/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz చరిత్రపుటల్లో ఓ కమ్యూనిస్టు యోధుడు Raghu ram reddy
చరిత్రపుటల్లో ఓ కమ్యూనిస్టు యోధుడు

బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో పన్నుల నిరాకరణోద్యమానికి కేంద్రమైన గుంటూరు జిల్లా పెదనందిపాడులో 1910లో ధనిక భూస్వామ్య కుటుంబంలో జన్మించారు కొల్లా వెంకయ్య. కృష్ణయ్య, రత్నమ్మ దంపతులకు...

బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో పన్నుల నిరాకరణోద్యమానికి కేంద్రమైన గుంటూరు జిల్లా పెదనందిపాడులో 1910లో ధనిక భూస్వామ్య కుటుంబంలో జన్మించారు కొల్లా వెంకయ్య. కృష్ణయ్య, రత్నమ్మ దంపతులకు ఆరుగురు సంతానంలో కొల్లా వెంకయ్య పెద్ద కుమారుడు. 1921–22లో పర్వతనేని వీరయ్య నాయకత్వంలో జరిగిన పన్నుల నిరాకరణోద్యమ ప్రభావంతో జాతీయోద్యమంలోకి ఆకర్షితులయ్యారు. పన్నెండేళ్ల వయస్సులో వెంకయ్య పెదనాన్న కొడుకు గోవిందు, ఆయన కుమారుడు పాపయ్య శాంతి సేనలో చేరారు. పెదనందిపాడు గ్రామంలో ఆజానుబాహుడు దాసరి సుబ్బయ్యశెట్టి, లావు వెంకటసుబ్బయ్యలు శాంతి సేనకు ముందు నిలిచేవారు. 1921లో శాంతి సేన ఆధ్వర్యంలో పుసులూరులో పెదనందిపాడు పరిసర ప్రాంత గ్రామ అధికారులు సభ జరిపి తమ పదవులకు రాజీనామా చేశారు. పెదనందిపాడు గ్రామ కరణం సరికా సీతారామయ్య రాజీనామా చేయగా, గ్రామస్తులు ఆయనను పల్లకీలో ఊరేగించారు. ఆ సభకు వెంకయ్య వెళ్లారు. పెదనందిపాడు ఫిర్కా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను గ్రామస్తులు సాంఘిక బహిష్కరణ చేశారు. ఈ ఉద్యమ సమయంలో రైతులే మాల, మాదిగలను ప్రోత్సహించి చెరువులో నీరు ముంచుకునేటట్లు చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో మార్పు కొనసాగింది. గ్రామం చివరలో ఉన్న సారా దుకాణాన్ని మూయించారు. వారు మహాత్మాగాంధీ ప్రబోధించిన అంటరానితనానికి, మద్యపానానికి వ్యతిరేకంగా, హిందూ–ముస్లిం ఐక్యత కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

1948–51 వరకు సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మైదాన ప్రాంతం నుంచి ఆ ఉద్యమానికి సహాయ సహకారాలు అందించడానికి ఏర్పడిన కమిటీకి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. జిల్లాలో చివుకుల శేషశాస్త్రి, దండా నారాయణస్వామి, కొనికి లక్ష్మీనారాయణ వంటి రైతు నాయకులను కాల్చి చంపుతున్న రోజులవి. ఆ కాలమంతా కొల్లా వెంకయ్య అజ్ఞాత జీవితం గడిపారు. అప్పటికే ఆయన జిల్లాలో గుర్తింపు పొందిన నాయకుడు. రహస్య జీవితమంతా చాలా గడ్డుగా నడిచింది. రాత్రిపూట రైతుల కొట్టాల్లోనూ, పగలు పొలాల్లోనూ గడిపారు. ఆ రోజుల్లో కమ్యూనిస్టులకు రక్షణ ఇవ్వటం ప్రాణసంకటంగా ఉండేది. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం వెంకయ్య గ్రామగ్రామాన కాలినడకన నడిచి ఉద్యమాన్ని నిర్మించారు.

కమ్యూనిస్టు పార్టీలో రాష్ట్ర నాయకుడుగా కొల్లా వెంకయ్య వివిధ హోదాలలో పనిచేశారు. సీపీఐ నుంచి సీపీఐ(ఎం) వైపు వచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ మూడు నాలుగు జాతీయ కాంగ్రెస్‌లలో ఆయన కేంద్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సీపీఐ(ఎం) నుంచి తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులతో కలిసి సీపీఐ(ఎం)కి వ్యతిరేకంగా పాలకొల్లు లోనూ, బర్ద్వాన్‌లోనూ సిద్ధాంత పోరాటం నిర్వహించారు. కొంతకాలం చారు మజుందార్‌ నాయకత్వంలోని సీపీఐ(ఎంఎల్)లో కొనసాగారు. పార్వతీపురం కుట్ర కేసులో ఇరికించబడి ఏడు సంవత్సరాలకు పైగా జైలు జీవితం అనుభవించారు. నక్సల్బరి, శ్రీకాకుళ పోరాటాలు గాడి తప్పాయని చైనావారు సలహాలు ఇచ్చారు. అది దళ చర్యల ద్వారా సాగించే వ్యక్తిగత సంహారమని జైలు నుంచి కొల్లా వెంకయ్య, కాను సన్యాల్‌, చౌదరి తేజేశ్వరరావు, భువనమోహన్ పట్నాయక్, నాగభూషణ పట్నాయక్, సౌరీన్ బోస్ తదితరులు చారు మజుందార్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. ఆరుగురు కామ్రేడ్స్‌ లేఖగా అది ప్రసిద్ధి చెందింది. మార్క్సిజం–లెనినిజం, మావో ఆలోచన విధానం మా మౌలిక సిద్ధాంతం అని ఆయన పార్వతీపురం కుట్ర కేసులో వాదించారు. జిల్లా కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధంచగా, హైకోర్టు కొట్టివేసింది.

1952లో పొన్నూరు నుంచి శాసనసభకు, 1957లో శాసనమండలికి, 1962లో తెనాలి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1962లో భారత–చైనా సరిహద్దు ఘర్షణ సమయంలో నిర్బంధానికి గురయ్యారు. 1975లో అత్యవసర పరిస్థితిలో జైల్లో నిర్బంధించబడ్డారు. ఆయన అనేక సిద్ధాంత రచనలు చేశారు. సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఆయనకు విశేషమైన పరిచయం ఉన్నది. వెంకయ్య నిరంతర అధ్యయనశీలి. కుల సమస్య పట్ల ఆయనకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. కుల సమస్య వర్గ సమస్యతో ముడిపడి ఉన్నదనేది ఆయన నిశ్చితాభిప్రాయం. 1955 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలో ఆయన ఒక ‘కీ’ నోటు పెట్టారు.

1977లో జైలు నుంచి విడుదలైన తరువాత, నల్లమడ ముంపు నివారణ కోసం గొప్ప ఉద్యమం నిర్మించారు. 1973 భూగరిష్ఠ పరిమితి చట్టం అమలుకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 1980లో గ్రామీణ పేదల సంఘాన్ని స్థాపించి భూ సంస్కరణల కోసం పోరాడారు. 1986లో భూ సంస్కరణల చట్టం అమలు కోసం సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. 1991లో తీర్పు రాగా, దాని అమలు కోసం జీవిత పర్యంతం పోరాడారు.

ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ రెండు విషయాల్లో తప్పు చేసిందనేది ఆయన నిశ్చితాభిప్రాయం. ఒకటి– ఎన్నికల్లో భూస్వామ్య పార్టీలతో పొత్తు కట్టటం, రెండు– సాయుధపోరాటం కొరకు పంథాను రూపొందించడం, అమలుపరచటంలోనూ! భారతదేశం అర్ధ వలస, భూస్వామ్య దేశం అని పార్లమెంటరీ పంథాను ఆయన తిరస్కరించారు. ఈ దేశంలో సోషలిజం స్థాపన జరగాలంటే కమ్యూనిస్టు ఉద్యమం సూత్రబద్ధంగా ఐక్యం కావాలని అందుకోసం ఆయన సుదీర్ఘ కృషి చేశారు. కడదాకా పేదరిక నిర్మూలన కోసం, సమసమాజం కోసం, ఎన్నో ఆటుపోట్లను, నిర్బంధాలను తట్టుకొని దోపిడీ రహిత సమాజం కోసం పోరాడిన కొల్లా వెంకయ్య నేటి తరానికి ఆదర్శప్రాయుడు. ఆయన చనిపోయి నేటితో 26 సంవత్సరాలు పూర్తి అయింది.

మెుదలైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర..

ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 11రోజులపాటు పూజలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు.

ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 11రోజులపాటు పూజలు అందుకున్న లంబోదరుడు నిమజ్జనానికి సిద్ధమయ్యాడు. ఈ మేరుకు అన్నీ ఏర్పాట్లు చేసిన కమిటీ సభ్యులు, అధికారులు భారీ ట్రక్కును తెప్పించారు. క్రేన్ సాయంతో విగ్రహాన్ని ట్రక్కులోకి ఎక్కించారు. ఉదయం 6:15గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వరకూ పెద్దఎత్తున సాగనుంది. వందల, వేల మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే ఖైరతాబాద్‌కు చేరుకున్నారు.

ఇవాళ మంగళవారం కావడంతో అర్ధరాత్రే కలశపూజ అనంతరం గణనాథుణ్ని కదలించారు. అనంతరం శోభాయాత్రకు సిద్ధం చేశారు. మొత్తం రెండున్నర కిలోమీటర్ల మేర సాగనున్న శోభాయాత్ర.. ఖైరతాబాద్ మీదుగా సెన్సేషనల్ థియేటర్, రాజ్‌దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, సెక్రటేరియట్, NTR మార్గ్ వరకూ కొనసాగనుంది. NTR మార్గ్‌లో ఏర్పాటు చేసిన 4వ నంబర్ క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం జరగనుంది. హుస్సేన్ సాగర్‌లో ఇవాళ మధ్యాహ్నం 2గంటల కల్లా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యేలా పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ యేడాది బడా గణేశ్ విగ్రహం తయారీ ఆలస్యంగా ప్రారంభమైనా అనుకున్న సమయానికే పూర్తి చేసి ఏర్పాటు చేశారు. కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి బడా లంబోదరుణ్ని ప్రతిష్ఠించారు. ఖైరతాబాద్ వినాయకుణ్ని పెట్టడం మెుదలుపెట్టి 70ఏళ్లు అయిన సందర్భంగా ఈ యేడాది 70అడుగుల ఎత్తులో భారీ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చి పూజలు అందుకున్నారు. కుడి వైపు శ్రీనివాస కల్యాణం, ఎడమ వైపు పార్వతీ కల్యాణంతో కనివిందు చేస్తున్నారు. భారీ విగ్రహం కాళ్ల వద్ద అయోధ్య బాలరాముడి ప్రతిమను ఏర్పాటు చేశారు. పర్యావరణ హితంగా ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. విగ్రహం బరువు సుమారు 40నుంచి 50టన్నుల వరకూ ఉంటుంది. విగ్రహం తయారీకి పెద్దఎత్తున ఐరన్, పీచు, మట్టి వినియోగించారు.

మరోవైపు నగరవ్యాప్తంగా ఉన్న చిన్నా, పెద్ద గణేశ్ విగ్రహాలు అర్ధరాత్రి నుంచీ నిమజ్జనానికి తరలివస్తున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. 75 పాండ్స్‌తో పాటు 5 చెరువుల వద్ద క్రేన్లను సిద్ధం చేశారు. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 125 జెసీబీలు, 102 మినీ టిప్పర్లు సిద్ధంగా ఉన్నాయి. నిమజ్జన డ్యూటీలో 20వేల మందికి పైగా జీహెచ్‌ఎంసీ సిబ్బంది పాల్గొంటున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 31 క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్‌పై 7 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్‌లో 9, పీపుల్స్ ప్లాజా వద్ద 7, జలవిహార్ వద్ద 4 క్రేన్లు సిద్ధం చేశారు. పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సమన్వయంతో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 25వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వచ్చే వాహనాలు అన్ని నిర్దేశించిన మార్గంలోనే వెళ్లాలని పోలీసులు సూచించారు.

చైనాలో బెబింకా తుఫాను

చైనా ఆర్థిక నగరమైన షాంఘైను బెబింకా తుఫాను వణికిస్తోంది. సోమవారం ఉదయం షాంఘై నగరాన్ని తాకిన ఈ టైఫూన్‌ విజృభిస్తుండటంతో అక్కడి జనజీవనం స్తంభించింది. గత ఏడు దశాబ్దాల కాలంలో ఈ నగరాన్ని తాకిన తీవ్ర తుపాను ఇదేనని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గంటకు 151 కి.మీ. వేగంతో ఈరోజు తుపాను షాంఘై నగరాన్ని తాకిందని స్థానిక మీడియా వెల్లడించింది.

1949 తరువాత వచ్చిన తీవ్ర తుఫాను ఇదే ..!

ఈ నగరాన్ని తుపాన్లు నేరుగా తాకడం అరుదు. 1949లో టైఫూన్‌ గ్లోరియా తర్వాత షాంఘైను తాకిన తీవ్ర తుపాను ఇదే. దీంతో ఆదివారం రాత్రి నుంచి అక్కడి రెండు విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన వందల విమానాలు రద్దయ్యాయి. పలు రైళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పలు పార్కులు, వినోద ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేశారు. షాంఘై డిస్నీ రిసార్ట్‌తో సహా నౌకలను రీకాల్‌ చేశారు. పర్యాటక ప్రదేశాలను ఆదివారం మూసివేశారు. తూర్పు చైనాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయని చైనా వాతావరణ యంత్రాంగం ఆదివారం మధ్యాహ్నం టైఫూన్‌ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

హైనాన్‌ ప్రావిన్స్‌లో యాగి తుపాను …

మరోవైపు చైనాలోని హైనాన్‌ ప్రావిన్స్‌ను యాగి తుపాను కలవరం రేపింది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురవడంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది.

సెల్‌ఫోన్‌లలో ఛార్జింగ్‌ అయిపోవడంతో డిజిటల్‌ చెల్లింపులకు ప్రజలు నానాతంటాలు పడ్డారు. అంధకారంలో గడిపారు. కనీసం నిత్యావసర సరకులను కూడా కొనుగోలు చేయలేని పరిస్థితులు ఎదుర్కొన్నారని పలు మీడియా కథనాలు వివరించాయి.

నిమజ్జనంలో 15వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది

రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్ఎంసీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కోరారు. మొత్తం 15 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిమజ్జనంలో పాల్గొంటున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 465 క్రేన్స్, హుస్సేన్ సాగర్లో 38 క్రేన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గణేష్ నిమజ్జనం నేపథ్యంలో బల్దియా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి (GHMC Commissioner Amrapali ) తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్ఎంసీ (GHMC) సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. మొత్తం 15 వేల మంది జీహెచ్‌ఎంసీ సిబ్బంది నిమజ్జనంలో పాల్గొంటున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 465 క్రేన్స్, హుస్సేన్ సాగర్లో 38 క్రేన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో జీహెచ్ఎంసీ నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేసిందన్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు జీహెచ్ఎంసీ సిబ్బందికి అసలైన పని ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి పేర్కొన్నారు.

రేపటి మహా నిమజ్జనానికి జీహెచ్ఎంసీ తరఫున ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 160 గణేష్ టీమ్స్ పనిచేయనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నిమజ్జనానికి 10 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు అయ్యాయి. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. నిమజ్జనం మరుసటి రోజు అదనంగా మరో 500 మంది సిబ్బంది పాల్గొననున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 73 వినాయక పాండ్స్, పెద్ద చెరువులలో నిమజ్జనానికి ఏర్పాటు చేశారు. అలాగే రేపటి నుంచి మూడు రోజులపాటు జీహెచ్ఎంసీ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.

హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సోమవారం ఖైరతాబాద్ మహాగణపతిని మంత్రి దర్శించుకున్నారు. మహాగణపతి నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లు పొన్నం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొదటిసారి మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామని తెలిపారు. శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో నిర్వాహకులు పూజ కార్యక్రమాలు చేశారన్నారు. రేపు నిమజ్జన ఘట్టమని.. భక్తులు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు.

360 క్రేన్లు హైదరాబాద్ మొత్తం ఏర్పాటు చేశామని తెలిపారు. మొబైల్ క్రేన్లు కూడా ఉన్నాయన్నారు. అవసరమైన ప్రాంతాలకు తరలించదానికి ప్రత్యేక అధికారులు ఉన్నారని చెప్పారు. ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రేపు (మంగళవారం) ఉదయం ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభం అవుతుందని.. ఇప్పటికే పనులు జరుగుతున్నాయన్నారు. సమయానికి నిమజ్జనం పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. ఎల్లుండి వర్కింగ్‌ డే అని ఆలోపు నిమజ్జనం పూర్తి చేసుకుంటే ప్రజలకు ఇబ్బందులు ఉండవని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త చీఫ్ ముందున్న అతిపెద్ద సవాల్.. గెలిస్తే తిరుగుండదు..

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. నాలుగు దశాబ్ధాలుగా పైగా కాంగ్రెస్ పార్టీతో ఆయనకు అనుబంధం ఉంది. కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు. పదవులను ఆశించకుండా అధిష్టానం తనకు అప్పగించిన పనిని చేసుకుని వెళ్లడమే ఆయనకు తెలుసు. తెలంగాణలో బీసీ ఓటర్లు ఎక్కువుగా ఉండటం.. ఈ మధ్య కాలంలో బీసీ నినాదం ఎక్కువ వినిపిస్తుండటంతో.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్‌కు పీసీసీ పదవి దక్కింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎంగా ఉండటంతో.. బీసీకి పీసీసీ పదవి ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోవడంతో మహేశ్ కుమార్‌గౌడ్‌ను అదృష్టం వరించింది.

మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా పీసీసీ చీఫ్ బాధ్యతలు స్వీకరించారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. పార్టీలో అంతర్గత విబేధాలను పక్కనపెట్టి నాయకులను ఏకతాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్‌పై ఉంది. దీనికి తోడు త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు కొత్త పీసీసీ చీఫ్‌కు సవాలుగా చెప్పుకోవచ్చు. ఓవైపు అద్భుతమైన పాలన అందిస్తున్నామని.. ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని కాంగ్రెస్ చెబుతుంటే.. కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. ఈ క్రమంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం ఆయన ముందున్న అతిపెద్ద సవాల్‌గా చెప్పుకోవచ్చు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సాధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల విషయంలో అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని.. విమర్శలు మొదలుపెట్టింది. ఓవైపు అన్ని హామీలు అమలుచేస్తున్నామని కాంగ్రెస్ చెబుతుంటే.. అంతా మాయ అంటూ బీఆర్‌ఎస్ విమర్శిస్తోంది. రెండు పార్టీల మధ్య పంచాయితీ పక్కన పెడితే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలవుతోంది. మరో రెండు నుంచి మూడు నెలలలోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పుగా చూడాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నప్పటికీ.. 10కిపైగా సీట్లు సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ కూడా కాంగ్రెస్‌తో సమానంగా 8 ఎంపీలను గెలుచుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తిగా లేరనే ప్రచారం జరిగింది.

ప్రతిరోజు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్‌పై రాజకీయ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ దశలో పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఓ వైపు కాంగ్రెస్.. మరోవైపు బీఆర్‌ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బీఆర్‌ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తే కాంగ్రెస్‌కు కొంత ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదు. బాధ్యతలు కొత్తగా స్వీకరించినా.. ఎన్నికల్లో ఫలితాలకు పీసీసీ చీఫ్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలను పరిష్కరించి మహేశ్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

పడవల తొలగింపులో కొత్త విధానానికి శ్రీకారం.

ప్రకాశం బ్యారేజ్ వద్ద పడవల తొలగింపునకు కొత్త విధానం అమలు చేసేందుకు టీంలు సిద్ధమయ్యాయి. రెండు కార్గో బోట్లపై మూడు ఇనప గడ్డర్లను సిబ్బంది అమర్చింది. ఇనుప గడ్డర్లు కదలకుండా బోట్లకు వెల్డింగ్ చేశారు. నీటిలో మునిగి ఉన్న బోటుకు ఇనప గడ్డర్లకు రోప్ లాక్ చేసే విధంగా భారీ హుక్కులు ఏర్పాటు చేశారు

ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) వద్ద పడవల తొలగింపు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బోటును ముందుకు లాగే ప్రక్రియను ప్రస్తుతానికి సిబ్బంది నిలివేశారు. బ్యారేజీ వెనక ఉన్న సేఫ్టీ వాల్‌ను బోటు ఢీ కొడితే లాగడం కష్టమని నిపుణులు భావిస్తున్నారు. దీనితో నేడు కొత్త విధానం అమలు చేసేందుకు టీంలు సిద్ధమయ్యాయి. రెండు కార్గో బోట్లపై మూడు ఇనప గడ్డర్లను సిబ్బంది అమర్చింది. ఇనుప గడ్డర్లు కదలకుండా బోట్లకు వెల్డింగ్ చేశారు.

నీటిలో మునిగి ఉన్న బోటుకు ఇనప గడ్డర్లకు రోప్ లాక్ చేసే విధంగా భారీ హుక్కులు ఏర్పాటు చేశారు. ఒక బోటును బ్యారేజ్ గేట్ల వైపు, మరో బోటును నది వైపు ఉంచి నీటిలో ఉన్న బోటుకు ఇనప రోప్ తగిలించి గడ్డర్లు లాక్ చేయాలని నిర్ణయించారు. ఆ బోట్ల సహాయంతో మునిగిన బోట్, గొల్లపూడి వైపు తీసుకెళ్లేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు.

మరోవైపు నదిలో చిక్కుకున్న పడవ నీటిలో మునిగిపోవడంతో రెస్క్యూకి ఆటంకం కలిగింది. లాగే కోద్దీ రోప్, క్రేన్‌పై బరువు పెరుగుతోంది. గేట్లకు అడ్డం పడిన పడవను ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి పది అడుగులు ముందకు తీసుకువచ్చారు. అయితే, నీట మునిగిన పడవను కూడా బయటకు తీసేందుకు రెస్క్యూటీమ్ ప్రయత్నాలు చేస్తోంది. అండర్ వాటర్ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. నీటిలో ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో బోటును పూర్తిగా కట్ చేయలేకపోతోంది డైవింగ్ టీమ్. ప్రవాహ ఉధృతి కూడా డైవర్లకు ఇబ్బందిగా మారింది. కట్ చేసిన రంద్రాల నుంచి పడవలోకి నీరు చేరుతోంది. దీంతో కటింగ్ ప్రక్రియను నిలిపివేసి.. భారీ రోప్ సహాయంతో ఒడ్డుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఇక్కడా చిక్కే ఎదురవుతోంది. పొజిషన్ నుంచి పడవ అస్సలు కదలడం లేదు. దీంతో నయా ప్లాన్‌కు శ్రీకారం చుట్టారు అబ్బులు టీమ్.

కాగా.. వరద కారణంగా కొట్టుకొచ్చిన బోట్ల తొలగింపు ప్రక్రియ కష్టతరంగా మారింది. ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా బోట్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండాపోంది. అయిన్పటికీ ప్రయత్నాలను వీడటం లేదు. కొత్తకొత్త ప్లాన్లతో బోట్లను తొలగించేందుకు చూస్తున్నారు. కాగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అటు కృష్ణా నది.. ఇటు బుడమేరు.. మరోవైపు మున్నేరు ఉప్పొంగి ప్రవహించాయి. దీంతో విజయవాడ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఇక నీటి ప్రవాహ ధాటికి ఒడ్డున నిలిపిన భారీ పడవలు సైతం కొట్టుకొచ్చాయి. ఓ మూడు భారీ సైజు పడవలు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డం పడ్డాయి. దీంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఈ పడవలను తొలగించేందుకు ప్రభుత్వం అబ్బులు టీమ్‌ను ఏర్పాటు చేసింది. అబ్బులు టీమ్ ఈ పడవలను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది.

గణేష్‌ నిమజ్జనం అలర్ట్‌.. హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ మళ్లింపు

భాగ్యనరగంలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి సమయం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 17,18 తేదీల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. నగరం నలుమూలల నుంచి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కోసం విగ్రహాలు తరలి రానుండటంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

హైదరాబాద్‌ నగరంలో గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. హైదరాబాద్‌, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేష్‌ విగ్రహాలు హుస్సేన్‌ సాగర్‌ వైపు రానుండటంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షల్ని అమలు చేయనున్నారు. నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి ప్రజలు సహకరించాలని సూచించారు. ప్రధాన మార్గాల్లో విగ్రహాల ఊరేగింపులు వెళ్లేందుకు వీలుగా సాధారణ ట్రాఫిక్‌ ను నియంత్రిస్తారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 17, 18తేదీల్లో నగర వ్యాప్తంగా ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు.

బాలాపూర్‌ నుంచి గుర్రం చెరువు ట్యాంక్‌పై కట్టమైసమ్మ ఆలయం వద్ద గణేష్‌ విగ్రహ ఊరేగింపు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి ప్రవేశిస్తుందని, కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ (ఎడమ మలుపు), ఎంబీఎన్‌ఆర్‌ ఎక్స్‌ రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్, ఆలియాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్‌ ఎక్స్‌ రోడ్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్‌ మార్గ్, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ (నెక్లెస్‌ రోడ్డు)లో అంబేడ్కర్‌ విగ్రహం వైపు వెళ్లాలని సూచించారు.

సికింద్రాబాద్‌ నుంచి వచ్చే విగ్రహ ఊరేగింపులు సంగీత్‌ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్‌ జంక్షన్, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, ట్యాంక్‌బండ్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్డుకు వెళ్తుంది.

చిలకలగూడ కూడలి నుంచి వచ్చే గణేష్‌ విగ్రహాలు గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్, నారాయణగూడ పైవంతెన, వై.జంక్షన్, హిమాయత్‌నగర్‌ నుంచి లిబర్టీ వైపు వెళ్తాయి.

ఉప్పల్‌ ప్రాంతం నుంచి వచ్చే ఊరేగింపులు రామంతాపూర్, శ్రీ రమణ జంక్షన్, ఛే నంబరు, తిలక్‌నగర్, ఓయూ ఎన్‌సీసీ గేట్, విద్యానగర్‌ జంక్షన్, ఫీవర్‌ ఆసుపత్రి, బర్కత్‌పుర కూడలి మీదుగా వెళ్తుంది. ఆ ఊరేగింపులు నారాయణగూడ వైఎంసీఏ కూడలికి చేరుకొని, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు నుంచే వచ్చే ఊరేగింపుతో కలుస్తోంది.దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వచ్చే విగ్రహాలు ఐఎస్‌ సదన్, సైదాబాద్, చంచల్‌గూడ ఉంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ ఎక్స్‌ రోడ్డులో కలుస్తోంది. అక్కడి నుంచి మూసారాంబాగ్‌ మీదుగా అంబర్‌పేట్‌ వైపు వెళ్తాయి.

తార్నాక వైపు వచ్చే విగ్రహాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యాకేంద్రం రోడ్డు, అడిక్‌మెట్‌ వైపు వెళ్లి విద్యానగర్‌ మీదుగా ఫీవర్‌ ఆసుపత్రి వద్ద ఊరేగింపు చేరుతుంది.

టోలిచౌకి, రేతిబౌలి, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే గణేష్‌ నిమజ్జనం ఊరేగింపు మాసబ్‌ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ద్వారకా హోటల్‌ జంక్షన్, ఇక్బాల్‌ మినార్‌ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకుంటుంది.ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్‌ఆర్‌ నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ మీదుగా మోహిదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్‌ వద్ద చేరి, ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు వెళ్తోంది.

టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్‌ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, వోల్గా హోటల్‌ ఎక్స్‌రోడ్, గోషామహల్, మాలకుంటజంక్షన్‌ మీదుగా వెళ్లి ఎంజేఎం వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.

వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో సాధారణ ప్రజలు రాకపోకలకు అంతరాయం కలగవచ్చని, ఊరేగింపు సాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలు అందుకు అనుగుణంగా ప్రయాణ మార్గాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు

అమరావతి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధుల జమ..!!

ఏపీ ప్రభుత్వం అమరావతి రైతులకు బకాయిలు విడుదల చేసింది. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు పెండింగ్‌లో ఉన్న వార్షిక కౌలును సీఆర్డీఏ నేరుగా వారి ఖాతాల్లోజమ చేయనుంది.ఇందు కోసం ప్రభుత్వం రూ 400 కోట్లను విడుదలకు ఆమోద ముద్ర వేసింది.అదే సమయంలో హైకోర్టు భవనం ప్రాంగణంలో అదనపు నిర్మాణాలకు సంబంధించి రూ.13.33 కోట్లను సీఆర్డీఏ విడుదల చేసింది.

అమరావతిలో కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రైతులకు పెండింగ్‌లో ఉన్న వార్షిక కౌలును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో పెండింగ్ అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది. భూసమీకరణ పెండింగ్ లో ఉన్న గ్రామాల్లో రైతులతో నేరుగా మంత్రి నారాయణ సంప్రదింపులు చేస్తున్నారు. వారిని భూములు ఇచ్చేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. భూములు ఇస్తే కోరిన చోట ప్లాట్లు కేటాయిస్తామని హామీ ఇస్తున్నారు.

ఇక, అమరావతిలో నిర్మాణాల పైన అధ్యయనం చేసిన చెన్నై ఐఐటీ నిపుణుల బృందాలు ప్రాథమిక నివేదికను అందజేసినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో తుది నివేదికను అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదికలో మరోవైపు అమరావతిలో హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల పునాదులకు ఎలాంటి ఇబ్బంది లేదని తేలింది. ఐదేళ్లుగా నీళ్లలో ఉంటూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్న నివాస భవనాల టవర్ల పటిష్ఠతపై చెన్నై, హైదరాబాద్‌ ఐఐటీలకు చెందిన నిపుణులు క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలకు ఆర్కిటెక్చరల్‌ డిజైన్లు, సేవలు అందజేసేందుకు సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. వచ్చే నెల 4 మధ్యాహ్నం 2 గంటలలోపు బిడ్‌లు దాఖలు చేయాలని సూచించింది ప్రభుత్వం. వచ్చే నెల 4న సాయంత్రం టెక్నికల్‌ బిడ్‌లు ఓపెన్‌ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డ్.. ఒకే రోజు 13వేలకుపైగా, చాలా అరుదుగా!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రపంచ రికార్డును సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణను వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్‌ను ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ టేలర్ డిప్యూటీ సీఎంకు అందజేశారు. ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరల్డ్ రికార్డును సాధించింది. ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకేరోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీన్ని వరల్డ్‌ రికార్డ్స్‌ యూనియన్‌ గుర్తించింది.. ఈమేరకు రికార్డు ధ్రువపత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు అందజేశారు. దీనికి సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్‌ను పవన్ కళ్యాణ్‌కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందజేశారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. పంచాయతీరాజ్‌ మంత్రిగా పవన్‌ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదు కావడం విశేషం.

రాష్ట్రవ్యాప్తంగా ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరుతో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించింది. గ్రామాల అభివృద్ధికి నాలుగు ప్రధాన ప్రణాళికలతో ఒకేసారి ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించే గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లె గ్రామసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ గ్రామ సభల్ని సర్పంచి అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ఆ ఊరిలో ప్రజలంతా పాల్గొని.. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు అంశాలపై చర్చించి తీర్మానం చేశారు.

తిరుమలలో ఏర్పాట్లు బాగోలేదు.. మంత్రి ఆనంకు భక్తుడి ఫిర్యాదు

తిరుమలలో ఏర్పాట్లు బాగోలేదంటూ శ్రీవారి ఆలయం వద్దే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి భక్తుడు ఫిర్యాదు చేశాడు. నిన్నటి (ఆదివారం) నుంచి క్యూ లైనల్లో వేచి వున్నా స్వామి వారి దర్శన భాగ్యం దక్కలేదన్నారు. అంతేకాకుండా క్యూలైనల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేయలేదని తెలిపారు. చిన్న బిడ్డలతో క్యూలైన్లలో వేచి ఉండలేక బయటకు వచ్చేసామంటూ మంత్రికి సదరు భక్తుడు ఫిర్యాదు చేశాడు.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుడిని (Lord venkateshwara) పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. ఆ శ్రీనివాసుడి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో భక్తులు వేచి ఉంటారు. ఇక వారాంతాలు, పండగల సమయాల్లో అయితే స్వామి దర్శనానికి గంటల సమయం పడుతుంది. క్యూలైన్లలో ఉండే భక్తుల అవసరాలను టీటీడీ తీరుస్తుంది. భోజనసదుపాయాలను అందిస్తుంది. తాజాగా తిరుమలలో ఏర్పాట్లపై ఓ భక్తుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏకంగా ఏపీ మంత్రికే తిరుమలలో ఏర్పాట్లపై ఫిర్యాదు చేశాడు.

తిరుమలలో ఏర్పాట్లు బాగోలేదంటూ శ్రీవారి ఆలయం వద్దే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి (Minister Anam Ram Narayanareddy) భక్తుడు ఫిర్యాదు చేశాడు. నిన్నటి (ఆదివారం) నుంచి క్యూ లైనల్లో వేచి వున్నా స్వామి వారి దర్శన భాగ్యం దక్కలేదన్నారు. అంతేకాకుండా క్యూలైనల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేయలేదని తెలిపారు. చిన్న బిడ్డలతో క్యూలైన్లలో వేచి ఉండలేక బయటకు వచ్చేసామంటూ మంత్రికి సదరు భక్తుడు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన మంత్రి ఆనం.. భక్తుడ్ని సముదాయించే ప్రయత్నం చేశారు. అధికారులకు చెప్పి దర్శనం కల్పిస్తామని భక్తుడికి మంత్రి ఆనం హామీ ఇచ్చారు.

కాగా.. ఈరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వరుడిని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనాంనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రకృతి వైఫరిత్యం వల్ల రాష్ట్రంలోని ఓ ప్రాంతం అతలాకుతలమైందన్నారు. 10 రోజుల పాటు ఆహారం దొరక్క, నిలువున నీడలేక ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. కష్ట కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలతోనే ఉండి వారి కష్టాలను తీర్చారన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుని ప్రస్తుతం అక్కడ పూర్వ పరిస్థితులను నెలకొల్పారని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వెల్లడించారు.