/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz భువనగిరి పార్లమెంటులో సిపిఎం ను గెలిపించండి: సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు Vijay.S
భువనగిరి పార్లమెంటులో సిపిఎం ను గెలిపించండి: సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు


యాదాద్రి భువనగిరి జిల్లా: రాజకీయాల్లో విలువలు బ్రష్టు పడుతున్న కాలంలో వాటిని కాపాడడానికి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం పై ఓటు వేసి ప్రజలు గెలిపించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విజ్ఞప్తి చేశారు. గురువారం భువనగిరి లో సుందరయ్య భవన్లో సిపిఎం అభ్యర్థి ఎండి జాంగిర్ తో కలిసి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు కేంద్ర రాష్ట్ర కమిటీ ఇలా నిర్ణయం మేరకు భువనగిరిలో సిపిఎం పోటీ చేస్తుందని అన్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, జనగామ, ఇబ్రహీంపట్నం, ఆలేరు ,మునుగోడు ,తుంగతుర్తి నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో కమ్యూనిస్టు ఉద్యమాలకు కేంద్రాలని అన్నారు .గతంలో నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడు, ఆలేరు ,భువనగిరి ఇబ్రహీంపట్నంలో కమ్యూనిస్టులు గెలిచారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలను పార్లమెంటులో గత అభ్యర్థులు ప్రస్తావించక పోయారన్నారు. కమ్యూనిస్టులు మాత్రమే ప్రస్తావిస్తారని తెలిపారు.

మిగతా రాజకీయ ప్రక్షాలు చేసే రాజకీయ జిమ్మిక్కులను ప్రజలు గందరగోళం పడకుండా ఎంతో చైతన్యవంతంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న కమ్యూనిస్టులను సిపిఎం ను గెలిపించాలని కోరారు . ఎండి జహంగీర్ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన వారిని, గత 35 సంవత్సరాలుగా సిపిఎం సభ్యత్వం తీసుకొని 32 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తున్నారని అన్నారు.ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులకు నరసింహ బట్టుపల్లి అనురాధ జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు దోనూరు నర్సిరెడ్డి కల్లూరు మల్లేశం దాసరి పాండు మంగ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం ను సన్మానించిన దర్గాయి హరిప్రసాద్


తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన పిసిసి ఎస్సి విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నాగరి గారి ప్రీతం గారిని ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాలు పట్టణాల నుండి విచ్చేసిన ఎస్సి విభాగం నాయకులు కార్యకర్తలు గాంధీభవన్ లో జరిగిన అభినందన సభలో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా దర్గాయి హరిప్రసాద్ మాట్లాడుతూ......

పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు, దళిత వ్యతిరేక విధానాలపై ప్రాణాలకు తెగించి పోరాడి ఎన్నో కష్టాలను నష్టాలను కేసులను అనుభవించి అధిష్టానం ఆదేశం మేరకు శాసనసభ టికెట్ కూడా త్యాగం చేసిన ప్రితమన్న గారికి న్యాయం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం హర్షనీయమని ప్రితమన్న గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద దళిత కుటుంబాలలో వెలుగులు చూస్తామని దళిత కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రితమన్న తీసుకుంటాడని ప్రితమన్న గారు భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా లో ఉన్న తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి వారి కి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదం స్వామివారి చిత్రపటం శాలువాలు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ విభాగం కన్వీనర్ నాగారం శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు కొండాపురం గణేష్, గోపి శ్రీనివాస్, చిలుకా కిష్టయ్య,మల్లేష్, సోమన్న, ఊదరి శ్రీనివాస్, బింగి శ్రీనివాస్, కుక్క బాల నరసింహ, సన్నాయిల రఘు, ఎనుతుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ మండల మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా బొలుగుల భాగ్యమ్మ నియామకం


 

 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామానికి చెందిన బోలుగుల భాగ్యమా బిజెపి పార్టీకి ఆమె సేవ చేసినందుకు అధిష్టానం గుర్తించి ,వలిగొండ మండలం మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ... వలిగొండ మండలం బిజెపి పార్టీ అధ్యక్షులు బోల్ల సుదర్శన్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేసినారు. ఈ సందర్భంగా బొలుగుల భాగ్యమ్మ మాట్లాడుతూ...

పార్టీ కోసము అహర్నిశలు కృషి చేస్తానని, పార్టీ బలోపేతము చేసే దిశగా ప్రయాణిస్తానని మాట్లాడినారు.

 ఈ కార్యక్రమంలో మండల నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి మండల అధ్యక్షుడు బోళ్ళ సుదర్శన్ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీ ఎంపిక


భారతీయ జనతా పార్టీ వలిగొండ మండలం అధ్యక్షులు బోల్ల సుదర్శన్ ఆధ్వర్యంలో గురువారం నూతన మండల కమిటీ పదాధికారులు ఎన్నిక కావడం జరిగింది .మండల బిజెపి ప్రధాన కార్యదర్శులుగా మారోజు అనిల్ కుమార్ , లోడే లింగస్వామి ,ఉపాధ్యక్షులుగా దయ్యాల వెంకటేష్, డోగిపర్తి సంతోష్, గంగాదారి దయాకర్, వేల్పుల కొమరెల్లి, రుద్రపల్లి మచ్చ గిరి ,రావుల పద్మా రెడ్డి, కార్యదర్శులుగా మైసోల్ల చిన్న మత్స్యగిరి బైరు మల్లేశం, మందుల నాగరాజు ,చిలకమర్రి లావణ్య, కొండపర్తి రాజేష్, గంగాపురం నరేష్ ,కోశాధికారిగా అప్పిశెట్టి సంతోష్, బీజేవైఎం మండల అధ్యక్షులుగా మందాడి రంజిత్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలుగా చిన్నం అంజమ్మ, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా బొలుగుల భాగ్యమ్మ ,ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా వెలిమినేటి వెంకటేశం ,కిసాన్ మోర్చా అధ్యక్షులుగా కొత్త రామచంద్రం, దళిత మోర్చా అధ్యక్షులుగా పల్లెర్ల నరసింహ,మండల సోషల్ మీడియా కన్వీనర్ గా రాస శ్రీశైలంలను నియమించడం జరిగింది వారందరికీ అద్యక్షులు బోల్ల సుదర్శన్ నియామక పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు CN రెడ్డి ,పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి, జిల్లా సెక్రెటరీ కొప్పుల యాదిరెడ్డి అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ,BJYM జిల్లా సెక్రటరీ రేగూరి అమరేందర్ ,కనతల అశోక్ రెడ్డి, శీలోజు శ్రీరాములు, బచ్చు శ్రీనివాస్, కందుల తానేష గౌడ్ మంద నరసింహ, బందారపు రాములు బుంగమట్ల మహేష్,దంతూరి అరుణ్ ,ఏర్రబొలు జంగయ్య, బర్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేత


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో బుధవారం వల్లమల పెద్ద నర్సింహ మృతి చెందడంతో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సౌజన్యంతో కుంభం ప్రేమలత శ్రీనివాస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో 5,000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  గ్రామశాఖ అధ్యక్షుడు పీసరి వెంకట్ రెడ్డి ఉపాధ్యక్షుడు కొంత ఎల్లగౌడ్ ,బిక్షపతి , కార్యదర్శి చిన్నం స్వామి , కందాటి సోమిరెడ్డి , అరూరు నరసింహ ,వెంకటయ్య ,అంజయ్య ,చాంద్ పాషా ,లక్ష్మీనర్సయ్య ,తదితరులు పాల్గొనడం జరిగింది.

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీబీనగర్ జడ్పిటిసి


యాదాద్రి భువనగిరి జిల్లా  స్త్రీ, శిశు సంక్షేమ స్థాయి సంఘం చైర్మెన్ బీబీనగర్ జడ్పీటిసీ గోలి ప్రణీత పింగల్ రెడ్డి దంపతులు, బీబీనగర్ మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గురువారం ఉదయం హైదరాబాదులో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మరో వంద మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ లో చేరారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తున్నందుకే కాంగ్రెస్ లో చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొట్టోల్ల శ్యామ్ గౌడ్, బీబీనగర్ మండల నాయకులు ,కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.

గోపి ఆశయ సాధన కోసం మతోన్మాదం పై పోరాటం, సిఏఏ వెనుక కొట్టాలి: మాటూరు బాలరాజు, దోనూరు నర్సిరెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు


అమరజీవి కామ్రేడ్ తీరందాసు గోపి చిన్నతనం నుండి విద్యార్థి ఉద్యమంలో యువజన ఉద్యమంలో కీలకపాత్ర పోషించి సిపిఎం పార్టీ నిర్మాణంలో రాష్ట్ర కమిటీ సభ్యునిగా కార్మిక సంఘం నేతగా అనేక ఉద్యమాలు నిర్వహించి పార్టీ క్యాడర్ ను ఉద్యమాల వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారని వారి ఆశయ సాధన కోసం రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మతోన్మాదంపై పోరాటం సాగించి బిజెపిని ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరు బాలరాజు, దోనూరు నర్సిరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక కందాల రంగారెడ్డి స్మారక భవనంలో తిరందాసు గోపి అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన స్టడీ సర్కిల్ లో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ

పదేండ్ల కాలంలో అధికారంలో ఉన్న బిజెపి మతోన్మాదం ముసుగులో సిఏఏ ను తీసుకురావాలని ప్రయత్నం చేస్తుందని సిఏఏ వల్ల దేశానికి జరిగే ప్రయోజనం ఏమీ లేదని సెక్యులర్ దేశంగా ఉన్న భారతదేశాన్ని మతాల పేరుతో కులాల పేరుతో విడదీయాలని కుట్ర బిజెపి చేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మతాన్ని ప్రాతిపదికగా చేసుకొని బిజెపి భారతదేశాన్ని హిందుత్వ దేశంగా మార్చాలని చూస్తుందని దీనిని వామపక్షవాదులు అభ్యుదయవాదులు మేధావులు విద్యార్థి యువజనులు వ్యతిరేకించాలని సిఏఏకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు ప్రత్యక్షంగా నడపాలని వారు పిలుపునిచ్చారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించాలని ప్రజా ఉద్యమాలను బలపరచాలని ప్రజల తరఫున పోరాడే సిపిఎం ను పార్లమెంటుకు పంపాలని వారు కోరారు. వీరితోపాటు మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, ఎండి పాషా,గడ్డం వెంకట్, స్టడీ సర్కిల్ బాధ్యులు అవ్వరు గోవర్ధన్, తడక మోహన్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బొజ్జ బాలయ్య, రాగిర్ కిష్టయ్య, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

BJYM యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా రేగూరి అమరేందర్ నియామకం


 భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా సెక్రటరీగా వలిగొండ మండల కేంద్రంకు చెందిన రేగురి అమరేందర్ ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి జిల్లా అద్యక్షులు పాశం భాస్కర్, BJYM జిల్లా అద్యక్షులు పట్నం కపిల్ నియామక పత్రం ను వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తన ఎన్నికకు సహకరించిన వలిగొండ మండల అద్యక్షులు బోల్ల సుదర్శన్,పార్లమెంట్ కన్వినర్ బందారపు లింగ స్వామి ,జిల్లా సెక్రటరీ కొప్పుల యాదిరెడ్డి,అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ, దంతూరి సత్తయ్య,మాజీ మండల అద్యక్షులు నాగెళ్లీ సుధాకర్ గౌడ్ ,సీనియర్ నాయకులందరికీ ధన్యవాదములు తెలియజేస్తూ ...పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తానని గ్రామాల్లో పార్టీ పటిష్టతకు పని చేస్తానని,పార్టీ పిలుపు మేరకు పని చేస్తానని వారు అన్నారు.

భువనగిరి సిపిఎం పార్లమెంట్ అభ్యర్థిగా ఎండి జహంగీర్


లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయునట్లు సిపిఎం బుధవారం అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలలో సింగిల్ గానే బరిలోకి దిగుతామని తెలిపింది. భువనగిరి పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని సైతం ప్రకటించింది. సిపిఎం భువనగిరి అభ్యర్థిగా జహంగీర్ పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ వీరయ్య తెలిపారు. మిగిలిన 16 పార్లమెంట్ స్థానాలకు త్వరలోనే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని అన్నారు. భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన వారు. గతంలో మునిపంపుల గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్నారు

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిని పరిరక్షించాలి:BKMU


తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలోని ఎమ్మెస్సార్ ఫంక్షన్ హాల్ లో ఉప్పల ముత్యాలు అధ్యక్షతన జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య మాట్లాడుతూ 

నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కలకొండ కాంతయ్య కోరారు. మంగళవారం మండల కేంద్రంలో జరిగిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశంలో మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని, కూలీలకు నీడ కోసం టెంట్లు వేయాలని, వాటర్ సౌకర్యం కల్పించాలని కోరారు. పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లను మంజూరు చేయాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం తో పాటు ఇంటి నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలతోపాటు రాష్ట్రంలో ఉన్న మిగులు భూములను భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేయాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు మాట్లాడుతూ పార్టీ సభ్యత్వాలను త్వరగా పూర్తిచేయాలని, పార్టీ నాయకులు కార్యకర్తలు అందుబాటులో ఉండి వారు చూపే సమస్యలకు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని కోరారు. పార్టీ నాయకత్వము బాధ్యతతో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వీరస్వామి, సహాయ కార్యదర్శి జెట్ట రాములు, సిపిఐ మండల కార్యదర్శి జల్ది రాములు, ప్రజానాట్యమండ జిల్లా కార్యదర్శి చెక్క వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు భారతమ్మ, సిపిఐ మండల నాయకులు మారుపాక వెంకటేశం, సోలిపురం లింగారెడ్డి, జక్క దయాకర్ రెడ్డి, సుల్తాన్ పురుషోత్తం, గుర్రం రాజమణి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, ఎం డి నయీమ్ తదితరులు పాల్గొన్నారు.