/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz జగిత్యాల ఎమ్మెల్యే డా" సంజయ్ కుమార్ కు పితృ వియోగం Raghu ram reddy
జగిత్యాల ఎమ్మెల్యే డా" సంజయ్ కుమార్ కు పితృ వియోగం

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తండ్రి సీనియర్ న్యాయవాది హనుమంతరావు (85) కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతూ శుక్రవారం కన్నుమూశారు..

ఆయన మృతి పట్ల పలు వురు సంతాపం వెలిబు చ్చారు. విషయం తెలుసు కున్న పట్టణ, జిల్లా ప్రము ఖులు ఆయన భౌతిక కాయం సందర్శన కోసం జగిత్యాలకు చేరుకుంటు న్నారు..

ఐటీ మంత్రి శ్రీధర్ బాబును సన్మానించిన మున్నూరు కాపు సంఘం నాయకులు

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా నియమితులైన రాష్ట్ర ఐ.టి. శాఖ మంత్రి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ను శుక్రవారం మున్నూరు కాపు సంఘం మహాసభ నాయ కులు ఘనంగా సన్మానిం చారు.

ఈ మేరకు ఈరోజు హైదరా బాద్ లోని ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జాతీయ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ గా నియమి తులైన శ్రీధర్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగర మున్నూ రు,కాపు సంఘం మహాసభ అధ్యక్షులు గడ్డి రాజశేఖర్, పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం మహాసభ కన్వీనర్ ఇనుముల సతీష్, భూపాల పల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం నాయకులు తుల్సేగారి తిరుపతి, పటేల్ తది తరులు పాల్గొన్నారు

టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన.. మరో లిస్ట్ విడుదల

మరో 4 ఎంపీ సీట్లకు, 9 అసెంబ్లీ సీట్లకు టీడీపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది..

ఎంపీ అభ్యర్థులు:

విజయనగరం-అప్పలనాయుడు,

ఒంగోలు-మాగుంట శ్రీనువాసులు రెడ్డి,

అనంతపూర్- అంబికా లక్ష్మీనారాయణ,

కడప-భూపేష్ రెడ్డి

ఎమ్మెల్యే:

భీమిలి-గంటా శ్రీనివాస్ రెడ్డి,

రాజంపేట-సుభ్రమణ్యం

చీపురుపల్లి-కళా వెంకట్రావు

గుంతకల్లు-గుమ్మనూరు జయరాం

కదిరి-కే.వెంకట ప్రసాద్

పాడేరు-వెంకట రమేష్

దర్శి-గొట్టిపాటి లక్ష్మి

ఆలూరు వీరభద్రగౌడ్

అనంతరపురం అర్బన్-దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు జారీ

లోక్‌సభ ఎన్నికలు సమీపి స్తున్న వేళ ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ పార్టీకి ఐటీ విభాగం మరో సారి నోటీసులు జారీ చేసింది.

ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత వివేక్‌ తంఖా ఈరోజు వెల్లడించారు. 2017-18, 2020-21 మదింపు సంవ త్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల డిమాండ్‌ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.

తమపై ఐటీ విభాగం ప్రక్రి యను నిలిపివేయా లంటూ పార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన వెంటనే ఈ పరిణామాలు చోటుచేసు కోవడం గమనార్హం. ఎలాంటి మదింపు ఉత్తర్వులు, పత్రాలు లేకుండానే గురువారం తాజా నోటీసులిచ్చారని వివేక్‌ తంఖా ఆరోపించారు.

ఇది అహేతుక, అప్రజాస్వా మిక చర్య అని ఆయన మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేం దుకు కేంద్రం ప్రయత్నిస్తోం దని దుయ్యబట్టారు.దీన్ని తాము చట్టపరంగా ఎదు ర్కొంటామని అన్నారు.

పార్టీ మారడం లేదు: మాలోత్ కవిత

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి.పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కొందరు ప్రకటిస్తుండగా.. ఏకంగా రాజీనామాలు చేస్తూ మరికొందరు షాకిస్తున్నారు.

ఈ క్రమంలోనే మహబూ బాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత కూడా పార్టీ మారుతుందని పోటీ నుంచి తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా.. ఈ ప్రచారంపై ఆమె స్పందించారు.

శుక్రవారం ఉదయం కవిత మీడియాతో మాట్లాడుతూ.. తనపై జరుగుతన్న ప్రచార మంతా అవాస్తవమని కొట్టిపారేశారు. తానంటే గిట్టని వారే ఈ ప్రచారానికి తెరలేపారని అనుమానం వ్యక్తం చేశారు.

నేను పార్టీ మారబోనని తప్పకుండా పోటీలో ఉంటానని స్పష్ట చేశారు. అంతేకాదు.. కేసీఆర్ ఆశీస్సులతో తప్పకుండా మహబూబాబాద్ నుంచి గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు..

జగిత్యాల జిల్లాలో నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ శివారులో కళ్యాణ్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పాంటించు కొని ఆత్మహత్య చేసుకు న్నాడు.

గురువారం రాత్రి ఇంట్లో నుండి వెళ్లిన యువకుడు గ్రామ శివార్లలోని కోళ్ల ఫారంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

ఈరోజు ఉదయం ఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు ఆదారాలు సేకరి స్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు ఈ వేసవి నుంచి కూలి పెరగనుంది.వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త వేత నం అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వు లు జారీ చేసింది.

దీంతో రోజుకు రూ 272 అందుతున్న కూలి రూ.300 కు పెరగనుంది.ఈ నిర్ణయం తో మండలంలో 11,079 వేల మంది కూలీలకు లబ్ది చేకూరనుంది.అయితే కూలీలకు మూడేళ్ళుగా వేసవి భత్యం ఇవ్వకపోగా ఈసారి కూలి పెంపుతో సరిపెట్టారు.

ఉపాధిహామీ పథకం నిర్వ హణలో కేంద్ర ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొ చ్చింది.ఇప్పటికే సాప్ట్ వేర్ ను పూర్తిగా తన ఆధీనం లోకి తీసుకుని పనిదినాల లక్ష్యాలు కేటాయింపులను పర్యవేక్షిస్తుంది.

పనులకు వచ్చే కూలీల సంఖ్య ఆధారంగా గ్రామం, మండలం, జిల్లా లక్ష్యాలను నిర్దేశిస్తుండగా రాష్ట్ర ప్రభు త్వం మరిన్ని పనిదినాలు పెంచేది.మూడేళ్ళుగా ఈ లక్ష్యాల మేరకు కూలీలకు పనులు కల్పిస్తున్నారు.

ఉపాధిహామీ పథకంలో మార్పు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఏటా మాదిరిగానే 2024-25 ఆర్థిక సంవత్స రానికి కూలీల వేతనాలు పెంచుతూ నిర్ణయించిం ది.ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో రూ.28 కు పెంచింది.

గత సంవత్సరం రూ.15 మాత్రమే పెంచగా ఈసారి ఇంకాస్త ఎక్కువ పెంచగా కొత్త వేతనం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కానుంది.

గండిపేట కార్ల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

రంగారెడ్డి జిల్లా గండిపేట సమీపంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవిం చింది.

ఖానాపూర్‌లోని ఓ కార్ల గోదాంలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్ని కీలలు ఎగిసిపడటంతో గోదాంలో ఉన్న కార్లన్నీ మంటల్లో తగలబడ్డాయి.

గోదాంలో 25 కార్లు ఉండ గా.. అవన్నీ పూర్తిగా దగ్ధ మయ్యాయి. భారీ మంటల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించిం ది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమా పక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చేం దుకు శ్రమిస్తున్నారు.

కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు...

Justice NV Ramana: రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

కృష్ణా జిల్లా: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న సుప్రీంకోర్టు (Supreme Court) మాజీ ప్రధాన న్యాయమూర్తి (Former Chief Justice) జస్టిస్ ఎన్వీ రమణ ( Justice NV Ramana)కు విజయా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు (Chalasani Anjaneyulu), మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు (Dasari Balavardhana Rao), అమరావతి మహిళలు (Amaravati Womens), రైతులు (Farmers) ఘన స్వాగతం పలికారు..

ఈ సందర్భంగా మాజీ సీజేఐకు అమరావతి రైతులు, మహిళలు.. వినతిపత్రం అందజేశారు. జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ అమరావతి మహిళా రైతులు తమ కష్టాలు చెప్పారని, ప్రస్తుత ప్రభుత్వ విధానాల వలన1563 రోజులు నుంచి ఉద్యమం చేస్తున్నామని రైతులు వెల్లడించారన్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగం చేశారని, రాజధాని అమరావతి శంకుస్థాపనకు తాను కూడా వచ్చానని చెప్పారు.

రైతుకు భూమికి ఉన్న సంబంధం తల్లి బిడ్డకు ఉన్న సంబంధం లాంటిదని, రైతు భూమి కోల్పోవడం సామాన్యమైన విషయం కాదని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా రైతులు భూములు ఇచ్చి నేరస్థుల్లా కోర్టులో నిలబడి అష్ట కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వాలు మేల్కొని రైతులకు న్యాయం చేస్తారని అనుకుంటున్నానన్నారు. వాళ్లకు న్యాయ వ్యవస్థ కూడా పనిచేస్తుందని విశ్వసిస్తున్నానన్నారు. ఆలస్యం అయినప్పటికీ తప్పక న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాని.. వారి ఉద్యమ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. సీఎం జగన్ సభ దగ్గర ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు..

ఇందులో భాగంగా ఇవాళ ఆయన నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. నంద్యాలలో వైసీపీ బహిరంగా సభ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వైసీపీ సభ దగ్గరకు వెళ్లిన అఖిల ప్రియ సాగునీటి విడుదల కోసం సీఎం జగన్కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమెతో పాటు టీడీపీ శ్రేణులు సైతం భారీగా తరలివెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే అఖిలప్రియను, టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అఖిలప్రియను పోలీసులు అదులోకి తీసుకోవడంతో కాసేపు అక్కడి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. వినతిపత్రిం ఇచ్చేందు వస్తే అరెస్ట్ చేయడమేంటని తెలుగు తమ్ముళ్లు పోలీసుల తీరుపై ఫైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ.. అపాయిట్మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎంవో స్పందించలేదని తెలిపారు. అందుకే నేరుగా సీఎంను కలిసి వినతి పత్రం ఇద్దామని వచ్చానన్నారు. వినతిపత్రం ఇస్తే శాంతిభద్రతల సమస్య ఎలా అవుతోందని ప్రశ్నించారు..