/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఘనంగా సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు Vijay.S
ఘనంగా సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు

సామాజిక కార్యకర్త, హక్కుల నాయకుడు, సీనియర్ జర్నలిస్టు, మూడ నమ్మకాల నిర్మూలనకు, కరెన్సీ నోట్ల పై అంబేద్కర్ ఫోటో సాధన కోసం కృషి చేస్తున్న కొడారి వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘణంగా నిర్వహించారు. మొదట భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కు పూలమాలలు వేసి నివాళులర్పించారు‌. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ధరణికోట నర్సింహ, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్, జిల్లా ఎస్సీ/ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, టీ పి సి సి మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నింటి స్టాన్లీ లు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న కొడారి వెంకటేష్,భవిష్యత్తులో మరిన్ని సామాజిక ఉద్యమాలు నిర్వహించి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందే విధంగా కృషి చేయాలని కోరుతూ ఆశీర్వదించారు. పుట్టినరోజు కార్యక్రమంలో వికలాంగుల హక్కుల మహిళా అధ్యక్షురాలు కొత్త లలిత, జిల్లా నాయకులు జాగిల్లపురం అయిలయ్య, సింగారం రమేష్, కాటపల్లి రజిత, ఇంజ పద్మ , మచ్చ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.


ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి:AISF

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా AISF జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. మహిళల విద్యార్థులకు బాత్ రూమ్ శుభ్రంగా లేకపోవడం మూలంగా ఇబ్బందులు పడుతున్నారు. .లైబ్రరీ సౌకర్యాలు లేకపోవడం మూలంగా విద్యార్థుల అధ్యయనంతో పాటు వారి భవిష్యత్ పైన కూడా ప్రభావం పడుతుందని అన్నారు. పాఠశాలలో పారిశుద్ధ కార్మికులు లేకపోవడం మూలంగా పాఠశాల ఆవరణమంతా శుభ్రంగా లేకపోవడం మరియు మంచినీటి సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో వైరల్ ఫీవర్ తో పాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.. చాలా పాఠశాలలో పురాతన భవనాలు కుంగి పోవడంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పాఠశాలలు మార్చడం జరుగుతుంది దీని మూలంగా అనేకమంది విద్యార్థులు చదువుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు కావున తక్షణమే సొంత భవనాలను నిర్మించాలి అదే విధంగా అనేక పాఠశాలలో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ కొరత ఉంది. కావున తక్షణమే అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని కోరడం జరిగింది లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ గా ఈ సమస్యలన్నీ తీరేవరకు విద్యార్థులకు సరైన విద్య నాణ్యతతో కూడిన సదుపాయాలు కల్పించేంత వరకు పోరాటం కొనసాగుతుందని వారు అన్నారు. అనంతరం ఎస్సీ బాలికల వసతి గృహం, బీసీ కళాశాల బాలుర వసతి గృహం లను సందర్శించి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో విద్యార్థులకు ఎలాంటి సీజనల్ వ్యాధులు రాకుండా శానిటేషన్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న సంక్షేమ హాస్టల్లో మిస్ చార్జీలను విడుదల చేయాలని మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు కంబాల నరసింహ శివ తదితరులు పాల్గొన్నారు.

APF ఫౌండేషన్ చైర్మన్ దుబ్బాక ఆకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా KTR జన్మదిన వేడుకలు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR గారి జన్మదిన వేడుకలు BRS పార్టీ మున్సిపల్ నాయకులు, APF ఫౌండేషన్ చైర్మన్ శ్రీ దుబ్బాక ఆకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.... మున్సిపల్ నాయకులు, APF ఫౌండేషన్ చైర్మన్ శ్రీ దుబ్బాక ఆకాష్ రెడ్డి  ప్రకృతి పరిరక్షణ సంకల్పంతో మొక్కలు నాటారు...అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపటి తెలంగాణ భవిష్యత్తు KTR  సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఈ సేవ కార్యక్రమాలు నిర్వహించామని, ఈ సందర్భంగా ఆకాష్ రెడ్డి పేర్కొన్నారు.... ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ గంజి విజయ్ కుమార్, యూత్ నాయకులు ,రాజు,ఈశ్వర్, వినోద్, నరేష్,సాయి కృష్ణ శివ,మధు,రాజేష్,సాయి,SK అత్తూ,విష్ణు , యువజన నాయకులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
తండాలు గ్రామపంచాయతీలుగా ఉన్నతీకరణ చేయాలి : ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

అసెంబ్లీ సమావేశాల్లో  ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని బుధవారం  కోరారు. గత ప్రభుత్వం లో తెలంగాణ రాష్ట్రం లో 5848 తాండల్లో సుమారు 1271తాండలను మాత్రమే గ్రామపంచాయతీలు గా చేసారని కానీ అభివృద్ధి చేయలేదన్నారు. గతంలో ఏర్పాటు చేసిన తండా గ్రామపంచాయతీ లకు పక్క భవనం నిర్మించక పోవడం వల్ల చెట్ల కింద పరిపాలన చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు.గత ప్రభుత్వం లో సర్పంచుల కు నిధులు ఇవ్వకపోవడం తో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గంలో మిగిలిన తండాలను గ్రామపంచాయతీలుగా చేసి తండాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు.
జిల్లా గ్రంధాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రియాజ్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం లోని జిల్లా గ్రంధాలయాన్ని రాష్ట్ర గ్రంధాలయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ రియాజ్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా వారు అక్కడ ఉన్న నిరుద్యోగులతో మాట్లాడి అక్కడ ఉన్న సౌకర్యాలను తెలుసుకోవడం జరిగింది. అదే విధంగా వారికి కావలసిన వసతులు, పుస్తకాలు సరిగా ఉన్నాయా మరియు వారికి కావలసిన స్టడీ మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడం వలన మేము సంతోషంగా ఉన్నామని చదువుకోవడానికి సమయం లభించిందని నిరుద్యోగ యువత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా డాక్టర్ రియాజ్ గారు గ్రూప్స్ కొరకు సిద్ధం అయ్యే వారికి ఇచ్చే ఆన్లైన్ తరగతులు మేము కూడా వింటామని యువత తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రంధాలయాలను మరింత అభివృద్ధి చేస్తామని డాక్టర్ రియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమం లో గ్రంధాలయ సెక్రటరీ సుధీర్, గ్రంధాలయ సిబ్బంది,నాయకులు అతహర్, అవేస్ చిష్టి, సలాఉద్దీన్, మాజహార్, రఫీద్దీన్ గౌరి తదితరులు పాల్గొన్నారు.

నందనం - సిరివేణి కుంట గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి : దయ్యాల నరసింహ సిపిఎం మండల కార్యదర్శి

నందనం గ్రామం నుండి సిరివేణికుంటకు వెళ్లి దారిలో అసంపూర్తిగా ఉన్నటువంటి బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని అలాగే చెరువు కింద ఉన్నటువంటి రైతులకు ఉపయోగపడే దారిలో పెరిగిన కంపచెట్లను తొలగించి దారిని ఏర్పాటు చేయాలని డయాల నరసింహ డిమాండ్ చేశారు అదేవిధంగా గ్రామంలో చాలామంది నిరుపేదలకు ఇండ్లు లేక ఉన్నారని ప్రభుత్వము ఇల్లు లేని పేదలందరికీ ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అర్హత కలిగిన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇంకా అర్హత ఉండి పెన్షన్స్ రాని వారందరికీ అన్ని రకాల పెన్షన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామంలో దోమలు నివారణకు ఫాగింగ్ చేపట్టాలని మరియు ప్రధానంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించి గ్రామ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో మండల కమిటీ సభ్యులు కొండాపురం యాదగిరి, అబ్దుల్లాపురం వెంకటేష్ కొల్లూరి సిద్దిరాజు, లక్ష్మారెడ్డి, సురుపంగ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫిట్నెస్ లేని బస్సులు నడిపిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి:AISF

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫిట్నెస్ లేని బస్సులు నడిపిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి *ఏఐఎస్ఎఫ్* జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కిస్తూ ఫిట్నెస్ లేకుండా బస్సులను నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్టీవో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మరియు జిల్లా వ్యాప్తంగా మోత్కూర్ చౌటుప్పల్ వలిగొండ తుర్కపల్లి లోఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల పై చర్యలు తీసుకోవాలని అన్నారు విద్యా సంవత్సరం ప్రారంభమైన నాటినుండి అనేక ప్రైవేట్ పాఠశాలల బస్సులు ప్రమాదాలకు గురై విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని ఆ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఉన్నత పాఠశాల బాలికలఆశ్రమంలో మరియు ప్రభుత్వ గిరిజన సంక్షేమ కళాశాల బాయ్స్ హాస్టల్లో సర్వే నిర్వహించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు కళ్యాణ్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల దళిత డిక్లరేషన్ పై బడ్జెట్ సమావేశాల్లో స్పష్టత ఇవ్వండి, ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి సమగ్రంగా అమలు చేయాలి

చేవెళ్ల దళిత డిక్లరేషన్ పై బడ్జెట్ సమావేశాల్లో స్పష్టత ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి సమగ్రంగా అమలు చేయాలని ప్రజా పర్యవేక్షణ కమిటీ, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన చేవెళ్ల దళిత డిక్లరేషన్ ప్రకారం ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లను పెంచాలని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేస్తామని అలాగే ఇందిరమ్మ గృహ నిర్మాణానికి అంబేద్కర్ అభయ హస్తం పేరుతో 6లక్షల రూపాయలు విడుదల చేయాలని, అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పించాలని, అన్ని కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వ రాయితీలు పొందుతున్న ప్రయివేటు కంపెనీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.రానున్న బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చించి దళిత, గిరిజనుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు బట్టు రామచంద్రయ్య, ప్రజా పర్యవేక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సురుపంగ శివలింగం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కృష్ణ, విజిలెన్స్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్, జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ, ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుతాడి సురేష్, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, దళిత సంఘాల నాయకులు అందే సాయి, వద్ధిగల దాసు , కొండలరెడ్డి తదితరులు పాల్గోన్నారు.

స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలి: ప్రియదర్శిని మేడి బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

బాధ్యతాయుతమైన ఐ. ఏ. ఎస్. అధికారి స్మిత సబర్వాల్, వికలాంగుల పట్ల చేసిన అనుచిత వాఖ్యలు, వెంటనే వెనక్కి తీసుకొని, వికలాంగులకు క్షమాపణ చెప్పాలని ప్రియదర్శిని మేడి బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకి తూట్లు పొడిచే విధంగా ఉన్నాయి అవకాశాలు కల్పిస్తే ఎవరైనా ఏదైనా సాధించగలం రాజ్యాంగం కల్పిస్తుంది. ఆమె మాట్లాడుతూ ఎందరో వికలాంగులు విభిన్న ప్రతిభను కనబర్చి, చరిత్ర పుటల్లోకి ఎక్కిన సంఘటనలు స్మిత సబర్వాల్ మరవరాదని ఆమె అన్నారు.‌ మీరన్నట్టు బ్యూరోక్రాట్లు అంతే సమర్థవంతంగా లొంగకుండా పనిచేస్తూ ఉంటే ఇప్పటికే మన దేశ కరెన్సీ డాలర్ తో సమానం అయి ఉండేది. ఇంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత సంకుచితంగా శోచనీయం.వికలాంగుల సమాజానికి స్మిత సబర్వాల్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని లేనిచో బి ఎస్ పి పార్టీ ఆద్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు.
ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజల కష్టాలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణం స్పందించాలి : సిపిఎం

గ్రామపంచాయతీలలో కొనసాగుతున్న ప్రత్యేక అధికారుల పాలనలలో సమస్యలు పెద్ద ఎత్తున పేర్కపోయి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి తగిన నిధులు కేటాయించి గ్రామాల్లో ఉన్న మౌలిక సమస్యలను పరిష్కారం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. సోమవారం భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం పెంచికల్ పహాడ్, బస్వాపురం గ్రామాలలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం ఆయా గ్రామాలలోని పంచాయతీ కార్యదర్శులకు, ప్రత్యేక అధికారులకు మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ్మలు పాల్గొని మాట్లాడుతూ గత ఫిబ్రవరి నుండి సర్పంచ్ పాలన ముగిసి ప్రత్యేక అధికారుల పాలన వచ్చిన తర్వాత గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎవరిని అడగాలను అర్థం కాని పరిస్థితులలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామాలలో రోజురోజుకు మురికి కాలువలు, వీధిలైట్లు, మంచినీళ్ల సమస్యలు పెరుగుతున్నాయని వాటిని తక్షణం పరిష్కారం చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. పెంచికల్ పహాడ్ గ్రామంలో మంచినీళ్ల ఫిల్టర్ రిపేరుకు వచ్చి వారం కావస్తున్నా నేటికీ దానిని బాగు చేయించే పరిస్థితి లేదని దాంతో మంచినీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. హనుమాపురం గ్రామంలో లింక్ రోడ్ల సమస్య చాలా పెద్ద ఎత్తున ఉన్నదని అనంతరం, తాజ్ పూర్, కుర్మగూడెం, అనంతరం బస్వాపురం వరకు లింకు రోడ్ల సమస్యలను పరిష్కారం చేయాలి, అక్కడక్కడ దెబ్బతిన్న బీటీ రోడ్లను తక్షణం బాగు చేయాలని అన్నారు. బస్వాపురం నుండి యాదగిరిగుట్ట వరకు లింకు రోడ్డు కూడా తక్షణమే ఏర్పాటు చేయాలని, బస్వాపురం ఉసిల్లవాగుపై బ్రిడ్జిని తక్షణమే నిర్మాణం చేయాలని, భువనగిరి నుండి కృష్ణాపురం పెంచికల్పాడు మీదుగా వెళ్లే ప్రయాణికులకు భువనగిరి ప్రభుత్వ ఐటిఐ దగ్గర అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని కోరినారు. ప్రభుత్వము ఎన్నికల ముందు ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తానన్న హామీని వెంటనే అమలు చేయాలని, అర్హత కలిగి రేషన్ కార్డు లేని పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని, అన్ని రకాల పెన్షన్స్ కూడా తక్షణం ఇవ్వాలని వారు ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వము అన్ని గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం ప్రజలందరినీ సమీకరించి సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం తగిన నిధులు విడుదల చేయాలని కోరినారు. గ్రామాలలో రోజురోజుకు కోతుల, కుక్కల బెడద పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాటి నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షకాలంతో దోమల బెడద పెరిగి ప్రజలు వివిధ రోగాల బారిన పడుతున్నారని గ్రామాలలో తరచుగా గడ్డి మందు, దోమల నివారణ మందు పిచికారి చేయాలని ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పై సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం స్పందించకపోతే మండల స్థాయిలో ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ, మండల కమిటీ సభ్యులు సిలివేరి ఎల్లయ్య, రాసాల వెంకటేష్, హనుమాపురం సిపిఎం శాఖ కార్యదర్శి మోటె ఎల్లయ్య, బసవపురం శాఖ కార్యదర్శి నరాల చంద్రయ్య, పెంచికల్ పహాడ్ శాఖ కార్యదర్శి సుబ్బురు పోచయ్య, నాయకులు ప్రజలు బండి శ్రీను, తెల్జీరి మాణిక్యం, కుసుమ మధు, బాల్ద మల్లయ్య, ఉడుత విష్ణు, మచ్చ భాస్కర్, సిల్వేరు జెమ్మయ్య, చిన్నం బాలరాజు, గోపి స్వామి, సిలువేరు జమదగ్ని, చిన్నం సబితా, గోపె సంధ్య, చాట్ల భారతమ్మ, సిలువేరు సత్యలక్ష్మి, నల్ల నవీన్, చిందం నరసింహ, నరాల కృష్ణ, రాసాల గంగరాజు తదితరులు పాల్గొన్నారు.