/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz భువనగిరి పార్లమెంట్ లో పోటీ చేస్తున్న సిపిఎం ను గెలిపించండి: భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ పిలుపు Vijay.S
భువనగిరి పార్లమెంట్ లో పోటీ చేస్తున్న సిపిఎం ను గెలిపించండి: భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ పిలుపు


 

   భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న సిపిఎంను గెలిపించి మతోన్మాద బిజెపిని ఓడించాలని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి, సిపిఎం జిల్లా కార్యదర్శి యండి.జహంగీర్ పిలుపు నిచ్చినారు. శనివారం సుందరయ్య భవన్, భువనగిరిలో సిపిఎం భువనగిరి మండల జనరల్ బాడీ సమావేశం మండల కార్యదర్శివర్గ సభ్యులు పల్లెర్ల అంజయ్య అద్యక్షతన జరుగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా యండి. జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ

కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడి ప్రభుత్వం దేశసంపదను మొత్తం అధానీ అంభాని లాంటి కార్పొరేట్ శక్తులకు, దోపిడీ దారులకు దోచిపెడుతున్నారనీ విమర్శించారు. మరోప్రక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రవేట్ పరంచెస్తు కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అమ్ముతున్నార అన్నారు. మరో పక్క ప్రజలపై అనేక భారాలను మోపుతూ ధరలు పెంచి ప్రజల జీవితాలతో ఆటలాడుతున్నారని అన్నారు. పది సంవత్సరాల బిజెపి పాలనలో మతఘర్షనలు సృష్టిస్తుా, విభజన రాజకీయాలు చేస్తు భారత రాజ్యాంగాన్ని, ప్రజలకు హక్కులను దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారని ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి చిత్తుచిత్తుగా ఓడించాలని జహంగీర్ పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ మాట్లాడుతూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న యండి.జహంగీర్ గారికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరినారు. జహంగీర్ గారు గత 35 సంవత్సరాలు ఎర్రజెండా చేతబట్టి కార్మికుల కర్షకుల వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం, తాగు సాగునీటి సమస్యల పరిష్కారం కోసం, యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్రాభివృద్ధికి కోసం అనేక పోరాటాలతో పాటు పాదయాత్రలు కూడా చేసి ప్రజల పక్షాన నిలిచిన గొప్ప చరిత్ర కలిగిన నాయకుడని అన్నారు. భువనగిరి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్నదని ఈ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే, ప్రజల బాధలు పోవాలంటే ప్రజల పక్షాన నిలబడే ప్రజా నాయకుడు జహంగీర్ గారి సుత్తి కొడవలి సుక్క గుర్తుపైన పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించాలని నర్సింహ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వీర్లపల్లి ముత్యాలు, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ్మ , మండల కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, పాండాల మైసయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్, ఎల్లంల వెంకటేష్ , మోటే ఎల్లయ్య, వివిధ గ్రామాలకు సంబంధించిన శాఖ కార్యదర్శులు నరాల చంద్రయ్య, కూకుట్ల కృష్ణ , బోడ ఆంజనేయులు, కళ్లెం లక్ష్మీనరసయ్య తోపాటు యండి.జహంగీర్, కడారి కృష్ణ , మద్యపురం బాల్ నర్సింహ్మ, మచ్చ భాస్కర్, ఉడుత విష్ణు, కే. వెంకటేష్, దయ్యాల మల్లేష్, మాణిక్యం, దానయ్య, అంజయ్య, గోపాల్ రెడ్డి, లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

      

అరూర్ లో తుమ్మల నర్సయ్య సేవాసమితి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అరూర్ గ్రామం లో తుమ్మల నర్సయ్య సేవ సమితి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు దమేర లక్షమ్మ కు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమం లో కిసాన్ సేల్ జిల్లా నాయకులు బండారు నర్సింహా రెడ్డి మండల నాయకులు తుమ్మల శ్రీనువాస్ మాజీ ఎంపీటీసీ పోలేపక చంద్రయ్య మత్స్యగిరి గుట్ట మాజీ డైరెక్టర్ కాసిరాబోయిన లింగయ్య యాదవ్ మండల ఓబీసీ అధక్షుడు చిల్కమర్రి కనకచారి హైస్కూల్ మాజీ చైర్మన్ జినుకాల మల్లేశం హైస్కూల్ ప్రైమరి మాజీ చెర్మన్ ఆవుల అంజయ్య తుమ్మల సంతోష్ బండారు మైహిపాల్ రెడ్డి కోడితల లక్ష్మయ్య కాసిరాబోయిన నర్సింహా వేముల ఎట్టయ్య పిట్టల సుధాకర్ వెలిమినేటి సంతోష్ బత్తిని వెంకటేష్ కొయ్యగుర మధు మీసాల మత్సగిరి నల్ల రామచంద్రు పోలేపక మహేష్ ఎర్ర సాయి మరియు తదితరులు పాల్గొన్నారు

మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయి: తహసిల్దార్ పి శ్రీనివాస్ రెడ్డి


అఖిలభారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ మండల స్థాయి టోర్నమెంట్ 

సర్దార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుకుదేవ్ ల 93 వ వర్ధంతి సందర్భంగా వలిగొండ మండలంలోని అరూరు గ్రామంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ తహాసిల్దార్ పి.శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడుతూ...

మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని శరీర ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు భగత్ సింగ్ రాజు గురు సుఖదేవులు అతి చిన్న వయసులో తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారని అన్నారు నేటి యువత వారి ఆశ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఈ సమాజానికి సామాజిక స్పృహ అలవర్చుకొని ఎన్నో సేవా కార్యక్రమాలలో యువతి, యువకులు అనేక రంగాలలో ముందుండాలని ఈ సందర్భంగా అన్నారు... అనంతరం టాస్ వేసి ఆటను ప్రారంభించి యువతను మరింత ఉత్తేజపరిచారు.

ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుకుదేవ్, వారి ఆశయాలను కోసం ఎంతోగానో పనిచేయాలని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అతి చిన్న వయసులో 23 వయస్సు లోనే ఇన్క్విలాబ్ జిందాబాద్ అంటూ ఉరి కంబాన్ని ముద్దాడిన ఈ విప్లవ యోధులను ఎంతగానోస్మరించుకోవాలని భారత దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు నేటి యువత మద్యం ,మత్తు పానీయాలకు బానిస గా మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని అన్నారు వీటన్నిటిని పారదోలడానికి యువతలో చైతన్యమైన,మానసిక దృఢత్వానికి ఎంతగానో క్రీడలు ఉపయోగపడతాయి అని అన్నారు. గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించాలని క్రీడాకారు

లను గుర్తించి వారికి అన్ని రకాల సహకారం గుర్తింపు ఇవ్వాలని అన్నారు పాలకులు క్రీడారంగాన్ని విస్మరిస్తున్నారు ఇప్పటికైనా క్రీడలకు సరైన నిధులు, బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు క్రీడలకు పెద్దపీట వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్, ఆర్గనైజర్ మేడి దేవేందర్, సిపిఐ మండల కార్యదర్శి పోలపాక యాదయ్య,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బండారు నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ,సిపిఐ మండల నాయకులు బుర్ర మల్లేశం, కొడిత్యాల కర్ణాకర్,కనకాచారి, క్రీడాకారులు రవ్వ శివ,జోల మల్లేష్, ఆలకుంట్ల శ్రవణ్, చిలకమర్రి బన్నీ, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ డైరీ ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ( టి జే యు) 2024 డైరీ ని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట పట్టణం తన నివాసంలో శనివారం రోజున ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు జర్నలిస్టులు వారధిగా ఉండాలని, కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు పెద్దపీట వేస్తుందని,జర్నలిస్టుల సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులు అందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు .

ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్, యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు చిమ్మని రాజు తదితరులు పాల్గొన్నారు.

బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్న, పార్టీ మారే ప్రసక్తే లేదు: మేడి ప్రియదర్శిని నకిరెకల్ నియోజకవర్గం ఇన్చార్జి

బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్నా...

- ఎలాంటి ఘటనలు జరిగిన పార్టీ మారే ప్రసక్తే లేదు...

- బీఎస్పీ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ...

- నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని

 ఎవరెన్ని ఆశలు పెట్టిన తలోగ్గేది లేదని, బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్నానని నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. బహుజన వాదం అని చెప్పి, నమ్ముకున్న కార్యకర్తలను నట్టింట ముంచి మధ్యలో వదిలేసి వెళ్లిపోయారని అన్నారు. శుక్రవారం నాడు నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీలలో నాయకులు వస్తుంటారు, పోతుంటారు నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు ఎవరు అదైర్య పడొద్దని, అందరికీ వెన్నంటుగా ఉండి, అండగా ఉంటానని బీఎస్పీ పార్టీ నియోజకవర్గం ఇంఛార్జి మేడి ప్రియదర్శిని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావిరాల నరసింహ యాదవ్,నియోజకవర్గ చేరికల కమిటీ కన్వీనర్స్ మునుగోటి సత్తయ్య, చెరుకుపల్లి శాంతి కుమార్, చిట్యాల మండలం అధ్యక్షులు జోగు శేఖర్, రామన్నపేట మండల ఉపాధ్యక్షులుగుని రాజు,ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నరసింహ, మండల కోశాధికారి గట్టు రమేష్,మండల మహిళా కన్వీనర్,బందెల అనిత, నాయకులు బాలాగోని మల్లయ్య గౌడ్,బుస్సు శ్రీకాంత్,రవి,యోగి, రామ్ కుమార్ బిఎస్పి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పోచంపల్లి మండలంలో నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి


పోచంపల్లి మండలం అంతమ్మ గూడెం మరియు దోతిగుడెం గ్రామంలో పొలాలలో నీళ్లు లేక ఎండిపోయిన సందర్భంగా రైతులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ సభ్యులు శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ నాయక్, బుడద బిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి గారు, కొలుపుల అమరేందర్, జడ్పీటీసీ శ్రీమతి కోట పుష్పలత మల్లారెడ్డి గారు, పోచంపల్లి ఎంపీపీ శ్రీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి గారు,వైస్ ఎంపీపీ శ్రీ పాక వెంకటేష్ గారు, PACs చైర్మెన్ శ్రీ భూపాల్ రెడ్డి గారు, BRS మండల పార్టీ అధ్యక్షులు శ్రీ పాటి సుధాకర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శ్రీ మహిపాల్ రెడ్డి గారు, శ్రీ సుధాకర్ రెడ్డి గారు, దోతిగూడెం మాజీ సర్పంచ్ శ్రీ రామ్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకులు పాల్గొన్నారు.

భారతీయ జనతా పార్టీ మండల కార్యదర్శిగా మందుల నాగరాజు నియామకం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో గురువారం రోజున భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయంలో జరిగిన సమావేశంలో మండల శాఖ కార్యదర్శిగా నాగారం గ్రామానికి చెందిన మందుల నాగరాజును మండల పార్టీ అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి ఎన్ రెడ్డి జిల్లా కార్యదర్శి కొప్పుల యాది రెడ్డి భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి రాచకొండ కృష్ణ సమక్షంలో నియామక పత్రం అందజేసారు. ఈ నియామక పత్రం అందుకున్న మండల కార్యదర్శి మందుల నాగరాజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మండల కార్యదర్శిగా నియమించిన జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయకులు సీఎన్ రెడ్డి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కన్వీనర్ బందారపు లింగస్వామి రాచకొండ కృష్ణ మారోజు అనిల్ కు ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వలిగొండ మండలంలో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని ఆయన అన్నారు.

భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే కేటాయించాలి: మండల బీసీ సంఘం అధ్యక్షుడు సాయిని యాదగిరి డిమాండ్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో గురువారం రోజున మండల బీసీ సంఘం నాయకులు సాయిని యాదగిరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా అన్ని రాజకీయ పార్టీలు బిసి నాయకులకే కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన డిమాండ్ చేశారు బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలలో బీసీలకు కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థికి పార్లమెంటు స్థానాన్ని కేటాయించి నట్లయితే బిసిలు బీసీ నాయకులను గెలిపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని రాజకీయ పార్టీ నాయకులకు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ ఉన్నా ఓసీలకు సీట్లు కేటాయించడం వలన ఓట్లు వేసేది బీసీలు నాయకులుగా ఎన్నుకోబడేది ఓసీలా అని ఆయన ప్రశ్నించారు. బీసీ నాయకులకు అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ టికెట్ ఇవ్వకుంటే బీసీల సత్తా ఏమిటో రాజకీయ పార్టీలకు చూపిస్తామని ఆయన అన్నారు.

భువనగిరి పార్లమెంటులో సిపిఎం ను గెలిపించండి: సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు


యాదాద్రి భువనగిరి జిల్లా: రాజకీయాల్లో విలువలు బ్రష్టు పడుతున్న కాలంలో వాటిని కాపాడడానికి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం పై ఓటు వేసి ప్రజలు గెలిపించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విజ్ఞప్తి చేశారు. గురువారం భువనగిరి లో సుందరయ్య భవన్లో సిపిఎం అభ్యర్థి ఎండి జాంగిర్ తో కలిసి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు కేంద్ర రాష్ట్ర కమిటీ ఇలా నిర్ణయం మేరకు భువనగిరిలో సిపిఎం పోటీ చేస్తుందని అన్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, జనగామ, ఇబ్రహీంపట్నం, ఆలేరు ,మునుగోడు ,తుంగతుర్తి నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో కమ్యూనిస్టు ఉద్యమాలకు కేంద్రాలని అన్నారు .గతంలో నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడు, ఆలేరు ,భువనగిరి ఇబ్రహీంపట్నంలో కమ్యూనిస్టులు గెలిచారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలను పార్లమెంటులో గత అభ్యర్థులు ప్రస్తావించక పోయారన్నారు. కమ్యూనిస్టులు మాత్రమే ప్రస్తావిస్తారని తెలిపారు.

మిగతా రాజకీయ ప్రక్షాలు చేసే రాజకీయ జిమ్మిక్కులను ప్రజలు గందరగోళం పడకుండా ఎంతో చైతన్యవంతంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న కమ్యూనిస్టులను సిపిఎం ను గెలిపించాలని కోరారు . ఎండి జహంగీర్ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన వారిని, గత 35 సంవత్సరాలుగా సిపిఎం సభ్యత్వం తీసుకొని 32 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తున్నారని అన్నారు.ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులకు నరసింహ బట్టుపల్లి అనురాధ జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు దోనూరు నర్సిరెడ్డి కల్లూరు మల్లేశం దాసరి పాండు మంగ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం ను సన్మానించిన దర్గాయి హరిప్రసాద్


తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన పిసిసి ఎస్సి విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నాగరి గారి ప్రీతం గారిని ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాలు పట్టణాల నుండి విచ్చేసిన ఎస్సి విభాగం నాయకులు కార్యకర్తలు గాంధీభవన్ లో జరిగిన అభినందన సభలో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా దర్గాయి హరిప్రసాద్ మాట్లాడుతూ......

పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు, దళిత వ్యతిరేక విధానాలపై ప్రాణాలకు తెగించి పోరాడి ఎన్నో కష్టాలను నష్టాలను కేసులను అనుభవించి అధిష్టానం ఆదేశం మేరకు శాసనసభ టికెట్ కూడా త్యాగం చేసిన ప్రితమన్న గారికి న్యాయం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం హర్షనీయమని ప్రితమన్న గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద దళిత కుటుంబాలలో వెలుగులు చూస్తామని దళిత కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రితమన్న తీసుకుంటాడని ప్రితమన్న గారు భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా లో ఉన్న తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి వారి కి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదం స్వామివారి చిత్రపటం శాలువాలు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ విభాగం కన్వీనర్ నాగారం శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు కొండాపురం గణేష్, గోపి శ్రీనివాస్, చిలుకా కిష్టయ్య,మల్లేష్, సోమన్న, ఊదరి శ్రీనివాస్, బింగి శ్రీనివాస్, కుక్క బాల నరసింహ, సన్నాయిల రఘు, ఎనుతుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.