/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత్ పాకిస్తాన్ వెళుతుందా? జైషా సమాధానమిదే? janardhanreddy vemula
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత్ పాకిస్తాన్ వెళుతుందా? జైషా సమాధానమిదే?
ICC ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది అంటే ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాకిస్థాన్‌ వేదికగా జరుగనుంది. ఈ ఐసీసీ ఈవెంట్‌లో పాల్గొనేందుకు టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే టీమ్ ఇండియాను పాకిస్థాన్ పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు ICC ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే ఏడాది అంటే ఫిబ్రవరి, మార్చి నెలల్లో పాకిస్థాన్‌ వేదికగా జరుగనుంది. ఈ ఐసీసీ ఈవెంట్‌లో పాల్గొనేందుకు టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే టీమ్ ఇండియాను పాకిస్థాన్ పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు టీమ్ ఇండియాను పాకిస్థాన్‌కు ఆహ్వానించే బాధ్యతను పీసీబీ, ఐసీసీ భుజాలకెత్తుకున్నాయి. దీంతో త్వరలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీపై క్రికెట్ ప్రేమికుల్లో ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే దీనిపై బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనే ప్రశ్నకు ‘దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. టోర్నీ దగ్గర పడ్డాక నిర్ణయం తీసుకుంటాం’ అని జైషా చెప్పుకొచ్చారు. ఐసిసికి పాకిస్తాన్ సమర్పించిన ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకారం, టోర్నమెంట్ ఫిబ్రవరి 19, 2025 నుండి మార్చి 9, 2025 వరకు జరగాల్సి ఉంది. కాగా, ఈ టోర్నీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మార్చి 1న జరగాల్సి ఉంది. కానీ పాకిస్థాన్ ఐసీసీకి సమర్పించిన ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్పటి వరకు ఆమోదించలేదు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఇందులో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. ఈ జట్లను 2 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్ , బంగ్లాదేశ్ ఉండగా.. రెండో గ్రూపులో ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఉన్నాయి.
ఢిల్లీలో హైఅలర్ట్.. ఎర్రకోటపై ప్రధాని జాతీయపతాక ఆవిష్కరణ :
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశమంతటా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట నుండి 78వ స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. లోకల్ కోసం వోకల్ నినాదం స్వావలంబన మంత్రంగా మారింది. మనం అడుగులు వేసేటప్పుడు, భవిష్యత్ ప్రాణాలను సిద్ధం చేసుకునే ప్రతి ప్రయత్నం వెనుక ‘మేరా భారత్ మహాన్’ పదాలు ఆత్మగా ఉంటాయి. కోవిడ్ వంటి మహమ్మారి సమయంలో ఇతరులకు సాయం చేసేందుకు దేశ ప్రజలు ముందుకు రావడం మనం చూశాం. మన కరోనా వారియర్స్ అవసరమైన వారికి సేవ చేసిన విధానం, మన సైనికులు సర్జికల్ స్ట్రైక్స్ చేయడం చూశాం. ఇక మన వైమానిక దళం వైమానిక దాడులు చేయడం చూసినప్పుడు ప్రతి భారతీయుడు వారిని చూసి
**గర్వంగా తలలు పైకెత్తాం’’ అని మోదీ అన్నారు** స్వాతంత్య్ర సమరయోధులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. వారి త్యాగాలను స్మరించుకునే రోజు ఇది. 20వ శతాబ్దపు తొలి నాళ్లలో 40 కోట్ల మంది భారతీయులు ఒక్కతాటిపైకి వచ్చి దేశం నుంచి బ్రిటీష్ పాలనను తరిమికొట్టారు. అప్పుడు 40 కోట్ల మంది జనాభా ఉన్నారు. నేడు మనం 140 కోట్ల మంది జనాభా ఉన్నాం. 40 కోట్ల మంది ఆ నాడు కష్టమైన పనిని సాధించి చూపారు. నేడు 140 కోట్ల మంది మనం దేశాన్ని ముందుకు సాగించగలం. నాడు ఆ 40 కోట్ల మందిలో చాలా మంది స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం ప్రాణాలు అర్పించారు. నేడు 140 కోట్ల మంది దేశం కోసం బతకాలి. దేశాన్ని ముందుకు నడిపించాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశం కోసం ధైర్యంగా, కష్టపడి పనిచేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్న మన సైనికులు, మన రైతులు, మన యువత అందరికీ నేను సెల్యూట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని విపత్తుల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుఃఖం, కష్ట కాలంలో దేశం అడుగడుగునా వారికి అండగా ఉంటుందని బాధిత కుటుంబాలకు నేను భరోసా ఇస్తున్నాను’’ అని అన్నారు. ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.



ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి సుమారు 6,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ఏడాది ఎర్రకోటలో జరిగే వేడుకలను చూసేందుకు యువకులు, గిరిజనులు, రైతులు, మహిళా వర్గాలతో పాటు ఇతర ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. అంతేకాదు వివిధ రంగాలకు చెందిన, వివిధ రంగాలలో రాణించిన వారిని వేడుకలకు ఆహ్వానించారు.
రైల్వేలో ఉద్యోగాలు... ఆగస్టు 16 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం!
రైల్వేలో ఉద్యోగాలు ఆగస్టు 16 నుంచి దరఖాస్తులకు ఆహ్వానం  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి ఆర్‌ఆర్‌సీ, నార్త్ రైల్వే ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కొనసాగనున్న అప్లికేషన్లు రూ.100 ఫీజుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం రైల్వేలో ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.
ఉత్తర రైల్వే, ఆర్‌ఆర్‌సీ (రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్) వేర్వేరు విభాగాల్లో అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. వివిధ విభాగాలు, యూనిట్‌లు, వర్క్‌షాప్‌లలో కలిపి మొత్తం 4,096 అప్రెంటీస్‌ ఖాళీలు ఉన్నాయని వెల్లడించాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో తెలిపాయి.
కాగా ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మెరిట్ లిస్ట్‌కు ఎంపికైన వారికి సమాచారం అందిస్తారు. విద్యార్హత విషయానికి వస్తే.. ఐటీఐ లేదా ఎన్‌సీవీటీ సర్టిఫికెట్‌తో 10వ తరగతి ఉత్తీర్ణులైన ఉండాలి. వయోపరిమితి 2024 సెప్టెంబర్ 16 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయసు 24 ఏళ్లు మించి ఉండకూదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆర్ఆర్‌సీ, నార్త్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
**ఆగష్టు 15న సీతారామ ప్రాజక్టు 3 పంపులను ప్రారంభిస్తాము**
2026 ఆగష్టు 15 నాటికి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్లు ఖర్చు చేసి, లక్ష ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్లు, సీతారామ ప్రాజెక్టుకి రూ.7,436 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరకి కూడా నీరు ఇవ్వలేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసారు. పదేళ్లు అధికారంలో ఉన్నా కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటిపారుదల శాఖకు అధిక ప్రాధాన్యత కల్పించి నిధులు కేటాయించింది. కాంగ్రెస్ హయంలోనే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టు చేపట్టారు. 2 వేల కోట్లతో ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. కమిషన్ల కక్కుర్తి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టింది. రీడిజైన్ పేరుతో ప్రాజెక్టుల పేర్లు మార్చి, ఖర్చు నాలుగింతలు చేశారు. పాత ప్రాజెక్టులు పూర్తి చేస్తే కాంగ్రెస్ కి పేరు వస్తుందనే అలా చేశారు.
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.
**రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్ లలో వారానికి ఒకసారి ఎమ్మెల్యేలు, అధికారులు బసచేయాలి**.....**బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ **
రాష్ట్రంలోని సాంఘీక సంక్షేమ, గిరిజన,వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖల వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు మెరుగుపరచాలని బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం నియమించిన ప్రత్యేక అధికారులు,స్థానిక ఎమ్మెల్యే లు సంక్షేమ వసతి గృహాలను తరచుగా సందర్శించి వారానికి ఒకసారి అక్కడ బస చేసి అక్కడి ఇబ్బందులను,అవసరమైన వసతుల గురించి తెలుసుకోవాలని కోరారు.వసతి గృహాల నిర్వహణను మెరుగుపరచడంతోపాటు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. వసతి గృహాల విద్యార్థుల చదువులు మరింతగా మెరుగుపరచేందుకు అవసరమైన చోట ట్యూటర్లను ఏర్పాటు చేయాలని, చదువుల పట్ల విద్యార్థులకు శ్రద్ధ పెరిగేలా చూడాలని
బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ తెలిపారు.
**శ్రావణమాసం బోనాల సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఈదులగూడ నందు *శ్రీ ముత్యాలమ్మ పరమేశ్వరి అమ్మవారి బోనాల**
ఈరోజు శ్రావణమాసం బోనాల సందర్భంగా అమ్మవారికి మహోత్సవంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరు ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు మంచిగా పంటలు పండాలని కోరుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..
**తెలంగాణలో మరో కొత్త రైలు మార్గం.. ఈ రూట్‌లోనే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది**
తెలంగాణలో మరో కొత్త రైలు మార్గం.. ఈ రూట్‌లోనే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది దేశంలో ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. కనెక్టివిటీని పెంచడం, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు చమురు దిగుమతులు, కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త రైల్వే ప్రాజెక్టులను తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.24,657 కోట్లు కాగా.. కేంద్ర ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో మల్కాన్‌గిరి - పాండురంగాపురం వయా భద్రాచలం మీదుగా 174 కిలోమీటర్ల నూతన రైల్వే మార్గం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రా తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది.. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయ తీసుకున్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఎనిమిది కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్‌లో మొత్తం రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుల్ని చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైన్‌ నిర్మించనున్ననారు. ఈ ప్రాజెక్టు రూ.4,109 కోట్లతో 200.60 కిలోమీటర్ల పొడవైన లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు. ప్రధానంగా మహానది కోల్‌ఫీల్డ్‌ నుంచి మధ్య, దక్షిణ భారతంలోని విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరఫరా మరింత సులభమవుతుందని.. అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకూ ప్రయోజనం కలుగుతుంది అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ విస్తృతం చేయొచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు మేలు జరుగుతుంది అంటున్నారు. ఈ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందంటున్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఉంటుందంటున్నారు. తెలంగాణ వార్తలు తెలంగాణ సినిమా వార్తలు లైఫ్‌స్టైల్ రాశి ఫలాలు ఒలింపిక్స్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ జాబ్స్ ఫోటో గ్యాలరీ వైరల్ సంక్షిప్త వార్తలు స్పోర్ట్స్ బిజినెస్ టీవీ ఆధ్యాత్మికం వీడియో గ్యాలరీ ఏది నిజం అనంత్ అంబానీ వెడ్డింగ్ ట్రావెల్ జోక్స్ వెబ్ తెలంగాణలో మరో కొత్త రైలు మార్గం.. ఈ రూట్‌లోనే, గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దేశంలో ఎనిమిది కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. కనెక్టివిటీని పెంచడం, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు చమురు దిగుమతులు, కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త రైల్వే ప్రాజెక్టులను తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.24,657 కోట్లు కాగా.. కేంద్ర ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల్లో మల్కాన్‌గిరి - పాండురంగాపురం వయా భద్రాచలం మీదుగా 174 కిలోమీటర్ల నూతన రైల్వే మార్గం ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒడిశా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మేలు.  తెలంగాణకు కేంద్రం నుంచి గుడ్‌న్యూస్ తెలంగాణలో కొత్త రైలు మార్గానికి గ్రీన్ సి తెలంగాణకు కేంద్రం శుభవార్త చెప్పింది.. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయ తీసుకున్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఎనిమిది కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్‌లో మొత్తం రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుల్ని చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైన్‌ నిర్మించనున్ననారు. ఈ ప్రాజెక్టు రూ.4,109 కోట్లతో 200.60 కిలోమీటర్ల పొడవైన లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు. ప్రధానంగా మహానది కోల్‌ఫీల్డ్‌ నుంచి మధ్య, దక్షిణ భారతంలోని విద్యుత్తు ప్లాంట్లకు బొగ్గు సరఫరా మరింత సులభమవుతుందని.. అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకూ ప్రయోజనం కలుగుతుంది అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌ విస్తృతం చేయొచ్చని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, తెలంగాణలోని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు మేలు జరుగుతుంది అంటున్నారు. ఈ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతుందంటున్నారు. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు అనుసంధానం ఉంటుందంటున్నారు. ఈ కొత్త మార్గం ద్వారా ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీర ప్రాంతానికి వెళ్లేందుకు వీలుంటుంది. దక్షిణ ఒడిశా, బస్తర్‌ ప్రాంతం నుంచి దక్షిణాదికి దూరం (124 కిలోమీటర్లు) తగ్గుతుంది. ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి 1,697 హెక్టార్ల భూమి సేకరించాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. కేంద్ర ఆమోదించిన ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా ఏడు రాష్ట్రాల్లో 900 కిలోమీటర్ల కొత్త లైన్లు అందుబాటులోకి వస్తున్నాయి. మొత్తం 64 కొత్త రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు.. 510 గ్రామాలు, 14 జిల్లాల మీదుగా సాగే ఈ లైన్ల కారణంగా రెండు కోట్ల మందికి రైల్వే అనుసంధానత పెరుగుతుంది అంటున్నారు. ఈ కొత్త మార్గం ద్వారా ఏటా 140 మిలియన్‌ టన్నుల సరకులను అదనంగా రవాణా చేయొచ్చు. ఈ ప్రాజెక్టుల్ని ఐదేళ్లలోనే వీటిని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం. ఈ లైన్లు అందుబాటులోకి వచ్చాక 32.20 కోట్ల లీటర్ల చమురు దిగుమతి తగ్గడంతో పాటు 0.87 మిలియన్‌ టన్నుల గ్రీన్ హౌస్ గ్యాస్‌లు తగ్గుతాయి. అది 3.5 కోట్ల చెట్లు నాటడంతో సమానం అని చెబుతున్నారు. మొత్తం మీద కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ కొత్త రైల్వే ప్రాజెక్టుతో తెలంగాణకు ప్రయోజనం చేకూరనుంది.
**బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 62 మంది మృతి భయానక దృశ్యాలు**
58 మంది ప్రయాణికులు.నలుగురు క్యాబిన్ సిబ్బందితో వెళ్తోన్న ఓ విమానం గమ్య స్థానానికి ఓ 40 నిమిషాల్లో చేరుకుంటుందనగా.. 80 కి.మీ. దూరంలో ఉండగా ఒక్కసారి ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో విమానంలో ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయారు. నివాస సముదాయాల మధ్య కూలిపోయిన విమానంలో మంటలు చెలరేగి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్‌ (Brazil)లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 58 మంది ప్రయాణికులు సహా 62 మంది ప్రాణాలు కోల్పోయారు.
సావో పాలోలోని విన్‌హెడోలో ప్రయాణికులతో వెళ్తున్న వియోపాస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన టుర్బోరోప్ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విమానం సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన విమానం గింగిరాలు తిరుగుతూ నివాస సముదాయాలకు దగ్గర చెట్ల మధ్యన కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే మంటల వ్యాపించి ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్‌ (Brazil)లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 58 మంది ప్రయాణికులు సహా 62 మంది ప్రాణాలు కోల్పోయారు. సావో పాలోలోని విన్‌హెడోలో ప్రయాణికులతో వెళ్తున్న వియోపాస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన టుర్బోరోప్ విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విమానం సావో పాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన విమానం గింగిరాలు తిరుగుతూ నివాస సముదాయాలకు దగ్గర చెట్ల మధ్యన కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే మంటల వ్యాపించి ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
*విజయవంతంగా సాగిన 5వ రోజు స్వచ్చధనం- పచ్చదనం కార్యక్రమం...MLA-BLR*
ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో 5వ రోజు పలు చోట్ల నిర్వహించిన స్వచ్చధనం- పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*. మిర్యాలగూడ పట్టణంలోని *బక్కల్వాడి ఉన్నత పాఠశాలలో* ఫారెస్ట్ రేంజ్ అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది.. అనంతరం మిర్యాలగూడ మండలం *వెంకటాద్రి పాలెం గ్రామంలో* ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటి ఇంకుడు గుంతలు తీయడం జరిగింది .. అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి *గౌ ,, శ్రీ రేవంత్ రెడ్డి గారు* ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐదు రోజుల *స్వచ్చధనం- పచ్చదనం* కార్యక్రమం విజయవంతం గా పూర్తి చేసిన అధికారులకు , ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.. ఈ కార్యక్రమం కేవలం ఈ ఐదు రోజులు మాత్రమే కాకుండా నిరంతరం కొనసాగాలని ప్రతిఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా స్వీకరించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో MPdo గారు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. *నేను నా మిర్యాలగూడ* కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ !
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా *రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మిర్యాలగూడ* వారి ఆధ్వర్యంలో 25 వేల మొక్కల పెంపకం కార్యక్రమంలో భాగంగా *శ్రీ వెంకట రమణ రైస్ మిల్స్* ఆధ్వర్యంలో *250 మొక్కలు నాటి* కార్యక్రమం ప్రారంభించడం జరిగింది... ఈ సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* మాట్లాడుతూ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ప్రతి రైస్ మిల్ ఆధ్వర్యంలో 250 మొక్కలను నాటుతామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నేను నా మిర్యాలగూడ పర్యావరణ పరిరక్షణలో వారు కూడా భాగస్వామ్యులు అవుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.. అలాగే మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా వ్యాపార వాణిజ్య సంఘాల వారు, విద్యావంతులు మేధావులు ప్రతిఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతూ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రకృతి వనంగా తీర్చి దిద్దాలి అని అన్నారు.. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..