/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz **హైదరాబాద్‌కు మహర్దశ..**ఎంట్రీ ఇస్తోన్న మరో ఇంటర్నేషన్ కంపెనీ! janardhanreddy vemula
**హైదరాబాద్‌కు మహర్దశ..**ఎంట్రీ ఇస్తోన్న మరో ఇంటర్నేషన్ కంపెనీ!
టెక్నాలజీ, సర్వీస్ సొల్యూషన్స్ లో పేరొందిన ఆర్సీసియం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అమెరికాలో పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం ఆర్సీసియం సీఈవో గౌరవ్ సూరి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆర్సీసియం మొదటిసారిగా హైదరాబాద్ లో తమ ఆఫీసును విస్తరించనుంది. అమెరికా తర్వాత విదేశాల్లో కంపెనీ పెట్టడం ఇదే మొదటి సారి. ప్రపంచ వ్యాప్తంగా తమ సేవల విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది. డీఈ షా గ్రూప్, బ్లాక్‌స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ మద్దతుతో ఆర్సెసియం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. బ్యాంకులు, హెడ్జ్ ఫండ్‌లు, సంస్థాగత ఆస్తుల నిర్వాహకులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డేటాతో పాటు కార్యకలాపాలపై ఈ కంపెనీ విశ్లేషణలు అందిస్తుంది. ప్రత్యేకంగా డేటా మేనేజ్మెంట్, డేటా స్ట్రాటజీలో ఈ కంపెనీకి గుర్తింపు ఉంది. హైదరాబాద్ ఆఫీసు విస్తరణతో రాష్ట్రంలో మరింత మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గ్లోబల్ టెక్ కంపెనీలకు ప్రధాన గమ్య స్థానంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షించనుంది. ఐటీ రంగంలో బహుముఖ వృద్ధిని సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో స్పష్టం చేశారు.
కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుందని ప్రకటించారు.
ఈ కంపెనీ విస్తరణ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సురెన్స్ రంగంలో హైదరాబాద్ పే కొత్త ఆవిష్కరణ కేంద్రంగా నిలబెడుతుందని అన్నారు. సాంకేతిక వృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సహకారం తప్పనిసరిగా ఉండాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు. ఆర్సీసియం లాంటి కంపెనీలకు తగినంత మద్దతు పాటు మౌలిక సదుపాయాలను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుందని అన్నారు. మౌలిక సదుపాయాలతో పాటు నైపుణ్యమున్న మానవ వనరులుండటంతో హైదరాబాద్ ను తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్లు కంపెనీ సీఈవో గౌరవ్ సూరీ తెలిపారు.
*ఈరోజు ప్రో . జయశంకర్ సార్ గారి ఆత్మ శాంతిస్తుంది అని భావిస్తున్నాము ...MLA -BLR*
ఈరోజు మన తెలంగాణ పితామహుడు , *ఆచార్య జయశంకర్ సార్ గారి* జయంతి సందర్భంగా మన మిర్యాలగూడ పట్టణంలో మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి-BLR గారు* మరియు *మిర్యాలగూడ కార్పెంటర్స్ యూనియన్* ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని విగ్రహం ప్రారంభించిన *MLA బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నిరంతరం పోరాడి ఆజన్మ బ్రహ్మచారి గా ఉండిపోయి తన జీవితం ఉద్యమానికి తెలంగాణ భవిషత్తు కోసం అంకితం చేసిన మహనీయుని విగ్రహం వారి జయంతి సందర్భంగా ఆవిష్కరణ చేయడం చాలా గర్వంగా ఉంది అని అన్నారు.. అలాగే గత BRS ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో తెలంగాణ కోసం పోరాడిన మన రాష్ట్ర జాతి పిత విగ్రహ ఏర్పాటు చేయకపోవడం చాలా బాధా కరం . కానీ మేము ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేసుకుంటే మమ్ములను ఏర్పాటు చేయనివ్వకుండా అడ్డుకున్నారు .కానీ కాలం సమాధానం చెప్తుంది అనడానికి ఇదే నిదర్శనం ఆ మహనీయుడు జయశంకర్ సార్ గారే ఈ రోజు మాతో ఇలా విగ్రహ ప్రతిష్టాపన చేయిస్తున్నారు అని మేము భావిస్తున్నాము అని అన్నారు. ఆరోజు వొద్దు అని అడ్డుకున్న నాయకులతోనే ఈరోజు విగ్రహానికి దండ వేయించాము.
ఈరోజు వారి ఆత్మ శాంతిస్తుంది అని అన్నారు. రాజకీయాలు అనేవి సామాజిక బాధ్యతగా ఉండాలి కాని రాజరికంగా చేస్తే కాలం ఇలాగే సమాధానం చెప్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్స్ యూనియన్ వారు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు...
**ధోని శిష్యుడితో పాటు కేఎల్ రాహుల్‌పై వేటు.. జట్టులోకి ధనాధన్ కుర్రాళ్లు**
మూడో వన్డేకి భారత తుదిజట్టు ఇదే.శ్రీలంకతో వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ బుధవారం జరగనుంది. మొదటి వన్డే టై కాగా, రెండో మ్యాచ్‌లో శ్రీలంక గెలిచింది. చివరి మ్యాచ్ గెలిచి సిరీస్ డ్రా చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తుండగా, ఆతిథ్య జట్టు కూడా గెలుపే లక్ష్యంగా గేమ్ ప్లాన్ రెడీ చేసుకుంటోంది.
1997 తర్వాత శ్రీలంక, భారత్‌పై వన్డే సిరీస్ గెలవలేదు. ఇప్పుడు ఆ లోటు పూడ్చుకునే అవకాశం వారికి దక్కింది. అయితే మూడో మ్యాచ్‌లో ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరెవరు ఉండే అవకాశం ఉందో చూద్దాం. ఓపెనింగ్‌, టాప్ ఆర్డర్ టీమ్ ఇండియా కెప్టెన్, ఓపెనర్‌ రోహిత్ శర్మ రెండు మ్యాచ్‌ల్లోనూ దూకుడుగా ఆడాడు. పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీలు బాదాడు. కానీ ఈ ఆరంభాన్ని టీమ్ ఇండియా సరిగా ఉపయోగించుకోలేదు. మిగతా బ్యాటర్లు ఫెయిల్ అవ్వడంతో తక్కువ స్కోర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే, భారత మిడిల్ ఆర్డర్ మొత్తం తడబడింది. విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శివమ్ దూబే అందరూ నిరాశపరిచారు. అయితే మూడో వన్డేలో కోహ్లి, అయ్యర్‌ ఇద్దరూ తుది జట్టులో ఉండవచ్చు. కానీ రాహుల్, దూబేను రీప్లేస్ చేసే అవకాశం ఉంది. మొదటి వన్డేలో రాహుల్ 31 పరుగులు చేసినా, టీమ్‌ను గెలిపించలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో డక్‌ ఔట్ అయ్యాడు. శివమ్ దూబే స్పిన్నర్లపై బాగా ఆడతాడనే అంచనాలు ఉన్నా, అతడు అంచనాలకు తగ్గట్లు రాణించలేదు. మొదటి వన్డేలో దూబే 25 పరుగులు చేశాడు, కానీ రెండో వన్డేలో డక్ ఔట్ అయ్యాడు. గంభీర్, రోహిత్ జట్టు కూర్పు మార్చాలనుకుంటే. రాహుల్, దూబేలకు బ్యాకప్ ఆప్షన్స్‌గా ఉన్న రిషబ్ పంత్, రియాన్ పరాగ్‌ను ఫైనల్ ఎలెవన్‌లోకి తీసుకోవచ్చు. పరాగ్‌కు ప్లస్ రియాన్ పరాగ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. టీ20 సిరీస్‌లో అతడి బౌలింగ్ స్కిల్స్‌ బయటపెట్టాడు. శ్రీలంక వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతున్నాయి. ఇక్కడి స్లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అందుకే రెండో వన్డేలో శ్రీలంక కేవలం ఒకే ఒక్క పేసర్‌ అసిత ఫెర్నాండోతో ఆడింది. భారత్ కూడా ఇదే గేమ్ ప్లాన్ ఫాలో కావచ్చు. టీమ్ ఇండియా ఇప్పటికే ముగ్గురు స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌తో ఆడుతోంది. వీరికి పరాగ్‌ తోడైతే, లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ను ఎదుర్కొనే అవకాశాలు పెరుగుతాయి. అందుకే దూబే ప్లేస్‌లో రియాన్ పరాగ్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. రాహుల్‌ను తీసేస్తారా? రెండు వన్డేల్లో టీమ్ ఇండియా బ్యాటర్లు దూకుడుగా ఆడలేదు. అందుకే అగ్రెసివ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు చివరి మ్యాచ్‌లో అవకాశం రావచ్చు. కానీ రాహుల్‌ను తప్పించడం తప్పుడు నిర్ణయమే అవుతుంది. ఎందుకంటే గత ఏడాది అతడు 66.25 యావరేజ్, 87.74 స్ట్రైక్ రేట్‌తో 1060 రన్స్ సాధించాడు. ఐదో స్థానంలో ఆడే ఈ కర్ణాటక బ్యాటర్ నిలబడితే, మ్యాచ్‌ను ఈజీగా గెలిపించగలడు. అంతేకాదు, రాహుల్ స్పిన్ బౌలింగ్‌లో చాలా బాగా ఆడతాడు.
అందుకే మూడో వన్డేల్లో పంత్ లేదా రాహుల్ ఇద్దరిలో ఎవర్ని ఆడించాలనేది డిసైడ్ అవ్వడం గంభీర్, రోహిత్‌కు కష్టంగా మారనుంది.
**నల్గొండ బిడ్డ సత్తా..** ఒకేసారి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక!
సర్కార్ కొలువు సాధించాలనేది ఎందరికో కల
డిగ్రీ పట్టాలు చేతికి వచ్చినప్పటి నుంచి కోచింగ్‌లు తీసుకుంటూ యువత ఉద్యోగ సాధనలో ముగినిపోతుంటారు. ఎంత కష్టపడినా.. కొలువు కొందరినే వరిస్తుంది. అయితే తాజాగా రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. నల్గొండకు చెందిన చింతల తులసి రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పలు నియామక పరీక్షల్లో సత్తాచాటి నాలుగు ఉద్యోగాలు.. సర్కార్ కొలువు సాధించాలనేది ఎందరికో కల. డిగ్రీ పట్టాలు చేతికి వచ్చినప్పటి నుంచి కోచింగ్‌లు తీసుకుంటూ యువత ఉద్యోగ సాధనలో ముగినిపోతుంటారు. ఎంత కష్టపడినా.. కొలువు కొందరినే వరిస్తుంది. అయితే తాజాగా రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. నల్గొండకు చెందిన చింతల తులసి రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పలు నియామక పరీక్షల్లో సత్తాచాటి నాలుగు ఉద్యోగాలు సాధించింది. ఇది వరకే ఆమె గ్రూప్‌-4, పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ కొలువులు సాధించిన తులసి.. ఏప్రిల్‌ 24న ఏఈ, ఆగస్టు 2న ఏఈఈ ఉద్యోగాలకు సైతం ఎంపికైంది. చింతల వెంకన్న, లక్ష్మి దంపతుల మూడో సంతానం తులసి. స్వగ్రామలో ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించిన తులసి, జేఎన్‌టీయూహెచ్‌లో బీటెక్, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్‌ పూర్తిచేసింది. అనంతరం ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా రెండేళ్లుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఉంది. ఈ క్రమంలో టీజీపీఎస్సీ గ్రూప్‌-4, పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ ఉద్యోగాలు సాధించింది. అయినా వాటితో సంతృప్తి చెందకుండా ఆ ఉద్యోగాలు వదులుకుని, ఉన్నత కొలువు కోసం అహర్నిశలు కష్టించింది. తాజాగా ఏఈఈ, ఏఈ ఉద్యోగాలు తులసిని వరించాయి. దీనిపై తులసి మాట్లాడుతూ.. ఏఈఈ పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపింది. అయితే వేటికీ బెదరక ట్యూషన్లు చెప్పుకుంటూ.. వచ్చిన డబ్బులతో పుస్తకాలు కొనుగోలు చేసి హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నానని చెప్పుకొచ్చింది. ఎన్ని కష్టాలెదురైనా చదువు వదలకూడదని అమ్మానాన్న చెప్పిన మాటలే తనలో స్ఫూర్తి నింపాయని, వారి ఆశలను వమ్ము చేయకుండా గ్రూప్‌-1 సాధించడమే తన లక్ష్యమని తులసి తెలిపింది.
*స్వచ్చధనం - పచ్చదనం కార్యక్రమం విజయవతం చేయండి..MLA -BLR*
ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *స్వచ్చధనం- పచ్చదనం* 5 రోజుల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు యాద్గరిపల్లి గ్రామంలో ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం, పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి *గౌ,, శ్రీ రేవంత్ రెడ్డి గారు* ఈ ఐదు రోజుల వినూత్నమైన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది . కావున అధికారులు, గ్రామపంచాయతీ , సిబ్బంది, ప్రజలు అందరు సమన్వయం చేసుకొని బాధ్యతగా పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు.అలాగే ప్రస్తుతం వస్తున్న విష జ్వరాలని పూర్తిగా కట్టడి చేయాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఈ ఐదు రోజుల కార్యక్రమంలో మొక్కలు నాటడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలను ప్రేరేపించాలి అని అన్నారు.. ఈ కార్యక్రమంలో RDO గారు, MRO గారు, MPDO గారు, అధికారులు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
*వారంలో టాయిలెట్స్ నిర్మాణం చేయాలి కాంట్రాక్టర్ పై ఆగ్రహం ..MLA -BLR*
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని *గాంధీ పార్క్ ప్రాథమికోన్నత పాఠశాలలో* అకస్మికంగా ఉదయం ప్రైర్ లో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.పాఠశాలలో టాయిలెట్స్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని ఉపాధ్యాయులు తెలియజేయడంతో .. వెంటనే కాంట్రాక్టర్ ని పిలిపించి వారం రోజుల్లో టాయిలెట్స్ పూర్తిచేయాలని కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.ఈ సందర్భంగా విద్యార్థులు అందరూ ఆనందంతో MLA గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ నేరుగా.. శ్రీవారి దర్శనం.. ఎంత లక్కో?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ తగ్గింది.
సోమవారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు. కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. వచ్చిన భక్తులకు వెంటనే స్వామి వారి దర్శనం అవుతుంది. పెద్దగా వేచి ఉండకుండానే శ్రీవారిని చూసే వీలు నేడు కలుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సోమవారం కావడంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య తగ్గడం వల్ల భక్తుల సంఖ్య తిరుమలలో అంతగా లేదు. వసతి గృహాలు కూడా వెంటనే భక్తులకు దొరుకుతున్నాయి. క్యూ లైన్లన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. గంటల తరబడి వేచి చూడకుండా స్వామి వారిని దర్శించుకునే వీలు కలుగుతుంది సహజంగా శుక్ర, శని, ఆదివారాలు మినహా మిగిలిన రోజుల్లో భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ఈరోజు ఇంకా తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.
హుండీ ఆదాయం
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి చూడకుండానే స్వామి వారి దర్శనానికి వెళ్లడానికి వీలవుతుంది. నేరుగా లైన్ కదులుతుండటంతో వెంటనే శ్రీవారి దర్శనం పూర్తవుతుంది. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం గంట నుంచి రెండు గంటల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 75,356 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,815 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.90 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*.. *నేను నా మిర్యాలగూడ* కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ **
BLR నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా *రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మిర్యాలగూడ* వారి ఆధ్వర్యంలో 25 వేల మొక్కల పెంపకం కార్యక్రమంలో భాగంగా *వైష్ణవి ఫుడ్ ప్రొడక్ట్స్ ఆధ్వర్యంలో 250 మొక్కలు నాటి* కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* మాట్లాడుతూ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ప్రతి రైస్ మిల్ ఆధ్వర్యంలో 250 మొక్కలను నాటుతామని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది.. నేను నా మిర్యాలగూడ పర్యావరణ పరిరక్షణలో వారు కూడా భాగస్వామ్యులు అవుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మిర్యాలగూడ నియోజకవర్గం వ్యాప్తంగా వ్యాపార వాణిజ్య సంఘాల వారు, విద్యావంతులు మేధావులు ప్రతిఒక్కరూ
ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతూ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రకృతి వనంగా తీర్చి దిద్దాలి అని అన్నారు.. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
*మిర్యాలగూడలో BC వెల్ఫేర్ బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన MLA -BLR*
ఈరోజు మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ నందు గల *MJPT.BC Welfare Residential Girls School ను* *MEO గారితో* కలసి ఆకస్మికంగా సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* . హాస్టల్ లోని ఉదయం అల్పాహారం చూసి నాణ్యత లేకుండా ఎలాంటి పోషకాలు లేని ఇలాంటి అల్పాహారం విద్యార్థులకు పెడుతున్నారా అంటూ హాస్టల్ సిబ్బందిపై మరియు ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు..ప్రతిరోజూ ఉదయం పెట్టే అల్పాహారం లిస్ట్ మరియు ఈరోజు అల్పాహారంలో ఉపయోగించిన వస్తువుల లిస్ట్ వెంటనే నాకు వివరణ ఇవ్వాలని సూచించారు .
అనంతరం హాస్టల్ పరిసరాలు తిరిగి విద్యార్థులతో మాట్లాడారు. మీరు మంచి విద్యను నేర్చుకొని మీ తల్లి తండ్రులు గర్వపడే విధంగా అభివృద్ధి చెందాలని అన్నారు.. నేను రాజకీయాలు చేయడానికి వచ్చిన రాజకీయ నాయకుణ్ణి కాదు. నేను అప్పుడైనా, ఇప్పుడైన, ఎప్పుడైనా ఒక సామాజిక కార్యకర్తని మాత్రమే.. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు నేరుగా ఫోన్ చేసి చెప్పవచ్చు అని అన్నారు.అలాగే ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అంటారు అదే విధంగా మీరు అంతా చదువుకొని ఎన్నో కుటుంబాల్లో వెలుగు నింపేలా ఆదర్శ వంతంగా మారాలి అని అన్నారు..
**పంచాయతీ స్థాయిలో రోజువారీ వాతావరణ సూచనలు**
గ్రామ పంచాయతీ స్థాయిలో రోజు వారీ వాతావరణ సూచనలు అందించే నూతన గ్రామీణ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. భారత వాతావరణ విభాగం, ఎన్జీవో కిసాన్‌ సంచార్‌తో కలిసి కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ వీటిని ప్రారంభించనుంది. బ్లాక్‌ స్థాయి గ్రామ పంచాయతీ స్థాయిలో రోజు వారీ వాతావరణ సూచనలు అందించే నూతన గ్రామీణ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. భారత వాతావరణ విభాగం, ఎన్జీవో కిసాన్‌ సంచార్‌తో కలిసి కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ వీటిని ప్రారంభించనుంది. బ్లాక్‌ స్థాయి నుంచి పంచాయతీ స్థాయిలో రోజువారీ వాతావరణ సూచనలు!

గ్రామ పంచాయతీ స్థాయిలో రోజు వారీ వాతావరణ సూచనలు అందించే నూతన గ్రామీణ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. భారత వాతావరణ విభాగం, ఎన్జీవో కిసాన్‌ సంచార్‌తో కలిసి కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ వీటిని ప్రారంభించనుంది. బ్లాక్‌ స్థాయి నుంచి గ్రామపంచాయతీ స్థాయి వరకు రోజు వారీ వాతావరణ వివరాలను అందించే ఏర్పాటు చేయనున్నారు. ఈ సమాచారాన్ని అందించే బాధ్యతలను 2.69 లక్షల స్థానిక సంస్థలకు అప్పగించనున్నట్టు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ వర్గాలు తెలిపాయి. తద్వారా రైతులకు ఎప్పటికప్పుడు స్థానిక వాతావరణ పరిస్థితులు తెలుస్తాయని, దీంతో వారికి సాగు విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే భారత వాతావరణ విభాగం ‘పంచాయతీ మౌసమ్‌ సేవ’ పోర్టల్‌ను ప్రారంభించింది. బ్లాక్‌(మండల) స్థాయిలో వాతావరణ పరిస్థితిని ఎప్పకటిప్పుడు అందిస్తోంది. దీనిని మరింత విస్తరించడం ద్వారా దేశవ్యాప్తంగా 6లక్షలకు పైగా గ్రామాల్లో రైతులకు మేలు చేసేందుకు ప్రయత్నిస్తోంది