/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz *2026లోనే శాసనసభ స్థానాల పెంపు* *స్పష్టం చేసిన కేంద్రం* janardhanreddy vemula
*2026లోనే శాసనసభ స్థానాల పెంపు* *స్పష్టం చేసిన కేంద్రం*
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లలో శాసనసభ స్థానాల పెంపు 2026 లోనేనని కేంద్రం స్పష్టం* రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం 2026లో జనాభా లెక్కల అనంతరమే *ఏపీలో 175 నుంచి 225 శాసనసభ స్థానాలు* *తెలంగాణలో 119 నుంచి 153 శాసనసభ స్థానాల పెంపు* నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడే ఎస్సీ ఎస్టీ స్థానాల పునఃసర్దుబాటు .
ఇండియాలో చిట్టి చివరి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా..? దాని ప్రత్యేకతలివే..?
ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశాల్లో ఇండియా కూడా ఒకటి. రోజులో కోట్ల జనాబ రైల్వే ప్రయాణం చేస్తుంటారు.. సుధీర్ఘ రైల్వే లైన్ తో పాటు.. చరిత్ర కలిగిన ఇండియా రైల్వేలో.. చిట్టచివరి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా..? రోజుకు 2 కోట్ల మందికి పైగా ప్రయాణికులు, దగ్గర దగ్గరగా 70 వేల కిలోమీటర్ల నెట్ వర్క్.13 వేలకు పైచిలుకు రైళ్ళు. వేలాదిగా రైల్వే స్టేషన్లు.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. ఇండియన్ రైల్వే గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండియన్ రైల్వే మొదలైన దగ్గర నుంచి.. ఇప్పటి వరకూ జరిగిన డెవలప్ మెంట్..అద్భుతాలు.. అతిపెద్ద ప్రమాదాలు.. ఇవన్నీ అతిపెద్ద చరిత్ర అవుతుంది. భావితరాలకు ఇండియన్ రైల్వే.. ఓ పాఠం అవుతుంది. వేల స్టేషన్లు కలిగి ఉన్న భారతీయ రైల్వేకు ఎంతో చరిత్రం ఉంది..ఒక్కోక్క రైల్వే స్టేషన్ కు ఒక్కో కథ ఉంది.. వాటి వెనుకాల ఎంతో మంది త్యాగం ఉంది. ఇలా చెప్పుకుంటే చాలా అవుతుంది కాని.. ఇప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే.. ఇండియాలో చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఏది.. ఎవరికైనా తెలుసా..? భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్ గురించి మీకు తెలుసా? ఇది ఎక్కడ ఉంది..? దాని ప్రత్యేకత ఏంటి..? ఇండియాలోనే చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఎక్కడో లేదు బంగ్లాదేశ్ సరిహద్దుకు ఆనుకుని.. వెస్ట్ బెంగాల్ లో ఉంది భారతదేశపు చివరి రైల్వే స్టేషన్. ఆ స్టేషన్ పేరు సింగాబాద్ రైల్వే స్టేషన్. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాలోని హబీబ్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఈ రైల్వే స్టేషన్ ను భారతదేశంలోని చివరి రైల్వే స్టేషన్‌గా పరిగణిస్తుంటారు. ఎందుకంటే దీని తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దు ప్రారంభమవుతుంది. సింగాబాద్ రైల్వే స్టేషన్ చాలా చిన్నది.. పురాతనమైనది కూడా.. బ్రిటీష్ కాలంలో దీన్ని నిర్మించారు. ఎంత చిన్నదైనా.. చాలా ప్రాచీనమైనది కావడంతో.. ఈ రైల్వే స్టేషన్ చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య గత సంబంధాలలో ఇది కీలక పాత్ర పోషించింది. స్వాతంత్య్రానికి ముందు, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వంటి వ్యక్తులు ఢాకా వెళ్ళడానికి ఈ స్టేషన్ గుండా వెళ్ళేవారు. అంత చరిత్ర ఉన్న ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోయింది. కనీసం ప్రభుత్వాలు.. ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చి.. హెరిటేజ్ ప్రాపర్టీగా కూడా దీన్ని కాపాడటంలేదు. ఎవరూ పట్టించుకోకపోవడంతో. ఇప్పుడు రైల్వే స్టేషన్‌ నిర్మానుష్యంగా మారింది. ఇప్పుడు ఇక్కడ ప్రయాణీకుల కోసం ఏ రైలు ఆగదు. ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు గూడ్స్ రైళ్లకు మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ నుంచి బంగ్లాదేశ్‌కు కొన్ని గూడ్స్ రైళ్లు నడుస్తాయి. ఈ రైల్వే స్టేషన్ కేవలం వ్యాపారానికి మాత్రమే ఉపయోగపడుతోంది. ఇక్కడ ఏ రైలు ఆగదు లేదా ప్రయాణీకులు ఎవరూ రారు. అందువల్ల ఈ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లు నిర్జనంగా కనిపిస్తుంటాయి. టిక్కెట్ కౌంటర్లు కూడా మూసివేశారు. స్టేషన్‌లో కొంతమంది రైల్వే సిబ్బంది మాత్రమే ఉన్నారు
*సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో బహుజనుల రాజ్యాధికారం కోసం ఉద్యమిద్దాం* *చౌగాని సీతారాములు KGKS జిల్లా ప్రధాన కార్యదర్శి*
ఈరోజు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతిని నల్లగొండలోని వృత్తిదారుల కార్యాలయంలోజిల్లా అధ్యక్షులు *కొండా వెంకన్న* అధ్యక్షతనఘనంగా నిర్వహించారు ! ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగానీ సీతారాములు మాట్లాడుతూ 1650 సంవత్సరంలో ధర్మయ్యా సర్వమ్మ దంపతులకు సామాన్య కల్లుగీత కుటుంబంలో జన్మించి గోల్కొండ కోటని రాజధానిగా చేసుకుని బహుజనుల రాజ్యాన్ని స్థాపించిన బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడినారు షాపూర్ను తన రాజధానిగా చేసుకుని తెలంగాణ ప్రాంతంలోని కొలనుపాక తాటికొండ ఎలగందుల చేర్యాల హుస్నాబాద్ భువనగిరి జనగామ తో సహా అనేక ప్రాంతాలను పాలించిన నాయకుడు అని అన్నారు క్రూరమైన ఇస్లామిక్ దౌర్జన్యాన్ని అరాచక పాలనను ముస్లిం జమీందారులపై నిరంతరం దాడులు చేసిన గందర గండడు 1710 లో ఇస్లామిక్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన భీకర యుద్ధంలో పాణాలు కోల్పోయిన వెన్నుచూపని వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అనికొనియాడారు ఆయన స్ఫూర్తితో రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని గౌడులకు కల్లుగీత కార్మికులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు *అచ్చాలుగారు* మాట్లాడుతూ యుద్ధాలు వద్దురా కొడకా మనది కల్లుగీత వృత్తి అది చేసి బతకాలి అని తల్లి అంటే తాటిచెట్టు ఎక్కితే ఏమొస్తది అమ్మ ముంతటి కల్లు తప్ప కొడితే గోల్కొండ కోటని కొట్టాలి అని బదిలిచ్చిన వీరుడు పాపన్న అని కొని నాడినారు ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పల గోపాల్ జిల్లా సహాయ కార్యదర్శి రాసకొండ వెంకట్ గౌడ్ నేలపట్ల నరసింహ గౌడ్ రాంబాబు స్వామి నరసయ్య వెంకన్న కొండ రాములు తదితరులుపాల్గొన్నారు
హైదరాబాద్‌ నిమ్స్‌లో 101 ఉద్యోగాలు.. **నెలకు రూ.32,500**
నిమ్స్‌-హైదరాబాద్‌ భారీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన 101 టెక్నీషియన్‌ పోస్టులను భర్తీ చేయనుంది. హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS).. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 101 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.32,000 వేతనం ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 24 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.nims.edu.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు

టెక్నీషియన్‌ ఖాళీలు :

101 విభాగాలు: రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, బయో మెడికల్, థెరపిస్ట్, న్యూక్లియర్ మెడిసిన్‌, అనస్తీషియా, బ్లడ్ బ్యాంక్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఎస్సీ), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 36 ఏళ్లు మించకూడదు. వేతనం: నెలకు రూ.32,500 గా ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. చిరునామా: దరఖాస్తులను ది ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్, 2వ అంతస్తు, ఓల్డ్‌ ఓపీడీ బ్లాక్‌, నిమ్స్‌, పంజాగుట్ట చిరునామాకు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 24
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత్ పాకిస్తాన్ వెళుతుందా? జైషా సమాధానమిదే?
ICC ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది అంటే ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాకిస్థాన్‌ వేదికగా జరుగనుంది. ఈ ఐసీసీ ఈవెంట్‌లో పాల్గొనేందుకు టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే టీమ్ ఇండియాను పాకిస్థాన్ పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు ICC ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది అంటే ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాకిస్థాన్‌ వేదికగా జరుగనుంది. ఈ ఐసీసీ ఈవెంట్‌లో పాల్గొనేందుకు టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే టీమ్ ఇండియాను పాకిస్థాన్ పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు టీమ్ ఇండియాను పాకిస్థాన్‌కు ఆహ్వానించే బాధ్యతను పీసీబీ, ఐసీసీ భుజాలకెత్తుకున్నాయి. దీంతో త్వరలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై క్రికెట్ ప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే దీనిపై బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనే ప్రశ్నకు ‘దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. టోర్నీ దగ్గర పడ్డాక నిర్ణయం తీసుకుంటాం’ అని జైషా చెప్పుకొచ్చారు. ఐసిసికి పాకిస్తాన్ సమర్పించిన ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకారం, టోర్నమెంట్ ఫిబ్రవరి 19, 2025 నుండి మార్చి 9, 2025 వరకు జరగాల్సి ఉంది. కాగా, ఈ టోర్నీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మార్చి 1న జరగాల్సి ఉంది. కానీ పాకిస్థాన్ ఐసీసీకి సమర్పించిన ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్పటి వరకు ఆమోదించలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఇందులో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. ఈ జట్లను 2 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ , బంగ్లాదేశ్ ఉండగా.. రెండో గ్రూపులో ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి.
ఢిల్లీలో హైఅలర్ట్.. ఎర్రకోటపై ప్రధాని జాతీయపతాక ఆవిష్కరణ :
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశమంతటా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుండి 78వ స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. లోకల్ కోసం వోకల్ నినాదం స్వావలంబన మంత్రంగా మారింది. మనం అడుగులు వేసేటప్పుడు, భవిష్యత్ ప్రాణాలను సిద్ధం చేసుకునే ప్రతి ప్రయత్నం వెనుక ‘మేరా భారత్ మహాన్’ పదాలు ఆత్మగా ఉంటాయి. కోవిడ్ వంటి మహమ్మారి సమయంలో ఇతరులకు సాయం చేసేందుకు దేశ ప్రజలు ముందుకు రావడం మనం చూశాం. మన కరోనా వారియర్స్ అవసరమైన వారికి సేవ చేసిన విధానం, మన సైనికులు సర్జికల్ స్ట్రైక్స్ చేయడం చూశాం. ఇక మన వైమానిక దళం వైమానిక దాడులు చేయడం చూసినప్పుడు ప్రతి భారతీయుడు వారిని చూసి
**గర్వంగా తలలు పైకెత్తాం’’ అని మోదీ అన్నారు** స్వాతంత్య్ర సమరయోధులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. వారి త్యాగాలను స్మరించుకునే రోజు ఇది. 20వ శతాబ్దపు తొలి నాళ్లలో 40 కోట్ల మంది భారతీయులు ఒక్కతాటిపైకి వచ్చి దేశం నుంచి బ్రిటీష్ పాలనను తరిమికొట్టారు. అప్పుడు 40 కోట్ల మంది జనాభా ఉన్నారు. నేడు మనం 140 కోట్ల మంది జనాభా ఉన్నాం. 40 కోట్ల మంది ఆ నాడు కష్టమైన పనిని సాధించి చూపారు. నేడు 140 కోట్ల మంది మనం దేశాన్ని ముందుకు సాగించగలం. నాడు ఆ 40 కోట్ల మందిలో చాలా మంది స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం ప్రాణాలు అర్పించారు. నేడు 140 కోట్ల మంది దేశం కోసం బతకాలి. దేశాన్ని ముందుకు నడిపించాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశం కోసం ధైర్యంగా, కష్టపడి పనిచేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న మన సైనికులు, మన రైతులు, మన యువత అందరికీ నేను సెల్యూట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని విపత్తుల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుఃఖం, కష్ట కాలంలో దేశం అడుగడుగునా వారికి అండగా ఉంటుందని బాధిత కుటుంబాలకు నేను భరోసా ఇస్తున్నాను’’ అని అన్నారు. ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.



ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 6,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ఏడాది ఎర్రకోటలో జరిగే వేడుకలను చూసేందుకు యువకులు, గిరిజనులు, రైతులు, మహిళా వర్గాలతో పాటు ఇతర ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. అంతేకాదు వివిధ రంగాలకు చెందిన, వివిధ రంగాలలో రాణించిన వారిని వేడుకలకు ఆహ్వానించారు.
రైల్వేలో ఉద్యోగాలు... ఆగస్టు 16 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం!
రైల్వేలో ఉద్యోగాలు ఆగస్టు 16 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఆర్‌ఆర్‌సీ, నార్త్ రైల్వే ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కొనసాగనున్న అప్లికేషన్లు రూ.100 ఫీజుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.
ఉత్తర రైల్వే, ఆర్‌ఆర్‌సీ (రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్) వేర్వేరు విభాగాల్లో అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. వివిధ విభాగాలు, యూనిట్‌లు, వర్క్‌షాప్‌లలో కలిపి మొత్తం 4,096 అప్రెంటీస్‌ ఖాళీలు ఉన్నాయని వెల్లడించాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో తెలిపాయి.
కాగా ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మెరిట్ లిస్ట్‌కు ఎంపికైన వారికి సమాచారం అందిస్తారు. విద్యార్హత విషయానికి వస్తే.. ఐటీఐ లేదా ఎన్‌సీవీటీ సర్టిఫికెట్‌తో 10వ తరగతి ఉత్తీర్ణులైన ఉండాలి. వయోపరిమితి 2024 సెప్టెంబర్ 16 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయసు 24 ఏళ్లు మించి ఉండకూదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆర్ఆర్‌సీ, నార్త్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
**ఆగష్టు 15న సీతారామ ప్రాజక్టు 3 పంపులను ప్రారంభిస్తాము**
2026 ఆగష్టు 15 నాటికి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు ఖర్చు చేసి, లక్ష ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్లు, సీతారామ ప్రాజెక్టుకి రూ.7,436 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరకి కూడా నీరు ఇవ్వలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసారు. పదేళ్లు అధికారంలో ఉన్నా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటిపారుదల శాఖకు అధిక ప్రాధాన్యత కల్పించి నిధులు కేటాయించింది. కాంగ్రెస్ హయంలోనే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టు చేపట్టారు. 2 వేల కోట్లతో ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. కమిషన్ల కక్కుర్తి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టింది. రీడిజైన్ పేరుతో ప్రాజెక్టుల పేర్లు మార్చి, ఖర్చు నాలుగింతలు చేశారు. పాత ప్రాజెక్టులు పూర్తి చేస్తే కాంగ్రెస్ కి పేరు వస్తుందనే అలా చేశారు.
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.
**రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్ లలో వారానికి ఒకసారి ఎమ్మెల్యేలు, అధికారులు బసచేయాలి**.....**బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ **
రాష్ట్రంలోని సాంఘీక సంక్షేమ, గిరిజన,వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖల వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు మెరుగుపరచాలని బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం నియమించిన ప్రత్యేక అధికారులు,స్థానిక ఎమ్మెల్యే లు సంక్షేమ వసతి గృహాలను తరచుగా సందర్శించి వారానికి ఒకసారి అక్కడ బస చేసి అక్కడి ఇబ్బందులను,అవసరమైన వసతుల గురించి తెలుసుకోవాలని కోరారు.వసతి గృహాల నిర్వహణను మెరుగుపరచడంతోపాటు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. వసతి గృహాల విద్యార్థుల చదువులు మరింతగా మెరుగుపరచేందుకు అవసరమైన చోట ట్యూటర్లను ఏర్పాటు చేయాలని, చదువుల పట్ల విద్యార్థులకు శ్రద్ధ పెరిగేలా చూడాలని
బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ తెలిపారు.
**శ్రావణమాసం బోనాల సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ నందు *శ్రీ ముత్యాలమ్మ పరమేశ్వరి అమ్మవారి బోనాల**
ఈరోజు శ్రావణమాసం బోనాల సందర్భంగా అమ్మవారికి మహోత్సవంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరు ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు మంచిగా పంటలు పండాలని కోరుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..