/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz కేరళ బాధితులకు సహాయాన్ని అందించి అండగా నిలవండి : సిర్పంగి స్వామి సిపిఎం మండల కార్యదర్శి Vijay.S
కేరళ బాధితులకు సహాయాన్ని అందించి అండగా నిలవండి : సిర్పంగి స్వామి సిపిఎం మండల కార్యదర్శి

ప్రకృతి వైపరీత్యంతో కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి మరణించిన 300 పైగా కుటుంబాలకు మరియు గాయాలపాలై వైద్యాన్ని అందుకుంటున్న క్షతగాత్రులకు,నిరాశ్రయులకు అండగా నిలిచి ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి కోరారు సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదివారం రోజున పులిగిల్ల గ్రామంలో కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ దేశంలో పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి కేరళను ప్రకృతి వైపరీత్యాలతో కురుస్తున్న అకాల వర్షం కారణంగా వయనాడ్ ప్రాంతంలోని ప్రజల జీవితాలను చిన్నభిన్నం చేసిందన్నారు సుమారు 300 పైగా ప్రజలు ఇప్పటికే మరణించారని అనేకమంది గాయాలతో ప్రాణాలను కాపాడుకున్నారని అనేకమంది తమ ఇండ్లను కుటుంబాలను కోల్పోయి నిరాశ్రయులై ఉన్నారని వారందరికీ అండగా నిలవాల్సిన అవసరం ప్రస్తుత సమయంలో ఉందని వారిని ఆదుకునేందుకు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా ఈనెల 4,5 తేదీల్లో విరాళాల సేకరణ నిర్వహించాలని పిలుపునిచ్చిందన్నారు ప్రజలను ఆదుకునేందుకు కేరళ రాష్ట్ర వామపక్ష ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుందన్నారు, కష్ట కాలంలో ఉన్న కేరళ రాష్ట్రాన్ని బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని ఆయన అన్నారు ఇప్పటికే అనేకమంది సినీ నటులతో పాటు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చి విరాళాన్ని ప్రకటించిందని ప్రజలందరూ మానవతా దృక్పథంతో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని తమకు వీలైన మేరకు ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరారు సిపిఎం పార్టీ సేకరించిన విరాళాలను జిల్లా రాష్ట్ర కమిటీల ద్వారా కేరళ బాధితులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి,సిపిఎం నాయకులు దొడ్డి బిక్షపతి, వడ్డమాని వెంకటయ్య, కొమ్మిడి సత్తిరెడ్డి,ఈర్ల రమేష్,మారబోయిన ముత్యాలు,వడ్లకొండ శంకరయ్య,బొడ్డు రాములు,వడ్డేమాన్ మధు,వేముల నాగరాజు, వరికుప్పల శంకరయ్య, వేముల అనిల్, వేముల నర్సింహ,వరికుప్పల బాబు,వేముల టెండూల్కర్,వేముల జ్యోతి బాబు,దయ్యాల నరసింహ,వనం యాదయ్య,దశరథ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 10, 11న భువనగిరిలో జరిగే ఆవాజ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని కరపత్రాల ఆవిష్కరణ

ఈనెల 10, 11న భువనగిరి పట్టణంలో జరిగే ఆవాజ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆత్మకూరు మండల కేంద్రంలో కరపత్రాల విడుదల. శనివారం రోజున ఆత్మకూరు మండలంలో ఆవాజ్ రాష్ట్రస్థాయి శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని అవాజ్ నాయకులు కరపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఇక్బాల్ S.K లతీఫ్ మాట్లాడుతూ శ్రీ శ్రీనివాస ఫంక్షన్ హాల్ (దివ్య) లో రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు శిక్షణ తరగతులు లౌకిక వాద ప్రజాతంత్ర శక్తులు ఈ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని సమాజం ఐక్యంగా నిలపడం కొరకు దేశ ఐక్యతను చాటే విధంగా ఉంటాయని శిక్షణ తరగతుల మొదటి రోజున ముస్లిం స్వాతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ ను భువనగిరి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రారంభిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో యువతి యువకులు ప్రజాతంత్ర వాదులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో MD అజీమోద్దీన్ MD మోలిసాహబ్ MD జమాల్ MD రంdజాన్ MD హారున్ వృత్తి సంఘం మండలం కన్వర్ వేముల బిక్షం తదితరులు పాల్గొన్నారు,
యాదగిరిగుట్టలో లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో శనివారం సీఎం సహాయనిధి చెక్కులను ప్రభుత్వ ఆలేరు  ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లబ్ధిదారులకు  పంపిణీ చేశారు. బొమ్మలమ్మ రామారావు మండలంలో 79 మందికి ,తుర్కపల్లి మండలంలో 63 మందికి, రాజపేట మండలంలో 76 మందికి, యాదగిరిగుట్ట పట్టణం మండలంలో 114 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య ఖర్చుల నిమిత్తం లబ్ధిదారులకు అందజేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు కట్టుబడి ఉందని తెలిపారు .ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

అమరుల స్ఫూర్తితో గీతా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తాం; బోలగాని జయరాములు KGKS రాష్ట్ర ఉపాధ్యక్షులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కల్లుగీత కార్మిక ఉద్యమాలలో పనిచేస్తూ అమరులైన అమరులు బొమ్మగాని ధర్మ బిక్షం బైరు మల్లయ్య తొట్ల మల్సూర్ సూదగాని ఎట్టయ్య లాంటి ఎందరో అమరవీరులు కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారిని స్మరిస్తూ వారు చూపిన మార్గంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్లుగీత కార్మిక సంఘం కార్మికుల సమస్యలపై సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు అన్నారు. తేదీ 03-08-2024 శనివారం రోజున వలిగొండ పట్టణంలోని శివశక్తి ఫంక్షన్ హాల్ కేజీ కేఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన అమరుల యాది సభ పలుసం స్వామి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన జయరాములు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి ఉన్నాయని కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఏ ప్రభుత్వాలు కూడా సంపూర్ణ ప్రయత్నాలు చేస్తలేవు అని వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని వారికి హామీల వరకే పరిమితం అవుతున్నారని అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించకపోవడం వృత్తి రక్షణకు ఆధునీకరణ చేయకపోవడంతో కల్లుగీత వృత్తిలో గీతా కార్మికులు క్రమంగా తగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కళ్ళు గీత కార్మికుల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు చేసి కళ్ళు గీత కార్మిక సంఘం నాయకులు కొన్ని హక్కులను సాధించారని వాటిని కాపాడుకుంటూ కల్లుగీత వృత్తి రక్షణ కోసం కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అధిక నిధులు విడుదల చేయడం కోసం ఆధునికరించడం కోసం భవిష్యత్తులో గీతా కార్మికులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలిపారు అందుకు వృత్తి రక్షణ కోసం పనిచేసే అమరులైన అమరుల స్ఫూర్తితో సంఘం ముందుకు వెళుతుందని తెలిపారు కేజీ కేస్ జిల్లా అధ్యక్షులు రాగిరి కృష్ణయ్య మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా నందనం వద్ద ఉన్న నీర కేంద్రానికి నిధులు కేటాయించి వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా కల్లుగీత కార్మికుల ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేస్తున్న కేజీ కేఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య మండల అధ్యక్షులు పబ్బతి మల్లేశం మండల నాయకులు కొండూరు సత్తయ్య కొండూరు అంజయ్య పలుసం లింగం బంధారపు ధనంజయ గాజుల వెంకటేశం గంధ మల్ల గోపాల్ పలుసం చంద్రమౌళి శంకరయ్య లోడే మల్లేశం మద్దెల మారయ్య మండలంలోని వివిధ గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు

ఎస్సీ వర్గీకరణ అమలుపై హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ యువజన నాయకులు డాక్టర్ ముప్పిడి రవి

ఎస్సీ వర్గీకరణపై తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీ ప్రస్తావన* *- అమలుపై హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి* *- ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ యువజన నాయకుడు డాక్టర్ ముప్పిడి రవి* ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. తీర్పు వచ్చిన వెంటనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేస్తానని ఇచ్చిన హామీకి కోమటిరెడ్డి బ్రదర్స్,నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరుడు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు డాక్టర్ ముప్పిడి రవి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేస్తే నేటికీ తుది ఫలితం రావడం హర్షణీయం అని, వచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం అమలు విషయం కూడా పారదర్శకంగా జరిగే విధంగా చేయాలని ఒక ప్రకటనలో కోరారు.
వలిగొండ: నర్సయ్య గూడెం వద్ద కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా : కారు ఢీ కొట్టడంతో తో వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండల పరిధిలోని నరసయ్య గూడెం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది .పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వల్లపు నరసయ్య తన వ్యక్తిగత పనుల నిమిత్తం వలిగొండ కు వచ్చి తన టీవీఎస్ ఎక్సెల్ బండిపై తిరిగి వెళుతుండగా నరసయ్య గూడెం సమీపంలో రోడ్డు కల్వర్టు వద్ద కారు ఢీకొట్టడంతో తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వలిగొండ ఎస్సై మహేందర్ తెలిపారు.
ప్రొద్దుటూరు అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు, అక్షరాభ్యాసం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామంలో అంగన్వాడి టీచర్ సునీత (హేమ) మాట్లాడుతూ ఈనెల ఒకటో తారీకు నుండి ఎనిమిదో తారీకు వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తామని అంగన్వాడి కేంద్రంలో 0నుంచి ఆరు నెలల పిల్లలు .ఏడో నెల నుండి మూడు సంవత్సరాల లోపు .టి హెచ్ ఆర్. పిల్లలు మూడు నుండి ఆరు సంవత్సరాలు. ప్రీ స్కూల్ పిల్లలు బరువు తీయడం జరుగుతుందని. ప్రతినెల ఒకటో తేదీ అంగన్వాడి కేంద్రంలో బరువులు తీసి పిల్లల బరువుల గురించి వయసుకు తగ్గ బరువు పిల్లలు ఉండేటట్లుతల్లులకు అవగాహన కల్పించడం జరుగుతుందని. బిడ్డ పుట్టిన వెంటనే మర్రుపాలు బిడ్డకు పట్టిస్తే అందులో అనేక కొలెస్ట్రాల్ బలము ఆ పాలల్లో ఉంటుందని ముర్రుపాలు వలన బిడ్డకు అనేక శక్తులు సమకూర్స్తాయని ఆరోగ్యవంతమైన శక్తి లభిస్తుందని తల్లి నుండి ముందుగా వచ్చే పసుపు. రంగు పాలు .ముదురు రంగు పాలు. బిడ్డకు పట్టించే విధానం గురించి గ్రామంలోని తిరుగుతూ గృహప్రదర్శనాలు బాలింతల ఇంటికి వెళ్లి సవివరంగా వివరించడం ప్రతినెల జరుగుతుందని. అంగన్వాడి టీచర్ పత్రిక ప్రకటన ద్వారా తెలియజేసినారు.. ఈ కార్యక్రమంలో ఈరోజు 3+పిల్లలకు అక్షర అభ్యాసం నిర్వహించడం జరిగిందని మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సునీత (హేమ) సెక్టార్ హుస్సేన్ సారు .ఏఎన్ఎం .ఆశ. ఎల్ ఎం హెచ్ పి. లు బాలింతలు తల్లులు మహేశ్వరి నికిత పాల్గొన్నారు.
చిత్తాపురం లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో భువనగిరి సాధన సభ్యులు  కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్  ఫండ్ చెక్కులను గ్రామ శాఖ అధ్యక్షులు పీసరి వెంకటరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. బాధితులు  చేగూరి అనిత మత్స్యగిరి 42,000, కందాటి భవాని ఎల్లారెడ్డి 24000, కల్లూరి విష్ణువర్ధన్14000 వేలు అందించడం జరిగింది .ఈ కార్యక్రమంలో చేగూరి మచ్చ గిరి, వలమాల బిక్షపతి, చేగూరు మహేష్, బడక సతీష్ ,మల్లయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు , తదితరులు పాల్గొన్నారు .
పోరాటయోధుడు కాచం కృష్ణమూర్తి ఆశయ మార్గంలో ముందుకు సాగుదాం : సిర్పంగి స్వామి సిపిఎం మండల కార్యదర్శి

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు కాచం కృష్ణమూర్తి గారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అన్నారు గురువారం రోజున మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయం వద్ద కాచం కృష్ణమూర్తి గారి 18వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి రాచరిక పాలనకు వ్యతిరేకంగా దొరలు, దోపిడీదారుల దౌర్జన్యాలను ఎదిరించి సాయుధులైన ప్రజలను సమరయోధులుగా మార్చేందుకు ప్రజల్లో నిత్యం చైతన్యాన్ని నింపి దొరలు,దోపిడీదారుల, రజాకారుల కోటలపై మెరుపు దాడులు నిర్వహించి ప్రజలకు వెట్టి చాకిరి,దోపిడీ పీడనల నుండి విముక్తి చేసిన గొప్ప పోరాట యోధుడు కాచం కృష్ణమూర్తి అన్నారు ఎన్ని నిర్బంధాలు ఎదురైన వెనక్కు తగ్గకుండా తను ఎంచుకున్న మార్గం ద్వారా ఎర్రజెండా నాయకత్వంలో ప్రజలను నడిపించిన మహోన్నతమైన నాయకుడని జీవితాంతం సాదాసీదాగా జీవించి ప్రజల కోసమే బ్రతికిన ఆ నాయకుని యొక్క స్ఫూర్తిని ఆదర్శాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేయడమే ఆయనకు మనమిచ్చే ఘననివాళని అన్నారు ఆయన ఆశయ మార్గంలో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు చీర్క శ్రీశైలం రెడ్డి,మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు, నాయకులు కొండూరు సత్తయ్య,వేముల లక్ష్మయ్య, ఉండ్రాటి పాపయ్య,నరసింహ తదితరులు పాల్గొన్నారు.
స్వయం ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిఎస్ రామానంద ప్రిన్సిపల్ ప్రభుత్వ ఐటిఐ భువనగిరి

విద్యార్థులు, చదువు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, స్వయం ఉపాధి అవకాశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భువనగిరి పారిశ్రామిక శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ జి. ఎస్ రామానంద అన్నారు. గురువారం భువనగిరి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రం లో కేంద్ర ప్రభుత్వ "సంకల్ప్ ప్రాజెక్టు" లో భాగంగా 15-05-2024 నుండి 31-05-2024 వరకు శిక్షణ పొందిన విద్యార్థులకు *సర్టిఫికెట్ల ప్రదానోత్సవ* కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు "ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ డెవలప్మెంట్" శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న పరిజ్ఞానం, భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంకల్ప్ ప్రాజెక్టు స్టేట్ కన్సల్టెంట్ నజీర్ సిద్దిఖీ, యాదాద్రి భువనగిరి జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు ఎర్ర శివరాజ్, బాలల హక్కుల పరిరక్షణ వేదిక జాతీయ కమిటీ ఉపాధ్యక్షులు బొక్క రాంబాయి, జిల్లా అధ్యక్షులు ఆవుల వినోద్ కుమార్, డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్ బాబూరావు, తులసీరావు, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, గురువయ్య, పరమేష్, రీసోర్స్ పర్సన్ కొడారి వెంకటేష్, చైల్డ్ లైన్ జిల్లా కో- ఆర్డినేటర్ మాటూరి దశరథ, విద్యార్థులు పాల్గొన్నారు.