/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz భద్రాచలం: చర్ల:దశాబ్దాలు గడుస్తున్న తాలిపేరు ప్రాజెక్టు అదనపు 3 గేట్లు ఎందుకు ఓపెన్ చేయడం లేదు AITF మండల నాయకుడు గొంది ముయ్యన్న Miryala Kiran Kumar
భద్రాచలం: చర్ల:దశాబ్దాలు గడుస్తున్న తాలిపేరు ప్రాజెక్టు అదనపు 3 గేట్లు ఎందుకు ఓపెన్ చేయడం లేదు AITF మండల నాయకుడు గొంది ముయ్యన్న

దశాబ్దాలు గడుస్తున్న తాలిపేరు ప్రాజెక్టు అదనపు 3 గేట్లు ఎందుకు ఓపెన్ చేయడం లేదు AITF మండల నాయకుడు గొంది ముయ్యన్న

 చర్ల మండలం పెద్ద ముడిసిలేరులో ఉన్న ఎడమ పక్కన తాలిపేరు ప్రాజెక్టుకు అదనపు మూడు గేట్లకు 70 కోట్ల రూపాయలు సాంక్షన్ అయ్యాయి కానీ రెండు దశాబ్దాలు పూర్తవుతున్న ఇంకా దాన్ని పూర్తి చేయలేదని దీనిపైన పూర్తి అవగాహన సీనియర్ మీడియా మిత్రులకు నాయకులకు అధికారులకు ఉన్న స్పందించడం లేదని ఏఐటిఎఫ్ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం మండల నాయకుడు గొంది ముయ్యన్న అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్లు జేబులు నింపుకోవడానికి అధికారుల జేబులు నింపడానికి ఈ ప్రాజెక్టుకి ప్రతి ఏటా నిధులు వస్తున్నాయి.

పక్కన ఉన్న తాలు పేరు ప్రాజెక్టు ఎస్టిమేషన్ వెంగళరావు 24 గేట్లకు అంచనా 48 కోట్లు ఇప్పుడున్న అదనపు మూడు గేట్లకి 70 కోట్లు శాంక్షన్ అయ్యాయి దానికి దీనికి రూపాయలు డిఫరెంట్ కోట్లు పెట్టిన ప్రాజెక్టుకు 24 గేట్లు తక్కువ కోట్లకు పూర్తయింది  దీనిపైన అధికారులు పాలకులు 70 కోట్ల వరకు బిల్లు చేశారు అయినా ఎందుకు ఇది పూర్తి కావడం లేదు ఇట్టి విషయంపై అవగాహన ఉన్న మేధావులు రాజకీయ నాయకులు సీనియర్ పత్రికా రిపోర్టర్లు ఎందుకు స్పందించడం లేదు దీనిలో కుల సమీకరణ కూడా ఉందని ప్రజలలో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ప్రాజెక్టుకి కొండా సురేఖ భర్త అయినా కొండ మురళి హస్తం ఉన్నదని వారు అన్నారు ఇప్పటికైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు* స్పందించి ఈ తాలిపేరు ప్రాజెక్ట్ అదనపు మూడు గేట్లను పూర్తి చేయించి ప్రారంభోత్సవం చేయాలని ఇప్పుడున్న వరద బీభత్సవానికి కాల్ పేరు బిర్జి తట్టుకోవడం లేదని వారు సర్వే చేసి తెలియజేశారు రెండు దశాబ్దాలు అయిన పూర్తి కానిది కనీసం మూడో దశాబ్దానికైనా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఆదివాసి మండలం అయినా చర్ల మండలం పైన పాలకులకు అధికారులకు ఎందుకు చిన్న చూపు అని ఆయన ప్రశ్నించారు.

కాలు పేరు అదనపు 3 గేట్లని పూర్తి చేయకపోతే ఆదివాసీ ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని పాలకులను అధికారులను వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు మండల నాయకుడు ఇర్ఫా రాజేష్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా నాయకుడు కామ్రేడ్ ముసలి సతీష్ పాల్గొన్నారు.

కోల్కతాలో మెడికోపై హత్యాచారం కేసులో లై డిటెక్టర్ టెస్టులో పొంతన లేని సమాధానాలు చెప్పిన సంజయ్రాయ్..

కోల్కతాలో మెడికోపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్..

లై డిటెక్టర్ టెస్టులో పొంతన లేని సమాధానాలు చెప్పిన సంజయ్రాయ్..

తాను చూసేసరికే లేడీ డాక్టర్ మరణించిందని చెప్పిన సంజయ్రాయ్..

సెమినార్ హాల్లోకి వెళ్లే సరికి మృతదేహం కనిపించిందన్న ప్రధాన నిందితుడు.. మృతదేహం కనిపంచడంతో భయంతో పారిపోయానన్న సంజయ్రాయ్.. అనేక ఆధారాలు చూపించి ప్రశ్నించిన సీబీఐ, సెంట్రల్ ఫోరెన్సిక్ టీమ్.. హత్యాచారం జరిగిన సమయంలో తాను వేరే చోట ఉన్నానన్న నిందితుడు..

న్యూఢిల్లీ: విద్యార్థుల కోసం పదివేల కోట్లతో విజ్ఞాన ధార పథకం..

10 వేల కోట్లతో విజ్ఞాన్‌ ధార

బయో ఈ3 పాలసీకి ఆమోదం

   

కేంద్ర మంత్రివర్గం నిర్ణయం

న్యూఢిల్లీ,: విజ్ఞాన్‌ ధార పథకానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఐటీశాఖ అమలు చేస్తున్న మూడు పథకాలను విలీనం చేసి ‘విజ్ఞాన్‌ ధార’ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది. 15వ ఆర్థిక సంఘం కాలమైన 2021-22 నుంచి 2025-26 మధ్య రూ.10,579 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. ఈ పథకం కింద 11వ, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, యూజీ, పీజీ, పీహెచ్‌డీ, పోస్ట్‌ డాక్టరల్‌ రిసెర్చ్‌ విద్యార్థులకు ఫెలోషిప్‌లు అందించనుంది.*

అధునాతన పరిశోధనల కోసం అంతర్జాతీయ భాగస్వామ్యం, సంయుక్త పరిశోధనా ప్రాజెక్టులు, ఫెలోషిప్‌లు వంటివి ఈ పథకంలో ఉంటాయి. ఆర్థిక, పర్యావరణ, ఉపాధి కోసం జీవసాంకేతిక విజ్ఞానం(బయో ఈ3) విధానానికి సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్వచ్ఛ ఇంధన, పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీ, పరిశోధన, ఈ రంగంలోని నూతన సాంకేతికత ప్రోత్సాహానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

TG: మాది రైతు ప్రభుత్వం:సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రూ.2 లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది.. రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుంది.. మాది రైతు ప్రభుత్వం అని నిరూపించుకోవడానికి రూ.2లక్షల రుణమాఫీ చేశాం.. డ్రగ్స్, గంజాయి గురించి నిద్రలో ఆలోచించినా భయపడే పరిస్థితి కల్పిస్తాం.. డ్రగ్స్‌, గంజాయి మూలాలు ఏరివేస్తున్నాం. -సీఎం రేవంత్‌ రెడ్డి.

హైదరాబాద్‌ కేంద్రంగా భారీ సైబర్ క్రైమ్. పాతబస్తీలో బ్యాంకు నుంచి రూ.175 కోట్లు లావాదేవీలు...

హైదరాబాద్‌ కేంద్రంగా భారీ సైబర్ క్రైమ్. పాతబస్తీలో బ్యాంకు నుంచి రూ.175 కోట్లు లావాదేవీలు.

సైబర్ నేరగాళ్లకు సహకరించిన ఇద్దరు ఆటో డ్రైవర్లు. జాతీయ బ్యాంక్‌లో 6 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసిన ఆటో డ్రైవర్లు. ఆటో డ్రైవర్ల ద్వారా రూ. 175 కోట్ల లావాదేవీలు జరిపిన సైబర్ కేటుగాళ్లు.

హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌, ఇండోనేషియా, కంబోడియాలకు నిధులు బదిలీ. క్రిప్టో కరెన్సీ ద్వారా నిధులు ట్రాన్స్‌ఫర్ చేసిన ఆటో డ్రైవర్లు.

N-కన్వెన్షన్‌ గురించి వస్తున్న వార్తలపై అభిమానులు, శ్రేయోభిలాషులకు అక్కినేని నాగార్జున ట్వీట్‌..

అభిమానులు, శ్రేయోభిలాషులకు అక్కినేని నాగార్జున ట్వీట్‌. N-కన్వెన్షన్‌పై వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ వినిపిస్తున్నాయి.

కన్వెన్షన్‌ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్‌ భూమి. ఒక్క సెంట్‌ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని 2014లో కోర్టు ఒక ఆర్డర్‌ ద్వారా జడ్జిమెంట్‌ ఇచ్చింది.

ప్రస్తుత నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానం తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్థిస్తున్నాను. -నాగార్జున

నల్లగొండ: ఘనంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు.. ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నేతలు..

ఘనంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు

52వ జన్మదిన వేడుకల సందర్భంగా భూపాల్ రెడ్డి గారు తన స్వగ్రామమైన ఉరుమండ్లలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వి.టి.కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితుల కోలాహలం మరియు వేద పండితుల ఆశీర్వచనాల మధ్యలో భారీ కేక్ ను భూపాల్ రెడ్డి గారు కట్ చేశారు.

ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ భూపాల్ రెడ్డికి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

52వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు కంచర్ల భూపాల్ రెడ్డి గారిని భారీ గజమాలతో సత్కరించారు.

కంచర్ల భూపాల్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు... అనాథ శరణాలయంలో అన్నదాన కార్యక్రమాలు మరియు గొల్లగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంచడమే కాకుండా అనాధలకు దుప్పట్లు కూడా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్, నల్గొండ, కనగల్ మండల అధ్యక్షులు దేప వెంకట్ రెడ్డి, ఐతగోని యాదయ్య, మహిళా నాయకులు శరణ్య రెడ్డి,కొప్పుల విమలమ్మ మరియు తదితర ప్రముఖ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ఉన్న మాటంటే ఉలుకెక్కువ -ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న పోషకాహార లోపం -సస్పెన్షన్లు, బలవంతపు రాజీనామాలు తగవు -సీసీజీజీఓఓ జాతీయ చైర్మన్

ఉన్న మాటంటే ఉలుకెక్కువ

-ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్న పోషకాహార లోపం

-సస్పెన్షన్లు, బలవంతపు రాజీనామాలు తగవు

-సీసీజీజీఓఓ జాతీయ చైర్మన్ వి. కృష్ణ మోహన్

తాజాగా ప్రకటించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఫలితాలు ప్రభుత్వానికి అసంతృప్తిని కలిగించి ఆ నివేదికను రూపొందించిన ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ డైరెక్టర్‌ సస్పెన్షన్‌కు దారి తీసింది. ఇకపై నివేదికల్లో రక్తహీనత అనే పదమే కనిపించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2011-12, 2017-18 మధ్యకాలంలో దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న జనాభా శాతం పెరిగిందని జాతీయ శాంపిల్‌ సర్వే కార్యాలయం వెల్లడించింది. దీంతో ఆ నివేదిక ప్రచురణను ప్రభుత్వం నిలిపి వేసింది. గణాంక వివరాలు బహిర్గతం కావడానికి కారకులనే నెపంతో ఇద్దరు స్టాటిస్టీషియన్లను బలవంతంగా తమ ఉద్యోగాలకు రాజీనామా చేయించటాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ (సీసీజీజీఓఓ) జాతీయ చైర్మన్ వి. కృష్ణ మోహన్ తప్పుబట్టారు.

ఆహారం సరిగా లభించక పోవడం వల్లనే కరువు కాటకాలు సంభవించడం లేదని, సామాజిక, ఆర్థిక అంశాలు కూడా దానికి దోహద పడుతున్నాయని తెలిపారు. రానున్న కాలంలో పౌష్టికాహార లోపం కుటుంబాల ఆర్థిక వనరులపై ప్రభావం చూపబోతోందని, వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా భవిష్యత్‌లో ఆహార భద్రతకు అనేక సవాళ్లు ఎదురవుతాయని హెచ్చరించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు కేవలం ఆహార ధాన్యాలను మాత్రమే అందిస్తున్నారు తప్పించి అవసరమైన పప్పు ధాన్యాలు మొదలైన నిత్యావసరాలు సరఫరా చేయడం లేదు. ఫలితంగా ప్రజల్లో పోషకాహార లోపం ఏర్పడింది.

అందుబాటులో లేని ఆరోగ్యకరమైన ఆహారం

ఆహార భద్రత, పోషకాహారంపై 2011లో ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) ఓ పరిశీలన ప్రారంభించింది. భారతదేశంలోని జనాభాలో 74.1 శాతం మందికి ఆరోగ్యకరమైన ఆహారం అందడం లేదని అది తేల్చింది. గతేడాది విడుదలైన ప్రపంచ ఆకలి సూచికలో భారత్‌ 111వ స్థానంలో (మొత్తం 125 దేశాల్లో) నిలిచింది. ఈ సూచికలో ప్రతి ఏటా మన ర్యాంకింగ్‌ పడిపోతూనే ఉంది. 2016లో 97, 2017లో 100, 2018లో 103, 2022లో 107… ఇలా మన ర్యాంక్‌ పతనమవుతూనే ఉంది. హైతీ, సబ్‌-సహారా ఆఫ్రికాలోని 12 దేశాలు మాత్రమే మన కంటే తక్కువ ర్యాంకులో ఉన్నాయి. దేశంలో ఐదేండ్ల కంటే తక్కువ వయసున్న ప్రతి ముగ్గురు చిన్నారుల్లో ఒకరు తక్కువ బరువును, 36 శాతం మంది తక్కువ ఎత్తును కలిగి ఉన్నారని 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలిపింది. వయసుకు తగినట్టు బరువు, ఎత్తు లేకపోవడం పోషకాహార లోపానికి సూచికలు. 19 శాతం మంది పిల్లలైతే ఎత్తుకు తగిన బరువు లేక పీలగా ఉన్నారు. ఇది కూడా పోషకాహార లోపం సూచికే. 2019-21లో దేశ జనాభాలో 36 శాతం మంది కుంగుబాటుకు లోనయ్యారు. 19 శాతం మంది అసాధారణ రీతిలో బలహీనంగా ఉన్నారు. 6-59 నెలల మధ్య వయసున్న పిల్లల్లో 67 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. పెద్ద వారిలో… అంటే 15-49 ఏండ్ల మధ్య వయస్కుల్లో 57 శాతం మహిళలు రక్తహీనతకు గురయ్యారు.

సౌకర్యాల కొరతతో వృథా

దేశంలో తృణధాన్యాల ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ ఆహారధాన్యాల తలసరి లభ్యత తగ్గిపోతోంది. 1991లో ఒక్కో వ్యక్తికి రోజుకు 510.1 గ్రాముల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండగా 2021లో 507.9 గ్రాములు మాత్రమే లభించాయి. వివిధ కారణాల వల్ల వ్యవసాయోత్పత్తుల్లో 40 శాతం వరకూ నష్టపోవాల్సి వస్తోంది. కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యాలు లేకపోవడంతో పండ్లు, పాలు వంటి 1.3 బిలియన్‌ టన్నుల సరుకులను నష్ట పోవాల్సి వస్తోంది. 

వ్యవసాయోత్పత్తిపై వాతావరణ మార్పుల ప్రభావం

 2020-2050 మధ్యకాలంలో దేశ జనాభా 0.82 శాతం వార్షిక వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా. అంటే శతాబ్దం మధ్య నాటికి దేశ జనాభా 172,33,80,000కు చేరుతుంది. ఇందుకనుగుణంగా తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఆహార ధాన్యాలు, కూరగాయలు, పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తి సగటున ఏటా వరుసగా 2.65 శాతం, 4.9 శాతం, 2.84 శాతం, 4.65 శాతం, 4.58 శాతం, 11.57 శాతం, 5.82 శాతం మేర పెరగాలి. వాతావరణ మార్పులు సంభవిస్తే ఉత్పత్తిపై ప్రభావం పడవచ్చు. ఉదాహరణకు 2021లో 113 మిలియన్‌ టన్నుల గోధుమలు ఉత్పత్తి కాగా 2022లో 107 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగింది. ఈ ఏడాది అది మరింత పడిపోయి 105 మిలియన్‌ టన్నులకు చేరుతుందని అంచనా. గతేడాదితో పాటు ఈ ఏడాది కూడా బియ్యం ఉత్పత్తి పడిపోయింది. అందుకే బాసుమతియేతర బియ్యం ఎగుమతులను కేంద్రం నిలిపివేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పంటల ఉత్పత్తి తగ్గిపోతే దాని ప్రభావం ఆకలిపై పడుతుంది. 2050 నాటికి ఆకలితో బాధపడే వారి సంఖ్య 11 నుంచి 20 శాతం వరకూ పెరగవచ్చునని ఓ నివేదిక తెలిపింది. దేశంలో 2022 నుండి తీవ్రమైన వడగాల్పులు సర్వసాధారణమై పోయాయి. వాతావరణ మార్పులే దీనికి కారణం. 1900-2018 మధ్యకాలంలో దేశంలో సగటు వార్షిక ఉష్ణోగ్రత 0.7 డిగ్రీలు పెరిగింది.

ఉత్పత్తి పెంపు అనివార్యం

 జనాభా అవసరాలకు అనుగుణంగా వ్యవసాయోత్పత్తులు పెరగకపోతే ఎగుమతులను తగ్గించుకోవడంతో పాటు నిత్యావసరాలను మరోసారి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడవచ్చు. ఈ పరిణామం మన విదేశీ వాణిజ్యంపై ప్రభావం చూపుతుంది. మనం ఇప్పటికే పప్పులు, వంటనూనెలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాము. బియ్యం, గోధుమల ఎగుమతులపై విధించిన నిషేధం కారణంగా భారత్ అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఓ అంచనా ప్రకారం జనాభా అవసరాలను తీర్చాలంటే 2030 నాటికి 311 టన్నులు, 2050 నాటికి 350 టన్నుల ఆహార ధాన్యాలను మన దేశం ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఉత్పాదకతనైనా పెంచాలి లేదా సాగు భూమినైనా పెంచాలని వి. కృష్ణ మోహన్ సూచించారు.

అడుగంటుతున్న భూగర్భ జలాలు

వివిధ కారణాలతో దేశంలో 147 మిలియన్‌ హెక్టార్ల భూమి ఇప్పటికే సారాన్ని కోల్పోయింది. వాతావరణ మార్పులు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2050 నాటికి వ్యవసాయ యోగ్యమైన భూమిలో సగం బీడుగా మారిపోయే ప్రమాదం ఉంది. అంతిమంగా అది ఉత్పాదకత తగ్గడానికి దారితీస్తుంది. భూమిలో లవణాలు పేరుకుపోతున్నాయని, ఫలితంగా ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని, ఆర్థికాభివృద్ధి దెబ్బ తింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పదేండ్ల క్రితం… అంటే 2012-14లో వేసిన ఓ అంచనా ప్రకారం భూమిలో లవణాలు పేరుకు పోవడంతో అప్పటికే 16.84 మిలియన్‌ టన్నుల వ్యవసాయోత్పత్తులకు నష్టం చేకూరింది. పులి మీద పుట్రలా జల వనరుల లభ్యత కూడా తగ్గిపోతోంది. జనాభాతో పాటు నీటి వినియోగం కూడా పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. హరిత విప్లవ కాలం నుంచి నీటి వినియోగం అధికంగా ఉండే పంటలనే రైతులు పండిస్తున్నారు. దేశంలో లభ్యమవుతున్న భూగర్భ జలాలలో 89 శాతం వ్యవసాయానికే ఖర్చవుతున్నాయి. అందుకే 2007-2017 మధ్యకాలంలో భూగర్భ జల మట్టం 61 శాతం పడిపోయింది.

భవిష్యత్తులో ఆకలి కేకలు నివారించేందుకు ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చే బదులు సర్వే ఫలితాల ఆధారంగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని, అంతే గాని నివేదికను రూపొందించిన ఆఫీసర్లను సస్పెండ్ చేయటం, బలవంతంగా రాజీనామాలు చేయించటం మానుకోవాలని ప్రధాన మంత్రికి వి. కృష్ణ మోహన్ విజ్ఞప్తి చేశారు.

నల్లగొండ: బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బీసీ మండల్ జయంతి వేడుక.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య..

బిపి మండల్ గారి 106 వ జయంతి సందర్భంగా నల్లగొండ, కోర్టు ఎదురుగా బి.పి మండల్ విగ్రహం దగ్గర ఘనంగా జయంతి వేడుకలు మిర్యాల యాదగిరి సభా అద్యక్షులు (బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు) ఆద్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యాసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ పంచాయతీరాజ్ సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతం కు పెంచాలని లేకపోతే ఉద్యమం ఉధృతం - హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటీసీ, వార్డు మెంబర్ల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతం కు పెంచుతామని మేనిఫెస్టో లో తెలిపిన ప్రకారం మాట మీద నిలబడి పెంచాలని జాతీయ బీసీ సంఘం అద్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఈ మేరకు హెచ్చరిక చేశారు‌. ప్రభుత్వం వచ్చే అక్టోబర్ నెలాఖరుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కులగణన చేయాలని నిర్ణయం తీసుకుంది.కులగణన చేసిన తర్వాత దాని ఆధారంగా రిజర్వేషన్లు పెంచాలి.ఇంకా కులగణన ప్రక్రియ ప్రారంభించలేదు. బిసి సంఘాల ఆధ్వర్యంలో కులగనన చేయాలని 42 శాతం కు బిసి రిజర్వేషన్లు పెంచాలని మూడు నెలలుగా ఉద్యమాలు చేస్తున్నాం. అయినా ప్రభుత్వం స్పందించడం లేదు. రాహుల్ గాంధీ అయినా స్పందించాలని కోరారు.రాష్ట్రంలో అన్ని పార్టీ రాజకీయ పార్టీలు టిఆర్ఎస్,బిజెపి,సిపిఐ, సిపిఎం పార్టీలు బిసి రిజర్వేషన్లపై మద్దతు తెలుపుతారా? లేదా ? విధాన ప్రకటన చేయాలని రాహుల్ గాంధీ వాగ్దానాన్ని బీసీలు నమ్మారు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోని బిసి నేతలు జెండాలు మోసుకుంటూ జిందాబాద్ లో పొట్టు కొట్టు బానిస బతుకులు వద్దు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు త్వరలో గ్రామ ఉద్యమాన్ని విస్తరింప చేస్తామని హెచ్చరించారు ప్రతి ఒక్క బీసీ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బహిరంగ సభలో ప్రతిరోజు కుల జనన జరుపుతామని దాని ప్రకారము విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని బడ్జెట్ కేటాయిస్తామని -బిసి ఎజెండా ఎత్తుకొని బీసీల అభిమానం చూరగొంటుంటే ఇక్కడ బీసీలకు అన్యాయం చేయడం తగు న్యాయమా అని ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ చేయాలి సుప్రీంకోర్టు ప్రకారం తీర్పు ప్రకారం 50 శాతం సీలింగ్ అని చెప్పి పెంచకుండా తప్పించుకోవడానికి వీలు లేదు ఇప్పటికే అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టి 50 శాతం సీలింగ్ పై పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసింది ఆ అగ్రకులాలకు రిజర్వేషన్లను పెంచడానికి మూడు రోజులలో లోక్సభ రాజ్యసభలలో రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి సంతకం చేశారు కానీ 50% జనాభా గల బీద కులాలకు రాజ్యాంగ సవరణ చేయరా మా దేశంలో ఇదేమి న్యాయమని ప్రశ్నించారు. అసెంబ్లీలో చట్టం చేసి 92 శాతం పెట్టవచ్చు అవసరమైతే అన్ని పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నవి పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం గతంలో 1986లో బిసి సంక్షేమ సంఘం అనేక ఉద్యమాలు చేయగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు స్పందించి బీసీలకు జడ్పిటిసి ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలలో 20% రిజర్వేషన్లు పెట్టారు. సర్పంచ్ లకు పెట్టలేదు బీసీ రిజర్వేషన్లను 50 శాతం కు పెంచాలని సర్పంచ్ ఎన్నికలలో కూడా బీసీ రిజర్వేషన్లు పెట్టాలని బిసి సంక్షేమ సంఘం ఆరు సంవత్సరాలు వరుసగా సుధీర్గంగా ఉద్యమాలు చేయగా 1993లో అప్పటి ముఖ్యమంత్రి ఉదయ భాస్కర్ రెడ్డి స్పందించి ఒక మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి బీసీ సంఘాలతో చర్చించి 20% నుంచి 34 శాతం పెంచుతూ రిజర్వేషన్లు పెట్టారు. అప్పటినుంచి 2019 వరకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగాయి సుప్రీంకోర్టు తర్వాత తీర్పు ప్రకారం 2019లో స్థానిక సంస్థలలో బిసి రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతం కు తగ్గించారు దీనితో బీసీలకు అన్యాయం జరిగింది అప్పటినుంచి జాతీయం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దీన్ని పార్లమెంటు వద్ద ధర్నాలు జరిపి అన్ని పార్టీల మీద ఒత్తిడి తేవడంతో కులగణన జరిపి బీసీ రిజర్వేషన్లు పెంచుతామని అన్ని పార్టీలు హామీ ఇచ్చారు అందులో భాగమే పెంచుతామన్న కాంగ్రెస్ పార్టీ జనాభా ప్రకారం పెంచుతామని హామీ ఇచ్చారన్నారు.

రాజారాం యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగం లో బిసి లకు రిజర్వేషన్లు కల్పించలేదు. రాజ్యాంగ సవరణ చేసి బిసి లకు జనాభా లెక్కల ప్రకారం బిసి లకు రిజర్వేషన్లు కల్పించాలి.దేశవ్యాప్యంగా కులగణన చెపట్టాలి లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం.కాంగ్రస్ పార్టీ కామారెడ్డి బిసి డిక్లరేషన్ ప్రకారం కుల గణన చేపట్టాలి.స్తానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించాలి.

బిపి మండల్ విగ్రహ కమిటీ చైర్మన్ నాగుల వేణు మాధవ్ మాట్లాడుతూ రాజ్యాధికారంలో ఉన్న వర్గాలే రిజర్వేషన్లు తీసుకోవడం చరిత్రలో ఎక్కడ కూడా జరగదు అని అన్నారు.ఉద్యోగుల ప్రమౌషన్స్ లో రిజర్వేషన్లు కల్పించాలని, కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దూకుడుకు లక్ష్మీ నారాయణ, నీల వెంకటేశం, పిల్లి రామరాజు, వంగూరి నారాయణ యాదవ్, ప్రసన్న, శిరందాసు రామదాసు, సత్తయ్య, సర్పాల వెంకన్న, అల్లి వేణు, మామిడి పద్మ, సింగం లక్ష్మీ,

 కొండూరు సత్యనారాయణ, గోవార్దన్, గద్దె నాగరాజు, సతీష్ యాదవ్, వల్లేకీర్తీ శ్రీనివాస్, మచ్చ గిరి తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట: జన సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా బీసీ మండల్ జయంతి.. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జనసేన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జనార్దన్ యాదవ్..

బీపీ మండల్ జయంతి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాబు బిందెశ్వర్ ప్రసాద్ మండల్ యాదవ్ జయంతి కార్యక్రమం జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తగుళ్ళ జనార్ధన్ యాదవ్ ఆధ్వర్యంలో 60 ఫీట్ల రోడ్లో మహర్షి డిగ్రీ కళాశాలలో ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి డాక్టర్ వూర రామూర్తి ముఖ్యఅతిథిగా విచ్చేసి బీపీ మండల్ వల్లనే బీసీలకు విద్య, ఉద్యోగాలో 27% రిజర్వేషన్లు వచ్చాయని తెలియజేశారు.

త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మల్కాజ్గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శీలం యాదగిరి మాట్లాడుతూ వెనుకబడిన తరగతులకు అండగా ఉన్నది బీపీ మండల్, వారి ఉద్యమ స్ఫూర్తితో 1993 నుండి బీసీలకు 27% విద్యా ఉద్యోగులో రిజర్వేషన్లు పొందుతున్నారు అని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వము సమగ్ర కులగణన జరిపి చట్టసభలలో వెనకబడిన తరగతులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

సభా అధ్యక్షులు జనార్దన్ మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రంలో బీపీ మండల్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. భారతదేశంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి, ఇప్పుడు జరగవలసిన ఉద్యమం బీసీల రిజర్వేషన్ల ఉద్యమం, మండల్ ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి బీసీ బిడ్డ మన రిజర్వేషన్ల కోసం పోరాడవలసిన అవసరం ఉందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వెంకట నరసయ్య, ముద్దం బిక్షపతి, తోట శ్రీనివాస్, గోపీనాథ్, జటంగి వీరస్వామి, వెంకట్, వీరబోయిన లింగయ్య, భారి అశోక్, పల్లెటి రమేష్, మధుకర్, మహేష్, రాజేష్, మల్లేష్, శ్రీను, నగేష్, అమర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.