‘విచారణ జరుగుతోంది.. పూర్తయిన తర్వాత వెల్లడిస్తాం’ అని ముక్తసరిగా సమాధానమిచ్చారు.

ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేస్తారు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాబోయే రోజుల్లో థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. అంతే కాకుండా ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేసే రోజులు వస్తాయని ప్రముఖ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ ఆర్కా ల్యాబ్‌ సీఈవో గాయత్రి తెలిపారు.

ఇకపై శరీరానికి సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా వ్యాధి ఎంటో నిర్ధారణ చేయవచ్చన్నారు. ఇలాంటి ఇకపైనూతన టెక్నాలజీ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. థర్మల్‌ స్క్రీనింగ్‌ డివైజ్‌ పరికరంతో రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను సులువుగా గుర్తించవచ్చని సీఈవో గాయత్రి తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో డివైజ్‌ తయారీ, వీటి వినియోగానికి అవసరమైన సాంకేతికతను బెంగళూరు కేంద్రంగా అందిస్తున్నట్టు చెప్పారు.

నిల్చున్న చోటే ముఖ కదలికలను కెమెరా రికార్డు చేసి వాటిని ఎనలైజ్‌ చేసేందుకు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ సాయంతో బీపీ, షుగర్‌, గుండె సంబంధిత వ్యాధులను గుర్తించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కిమ్స్‌తోపాటు మరికొన్ని సెంటర్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు క్లినిక్‌ల ద్వారా ఈ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 4వేల మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా వైద్య పరీక్షలు చేయగా 91 శాతం కచ్చితమైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నూతన డివైజ్‌ ద్వారా రూ.100-150 లోపే హెల్త్‌ రిపోర్టు పొందవచ్చని ఆమె తెలిపారు.

CM Jagan: విద్యుత్‌ కోతలనే మాటే వినిపించకూడదు: అధికారులకు సీఎం ఆదేశం

అమరావతి: వేసవిలో విద్యుత్‌ కొరత లేకుండా చూడాలని ఏపీ సీఎం జగన్‌ ఆదేశించారు. విద్యుత్‌ కొరత వల్ల కోతలనే మాట వినిపించకూడదని అధికారులకు సూచించారు..

కరెంట్‌ కోతలు లేకుండా అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలన్నారు. విద్యుత్‌ శాఖపై సీఎం జగన్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వేసవిలో విద్యుత్‌ డిమాండ్, రైతులకు కనెక్షన్లపై సమీక్షించిన సీఎం.. అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

బొగ్గు నిల్వలపైనా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో జాప్యం ఉండకూడదని.. దరఖాస్తు చేసిన నెలలోనే కనెక్షన్‌ ఇవ్వాలని ఆదేశించారు. మార్చి నాటికి మరో 20వేల విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తవుతోందని తెలిపారు.

Ts Raj Bhavan: పూలదండ ఆరోపణలపై తెలంగాణ రాజ్‌భవన్‌ క్లారిటీ

హైదరాబాద్‌: నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైద్య విద్యార్థిని ప్రీతిని పరామర్శించేందుకు గవర్నర్ పూలదండతో వచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని రాజ్ భవన్ తీవ్రంగా ఖండించింది.

ఖైరతాబాద్‌లోని హనుమంతుడి గుడిలో సమర్పించడానికి కారులో పూల దండ ఉంచామని స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్‌భవన్‌ నుంచి ప్రకటన వెలువడింది.

''గవర్నర్ వేరే ప్రదేశాల నుంచి రాజ్‌భవన్‌కు తిరిగి వచ్చేటప్పుడు ఖైరతాబాద్‌లోని హనుమంతుడి గుడికి వెళ్లి రావడం చాలా రోజుల నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఈ విషయాన్ని దుష్ప్రచారం చేస్తూ విపరీత అర్థాలు తీయడం సహేతుకం కాదు. అలాగే ప్రీతి త్వరగా కోలుకోవాలని హనుమంతుడి గుడిలో గవర్నర్ ప్రార్థించారు. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు సమగ్రంగా దర్యాప్తు జరిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గవర్నర్ నిమ్స్ పర్యటనను సరైన దృష్టితో అర్థం చేసుకోవాలి'' అని ప్రకటనలో పేర్కొంది.

Viveka Murder Case: ఒక వ్యక్తిని టార్గెట్‌ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి: వైఎస్‌ అవినాష్‌రెడ్డి

హైదరాబాద్: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో వైఎస్‌ అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం తన న్యాయవాదులతో కలిసి రెండో సారి అవినాష్‌ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు..దాదాపు 4.30 గంటల పాటు సీబీఐ అధికారులు అవినాష్‌ రెడ్డిని ప్రశ్నించారు. ఆయన వెంట వచ్చిన తన న్యాయవాదులను అధికారులు లోపలికి అనుమతించలేదు.

ఇవాళ్టి విచారణ అనంతరం అవినాష్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ''వివేకా కేసు దర్యాప్తులో భాగంగా ఇవాళ రెండో సారి సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు నాకు తెలిసినంత మేరకు సమాధానాలు చెప్పాను. అయితే, ఈ అంశంపై గతంలోనే నేను మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేశాను. ఇప్పుడు మరోసారి కోరుతున్నాను. నేను వైఎస్‌ విజయమ్మ దగ్గరకు వెళ్లి వస్తే.. ఆమెను నేను బెదిరించి వచ్చినట్లు టీవీల్లో చర్చా కార్యక్రమాలు పెట్టి అసత్య ప్రచారం చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. నేను దుబాయ్‌కి వెళ్లానని వక్రీకరించే వార్తలు రాస్తున్నారు. ఒక అంశంపై విచారణ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని కోరుతున్నా.

మీడియాతో మాట్లాడాను. రెండు రోజుల తర్వాత మరోసారి మీడియాతో మాట్లాడాను. అప్పుడు ఏ విషయాలు వెల్లడించానో.. ఇవాళ అధికారులకూ అదే చెప్పాను. ఎవరు అడిగినా అదే చెప్తాను. సీఆర్‌పీసీ 160 కింద నోటీసు ఇచ్చి విచారిస్తున్నారు. సీబీఐ విచారణ సరైన విధానంలో జరగాలని కోరుతున్నా. హత్య జరిగిన రోజు నేను వెళ్లే సరికి ఘటనా స్థలంలో లేఖ ఉంది.. అది ఎందుకు దాచారు? ఇవాళ లాయర్లను అనుమతించి ఆడియో.. వీడియో రికార్డు చేయాలని కోరాను. ఇవాళ జరిగిన విచారణ రికార్డు చేసినట్లు లేదు. గత నెల 28న మొదటిసారి నన్ను అధికారులు విచారించారు. అప్పుడు మరోసారి రావాల్సి ఉంటుందని చెప్పారు. ఇవాళ విచారణ అనంతరం మరోసారి రావాల్సి ఉంటుందని అధికారులు ఏమీ చెప్పలేదు'' అని అవినాష్‌ రెడ్డి వెల్లడించారు..

Chandrababu: వివేకాది ముమ్మాటికీ అంతఃపుర హత్యే: చంద్రబాబు

ఏలూరు: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని భయంకరంగా హత్య చేసి.. ఆ విషయాన్ని దాచిపెట్టేందుకు అనేక కుట్రలు చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు.వివేకా హత్యకు ముందు, తర్వాత ఏం జరిగిందో సీబీఐ దర్యాప్తులో అన్నీ బయటకు వచ్చాయన్నారు. ఏలూరులో నిర్వహించిన తెదేపా జోన్‌-2 సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

''హత్యకు ముందు ఎంపీ అవినాష్‌ ఇంట్లో కుట్ర జరిగినట్లు దర్యాప్తులో తేలింది. రాజకీయాలకు అడ్డు వస్తున్నారనే వివేకాను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇంత జరిగినా ఎంపీ అవినాష్‌.. అమాయకుడని వైకాపా నేతలు చెబుతున్నారు. వివేకా ఎలా చనిపోయారో తెలియాలని.. అందుకోసం కచ్చితంగా శవపరీక్ష చేయాల్సిందేనని ఆనాడు ఆయన కుమార్తె సునీత పట్టుబట్టింది.

తండ్రి హత్య కేసు విచారణపై సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఆమె.. పోరాడి కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయించుకున్నారు. అయితే, వివేకా హత్యను తెదేపా నేతలపై నెట్టేందుకు ప్రయత్నించారు.వివేకా హత్యతో అవినాష్‌కు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. వివేకా హత్యకు ముందు అవినాష్‌ ఇంట్లో అందరూ కూర్చున్నారు. హత్య తర్వాత లోటస్‌ పాండ్‌కు ఫోన్‌ వెళ్లింది. ఇవన్నీ చూస్తుంటే.. వివేకాది ముమ్మాటికీ అంతఃపుర హత్యే'' అని చంద్రబాబు పేర్కొన్నారు.

''వైకాపా చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమం పూర్తిగా విఫలమైంది. ఒంగోలులో తెదేపా నిర్వహించిన 'మహానాడు'కు ఎన్ని ఆటంకాలు కలిగించినా విజయవంతమైంది. ఇటీవల అనపర్తి వెళ్లకుండా అనేక ఇబ్బందులు పెట్టారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి మరీ అడ్డుకున్నారు. అనపర్తి సభ మనలో స్ఫూర్తి రగిలించింది. రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కందుకూరు తొక్కిసలాటను అడ్డంపెట్టుకొని జీవో.నం.1 తీసుకొచ్చారు. జగ్గంపేట, పెద్దాపురం సభలకు జనం భారీగా వచ్చారు. ప్రజల స్పందన చూసి అనపర్తి సభను అడ్డుకున్నారు. కార్యకర్తలే మా బలం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెదేపాదే విజయం'' అని చంద్రబాబు వెల్లడించారు..

చంద్రబాబుకు బాలకృష్ణ పూనినట్లున్నాడు: కొడాలి నాని సెటైరికల్‌ పంచ్‌

తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును పిచ్చి ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

కాగా, కొడాలి నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గన్నవరం ‍ప్రజలను చంద్రబాబు భయభ్రాంతులకు గురిచేశాడు. మీ అంతు తేలుస్తానంటూ చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబును జైల్లోగానీ, పిచ్చాసుపత్రిలోగానీ పెట్టాలి. చంద్రబాబు ఛాలెంజ్‌లకు భయపడేవారు ఎవరూ లేరు. నారా లోకేష్‌ పిచ్చి కూతలు కూస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.

నారా లోకేష్‌ బ్రెయిన్‌లెస్‌ కిడ్‌. రాజ్యాంగం గురించి లోకేష్‌కు ఏం తెలుసు?. చంద్రబాబు ముందు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.తర్వాత బ్లాక్‌ క్యాట్‌ కమెండోలను వదులుకోవాలి. అప్పుడు చంద్రబాబు ఛాలెంజ్‌లు చేయాలి. చంద్రబాబుకు బాలకృష్ణ పూనినట్లున్నాడు. సీఎం జగన్‌పై చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. లోకేష్‌ తన పిచ్చి వాగుడుని చంద్రబాబుకు అంటించినట్టున్నాడు. రాజ్యాంగం ముసుగులో చంద్రబాబు పిచ్చివాగుడు వాగుతున్నాడు. చంద్రబాబుతో ప్రజలకు ఇబ్బంది. పోలీసులను కించపరుస్తూ ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. పట్టాభిని గన్నవరం పంపింది చంద్రబాబే. గన్నవరంలో టీడీపీ కార్యకర్తలపై చిన్న గీత కూడా పడలేదు' అని పేర్కొన్నారు.

ప్రజా గోస బిజెపి బరోసా కార్యక్రమం లో బాగంగా బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమం

•ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చిట్యాల మాజీ జెడ్పిటిసి, చిట్యాల మున్సిపాలిటీ ఒకటవ వార్డు కౌన్సిలర్ శేపూరి రవీందర్

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామం మరియు ఎలికట్టే గ్రామాల్లో నిన్న రాత్రి జరిగిన ప్రజాగోష బిజెపి భరోసా కార్యక్రమం బిజెపి నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యులు శక్తి కేంద్రం ఇంచార్జ్ పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చిట్యాల మాజీ జెడ్పిటిసి చిట్యాల మున్సిపాలిటీ ఒకటవ వార్డు కౌన్సిలర్ శేపూరి రవీందర్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఉరుమడ్ల గ్రామ బిజెపి నాయకులు బిజెపి భరోసా కార్యక్రమానికి విచ్చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ గారిని శాలువాతో సన్మానించి పెద్ద ఎత్తున మహిళలు యువకులు కోలాటాలతో బిజెపి నినాదాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఉరుమడ్ల గ్రామంలో భారీ ర్యాలీ తీసి సభా వేదికకు చేరుకొని బిజెపి రాష్ట్ర నాయకులు రవీందర్ గారు గ్రామదేవతలైన ముత్యాలమ్మ తల్లికి కొబ్బరికాయలు కొట్టి బిజెపి భరోసా కార్యక్రమాన్ని శక్తి కేంద్రం ఇంచార్జ్ నర్ర మాధవి గోపాల్ రెడ్డి గారు ప్రారంభించారు.

ఈ సమావేశాన్ని ఉద్దేశించి రవీందర్ గారు మాట్లాడుతూ ఉరుమడ్ల గ్రామ మహిళల యువకుల ఉత్సాహం చూసి రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కేసీఆర్ 9 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి తాగుబోతు రాష్ట్రంగా మార్చాడన్నారు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి తగిన మూల్యం తప్పదన్నారు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారని తెలియజేశారు.

దళిత ముఖ్యమంత్రి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి, లక్ష రూపాయల రుణమాఫీ, కేజీ టు పీజీ విద్య, యాదవులకు గొర్రెలు, దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు, వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని బిసి సొసైటీలు ఫెడరేషన్లు అన్ని సంఘాలను నిర్వీర్యం చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల ద్వారా గ్రామ పంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని వీధిలైట్లు, రోడ్లు, మరుగుదొడ్లు, పల్లె పకృతి వనాలు, రైతు వేదికలు, స్మశానవాటికలు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు, సుకన్య సమృద్ధి యోజన, ఫసల్ బీమా యోజన, ఇలా 350 పైగా కేంద్ర ప్రభుత్వ పథకాలను నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు.

అన్ని విధాల సౌకర్యాల కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు వెచ్చించి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలంగాణ ప్రజలకు కరోనా కష్టకాలం నుండి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్నారని అదేవిధంగా కరోనా కష్టకాలంలో ఉచితంగా కరోనా మూడు దఫాలుగా టీకాలు వేయించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా ఐదు లక్షల వరకు మనం ఏ ఆసుపత్రికి వెళ్లిన ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చని తెలియజేశారు.

కేంద్రం నుంచి సరాసరి మన గ్రామాలకు అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం 1250 రూపాయలు ఒక్కరికి చొప్పున గ్రామపంచాయతీకి కేంద్ర ప్రభుత్వo నిధులు కేటాయిస్తుందన్నారు. ఉరుమడ్ల గ్రామపంచాయతీకి 20 లక్షల నుండి 25 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వ నిధులు కేటాయించబడతాయని తెలియజేశారు. ఎలికట్టే గ్రామంలో బిజెపి నాయకులు బూత్ కమిటీ అధ్యక్షులు పులుగు శ్రీనివాస్ గుడిపాటి సందీప్ చర్లపల్లి లింగస్వామి పామనగుండ్ల వెంకన్న ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర నాయకులు రవీందర్ గారికి శాలువాతో సన్మానించి మహిళలు కోలాటాలతో భారీ స్వాగతం పలికారు. ఎలికట్టె గ్రామ నూతన బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. గ్రామస్తులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమానికి శక్తి కేంద్రం ఇంచార్జ్ పల్లపు బుద్ధుడు అధ్యక్షతన సమావేశాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రవీందర్ గారు మాట్లాడుతూ ఎలికట్టే గ్రామంలో దళితులకు మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు దళిత బంధు మన గ్రామాల్లో ఎందుకు ప్రవేశ పెట్టలేదు దళితులను మోసం చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దతించడమే లక్ష్యంగా మనందరం కలిసికట్టుగా పనిచేసి భారతీయ జనతా పార్టీని బలపరిచి రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాల పైన సవివరంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన మోసాల గురించి ప్రజలకు వివరంగా బిజెపి రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నకరేకల్ అసెంబ్లీ కన్వీనర్ మైల నరసింహ, మండల అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్, బూత్ కమిటీ అధ్యక్షులు సుంకరి మల్లేష్ గౌడ్, ఈదుల పవన్ చింతకాయల రాము, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు మాస శ్రీనివాస్, ఎస్సీ మోర్చ నకిరేకల్ కన్వీనర్ కోరబోయిన లింగస్వామి, ఓబీసీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గరిసె రవికాంత్, గంజి గోవర్ధన్, సీనియర్ నాయకులు ఉయ్యాల లింగస్వామి, యువజన నాయకులు పాకల దినేష్, మాజీ వార్డు సభ్యులు రూపాని నరసింహ, పాలకూరి వెంకన్న జగన్ పవన్ వెంకటేష్, అర్జున్, మచ్చ గిరి సైదులు నరసింహ వెంకన్న భిక్షమయ్య అంజయ్య కిష్టయ్య బజారు వెంకటేష్, శ్రీశైలం నాగేష్ మహేష్ సురేష్ శివ రాంబాబు లింగస్వామి రమేష్ సందీప్ సాయి మరియు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

రెండోసారి విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి..

సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ముగింపుకు చేరుతున్నట్టే పరిణామాలు జరుగుతున్నాయి. తాజాగా రెండో సారి కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజర్యారు..

ఆయన్ను పలు రకాల ప్రశ్నలు వేస్తున్నారు అధికారులు.. తొలిసారి విచారణకు హాజరైనప్పుడు పలు ప్రశ్నలకు ఎంపీ సమాధానాలు చెప్పలేదు. ఈ నేపథ్యంలో మరోసారి పాత ప్రశ్నలతో పాటు.. దస్తగిరి చెప్పిన అంశాలపై..

హత్య జరిగిన రోజు ఎవరు పాత్ర ఏంటి అన్న విషయాలపై విచారణ చేస్తున్నారు. మరోవైపు సీబీఐ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కనిపించారు. అవినాష్ రెడ్డికి మద్దతుగా ఆయన అనుచరులు అక్కడకు చేరుకున్నారు. ఆయనకు అనూకలంగా నినాదాలు చేస్తూ.. పరిస్థితి గందరగోళంగా మారడంతో.. సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డి అనుచరులను అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు.

తెలంగాణలో ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 28న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి వెల్లడించారు.

మార్చి 3 నుంచి ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.

ఏప్రిల్‌ 30 నుంచి ఎంసెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని.. మే 7 నుంచి 11 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.