/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఎస్ఎఫ్ఐ జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన పవిత్రాత్మ పాఠశాల విద్యార్థినిలకు బహుమతులు అందజేత Vijay.S
ఎస్ఎఫ్ఐ జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన పవిత్రాత్మ పాఠశాల విద్యార్థినిలకు బహుమతులు అందజేత


విద్యార్థులు టాలెంట్ టెస్ట్ మాదిరిగానే 10వ తరగతి పరీక్షల్లో కూడా ఉన్నత ఫలితాలు సాధించాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు

*భారత విద్యార్థి ఫెడరేషన్ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో పదవ తరగతి జిల్లా స్థాయి టాలెంట్ నిర్వహించడం జరిగింది ఈ టాలెంట్ టెస్ట్ పరీక్షలలో మొదటి స్థానం మొదటి ద్వితీయ స్థానాలు సాధించిన పవిత్రాత్మ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థినీలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బహుమతులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు నిర్వహించడం వలన పరీక్షల పట్ల వారిలో ఉన్న భయాందోళన దూరం చేస్తూ వారిలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎస్ఎఫ్ఐ ప్రతి సంవత్సరం టాలెంట్ టెస్ట్ ద్వారా పరీక్షలకు ముందస్తుగా విద్యార్ధులను సిద్ధం చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా రెండు రోజుల్లో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు అందరూ మానసిక ఒత్తిడికి గురికాకుండా సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకొని మంచిగా పరీక్షలు రాసి తమ తమ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పరీక్షల్లో పాల్గొనబోయే విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేముల జ్యోతిబాసు నాయకులు మైసోల్ల నరేందర్ ఉపాధ్యాయులు పాండు , బాలశౌరి,తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా భువనగిరి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టౌన్ ప్రిన్స్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం MLC శ్రీమతి కల్వకుంట్ల కవిత అరెస్టుపై శనివారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమము చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్తు చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి , ఆలేరు మాజీ శాసనసభ సభ్యులు శ్రీ బూడిద బిక్షమయ్య గౌడ్ , యాదాద్రి భువనగిరి జిల్లా BRS పార్టీ అధ్యక్షులు శ్రీ కంచర్ల రామకృష్ణారెడ్డి , భువనగిరి జడ్పీటీసీ శ్రీ బీరు మల్లయ్య పాల్గొని మాట్లాడుతూ.. బి ఆర్ ఎస్ ను పార్లమెంట్ ఎన్నికల్లో ఎదుర్కొనలేకనే బిజెపి అరెస్టుల కు పాల్పడుతుందని అన్నారు. కాంగ్రెస్ బిజెపిలు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని ఉద్దేశంతో ఉన్నారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల శాఖ అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి పంజాల సతీష్ గౌడ్, మండల సీనియర్ నాయకులు కొలను దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అమరేందర్, బోడ్డు వెంకటేష్,మండల ప్రచార కార్యదర్శి పల్ల శ్రీనివాస్ రెడ్డి, BRS నాయకులు ఎర్ర శేఖర్ రెడ్డి, లక్ష్మీదేవి గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు జీల్కపల్లి బలరాజ్ భువనగిరి నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర స్థాయి కమ్యూనిటీ సేవా అవార్డు - 2024 పొందిన కొడారి వెంకటేష్, పద్మశ్రీ శాంత సిన్హా చేతుల మీదుగా ప్రధానం


 

 

 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా "సంకల్ప్ ఫౌండేషన్" ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రకటించిన రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డు లలో "కమ్యూనిటీ సర్వీస్ అవార్డు-2024" కు భువనగిరి కి చెందిన సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ ఎంపికైనారు. శుక్రవారం హైదరాబాద్ లోని చందానగర్ లోని హోటల్ స్వాగత్ రెసిడెన్సీ లో జరిగిన ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ శాంతా సిన్హా మేడం చేతులమీదుగా కొడారి వెంకటేష్ అవార్డు ను అందుకున్నారు. "సంకల్ప్ ఫౌండేషన్ " ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రస్థాయిలో వివిధ రంగాలలో సేవలందించిన, మరియు ప్రత్యేక ప్రతిభను కనబరిచిన వారికి ఈ అవార్డులను అందజేశారు. ముఖ్యంగా వ్యవసాయ, చేనేత, పారిశుద్ధ్య, పారిశ్రామిక, మహిళా హక్కుల, మహిళా సాధికారత, పిల్లల హక్కుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, ఆద్యాత్మిక ,తదితర అంశాలపై పనిచేసిన వారిని గుర్తించి అవార్డులు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గత దశాబ్ద కాలంగా, పిల్లల హక్కుల పరిరక్షణ కోసం , మహిళా సాధికారత కోసం కృషి చేసిన కొడారి వెంకటేష్

రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ పిల్లల హక్కుల కోసం, మహిళా సమానత్వం కోసం నిరంతరం కృషి చేస్తున్న మా మార్గదర్శి పద్మశ్రీ శాంతా సిన్హా మేడం చేతులమీదుగా అవార్డును అందుకోవడం చాలా గర్వంగా, మరియు ఆనందంగా ఉందన్నారు. సంకల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రోజీ గండ్ర మేడం ఆద్వర్యంలో లభించిన ఈ అవార్డుతో సామాజిక భాద్యత మరింత పెరిగిందన్నారు. నాతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ చింత కృష్ణ, యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఎర్ర శివరాజ్, సూర్యాపేట జిల్లా పీపుల్స్ ఫౌండేషన్ డైరెక్టర్ యాతాకుల సునీల్ లు ఎక్సలెంట్ అవార్డులకు ఎంపికైనారని ఆయన తెలిపారు. రాష్ట్ర స్థాయి ఎక్సలెన్స్ అవార్డు ఎంపికకు సహకరించిన వికారాబాద్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఇ. వెంకటేష్, సభ్యులు ధనసిరి ప్రకాష్ లకు కొడారి వెంకటేష్ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు

మోట కొండూరు మండల కేంద్రంలో మాన్యవార్ కాన్షిరాం జయంతి


యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో మాన్యవార్ కాన్సిరాం జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఉద్యోగం వ్యక్తిగత జీవితం సంపాదన ఇంటిని ఇలా అన్నింటినీ వదిలేసి సమాజంలోని సబ్బండ వర్ణాలను కలిపి ఆనాడు భగవాన్ బుద్ధుడు చెప్పిన బహుజన హితాయ బహుజన సుఖాయ లక్ష్యం సాధించి చూపి బాబాసాహెబ్ అంబేద్కర్ మాటలను నిజం చేసిన మహానుభావుడు కాన్సీరామ్ అని అన్నారు. సైకిల్ మీద తిరుగుతూ లక్షల మందిని కలిసి మహనీయుల మార్గంలో సమాజాన్ని నిర్మించిన ధీరుడు కాన్షిరాం. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ జిల్లా కార్యదర్శి కుసంగుల కుమార్ మండల కన్వీనర్ శ్రీను నరసింహ శ్రీకాంత్ భట్ల శ్రీను గంధ మల్ల నాని యాదగిరి కిష్టయ్య బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట ఆలయ ఈవో గా భాస్కర్ రావు నియామకం


యాదాద్రి భువనగిరి జిల్లా లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయ ఇన్చార్జి ఈవో రామకృష్ణారావు పై ప్రభుత్వం బదిలీ వేటి వేసింది. ముఖ్యమంత్రి పర్యటనలో ప్రోటోకాల్ విషయంపై నిర్లక్ష్యం చేశాడు అని బదిలీ చేసిన దేవాదాయ ధర్మాదాయ శాఖ. యాదగిరిగుట్ట కొత్త ఆలయ ఈఓ గా భాస్కర్ రావు నియామకం. యాదాద్రి భువనగిరి జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తు సస్పెండ్ అయిన భాస్కర్ రావు  తిరిగి యాదగిరిగుట్ట ఈవోగా నియమితులయ్యారు.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: ధర్మసమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ నల్ల నరేందర్


ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్ మహరాజ్ గారిపై వ్యక్తిగతంగా అనవసరంగా మాట్లాడి దూషించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ క్షమాపణ 48 గంటల్లో చెప్పాలని ధర్మసమాజ్ పార్టీ జిల్లా కమిటీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ధర్మసమాజ్ పార్టీ కార్యకర్తలను సైకోలు అని సంబోధించడం విశారదన్ మహరాజ్ గారి కుటుంబ వ్యవహారాలు మాట్లాడటం పై ధర్మ సమాజ్ పార్టీ యాదాద్రి జిల్లా కమిటీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తా ఉంది ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ నల్ల నరేందర్ మాట్లాడుతూ.....

 ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బహుజన సిద్ధాంతాన్ని సర్వనాశనం చేస్తున్నారని నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు... మహనీయుల పోరాట స్ఫూర్తితో ఏర్పడినటువంటి బహుజన వాదాన్ని పూటకో మాట మారుస్తూ సిద్ధాంతానికి విలువ లేకుండా చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ఆ పార్టీ పగ్గాలు విడిచి హిమాలయాలకు వెళ్లిపోవాలని రాజకీయ సన్యాసం తీసుకోవాలని తెలియజేస్తాము....

 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తూ నాగర్ కర్నూల్ లో పదివేల మంది కార్యకర్తలతో వచ్చి నువ్వు అగ్రకులాల పార్టీ లతో కలిసి చేస్తున్నటువంటి కుట్రని ప్రజలందరికీ తెలియజేసి నిన్ను ఓడకొట్టడానికి సిద్ధపడతామని తెలియజేస్తున్నాను... 

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మహేష్, నకిరేకంటి నరేందర్, ch వెంకటేష్ లు పాల్గొన్నారు....

నూతన వధూవరులను ఆశీర్వదించిన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్


యాదాద్రి భువనగిరి జిల్లా 

భువనగిరి పట్టణ పరిధిలోని శ్రీ సాయి కన్వెన్షన్ హాల్ లో వలిగొండ మాజీ సర్పంచ్ బోళ్ల లలిత శ్రీనివాస్ ల కూతురు శిరీష - ప్రణయ్ ముధిరాజ్ ల వివాహానికి హాజరై నూతన వధూవరుల ని ఆశీర్వదించిన భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ . ఈ కార్యక్రమంలో వలిగొండ మండల బిజెపి అధ్యక్షులు బోళ్ల సుదర్శన్, మాటూరు కిట్టు, మాటూరు వెంకటేష్, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

కేంద్రంలో అధికారంలోకి రాబోయేది బిజెపి ప్రభుత్వమే: కొత్త రామ చంద్రు బిజెపి మండల నాయకులు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ మండల నాయకులు కొత్త రామచంద్రు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంచేపట్టబోయేది బిజెపి ప్రభుత్వమే అని నరేంద్ర మోడీ ప్రధానిగా మూడవసారి ప్రమాణస్వీకారంచేయబోతున్నారని ఆయన అన్నారు.ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక తీసుకున్న ఆర్థిక సంస్కరణలు గానీ అభివృద్ధి కార్యక్రమాలు గాని దేశ విదేశాల్లో భారతదేశ విశిష్టతను పెంపొందించి ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు తెచ్చారని ప్రపంచ దేశాలలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడని కొత్త కొత్త ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి కుటుంబాల వారికి న్యాయం చేకూర్చాలని గత పది సంవత్సరాల కాలంలో దేశం పురోగతిని సాధించిందని, రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్తారని ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు.అందుకే ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి మరొకసారి మోడినిప్రధానమంత్రిగా గెలిపించాలని అప్పుడే దేశం మరింత అభివృద్ధినిసాధిస్తుందని కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టి, బడుగు బలహీన మధ్యతరగతి కుటుంబాల వారికి సమన్యాయం జరుగుతుందని వారన్నారు.భువనగిరి పార్లమెంటు స్థానానికి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ నిలబడడం జరిగింది. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి భువనగిరి గడ్డపై బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ని గెలిపించి దేశంలో భువనగిరి చరిత్రను తిరగ రాయాలని ఆయన అన్నారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను వెంటనే పరిష్కరించాలి: MRPS


యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ మరియు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు కోళ్ల జహంగీర్ మాదిగ బుధవారం డిసిపి రాజేష్ చంద్ర ని కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం

యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులను వెంటనే పరిష్కరించాలని ఈ మధ్యకాలంలో అట్రాసిటీ కేసులైనటువంటి ఎఫ్ఐఆర్ కాగానే నిందితుని అరెస్టు చేయకుండా జాప్యం చేస్తూ వెంటనే అట్రాసిటి కేసు నమోదు కాగానే ఎఫ్ఐఆర్ అయిన వెంటనే నిందితున్ని అరెస్ట్ చేసి శిక్షించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.

            

       

కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ టికెట్ ను చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలి తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ యాదవ్


కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ టికెట్ ను పీసీసీ ఉపాధ్యక్షులు,యువ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కేటాయించాలని సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (TSP) రాష్ట్ర అధ్యక్షుడు& ఓయూ జేఏసీ అధ్యక్షుడు బారి అశోక్ యాదవ్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పార్టీ బలోపేతానికై అహర్నిశలు కృషిచేసిన నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారని ఆయన చేసిన కృషికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరియు పిసిసి అధ్యక్షులు,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తించి భువనగిరి పార్లమెంటు స్థానాన్ని కేటాయిస్తే 3 లక్షల మెజార్టీ కోసం ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరఫున ఏడు నియోజకవర్గాల్లో కష్టపడి గెలుపుకై కృషి చేస్తామని తెలిపారు. ఈ మధ్యకాలంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎల్లప్పుడూ కష్టపడుతూ పార్లమెంట్ పరిధిలో, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకై కృషి చేశారని అన్నారు.