/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఆదివారం బ్యాంకులకు సెలవు లేదు Yadagiri Goud
ఆదివారం బ్యాంకులకు సెలవు లేదు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదివారంతో ముగియనున్న వేళ … దేశంలోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) కీలక ఆదేశాలు జారీచేసింది..

ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్‌ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా శని, ఆదివారాల్లో సేవలు అందించాలంటూ … 33 బ్యాంకులకు ఆర్‌బిఐ ఆదేశాలు జారీచేసింది.

ఈ ఆదేశాలతో భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్‌బిఐ) సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ సహా 20 ప్రైవేటు రంగ బ్యాంకులు,

విదేశీ బ్యాంకు డిబిఎస్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌లు ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ సాధారణంగానే పనిచేస్తాయి. నెఫ్ట్‌, ఆర్‌టిజిఎస్‌తోపాటు చెక్‌ క్లియరెన్స్‌ వంటి సేవలు యథాతథంగా కొనసాగుతాయి..

నిజామాబాద్ ముఖ్యనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతలతో పీసీసీ అధ్యక్షులు,ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,శుక్రవారం సమావేశం అయ్యారు.

నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తో పాటు....

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొ న్నారు.జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.

Streetbuzz News

కేజ్రీవాల్‌ కోసం మెసేజ్‌లు పంపండి.. వాట్సప్‌ నంబరు షేర్‌ చేసిన సతీమణి

దిల్లీ: దేశంలో అత్యంత అవినీతి, నియంత శక్తులకు వ్యతిరేకంగా తన భర్త పోరాడుతున్నారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) సతీమణి సునీత అన్నారు..

ఆయనకు అండగా ఉండేందుకు ప్రజలందరి ఆశీర్వాదం కావాలని కోరారు. ఈ మేరకు మరో వీడియో సందేశం విడుదల చేసిన ఆమె.. వాట్సప్‌ ప్రచారాన్ని ప్రారంభించారు.

''నా భర్త నిజమైన దేశభక్తుడు. కోర్టులో నిల్చుని నిజానిజాలన్నీ బయటపెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. ప్రస్తుతం ఆయన నియంత శక్తులను సవాల్‌ చేస్తున్నారు. ఇప్పుడు మనమంతా ఆయనకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు నుంచి మేం ప్రత్యేక డ్రైవ్‌ మొదలుపెడుతున్నాం. కేజ్రీవాల్‌ కోసం 8297324624 వాట్సప్‌ నంబరుకు మీ సందేశాలు పంపండి. అవన్నీ నేను ఆయనకు చేరవేస్తాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలతో ఆయన ధైర్యంగా ఉంటారు'' అని సునీత (Sunita Kejriwal) తన సందేశంలో వెల్లడించారు..

మద్యం విధానానికి (Delhi Excise Scam Case) సంబంధించిన కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ను గురువారం ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జడ్జి అనుమతితో సీఎం స్వయంగా తన వాదనలు వినిపించారు. కేవలం నాలుగు వాంగ్మూలాలతోనే తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు. అటు సునీత కూడా నిన్న కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త ఆరోగ్యం బాలేదని, ఆయనను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు..

బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న హిజ్రాలు

నగరంలో రోజురోజుకు హిజ్రాల ఆగడాలు మితి మిరిపోతున్నాయి. పెళ్లి వేడుకల్లో అమ్మాయి తరఫు వాళ్లను,అబ్బాయి తరుపు వాళ్లను బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు..

వీరికి అడ్డాలుగా మెయిన్ చౌరస్తా,సిగ్నల్ పాయింట్ల వద్ద వీరు బలవంతపు వసూళ్లకు పాల్పడుతు న్నట్లు తెలుస్తుంది..

కొండాపూర్‌ లో గురువారం అర్ధరాత్రి ఒంటిగంట కు సుమారు 30మంది హిజ్రాలు ఓ వ్యక్తిపై దాడి చేసి బలవంతంగా అతని అకౌంట్‌ నుంచి రూ.30 వేలు పోన్‌పే చేయించుకున్నట్లు తెలిసింది.

సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, దీనిపై పోలీసులు ఎటు వంటి కేసు నమోదు చేయలేదు. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. హెల్ప్‌చేయండి అంటూ పోలీసులకు, మీడియా ప్రతినిధులకు, రాజకీయ నాయకులకు ఫొటోలు, వీడియోలు షేర్‌ చేశాడు.

దీనిపై గచ్చిబౌలి పోలీసు లను వివరణ కోరగా తమ కు ఎలాంటి ఫిర్యాదూ రాలేదని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలో స్క్రాప్ గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం

ఇండ్ల మధ్య ఉన్న స్క్రాప్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమా దం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో మున్సిపాలిటీ పరిధిలోని రహదారిలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ శంషాబాద్ షాబాద్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రియాంక గ్యాస్ గోడౌన్ పక్కన ఉన్న ఓ భారీ స్క్రాప్ గోడౌన్‌లో శుక్రవారం ఉదయం ఒక్క సారిగా మంటలు చెలరే గాయి.

దీంతో దట్టమైన పొగ పక్కనే ఉన్న ఇండ్లకు వ్యాపించడం తో ఇండ్ల నుంచి పరుగులు తీశారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు లు ఇండ్లు ఖాళీ చేస్తున్నారు ఫైరింజన్ల సాయంతో మంట లను ఆర్పే ప్రయత్నం చేస్తు న్నారు..

సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు భేటీ

సీఎం రేవంత్ రెడ్డి తో కేశవ రావు భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే..రేవంత్‌ నివాసంలో కేశవరావు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరికపై సీఎం రేవంత్ రెడ్డి తో కేశవరావు చర్చించను న్నారు. ఇది ఇలా ఉండగా, ఇక అంతకు ముందు…పార్టీ మార్పు, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తో భేటీపై సీనియర్ నేత కె.కేశవరావు స్పందిం చారు.

కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా కేసీఆర్ పై గౌరవం ఉంది అని అయినా కాంగ్రెస్ లోకి వెళ్లాలనే నిర్ణయించుకున్నా అని వెల్లడించారు. అదే విషయం కేసీఆర్ కు చెప్పా అని అన్నారు.

కవిత అరెస్టుపై కూడా చర్చించాం’ అని ఆయన వివరించారు. కేకే రేపు కాంగ్రెస్ పార్టీలో చేరను న్నారు...

తెలుగు రాష్ట్రాల్లో మండే కాలం:నిర్మాణుష్యంగా మారుతున్న రోడ్లు

మార్చి నెల దాటకముందే ఎండలు మంటలు గక్కు తున్నాయి. గురువారం నాడు ఒక పక్క పెరిగిన ఉష్ణోగ్రతలు.. మరో పక్క వడగాల్పులతో తెలంగాణ విలవిలలాడిపోయింది.

ఈ పరిస్థితి ఒక్క తెలంగా ణకే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న ఆంధ్రప్ర దేశ్‌లోని రాయలసీమ జిల్లాలు కూడా సెగలు చిమ్మాయి. అసాధారణ రీతిలో పెరిగిపోయిన ఉష్ణోగ్రతలలతో తెలుగు రాష్ట్రాలు ఉడుకెత్తి పోయాయి.

ఉక్కపోతతో జనం విలవి లలాడిపోయారు. తెలంగా ణలోని హైదరాబాద్, వరం గల్ ,కరీంనగర్ , ఖమ్మం, నిజామాబాద్ , అదిలాబాద్ తదతర పట్టణాల్లో మధ్యా హ్నం ఎండల తీవ్రతతో ప్రధాన రోడ్లు నిర్మాణు ష్యంగా కనిపించాయి.

రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్ర తలలో భారీ మార్పులు చోటు చేసుకుంటూ వస్తు న్నాయి. శుక్రవారం నుంచి 5రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరి కలు జారీ చేసింది.

ఎండల తీవ్రత పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని వాతావ రణ శాఖసూచించింది

చివరిలో రెచ్చిపోయిన పరాగ్: పోరాడి ఓడిన ఢిల్లీ

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న గురువారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధిం చింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్,ఢిల్లీ ముందు 186 పరుగుల టార్గెట్ సేట్ చేసింది.

అయితే, చేజింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులే చేయగలి గింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ సొంత గ్రౌండ్‌లో ఢిల్లీపై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఢిల్లీ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (49), ట్రిస్టన్ స్టబ్స్ 44 (నాటౌట్) హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నారు. ఇక, మిచెల్ మార్ష్ (23),

రిషబ్ పంత్ (28) పర్వాలేదనిపించారు.

ఇక రాజస్థాన్ బౌలర్లలో నాంద్రే బర్గర్, యుజ్వేంద్ర చాహల్ చెరో రెండు వికెట్లు తీయగా.. అవేష్ ఖాన్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. రాజ‌స్థాన్ బ్యాటింగ్‌లో టాపార్డ‌ర్ పూర్తిగా విఫల మైనప్పటికీ.. మిడాలార్డర్ బ్యాటర్ రియాన్ ప‌రాగ్ (84) హాఫ్ సెంచ‌రీతో జ‌ట్టును ఆదుకున్నాడు.

ఇక అశ్విన్ (29), ధృవ్ జురెల్ (20), హెట్మెయర్ (14) ప‌రుగుల‌తో ప‌రువా లేద‌నిపించారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, అన్రిచ్ నోర్ట్జే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఓక్కో వికెట్ దక్కించుకున్నారు...

మొట్ట మొదటి సారిగా గగన విహారం చేసిన తేజస్-ఎంకే 1ఏ యుద్ధ విమానం

భారత్ దేశంలో అభివృద్ధి చేసిన యుద్ధ విమానం తేజస్. దీన్ని మరింత ఆధునికీకరించి తేజస్-ఎంకే 1ఏ వెర్షన్ కు రూపకల్పన చేశారు.

ఇప్పుడీ సరికొత్త పోరాట విమానం తొలిసారిగా పూర్తి స్థాయిలో విజయవం తంగా గగన విహారం చేసింది. ఇప్ప టికే ఈ తేలికపాటి యుద్ధ విమానం భారత వాయు సేన అమ్ములపొది లో చేరింది.

ఇవాళ బెంగళూరులో అన్ని హంగులతో, సకల అస్త్రశ స్త్రాలను అమర్చుకుని సంతృప్తికరంగా గగన విహారం చేసింది. భారత రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్ డీవో అనుబంధ సంస్థ ఏరోనా టికల్ డెవలప్ మెంట్ ఏజెన్సీ ఈ ఫైటర్ జెట్ ను డిజైన్ చేసింది.

తేజాస్ ఎంకే1ఏ యుద్ధ విమానాలను ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేస్తోంది. గత కొన్నేళ్లుగా అనేక పర్యా యాలు తేజస్ యుద్ధ విమానాలకు ట్రయల్స్ నిర్వహించారు.

ఇవాళ్టి గగన విహారం 18 నిమిషాల పాటు సాగింది. రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ కేకే వేణుగోపాల్ ఈ విమానాన్ని నడిపారు. త్వరలోనే ఈ విమానాలను వాణిజ్య ప్రాతిపదికన సరఫరా చేసే అవకాశాలున్నాయి.

కాంగ్రెస్ గూటికి కడియం శ్రీహరి, కూతురు కావ్య?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీకి వరుసగా షాకులు తగులు తున్నాయి. ఒక్కో నేత గులాబీ పార్టీని వీడి అధికార పక్షమైన కాంగ్రెస్ లో చేరుతున్నారు.

ఏ క్షణాన ఏ లీడర్ వెళ్తారో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. అయితే తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కడియం శ్రీహరి కుటుంబం ఊహించని షాక్ ఇచ్చింది. కేసిఆర్ కు ఎంపీ అభ్యర్థి కడియం కావ్య లేఖ రాశారు.

ఎంపీ ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖ లో తెలిపిన కడియం కావ్య…. బీఆర్ఎస్ పై అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగు తుందన్న కావ్య…ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుండి విరమించుకుంటున్నానని వెల్లడించారు.

కెసిఆర్, బీఆర్ఎస్ కార్య కర్తలు మన్నించాలని విజ్ఞప్తి చేశారు కడియం శ్రీహరి...