జ్యోతిబాపూలే 150 అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి-బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్
జ్యోతిబాపూలే 150 అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి-దాసు సురేశ్ , అధ్యక్షులు - బీసీ రాజ్యాధికార సమితి
సంఘ సంస్కర్త, వెనుకబడిన వర్గాల ఆశాకిరణం మహాత్మా జ్యోతిబా పూలే 150 అడుగుల విగ్రహాన్ని నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ డిమాండ్ చేశారు. జ్యోతిబా పూలే 198వ జయంతిని బాగ్ లింగంపల్లిలోని బీసీ రాజ్యాధికార సమితి ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతిబా పూలే పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం అంబర్పెపేట్ లోని జ్యోతిభాఫూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. భవిష్యత్ బీసీలదేనని నినదించారు ..తదనంతరం మీడియాతో మాట్లాడుతూ బడుగుల ఉన్నతికి జ్యోతిబా పూలే చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.
నెక్లెస్ రోడ్ లో అంబేద్కర్ భారీ విగ్రహం తరహాలోనే జ్యోతిబాపూలేకు కూడా 150 అడుగుల విగ్రహన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.. చారిత్రక అంశాలతో కూడిన ఫూలే స్మృతివనాన్ని నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేయాలన్నారు ఇదే ప్రాంగణంలో జ్యోతిబా పూలే పేరిట బీసీ నాలెడ్జ్ పార్క్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్లతో నిధని ఏర్పాటు చేసి ప్రతి ఏటా జ్యోతిబా పూలే పేరిట సంఘ సంస్కర్తలకు అవార్డులు ప్రధానం చేయాలని దాసు సురేష్ సూచించారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను జ్యోతిబా పూలేకు ఇవ్వాలని, పూలే జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి దాసు సురేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ తులసి శ్రీమాన్, మీడియా కన్వీనర్ మారేపల్లి లక్ష్మణ్ సిటీ కమిటీ సభ్యులు ప్యారసాని దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.

జ్యోతిబాపూలే 150 అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి-దాసు సురేశ్ , అధ్యక్షులు - బీసీ రాజ్యాధికార సమితి

నల్గొండ జిల్లా మునుగోడు రోడ్డు ఈద్గా నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి మంచినీరు పంపిణీ చేయడం జరిగింది.ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది హిందూ ముస్లిం అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో కలిసి ఉండాలని ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు VHP జిల్లా గౌరవ అధ్యక్షులు కర్నా టి యాదగిరి గారు.శ్యామల తారక్. సురెపల్లి వెంకటేశ్వర్లు. పున్న రామేశ్వర్ .మూడ సైదులు.పొట్టబత్తుల శ్రీను.కైరంకొండ చంద్రశేఖర్.చెరుకు శివశంకర్. గంజి శ్యాంసుందర్ .జువ్వాజి సోమయ్య. తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలకు సన్మానం చేయడం జరిగింది.
నల్గొండ జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతి ఉత్సవాలను ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

నల్గొండ జిల్లా కేంద్రా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ జయంతి 116వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ...


Apr 20 2024, 23:14
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
20.2k