ఐదేళ్లకు ఒకసారి దేశం కోసం ఐదు నిమిషాలు:ఓటు హక్కుపై జస్టిస్ డీవై చంద్రచూడ్
ఐదేళ్లకు ఒకసారి దేశం కోసం ఐదు నిమిషాలు:ఓటు హక్కుపై జస్టిస్ డీవై చంద్రచూడ్
దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ప్రజలను కోరారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో ఓటు హక్కుపై చైతన్యం కలిగించడానికి ఎన్నికల సంఘం 'మై ఓట్ మై వాయిస్' మిషన్లో భాగంగా ఓ వీడియోను విడుదల చేసింది..
ఇందులో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ '' ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. దేశ పౌరులైన మనకు రాజ్యాంగం అనేక హక్కులను కల్పించింది. అలాగే ఈ ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడం పౌరులుగా మన ప్రధాన బాధ్యత. ఐదు సంతవత్సరాలకు ఒకసారి మన దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించడానికి సాధ్యమవుతుంది కదా. ఓటు హక్కును వదులుకోవద్దని ప్రతిఒక్కరినీ అభ్యర్థిస్తున్నా. గర్వంగా ఓటు వేద్దాం. నా ఓటు నా వాయిస్'' అని అన్నారు..
దేశంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే గొప్ప అవకాశం ప్రజలకు ఉందని అందుకే రాజ్యాంగంలో 'భారత ప్రభుత్వం ప్రజలచే, ప్రజల కొరకు' అని రాసుందని చంద్రచూడ్ తెలిపారు. తాను మొదటి సారి ఓటు వేయడానికి చూపిన ఉత్సాహాన్ని, ఓటు వేసినప్పుడు కలిగిన ఆనందాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఏప్రిల్ 19న ప్రారంభమైన లోక్సభ ఎన్నికలు జూన్ 1వరకు జరగనున్నాయి. ఏడు దశల్లో నిర్వహిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తారు.

ఐదేళ్లకు ఒకసారి దేశం కోసం ఐదు నిమిషాలు:ఓటు హక్కుపై జస్టిస్ డీవై చంద్రచూడ్


జ్యోతిబాపూలే 150 అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి-దాసు సురేశ్ , అధ్యక్షులు - బీసీ రాజ్యాధికార సమితి
నల్గొండ జిల్లా మునుగోడు రోడ్డు ఈద్గా నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి మంచినీరు పంపిణీ చేయడం జరిగింది.ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది హిందూ ముస్లిం అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో కలిసి ఉండాలని ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు VHP జిల్లా గౌరవ అధ్యక్షులు కర్నా టి యాదగిరి గారు.శ్యామల తారక్. సురెపల్లి వెంకటేశ్వర్లు. పున్న రామేశ్వర్ .మూడ సైదులు.పొట్టబత్తుల శ్రీను.కైరంకొండ చంద్రశేఖర్.చెరుకు శివశంకర్. గంజి శ్యాంసుందర్ .జువ్వాజి సోమయ్య. తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలకు సన్మానం చేయడం జరిగింది.
నల్గొండ జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతి ఉత్సవాలను ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

నల్గొండ జిల్లా కేంద్రా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ జయంతి 116వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ...
Apr 24 2024, 20:32
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
20.8k