తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 26 2024, 19:41

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్న ఐఎండీ.

ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు ఆవర్తన ప్రభావంతో మరికొన్ని రోజులు వానలు కురిసే అవకాశం ఉంది. మరో వైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుదనం సంతరించుకోనున్నాయి. ఫలితంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.

ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు ఆవర్తన ప్రభావంతో మరికొన్ని రోజులు వానలు కురిసే అవకాశం ఉంది. మరో వైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుదనం సంతరించుకోనున్నాయి.

ఫలితంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలో పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఐఎండీ.

అలాగే, తెలంగాణలో కూడా పలు జిల్లాలకు వర్షసూచన చేసింది వాతావరణశాఖ. హన్మకొండ, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.

15వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, మట్టి తొలగింపు పనులు నిలిచిపోయినట్టు చెప్పారు సింగరేణి అధికారులు. దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం కురవడంతో సత్తుపల్లిలో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలతోపాటు రోడ్లపైనా పెద్దఎత్తున నీరు నిలిచిపోయింది. సత్తుపల్లితోపాటు పెనుబల్లి, కల్లూరు మండలాల్లో కూడా కుండపోత వర్షం కురిసింది.

నిజంనిప్పులాంటిది

Jun 23 2024, 14:10

రాష్ట్ర రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

#మంత్రిగా బాధ్యత చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభం తోను, అధికారులు పుష్ప గుచ్చాలను అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు.

# వేద పండితుల మంత్రోచ్ఛారణ ల మధ్య ఆ భగవంతునికి షోడశోపచారా పూజ నిర్వహించిన తదుపరి తమ సీట్లో ఆసీనులు అయ్యారు.

#ప్రకాశం జిల్లా దర్శి లో రూ.18.51 కోట్ల అంచనా వ్యయంతో  డ్రైవింగ్ శిక్షణ మరియు రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసే ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు.

#ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలోనే కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం పథకంలో ఎదురయ్యే లోటు పాట్లు మన రాష్ట్రంలో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా పలు చర్యలు చేపడతామన్నారు.

# రాష్ట్ర రవాణా శాఖ అదనపు కార్యదర్శి నరసింహారెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కేఎస్ బ్రహ్మానందరెడ్డి, జీవి రవి వర్మ, చంద్రశేఖర్, ఏపీఎస్ఆర్టీసీ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. వై శ్రీనివాస్, క్రీడా శాఖ ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎస్ వెంకటరమణ, యువజన సర్వీసెస్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ, ఎన్సీసీ అసిస్టెంట్ డైరెక్టర్కేజియా తదితరులతో పాటు పలువురు అధికారులు, అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Jun 23 2024, 12:57

రాష్ట్రమంతటా వైఎస్సార్సీపీ రాజమహళ్లు- నామమాత్రపు లీజులతో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ

వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా పర్వాలేదన్న విధంగా వైఎస్సార్సీపీ పాలనలో అక్రమాలు జరిగాయి.

అడుగడుగునా అధికారాన్ని దుర్వినియోగం చేసిన జగన్ అడ్డగోలుగా ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు లీజులకే వైఎస్సార్సీపీ కార్యాలయాలకు కట్టబెట్టారు.

అన్ని నిబంధనలనూ ఉల్లంఘిస్తూ చట్టాలన్నింటినీ కాలరాస్తూ 26 జిల్లాల్లో ప్యాలెస్‌లను తలదన్నేలా నిర్మాణాలను దాదాపు పూర్తి చేశారు.

ఐదేళ్లుగా అనుమతులు లేకుండా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు సర్వే నెంబరు 44లో రూ.2 కోట్ల విలువైన ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమిలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటికి సమీపంలో దీన్ని నిర్మిస్తున్నారు. 2022, మే 18న 33 సంవత్సరాలు ఎకరా వెయ్యి రూపాయల చొప్పున స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు జీవో ఇచ్చారు. పట్టణ ప్రణాళిక సంస్థ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణం తుది దశకు చేరింది.

విజయనగరం నడిబొడ్డున మూడున్నర కోట్ల రూపాయల విలువైన భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. మహరాజుపేట 540 సర్వే నంబర్​లోని స్థలంపై కన్నేసిన వైఎస్సార్సీపీ నేతలు చెరువు గర్భం స్థలాన్ని రెవిన్యూ దస్త్రాల్లో డీ-పట్టాగా మార్పు చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇందులో ఎకరం విస్తీర్ణంలో వైఎస్సార్సీపీ కార్యాలయ భవనం నిర్మిస్తున్నారు. దాదాపు 85 శాతం నిర్మాణం పూర్తైంది. దీనికీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.

పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.2కోట్ల విలువైన ఎకరం 18 సెంట్ల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇది చివరిదశకు చేరింది. గతంలో ఈ స్థలాన్ని రైతు శిక్షణ కేంద్రానికి కేటాయించి శంకుస్థాపన కూడా చేశారు. 

విశాఖపట్నం ఎండాడలో 175/4 సర్వే నంబర్​లో రూ.100 కోట్ల విలువైన 2ఎకరాల ప్రభుత్వ భూమిలో కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు. జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. గతంలో ఈ భూమిని రెవెన్యూ ఉద్యోగులకు కేటాయించారు. ఈ నిర్మాణానికి జీవీఎంసీ జోన్-2 అధికారులు ఇప్పుడు నోటీసులు అంటించారు.

అనకాపల్లిలో రూ.15 కోట్ల విలువైన ఎకరం 75 సెంట్ల భూమిలో అనుమతులు లేకుండా నిర్మాణం పూర్తి చేశారు. గతంలో ఈ భూమిని కాపు భవనానికి కేటాయించి శంకుస్థాపన సైతం చేసి 50లక్షల నిధుల కేటాయింపులు చేశారు. 

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.5 కోట్ల విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. ఇది సాగుభూమి అని గిరిజనులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉంది.

కాకినాడలో 75 కోట్ల విలువైన ఎకరం 93 సెంట్ల సర్కారు భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భూమి 22ఎ నిషేధిత జాబితాలో ఉంది. 

రాజమహేంద్రవరం జైలు రోడ్డులోని ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహం వెనుక సర్వే నంబరు 107/7లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. భవన నిర్మాణం దాదాపు పూర్తై, రంగులు అద్దుతున్నారు. 2023లో పనులు ప్రారంభించి శరవేగంగా పూర్తి చేశారు. ఐతే నిర్మాణానికి ఎలాంంటి అనుమతులు తీసుకోలేదన్న అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రూ.10కోట్ల విలువైన ఎకరం ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇది చెరువు భూమి. ఈ వ్యవహారం కోర్టులో ఉంది.

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలో వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణ దశలో ఉంది. సర్వే నంబర్ 201/3లో సుమారు 72 సెంట్ల స్థలాన్ని వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఇచ్చేశారు. దాని విలువ రూ.7కోట్ల పైమాటే. గృహ నిర్మాణ శాఖకు చెందిన ఈ స్థలాన్ని గతంలో పేదలకు కేటాయించి ఆ తర్వాత రద్దు చేశారు. ఇక్కడి పార్టీ కార్యాలయ శ్లాబ్‌ పూర్తైంది.

ఏలూరు రైల్వే స్టేషన్​కు వెళ్లే దారిలో ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థకు చెందిన రూ.5 కోట్ల విలువైన రెండెకరాల స్థలంలో రాజమహల్​ను తలదన్నేలా వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించారు. రెండేళ్ల క్రితం ఈ నిర్మాణం చేపట్టగా ఇటీవలే పూర్తైంది. దీనికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణంపై నిబంధనల మేరకు ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. 

విజయవాడ విద్యాధరపురంలోని సితార సెంటర్‌ సమీపంలో రూ.50 కోట్లకు పైగా విలువ చేసే ఎకరం స్థలంలో మూడంతస్తుల్లో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. దీనికీ ఎలాంటి అనుమతులు లేవు. నగరపాలక సంస్థకు రూపాయి కూడా రుసుముల కింద చెల్లించలేదు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా కోర్టు సెంటర్‌లో 60కోట్లకు పైగా విలువైన 2ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని దర్జాగా కడుతున్నారు. ఈ స్థలంలో ప్రజలందరికీ ఉపయోగపడేలా భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో ఓ గ్రంథాలయం, ఆడిటోరియం, కన్వెన్షన్‌ సెంటర్, మ్యూజియం నిర్మించాలని ప్రతిపాదనలుండగా వాటిని కాదని కార్యాలయం కట్టుకుంటున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని దీని వెనుక ప్రధాన పాత్రధారి. అక్రమంగా నిర్మిస్తున్న భవనానికి ఇప్పుడు ప్లాన్‌ అప్రూవల్‌ కోసం మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థకు దరఖాస్తు చేశారు.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో లింగంగుంట్ల అగ్రహారంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా ప్రధాన ఆసుపత్రి, రైల్వేస్టేషన్‌ సమీపంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మించారు. ఎకరం 50 సెంట్ల స్థలంలో అనుమతులు లేకుండానే కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు.

బాపట్లలో ఏపీఐఐసీకి చెందిన రూ.6కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మించారు. 2022లో అప్పటి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ కనుసన్నల్లో ఇది జరిగింది. 2022 డిసెంబర్ 19న వైఎస్సార్సీపీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఇది ఆర్టీసికి చెందిన స్థలమని డిపో మేనేజర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆగ్రహించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేనేజర్​ను అక్కడి నుంచి బదిలీ చేసింది. పట్టణ ప్రణాళికా విభాగానికి భవన నిర్మాణ ప్లాన్ సమర్పించారేగానీ, ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదు. ఐనా నిర్మాణం పూర్తి చేశారు. 

ప్రకాశం జిల్లా ఒంగోలు మినీ బైపాస్‌లో నీటిపారుదల శాఖ కార్యాలయం ఆనుకొని ఉన్న నాలుగున్నర కోట్ల విలువైన ఎకరం 64 సెంట్ల ప్రభుత్వ భూమిలో వైఎస్సార్సీపీ ఆఫీస్‌ కట్టారు. 2023 జులై 31న అనుమతులు తీసుకున్నారు. 2025 జనవరి 21లోగా ప్రారంభించి 2029 నాటికి పూర్తి చేయాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అనుమతిచ్చారు. నిర్మాణం ప్రారంభానికి గడువుండగానే వైఎస్సార్సీపీ నాయకులు ఆగమేఘాలపై నిర్మాణం పూర్తి చేశారు.

నెల్లూరులో వెంకటేశ్వరపురంలో రూ.10 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మాణం చేపట్టారు. అనుమతుల్లేకుండానే 90శాతం నిర్మాణం పూర్తి చేశారు. దీనికి ప్రస్తుతం రంగులు వేస్తున్నారు. గతంలో ఈ స్థలాన్ని టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారు. 

కర్నూలు ఐదు రోడ్ల కూడలిలోని సర్వే నంబర్ 95-2లో ఏపీ ఆగ్రోస్‌కు చెందిన రూ.100 కోట్ల విలువైన ఎకరం 60 సెంట్ల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవనం పూర్తైంది.

నంద్యాల సమీపంలోని కుందూనది ఒడ్డున జగనన్న కాలనీలో సుమారు 7 కోట్ల విలువైన ఎకరా భూమిని వైఎస్సార్సీపీ కార్యాలయానికి కేటాయించారు. 6 నెలల క్రితం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పునాదులు పూర్తయ్యాయి. వీటికీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. 

కడపలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సర్వేనంబర్ 424/3 లోని రెండు ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. కడప పట్టణాభివృద్ధి సంస్థ నుంచి అనుమతులు తీసుకోలేదు.

అన్నమయ్య జిల్లా రాయచోటిలో 12కోట్ల విలువైన ఎకరం 61 సెంట్ల ప్రభుత్వ భూమిలో వైకాపా కార్యాలయం నిర్మిస్తున్నారు. దీనికీ ఎలాంటి అనుమతులు లేకపోయినా నిర్మాణం చివరి దశకు చేరింది. 

అనంతపురంలో రూ.45 కోట్ల విలువైన ఎకరం 50 సెంట్ల జలవనరుల శాఖ భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం తుదిదశకు చేరింది. భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు. తక్షణమే నిర్మాణం ఆపేసి వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడికి అధికారులు నోటీసిచ్చారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శ్రీసత్యసాయి జిల్లాలో 20కోట్ల విలువైన ఎకరంన్నర భూమిలో విమానాశ్రయం ఎదురుగా కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇది తుదిమెరుగుల దశలో ఉంది. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. 

తిరుపతి రేణిగుంట విమానాశ్రయ సమీపంలో పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన రూ.14 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. దీనికి రెవెన్యూశాఖతో పాటు తుడా అనుమతులూ లేవు. పరిశ్రమల శాఖ అనుమతి నిరాకరిస్తూ గత అక్టోబర్‌లో పని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినా వాటిని పట్టించుకోకుండా నిర్మాణాలు చేశారు.

చిత్తూరు జిల్లాలో రూ.17కోట్ల విలువైన 2 ఎకరాల్లో అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేశారు. ఇది ఇతరుల ఆధీనంలోని భూమి. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. 

రాష్ట్ర వ్యాప్తంగా రూ.677 కోట్ల విలువైన 42 ఎకరాల 24 సెంట్ల స్థలంలో వైఎస్సార్సీపీ కార్యాలయాలు నిర్మిస్తున్నారు. రాజ ప్రాసాదాలను తలదన్నేలా వీటిని కడుతున్నారు. 

అధికారం అండతో వైఎస్సార్సీపీ ఐదేళ్లుగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినవి ఏమన్నా ఉన్నాయంటే అవి సొంత పార్టీకి చెందిన కార్యాలయాలేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Andrapradesh

May 20 2024, 07:46

రూ.5వేలకు ఓటు అమ్ముకున్న ఎస్సె.. సస్పెన్షన్*


AP: డబ్బుకు ఓటును అమ్ముకోవద్దని చెప్పాల్సిన SI తన ఓటు అమ్ముకుని సస్పెండ్ అయ్యారు. మంగళగిరి టౌన్ ఎస్సై ఖాజాబాబుకు ప్రకాశం (D) కురిచేడులో ఓటు ఉంది. SIతో ఓటు వేయిస్తామని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5వేలు తీసుకుని.. SIకి ఆన్లైన్లో పంపారు. ఆ తర్వాత డబ్బులు పంచుతూ సదరు నాయకుడు పోలీసులకు చిక్కాడు. విచారణలో SIకి నగదు పంపినట్లు తేలింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

నిజంనిప్పులాంటిది

May 09 2024, 11:57

నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ జిల్లాల్లోనే

నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ జిల్లాల్లోనే

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.

అలాగే ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

నిజంనిప్పులాంటిది

May 07 2024, 17:41

తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ రిలీఫ్ !

- తగ్గనున్న భానుడి భగభగ

- నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయంటూ ఐఎండి వెల్లడి

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. వారం రోజులుగా ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఊరట దొరకనుంది...

వచ్చే మూడ్రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు (Rains) పడే అవకాశముందని హైదరాబాద్‌ (Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అన్ని జిల్లాల్లో సగటున 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు మించకపోవచ్చని వివరించింది. 

నేడు నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే.. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి . 

ఏపీలో ఇలా..!

విదర్భ నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు ఏపీలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అక్కడక్కడా భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు పడతాయని తెలిపింది. 

మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఇంకా గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.

వడగళ్ల వానలతో రైతులకు పంట నష్టమే !

అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని ఎండ తీవ్రత, వడగాడ్పుల ప్రభావం కొనసాగింది. ప్రధానంగా రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో గాడ్పులు వీచాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఏడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. 

కాగా, విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకూ కొనసాగుతున్న ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించింది. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగడంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఈదురుగాలులు వీచాయి. అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 04 2024, 19:25

AP Newws: ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించిన ఈసీ

అమరావతి: మూడు జిల్లాల కలెక్టర్లు, ఐదు జిల్లాలకు ఎస్పీలను కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) గురువారం నాడు నియమించింది. కృష్ణా కలెక్టర్ గా కె.బాలాజీ, అనంతపురం కలెక్టర్‌గా వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్ నియమించింది..

గుంటూరురేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిఫాఠి, ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్, పల్నాడు ఎస్పీగా గరికపాటి బిందుమాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు. అనంతరపురం ఎస్పీగా అమిత్ బద్దార్, నెల్లూరు ఎస్పీగా అరీఫ్ హఫీజ్ నియమించింది.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు రాత్రి ఎనిమిది గంటలల్లోపు ఈ అధికారులు బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశించింది. రెండు రోజుల క్రితం ఐదు జిల్లాల ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ, ముగ్గురు కలెక్టర్లను ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆరోపణల నేపథ్యలో వీరిని బదిలీ చేసి, కొత్తవారిని కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించింది..

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 11:23

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం:ముగ్గురు మహిళలు మృతి

ప్రకాశం జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద డివైడర్‌ను కారు ఢీకొట్టింది.

ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మహిళలు మృతి చెందారు.

మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. వారిని హుటాహు టిన ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది..

madagoni surendar

Mar 19 2024, 16:25

మల్లు స్వరాజ్యం ఆశయాలను కొనసాగిస్తాము. పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా కార్యదర్శి

మల్లు స్వరాజ్యం ఆశయాలను కొనసాగిస్తాము.
   
పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా కార్యదర్శి

*ద్వితీయ వర్ధంతి సందర్భంగా జీకే అన్నారంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహణ*
నల్గొండ జిల్లా :-
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శమని వారి ఆశయాలు కొనసాగిస్తామని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు.  ఈ రోజు జీకే అన్నారం గ్రామంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) నల్గొండ ఆధ్వర్యంలో *సంకల్ప హాస్పిటల్ , ప్రభుత్వ PHC రాములబండ వారి సహకారంతో*  ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ ఆనాడు దున్నేవాడికే భూమి కావాలని పెట్టి చాకిరి విముక్తి కావాలని మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల వ్యతిరేకంగా నిలబడి తుపాకీ బట్టి పోరాడిన మల్లు స్వరాజ్యం జీవితం నేటి యువతరానికి ఎంతో ఆదర్శమని అన్నారు.  భూమి భుక్తి విముక్తి పోరాటాలు ద్వారానే నిజాం నిరంకుశ జాగీర్ దేశముకుల పాలన అంతమైందని అన్నారు. మల్లు స్వరాజ్యం తన పదకొండవ ఏట నుండి ప్రజా ఉద్యమాలలో పాల్గొని తుంగతుర్తి కి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై తన జీవితాంతం ప్రజల కోసం పోరాడిందని అన్నారు.   నేటి పాలకులు మద్యం మత్తు పదార్థాలు నియంత్రించడంలో ఘోరంగా విఫలం చెందుతున్నాయని అన్నారు.
ప్రజలు  విద్యా వైద్యం ఉపాధి కొరకు పోరాడాలని పిలుపునిచ్చారు.  ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని గ్రామాలలో వృద్ధులు పిల్లలు సరియైన పౌషక ఆహారము లేక సరియైన వైద్యం చేయించుకోలేక రోగాల బారిన పడుతున్నారని అన్నారు.  ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా అత్యధిక మంది ప్రజలు తమ ఆరోగ్యాలను పరీక్షించుకొని ఉచితంగా మందులు పొందారని అన్నారు.  రాములబండ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రభుత్వం వారిచే డాక్టర్ తిరుమల్ డాక్టర్ భాస్కర్  పద్మ సూపర్వైజర్ మరియు నల్లగొండ పట్టణం ప్రకాశం బజార్ లో గల సంకల్ప ఆసుపత్రి బృందం డాక్టర్ కరీముల్లా జనరల్ ఫిజీషియన్  డాక్టర్  లీనా మాధురి గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రజ్వల చిన్న పిల్లల డాక్టర్లు పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున కమిటీ సభ్యురాలు కొండ అనురాధ గీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న మండల కమిటీ సభ్యులు బోల్లు రవీందర్ కుమార్ సంకల్ప ఆసుపత్రి సహాయకులు రాము శ్రీకాంత్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
కొండ అనురాధ,
రాష్ట్ర కమిటీ సభ్యురాలు
ఐద్వా నల్లగొండ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 05 2024, 20:46

నల్లగొండ: బిఆర్ఎస్ నాయకులు పెండం ధనుంజయ కు మాతృవియోగం.. పరామర్శించిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే..

 నల్లగొండ పద్మా నగర్ నుండి...

 బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, పెండెం ధనుంజయ నేత... మాతృమూర్తి పెండెం నాగమణి గారు మృతి చెందటంతో.... నేడు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంట కండ్ల జగదీశ్ రెడ్డి గారు, వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు...ఈ సందర్బంగా వారు తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ... కుటుంబ సభ్యులకు ధైర్యవచనాలు పలికారు... ఇంకా వీరితోపాటు.. జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ గారు, నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ గారు...

స్థానిక నాయకులు...రాపోలు దత్త గణేష్, పెండం సదానందం,పట్టణ పార్టీ కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు మిర్యాల యాదగిరి..రావుల శ్రీనివాస రెడ్డి..చెరుపల్లి జయప్రకాశ్, వనం శేఖర్ తదితరులు వెంట ఉన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Jun 26 2024, 19:41

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్న ఐఎండీ.

ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు ఆవర్తన ప్రభావంతో మరికొన్ని రోజులు వానలు కురిసే అవకాశం ఉంది. మరో వైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుదనం సంతరించుకోనున్నాయి. ఫలితంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.

ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు ఆవర్తన ప్రభావంతో మరికొన్ని రోజులు వానలు కురిసే అవకాశం ఉంది. మరో వైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుదనం సంతరించుకోనున్నాయి.

ఫలితంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీలో పార్వతీపురం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఐఎండీ.

అలాగే, తెలంగాణలో కూడా పలు జిల్లాలకు వర్షసూచన చేసింది వాతావరణశాఖ. హన్మకొండ, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి సత్తుపల్లి ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.

15వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, మట్టి తొలగింపు పనులు నిలిచిపోయినట్టు చెప్పారు సింగరేణి అధికారులు. దాదాపు 10 సెంటీమీటర్ల వర్షం కురవడంతో సత్తుపల్లిలో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలతోపాటు రోడ్లపైనా పెద్దఎత్తున నీరు నిలిచిపోయింది. సత్తుపల్లితోపాటు పెనుబల్లి, కల్లూరు మండలాల్లో కూడా కుండపోత వర్షం కురిసింది.

నిజంనిప్పులాంటిది

Jun 23 2024, 14:10

రాష్ట్ర రవాణా, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

#మంత్రిగా బాధ్యత చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణకుంభం తోను, అధికారులు పుష్ప గుచ్చాలను అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు.

# వేద పండితుల మంత్రోచ్ఛారణ ల మధ్య ఆ భగవంతునికి షోడశోపచారా పూజ నిర్వహించిన తదుపరి తమ సీట్లో ఆసీనులు అయ్యారు.

#ప్రకాశం జిల్లా దర్శి లో రూ.18.51 కోట్ల అంచనా వ్యయంతో  డ్రైవింగ్ శిక్షణ మరియు రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసే ఫైలుపై మంత్రి తొలి సంతకం చేశారు.

#ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలోనే కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం పథకంలో ఎదురయ్యే లోటు పాట్లు మన రాష్ట్రంలో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా పలు చర్యలు చేపడతామన్నారు.

# రాష్ట్ర రవాణా శాఖ అదనపు కార్యదర్శి నరసింహారెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కేఎస్ బ్రహ్మానందరెడ్డి, జీవి రవి వర్మ, చంద్రశేఖర్, ఏపీఎస్ఆర్టీసీ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. వై శ్రీనివాస్, క్రీడా శాఖ ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎస్ వెంకటరమణ, యువజన సర్వీసెస్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామకృష్ణ, ఎన్సీసీ అసిస్టెంట్ డైరెక్టర్కేజియా తదితరులతో పాటు పలువురు అధికారులు, అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Jun 23 2024, 12:57

రాష్ట్రమంతటా వైఎస్సార్సీపీ రాజమహళ్లు- నామమాత్రపు లీజులతో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ

వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా పర్వాలేదన్న విధంగా వైఎస్సార్సీపీ పాలనలో అక్రమాలు జరిగాయి.

అడుగడుగునా అధికారాన్ని దుర్వినియోగం చేసిన జగన్ అడ్డగోలుగా ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు లీజులకే వైఎస్సార్సీపీ కార్యాలయాలకు కట్టబెట్టారు.

అన్ని నిబంధనలనూ ఉల్లంఘిస్తూ చట్టాలన్నింటినీ కాలరాస్తూ 26 జిల్లాల్లో ప్యాలెస్‌లను తలదన్నేలా నిర్మాణాలను దాదాపు పూర్తి చేశారు.

ఐదేళ్లుగా అనుమతులు లేకుండా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు సర్వే నెంబరు 44లో రూ.2 కోట్ల విలువైన ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమిలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటికి సమీపంలో దీన్ని నిర్మిస్తున్నారు. 2022, మే 18న 33 సంవత్సరాలు ఎకరా వెయ్యి రూపాయల చొప్పున స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు జీవో ఇచ్చారు. పట్టణ ప్రణాళిక సంస్థ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే నిర్మాణం తుది దశకు చేరింది.

విజయనగరం నడిబొడ్డున మూడున్నర కోట్ల రూపాయల విలువైన భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. మహరాజుపేట 540 సర్వే నంబర్​లోని స్థలంపై కన్నేసిన వైఎస్సార్సీపీ నేతలు చెరువు గర్భం స్థలాన్ని రెవిన్యూ దస్త్రాల్లో డీ-పట్టాగా మార్పు చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇందులో ఎకరం విస్తీర్ణంలో వైఎస్సార్సీపీ కార్యాలయ భవనం నిర్మిస్తున్నారు. దాదాపు 85 శాతం నిర్మాణం పూర్తైంది. దీనికీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.

పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.2కోట్ల విలువైన ఎకరం 18 సెంట్ల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇది చివరిదశకు చేరింది. గతంలో ఈ స్థలాన్ని రైతు శిక్షణ కేంద్రానికి కేటాయించి శంకుస్థాపన కూడా చేశారు. 

విశాఖపట్నం ఎండాడలో 175/4 సర్వే నంబర్​లో రూ.100 కోట్ల విలువైన 2ఎకరాల ప్రభుత్వ భూమిలో కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు. జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. గతంలో ఈ భూమిని రెవెన్యూ ఉద్యోగులకు కేటాయించారు. ఈ నిర్మాణానికి జీవీఎంసీ జోన్-2 అధికారులు ఇప్పుడు నోటీసులు అంటించారు.

అనకాపల్లిలో రూ.15 కోట్ల విలువైన ఎకరం 75 సెంట్ల భూమిలో అనుమతులు లేకుండా నిర్మాణం పూర్తి చేశారు. గతంలో ఈ భూమిని కాపు భవనానికి కేటాయించి శంకుస్థాపన సైతం చేసి 50లక్షల నిధుల కేటాయింపులు చేశారు. 

అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.5 కోట్ల విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. ఇది సాగుభూమి అని గిరిజనులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉంది.

కాకినాడలో 75 కోట్ల విలువైన ఎకరం 93 సెంట్ల సర్కారు భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భూమి 22ఎ నిషేధిత జాబితాలో ఉంది. 

రాజమహేంద్రవరం జైలు రోడ్డులోని ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహం వెనుక సర్వే నంబరు 107/7లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. భవన నిర్మాణం దాదాపు పూర్తై, రంగులు అద్దుతున్నారు. 2023లో పనులు ప్రారంభించి శరవేగంగా పూర్తి చేశారు. ఐతే నిర్మాణానికి ఎలాంంటి అనుమతులు తీసుకోలేదన్న అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రూ.10కోట్ల విలువైన ఎకరం ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇది చెరువు భూమి. ఈ వ్యవహారం కోర్టులో ఉంది.

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలో వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణ దశలో ఉంది. సర్వే నంబర్ 201/3లో సుమారు 72 సెంట్ల స్థలాన్ని వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఇచ్చేశారు. దాని విలువ రూ.7కోట్ల పైమాటే. గృహ నిర్మాణ శాఖకు చెందిన ఈ స్థలాన్ని గతంలో పేదలకు కేటాయించి ఆ తర్వాత రద్దు చేశారు. ఇక్కడి పార్టీ కార్యాలయ శ్లాబ్‌ పూర్తైంది.

ఏలూరు రైల్వే స్టేషన్​కు వెళ్లే దారిలో ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థకు చెందిన రూ.5 కోట్ల విలువైన రెండెకరాల స్థలంలో రాజమహల్​ను తలదన్నేలా వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించారు. రెండేళ్ల క్రితం ఈ నిర్మాణం చేపట్టగా ఇటీవలే పూర్తైంది. దీనికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణంపై నిబంధనల మేరకు ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. 

విజయవాడ విద్యాధరపురంలోని సితార సెంటర్‌ సమీపంలో రూ.50 కోట్లకు పైగా విలువ చేసే ఎకరం స్థలంలో మూడంతస్తుల్లో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. దీనికీ ఎలాంటి అనుమతులు లేవు. నగరపాలక సంస్థకు రూపాయి కూడా రుసుముల కింద చెల్లించలేదు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా కోర్టు సెంటర్‌లో 60కోట్లకు పైగా విలువైన 2ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని దర్జాగా కడుతున్నారు. ఈ స్థలంలో ప్రజలందరికీ ఉపయోగపడేలా భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో ఓ గ్రంథాలయం, ఆడిటోరియం, కన్వెన్షన్‌ సెంటర్, మ్యూజియం నిర్మించాలని ప్రతిపాదనలుండగా వాటిని కాదని కార్యాలయం కట్టుకుంటున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని దీని వెనుక ప్రధాన పాత్రధారి. అక్రమంగా నిర్మిస్తున్న భవనానికి ఇప్పుడు ప్లాన్‌ అప్రూవల్‌ కోసం మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థకు దరఖాస్తు చేశారు.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో లింగంగుంట్ల అగ్రహారంలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, జిల్లా ప్రధాన ఆసుపత్రి, రైల్వేస్టేషన్‌ సమీపంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మించారు. ఎకరం 50 సెంట్ల స్థలంలో అనుమతులు లేకుండానే కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు.

బాపట్లలో ఏపీఐఐసీకి చెందిన రూ.6కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మించారు. 2022లో అప్పటి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకటరమణ కనుసన్నల్లో ఇది జరిగింది. 2022 డిసెంబర్ 19న వైఎస్సార్సీపీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఇది ఆర్టీసికి చెందిన స్థలమని డిపో మేనేజర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆగ్రహించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మేనేజర్​ను అక్కడి నుంచి బదిలీ చేసింది. పట్టణ ప్రణాళికా విభాగానికి భవన నిర్మాణ ప్లాన్ సమర్పించారేగానీ, ఎలాంటి అనుమతి మంజూరు చేయలేదు. ఐనా నిర్మాణం పూర్తి చేశారు. 

ప్రకాశం జిల్లా ఒంగోలు మినీ బైపాస్‌లో నీటిపారుదల శాఖ కార్యాలయం ఆనుకొని ఉన్న నాలుగున్నర కోట్ల విలువైన ఎకరం 64 సెంట్ల ప్రభుత్వ భూమిలో వైఎస్సార్సీపీ ఆఫీస్‌ కట్టారు. 2023 జులై 31న అనుమతులు తీసుకున్నారు. 2025 జనవరి 21లోగా ప్రారంభించి 2029 నాటికి పూర్తి చేయాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అనుమతిచ్చారు. నిర్మాణం ప్రారంభానికి గడువుండగానే వైఎస్సార్సీపీ నాయకులు ఆగమేఘాలపై నిర్మాణం పూర్తి చేశారు.

నెల్లూరులో వెంకటేశ్వరపురంలో రూ.10 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మాణం చేపట్టారు. అనుమతుల్లేకుండానే 90శాతం నిర్మాణం పూర్తి చేశారు. దీనికి ప్రస్తుతం రంగులు వేస్తున్నారు. గతంలో ఈ స్థలాన్ని టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారు. 

కర్నూలు ఐదు రోడ్ల కూడలిలోని సర్వే నంబర్ 95-2లో ఏపీ ఆగ్రోస్‌కు చెందిన రూ.100 కోట్ల విలువైన ఎకరం 60 సెంట్ల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించారు. ఎలాంటి అనుమతులు లేకుండా భవనం పూర్తైంది.

నంద్యాల సమీపంలోని కుందూనది ఒడ్డున జగనన్న కాలనీలో సుమారు 7 కోట్ల విలువైన ఎకరా భూమిని వైఎస్సార్సీపీ కార్యాలయానికి కేటాయించారు. 6 నెలల క్రితం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పునాదులు పూర్తయ్యాయి. వీటికీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. 

కడపలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సర్వేనంబర్ 424/3 లోని రెండు ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. కడప పట్టణాభివృద్ధి సంస్థ నుంచి అనుమతులు తీసుకోలేదు.

అన్నమయ్య జిల్లా రాయచోటిలో 12కోట్ల విలువైన ఎకరం 61 సెంట్ల ప్రభుత్వ భూమిలో వైకాపా కార్యాలయం నిర్మిస్తున్నారు. దీనికీ ఎలాంటి అనుమతులు లేకపోయినా నిర్మాణం చివరి దశకు చేరింది. 

అనంతపురంలో రూ.45 కోట్ల విలువైన ఎకరం 50 సెంట్ల జలవనరుల శాఖ భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం తుదిదశకు చేరింది. భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు. తక్షణమే నిర్మాణం ఆపేసి వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడికి అధికారులు నోటీసిచ్చారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శ్రీసత్యసాయి జిల్లాలో 20కోట్ల విలువైన ఎకరంన్నర భూమిలో విమానాశ్రయం ఎదురుగా కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇది తుదిమెరుగుల దశలో ఉంది. దీనికి ఎలాంటి అనుమతులు లేవు. 

తిరుపతి రేణిగుంట విమానాశ్రయ సమీపంలో పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన రూ.14 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. దీనికి రెవెన్యూశాఖతో పాటు తుడా అనుమతులూ లేవు. పరిశ్రమల శాఖ అనుమతి నిరాకరిస్తూ గత అక్టోబర్‌లో పని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినా వాటిని పట్టించుకోకుండా నిర్మాణాలు చేశారు.

చిత్తూరు జిల్లాలో రూ.17కోట్ల విలువైన 2 ఎకరాల్లో అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేశారు. ఇది ఇతరుల ఆధీనంలోని భూమి. ఈ వ్యవహారం కోర్టులో ఉంది. 

రాష్ట్ర వ్యాప్తంగా రూ.677 కోట్ల విలువైన 42 ఎకరాల 24 సెంట్ల స్థలంలో వైఎస్సార్సీపీ కార్యాలయాలు నిర్మిస్తున్నారు. రాజ ప్రాసాదాలను తలదన్నేలా వీటిని కడుతున్నారు. 

అధికారం అండతో వైఎస్సార్సీపీ ఐదేళ్లుగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినవి ఏమన్నా ఉన్నాయంటే అవి సొంత పార్టీకి చెందిన కార్యాలయాలేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

Andrapradesh

May 20 2024, 07:46

రూ.5వేలకు ఓటు అమ్ముకున్న ఎస్సె.. సస్పెన్షన్*


AP: డబ్బుకు ఓటును అమ్ముకోవద్దని చెప్పాల్సిన SI తన ఓటు అమ్ముకుని సస్పెండ్ అయ్యారు. మంగళగిరి టౌన్ ఎస్సై ఖాజాబాబుకు ప్రకాశం (D) కురిచేడులో ఓటు ఉంది. SIతో ఓటు వేయిస్తామని ఆయన బంధువులు ఓ పార్టీ నాయకుడి నుంచి రూ.5వేలు తీసుకుని.. SIకి ఆన్లైన్లో పంపారు. ఆ తర్వాత డబ్బులు పంచుతూ సదరు నాయకుడు పోలీసులకు చిక్కాడు. విచారణలో SIకి నగదు పంపినట్లు తేలింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

నిజంనిప్పులాంటిది

May 09 2024, 11:57

నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ జిల్లాల్లోనే

నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ జిల్లాల్లోనే

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.

అలాగే ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

నిజంనిప్పులాంటిది

May 07 2024, 17:41

తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ రిలీఫ్ !

- తగ్గనున్న భానుడి భగభగ

- నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయంటూ ఐఎండి వెల్లడి

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. వారం రోజులుగా ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఊరట దొరకనుంది...

వచ్చే మూడ్రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు (Rains) పడే అవకాశముందని హైదరాబాద్‌ (Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అన్ని జిల్లాల్లో సగటున 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు మించకపోవచ్చని వివరించింది. 

నేడు నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే.. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి . 

ఏపీలో ఇలా..!

విదర్భ నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు ఏపీలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అక్కడక్కడా భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు పడతాయని తెలిపింది. 

మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఇంకా గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.

వడగళ్ల వానలతో రైతులకు పంట నష్టమే !

అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని ఎండ తీవ్రత, వడగాడ్పుల ప్రభావం కొనసాగింది. ప్రధానంగా రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో గాడ్పులు వీచాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఏడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. 

కాగా, విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకూ కొనసాగుతున్న ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించింది. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగడంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఈదురుగాలులు వీచాయి. అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 04 2024, 19:25

AP Newws: ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను నియమించిన ఈసీ

అమరావతి: మూడు జిల్లాల కలెక్టర్లు, ఐదు జిల్లాలకు ఎస్పీలను కేంద్ర ఎన్నికల కమిషన్ (Central Election Commission) గురువారం నాడు నియమించింది. కృష్ణా కలెక్టర్ గా కె.బాలాజీ, అనంతపురం కలెక్టర్‌గా వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్ నియమించింది..

గుంటూరురేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిఫాఠి, ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్, పల్నాడు ఎస్పీగా గరికపాటి బిందుమాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు. అనంతరపురం ఎస్పీగా అమిత్ బద్దార్, నెల్లూరు ఎస్పీగా అరీఫ్ హఫీజ్ నియమించింది.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు రాత్రి ఎనిమిది గంటలల్లోపు ఈ అధికారులు బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశించింది. రెండు రోజుల క్రితం ఐదు జిల్లాల ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ, ముగ్గురు కలెక్టర్లను ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆరోపణల నేపథ్యలో వీరిని బదిలీ చేసి, కొత్తవారిని కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించింది..

నిజంనిప్పులాంటిది

Mar 28 2024, 11:23

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం:ముగ్గురు మహిళలు మృతి

ప్రకాశం జిల్లాలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద డివైడర్‌ను కారు ఢీకొట్టింది.

ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మహిళలు మృతి చెందారు.

మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. వారిని హుటాహు టిన ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది..

madagoni surendar

Mar 19 2024, 16:25

మల్లు స్వరాజ్యం ఆశయాలను కొనసాగిస్తాము. పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా కార్యదర్శి

మల్లు స్వరాజ్యం ఆశయాలను కొనసాగిస్తాము.
   
పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా కార్యదర్శి

*ద్వితీయ వర్ధంతి సందర్భంగా జీకే అన్నారంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహణ*
నల్గొండ జిల్లా :-
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం నేటి తరానికి ఎంతో ఆదర్శమని వారి ఆశయాలు కొనసాగిస్తామని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు.  ఈ రోజు జీకే అన్నారం గ్రామంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) నల్గొండ ఆధ్వర్యంలో *సంకల్ప హాస్పిటల్ , ప్రభుత్వ PHC రాములబండ వారి సహకారంతో*  ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ ఆనాడు దున్నేవాడికే భూమి కావాలని పెట్టి చాకిరి విముక్తి కావాలని మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల వ్యతిరేకంగా నిలబడి తుపాకీ బట్టి పోరాడిన మల్లు స్వరాజ్యం జీవితం నేటి యువతరానికి ఎంతో ఆదర్శమని అన్నారు.  భూమి భుక్తి విముక్తి పోరాటాలు ద్వారానే నిజాం నిరంకుశ జాగీర్ దేశముకుల పాలన అంతమైందని అన్నారు. మల్లు స్వరాజ్యం తన పదకొండవ ఏట నుండి ప్రజా ఉద్యమాలలో పాల్గొని తుంగతుర్తి కి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై తన జీవితాంతం ప్రజల కోసం పోరాడిందని అన్నారు.   నేటి పాలకులు మద్యం మత్తు పదార్థాలు నియంత్రించడంలో ఘోరంగా విఫలం చెందుతున్నాయని అన్నారు.
ప్రజలు  విద్యా వైద్యం ఉపాధి కొరకు పోరాడాలని పిలుపునిచ్చారు.  ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని గ్రామాలలో వృద్ధులు పిల్లలు సరియైన పౌషక ఆహారము లేక సరియైన వైద్యం చేయించుకోలేక రోగాల బారిన పడుతున్నారని అన్నారు.  ఉచిత మెడికల్ క్యాంపు ద్వారా అత్యధిక మంది ప్రజలు తమ ఆరోగ్యాలను పరీక్షించుకొని ఉచితంగా మందులు పొందారని అన్నారు.  రాములబండ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రభుత్వం వారిచే డాక్టర్ తిరుమల్ డాక్టర్ భాస్కర్  పద్మ సూపర్వైజర్ మరియు నల్లగొండ పట్టణం ప్రకాశం బజార్ లో గల సంకల్ప ఆసుపత్రి బృందం డాక్టర్ కరీముల్లా జనరల్ ఫిజీషియన్  డాక్టర్  లీనా మాధురి గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రజ్వల చిన్న పిల్లల డాక్టర్లు పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున కమిటీ సభ్యురాలు కొండ అనురాధ గీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న మండల కమిటీ సభ్యులు బోల్లు రవీందర్ కుమార్ సంకల్ప ఆసుపత్రి సహాయకులు రాము శ్రీకాంత్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
కొండ అనురాధ,
రాష్ట్ర కమిటీ సభ్యురాలు
ఐద్వా నల్లగొండ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Feb 05 2024, 20:46

నల్లగొండ: బిఆర్ఎస్ నాయకులు పెండం ధనుంజయ కు మాతృవియోగం.. పరామర్శించిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే..

 నల్లగొండ పద్మా నగర్ నుండి...

 బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, పెండెం ధనుంజయ నేత... మాతృమూర్తి పెండెం నాగమణి గారు మృతి చెందటంతో.... నేడు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంట కండ్ల జగదీశ్ రెడ్డి గారు, వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు...ఈ సందర్బంగా వారు తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ... కుటుంబ సభ్యులకు ధైర్యవచనాలు పలికారు... ఇంకా వీరితోపాటు.. జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ గారు, నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ గారు...

స్థానిక నాయకులు...రాపోలు దత్త గణేష్, పెండం సదానందం,పట్టణ పార్టీ కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు మిర్యాల యాదగిరి..రావుల శ్రీనివాస రెడ్డి..చెరుపల్లి జయప్రకాశ్, వనం శేఖర్ తదితరులు వెంట ఉన్నారు.