/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ఉప్పు, చక్కెరలో ప్లాస్టిక్‌ భూతం.. Miryala Kiran Kumar
ఉప్పు, చక్కెరలో ప్లాస్టిక్‌ భూతం..

Plastic: ఉప్పు, చక్కెరలో ప్లాస్టిక్‌ భూతం

దేశంలోని అన్ని కంపెనీల ఉత్పత్తుల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్‌

సైజు 0.1 మి.మీ. నుంచి 5 మి.మీ.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

‘టాక్సిక్స్‌ లింక్‌’ అధ్యయనంలో వెల్లడి

దిల్లీ: దేశంలో విక్రయిస్తున్న ఉప్పు, చక్కెరలో ప్రమాదకర మైక్రో ప్లాస్టిక్స్‌ (ప్లాస్టిక్‌ రేణువులు) ఉన్నట్లు తేలింది. ఇందుకు ఏ బ్రాండూ మినహాయింపు కాదని వెల్లడైంది. బ్రాండ్లే కాదు.. అన్‌ బ్రాండెడ్‌ ఉప్పు, చక్కెరలోనూ మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నాయి. ‘పెద్ద బ్రాండ్‌.. చిన్న బ్రాండ్‌ అనే కాదు. అన్‌ బ్రాండెడ్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్యాకేజ్డ్, అన్‌ ప్యాకేజ్డ్‌లోనూ మైక్రో ప్లాస్టిక్స్‌ ఉనికి ఉంది’ అని ‘టాక్సిక్స్‌ లింక్‌’ అనే పర్యావరణ పరిశోధన సంస్థ ‘మైక్రో ప్లాస్టిక్స్‌ ఇన్‌ సాల్ట్‌ అండ్‌ షుగర్‌’ అనే పేరుతో జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. 10 రకాల ఉప్పులను, 5 రకాల చక్కెరలను తీసుకుని ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఆ వివరాలను మంగళవారం వెల్లడించింది. సంస్థ అధ్యయనం చేసిన వాటిలో టేబుల్, రాక్, సముద్ర, స్థానిక ముడి ఉప్పులున్నాయి. 

ఉప్పు, చక్కెరల్లో వివిధ రూపాల్లో మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నాయి. అవి ఫైబర్, పెల్లెట్స్, ఫిల్మ్స్, ఫ్రాగ్మెంట్స్‌ రూపంలో కనిపించాయి.

ఈ మైక్రో ప్లాస్టిక్స్‌ సైజు 0.1 మిల్లీమీటర్ల నుంచి 5 మిల్లీమీటర్ల వరకూ ఉన్నాయి.

అయోడైజ్డ్‌ ఉప్పులో అత్యధిక స్థాయిలో మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నాయి. అవి బహుళ రంగుల పల్చటి ఫైబర్, ఫిల్మ్స్‌ రూపంలో కనిపించాయి.

భారతీయుల్లో వినియోగం అధికం

భారతీయులు సగటున రోజుకు 10.98 గ్రాముల ఉప్పును తీసుకుంటారని గతంలో నిర్వహించిన సర్వేల్లో వెల్లడైంది. 10 చెంచాల చక్కెరను తీసుకుంటారని తేలింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే చాలా ఎక్కువ. మైక్రో ప్లాస్టిక్స్‌ ఆరోగ్యానికి, పర్యావరణానికి తీవ్ర నష్టం కలగజేస్తున్నాయి. ఇవి మానవ శరీరంలోకి ఆహారం, నీరు, గాలిద్వారా ప్రవేశిస్తాయి. ఊపిరితిత్తులు, గుండెతోపాటు తల్లి పాలు, గర్భస్థ శిశువుల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనలో తేలింది. 

నిర్దిష్ట చర్యల కోసమే: టాక్సిక్స్‌ లింక్‌

మైక్రో ప్లాస్టిక్స్‌పై శాస్త్రీయ డేటాబేస్‌కు మరింత సమాచారం జోడించడానికే తాము అధ్యయనం చేశామని టాక్సిక్స్‌ లింక్‌ ఫౌండర్‌-డైరెక్టర్‌ రవి అగర్వాల్‌ తెలిపారు. దీనిద్వారా అంతర్జాతీయంగా మైక్రో ప్లాస్టిక్స్‌పై పోరాటంలో నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు. ‘ఉప్పు, చక్కెరల్లో అధిక మైక్రో ప్లాస్టిక్స్‌ ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇది ఆరోగ్యంపై చూపే ప్రభావాలను అత్యవసరంగా, సమగ్రంగా పరిశోధించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది’ అని టాక్సిక్స్‌ లింక్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ సతీశ్‌ సిన్హా పేర్కొన్నారు.

కేజీ ఉప్పులో 89.15 వరకూ.. 

ఒక కేజీ ఉప్పులో 6.91 నుంచి 89.15 వరకు మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. 

• ఇళ్లలో విరివిగా ఉపయోగించే అయోడైజ్డ్‌ ఉప్పులోనే ఇవి ఎక్కువ సంఖ్యలో (89.15) ఉండటం గమనార్హం. 

ఆర్గానిక్‌ రాక్‌ సాల్ట్‌లో అతి తక్కువగా 6.7 మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నాయి. 

చక్కెరలో 68.25 వరకూ..

కేజీ పంచదారలో 11.85 నుంచి 68.25 మైక్రో ప్లాస్టిక్స్‌ ఉన్నట్లు తేలింది. 

ఆర్గానికేతర చక్కెరలోనే ఇవి అధికంగా ఉన్నట్లు వెల్లడైంది.

TS: రోగులకు ఉచితంగా హార్ట్‌ వాల్వులు పంపిణీ...త్వరలో హార్ట్‌ వాల్వ్‌ బ్యాంకును ప్రారంభించనున్న వైద్య మంత్రి

సహజసిద్ధమైన గుండె కవాటాలను అందించడమే లక్ష్యం

పేద రోగులకు ఉచితంగా హార్ట్‌ వాల్వులు పంపిణీ

త్వరలో హార్ట్‌ వాల్వ్‌ బ్యాంకును ప్రారంభించనున్న వైద్య మంత్రి

లక్డీకాపూల్‌: గుండెకు మరింత భరో సా కల్పించే దిశగా నిజామ్స్‌ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్‌) అడుగులు వేస్తోంది. గుండె సమస్యలతో బాధపడుతున్న పేద రోగుల్లో అవసరమైన వారికి ఉచితంగా గుండె కవాటా(హార్ట్‌ వాల్వ్‌)లను అందించేందుకు నిమ్స్‌ సమాయత్తమైంది. ప్రస్తుతం ఆస్పత్రిలో గుండె సిరలు దెబ్బతిన్న వారికి కృత్రిమంగా తయారు చేసిన వాటిని అమరుస్తున్నారు. 

JOY_Kareena_Subtitles

ఖర్చుతో కూడుకున్న ఈ వాల్వ్‌ల మార్పిడి ఆపరేషన్‌ నిరుపేదలకు పెనుభారంగా తయారైంది. దీంతో పేదలకు ఉచితంగా అందించేందుకు ఆస్పత్రిలో ప్రత్యేకంగా హార్ట్‌ వాల్వ్‌ బ్యాంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో స్థల పరిశీలన జరుగుతోంది. త్వరలోనే హార్ట్‌ వాల్వ్‌ బ్యాంక్‌ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో ప్రారంభించాలని భావిస్తున్నారు.  

బ్రెయిన్‌ డెడ్‌ అయిన వాళ్ల నుంచి సేకరణ..

బ్రెయిన్‌ డెడ్‌కు గురైన వాళ్ల నుంచి అవ యవాలను నిమ్స్‌ సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మృతుని కుటుంబసభ్యుల అంగీకారంతో కిడ్నీ లు, కాలేయం, కళ్లు, గుండె తదితర కీలక అవయవాలను సేకరిస్తోంది. అదే విధంగా బ్రెయిన్‌ డెత్‌కు గురైన వాళ్ల నుంచి గుండె కవాటాలను కూడా సేకరించి.. వాటిని భద్రపర్చేందుకు ప్రత్యేక విభాగాన్ని(హార్ట్‌ బ్యాంక్‌) ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. 

ఈ బ్యాంకులో భద్రపరిచిన కవాటాలను పూర్తిగా ఉచితంగా అందించడంతో నిమ్స్‌కు వచ్చే రోగులు చాలా తక్కువ ఖర్చుతోనే శస్త్ర చికిత్సలు చేయించుకోవచ్చని నిమ్స్‌ అసిస్టెంట్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాకేశ్‌ తెలిపారు.

నల్లగొండ; బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం...

బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణకాండ కు నిరసనగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని రామగిరి రామాలయం దేవాలయం నుండి నల్గొండ నడిబొడ్డున ఉన్నటువంటి గడియారం సెంటర్ వరకు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్ గారు పాల్గొని మాట్లాడుతూ గత వారం రోజులు హిందువులపై జరుగుతున్న మారణకాండ హిందూ ఆడపడుచుల మానప్రాణాలతో ఆర్చిలగాటమాడుతున్నటువంటి రోహింగ్ ముస్లింలు పైన బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బంగ్లాదేశ్ హిందువులకి మద్దతుగా నిలవాలని, అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి ఈ దేశానికి వలస వచ్చినటువంటి రోహింగ్యాలని ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ వెలికి తీసి వారి స్వదేశానికి తరిమేయాలని తెలియజేశారు. ఒకవేళ వారిపై తగ్గిన చర్యలు తీసుకోకుండా ఉన్నట్టయితే భవిష్యత్తులో హిందువులపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా హిందూ మహిళలపై ఏవైనా సంఘటనలు జరుగుతే జరగబోయే ఉద్యమాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సింది ఉంటుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొత్త లింగ స్వామి యాదవ్, యాదమ్మ, వెంకన్న, సురేష్. రాజు. జైశ్రీరామ్ తరుణ్, సాయి, మరియు రాష్ట్రీయ శ్రీరాంసేన కార్యకర్తలు మరియు ఇందు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల.. రెస్పాన్స్‌ షీట్ల కోసం క్లిక్‌ చేయండి..

తెలంగాణ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల.. రెస్పాన్స్‌ షీట్ల కోసం క్లిక్‌ చేయండి

హైదరాబాద్‌: తెలంగాణలో టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్‌, సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా కీ, రెస్పాన్స్‌షీట్లను పాఠశాల విద్యాశాఖ అధికారులు తమ అధికారిక 

లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు కీపై అభ్యంతరాలను ఆగస్టు 20వరకు తెలపవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 2,45,263 మంది హాజరయ్యారు.

http://tgdsc.aptonline.in/tgdsc/

యువత గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలి.. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా వాల్ పోస్టర్ల ఆవిష్కరణ..

యువత గంజాయి డ్రగ్స్ కు దూరంగా ఉండాలి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత గంజాయి డ్రగ్స్ మహమ్మారి బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు అన్నారు. తమకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలన్నారు. గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడం లక్ష్యమన్నారు దీనికి అందరూ సహకరించాలన్నారు గంజాయి కి సంబంధించినటువంటి సమాచారమైన 87126 70266 నెంబర్ కు సమాచారం అందించాలన్నారు.ఈ సందర్భంగా యువత విద్యార్థులను చైతన్యం చేస్తున్న డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ని అభినందించారు.భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దానికి జిల్లా యంత్రాంగం తరపున ఎల్లప్పుడూ సహకారం ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్ ఖమ్మం పాటీ శంకర్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కో కన్వీనర్ కుంచం కావ్యఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు రమావత్ లక్ష్మణ్ నాయక్ బుడిగ వెంకటేష్ స్పందన పావని సంపత్ నవదీప్ తదితరులు పాల్గొన్నారు.

TS: ముదిరాజ్ జె ఏ సీ మత్స్యకారుల రాష్ర్ట అధ్యక్షులుగా లోకనబోయిన రమణ ముదిరాజ్

తెలంగాణ ముదిరాజ్ జె ఏ సీ మత్స్యకారుల రాష్ర్ట అధ్యక్షులుగా లోకనబోయిన రమణ ముదిరాజ్

*తెలంగాణ ముదిరాజ్ జెఏసి అధ్యక్షులు పోల్కం లక్ష్మీనారాయణ ముదిరాజ్ ఈ రోజూ జేఏసీ తరపున పలు నియామకాలు చేశారు ,

అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జేఏసీ మత్స్యకారుల విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా లోకనబోయిన రమణ ముదిరాజ్, జేఏసీ మెదక్ జిల్లా అధ్యక్షునిగా బండి గోపాలకృష్ణ ముదిరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా చింతల దశరథ ముదిరాజ్ & జింకల కృష్ణ ముదిరాజ్ లను నియమించడం జరిగింది,

 ఇట్టి కార్యక్రమంలో ముదిరాజ్ జేఏసీ మహిళా రాష్ర్ట అధ్యక్షురాలు పుష్పలత ముదిరాజ్, జేఏసీ జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ ముదిరాజ్, జేఏసీ సభ్యులు బోయిని నరేష్ ముదిరాజ్, రెడ్ల గణేష్ ముదిరాజ్, పిట్ల ఉదయ్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, ఇప్ప కనకయ్య ముదిరాజ్, మరియు తెలంగాణ ముదిరాజ్ సమాజ్ అధ్యక్షులు దారం యువరాజు ముదిరాజ్ పాల్గొన్నారు.

నల్లగొండ: మండల మహిళా సమాఖ్య లో పనిచేస్తున్న అటెండర్స్ అందరికీ కనీస వేసిన 18వేలు అమలు చేయవలసిందిగా డిఆర్ డిఓ పిడి శేఖర్ రెడ్డికి వినతి పత్రం..

 మండల మహిళా సమైక్య అటెండర్స్ కు వేతనాలు పెంచాలి. 

   సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ

     

      మండల మహిళా సమైక్య లో అటెండర్స్ గా పనిచేస్తున్న వారందరికీ కనీస వేతనం 18వేలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

     మండల మహిళా సమైక్యలో పనిచేస్తున్న అటెండర్స్ కు వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డి ఆర్ డి ఓ పిడి శేఖర్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చారు . ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మండల మహిళ సమైక్యాలు ఏర్పడిన నాటి నుండి కొంతమంది,20 సంవత్సరాలుగా కొంతమంది తక్కువ వేతనాలతో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నారని అన్నారు. జిల్లాలో అటెండర్స్ కి 2వేలు నుండి 6వేలు వరకు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలతో ఈ వేతనాలు సరిపోక వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

       ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్న వీరికి గుర్తింపు కార్డులు, పిఎఫ్ ,ఈఎస్ఐ, ప్రమాద బీమా యూనిఫాం క్యాజువల్ సెలవులు అమలు కావడం లేదని కనీసం ఉద్యోగ భద్రత కూడా లేని పరిస్థితి దాపురించిందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే వీళ్ళ వేతనాలు పెంచే విధంగా ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనియెడల అటెండర్స్ అందరూ పోరాటాలకు సిద్ధమవుతారని హెచ్చరించారు. 

      ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పులకరం నారాయణ, జిల్లా నాయకులు ఉల్లెందుల సైదులు, సైదమ్మ, నాగమ్మ, ఎల్లమ్మ, కమలమ్మ,సరిత, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

TS: సెలబ్రిటీల జ్యోతిష్యం చెబుతూ నిత్యం వార్తలలో నిలిచే వేణు స్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ..

HYD : వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్‌ నోటీసులు. ఈనెల 22న మహిళా కమిషన్‌ ముందు హాజరుకావాలని ఆదేశం. నాగచైతన్య, శోభిత విడిపోతారంటూ వేణుస్వామి వ్యాఖ్యలపై నోటీసులు. తన భర్తకు సపోర్ట్ చేస్తూ వీడియో రిలీజ్‌ చేసిన వేణుస్వామి భార్య వాణి. మీడియాపై వేణుస్వామి భార్య వాణి ఆగ్రహం.

బ్రేకింగ్ న్యూస్: TS:రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ అరెస్ట్‌..

రంగారెడ్డి జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ అరెస్ట్‌

భూపాల్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు

ధరణిలో మార్పులకు రూ.8 లక్షలు డిమాండ్‌

లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ

అడిషనల్‌ కలెక్టర్‌ భూపాల్‌రెడ్డితో పాటు..

సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌మోహన్‌ అరెస్ట్‌

భూపాల్‌రెడ్డి నివాసంలో రూ.16 లక్షలు సీజ్‌

Ts: సర్పంచి ఎన్నికలు త్వరగా పూర్తి చేయండి: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ

సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి

వీలైనంత త్వరగా పూర్తి చేయండి

రాష్ట్రానికి లేఖ రాసిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ

గ్రాంట్ల రిలీజ్ చిక్కులతో అడ్వయిజరీ జారీ

కసరత్తు మొదలు పెట్టిన రాష్ట్ర అధికారులు

పంద్రాగస్టు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ఆ తర్వాతే స్థానిక సమరంపై మరింత క్లారిటీ

రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ లేఖ రాసింది. రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తున్నందున కేంద్రం నుంచి నిధులు విడుదల కావాలంటే ఎన్నికైన స్థానిక పాలనా వ్యవస్థ ఉండడం అనివార్యం కావడంతో కేంద్రం ఈ లేఖ రాసినట్టు రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి సర్పంచ్ తో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఒకే సారి నిర్వ హించాలని తొలుత రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరోవైపు బీసీ రిజర్వేషన్ చిక్కు లున్నందున రాష్ట్ర బీసీ కమిషన్, పంచాయ తీరాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో ఇప్పటికే సీఎం సుదీర్ఘ రివ్యూ నిర్వహించారు. ఆ మూడు విభాగాల అధికారులకు వర్క్ డివిజన్ చేసి వీలైనంత తొందరగా ఎన్నికల నిర్వహణపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇక సీఎం విదేశీ టూర్ ముగించుకుని వచ్చిన తర్వాత దీనిపై సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉన్నది.