/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు పై సస్పెన్షన్ వేటు Vijay.S
యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు పై సస్పెన్షన్ వేటు


యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు పై సస్పెన్షన్ వేటు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సస్పెన్షన్ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారం ఇవ్వడంతో చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి జిల్లా ఎడిషనల్ కలెక్టర్ భాస్కరరావు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని, ప్రభుత్వం దృష్టికి వచ్చింది. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన సూచనలను ఉల్లంఘించి ,భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి తన బదిలీని తప్పించుకున్నందుకు ,విధుల పట్ల నిర్లక్ష్యం చేసినందుకు, సస్పెండ్ చేస్తూ ...ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కలిసిన చిత్తాపురం అంబేద్కర్ యువజన సంఘం నాయకులు


 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం చిత్తాపురం గ్రామానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం నాయకులు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని హైదరాబాదులో తన నివాసంలో కలిసి గ్రామంలో అంబేద్కర్ కమ్యూనిటీ భవనం నిర్మాణముకు నిధులు కేటాయించాలని కోరగా వారు స్పందిస్తూ బడ్జెట్ నిధులు కేటాయించగానే మీకు అంబేద్కర్ భవనం సాంక్షన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి సంబంధించిన సాగునీటి సౌకర్యం కొరకు భీమ లింగం కాల్వ పొడిగింపులో చిత్తాపురం వరకు కాల్వ మరమ్మతులు చేయించాలని  మరియు ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి ఉన్నందున ప్రత్యేక బోరు వేయించాలని కోరగా ఆరు స్పందిస్తూ తక్షణమే గ్రామంలో బోరు వేయించి తాగునీటి ఎద్దడి తీరుస్తానని మరియు సాగునీరు వచ్చే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగినది  .ఈ కార్యక్రమంలో పీసరి వెంకటరెడ్డి ,చేగురు మచ్చగిరి, ఆరూరు నరసింహ ,కందాటి సోమిరెడ్డి ,బోడ విజయ్ కుమార్ ,వలమాల అంజయ్య ,వలమాల కుమార్ ,లింగస్వామి, రాములు ,ధర్మయ్య ,యాదయ్య ,దాసు, పీసరి ఉప్పల్ రెడ్డి ,అరూరు వెంకటయ్య  ,తదితరులు పాల్గొన్నారు.

టేకుల సోమవారం ఎఫ్ సి ఐ గోదాములలో భారీ అగ్నిప్రమాదం


యాదాద్రి భువనగిరి జిల్లా మండలం నాగిరెడ్డిపల్లి - టేకుల సోమవారం గ్రామాల మధ్య గల ఎఫ్ సి ఐ గోదాములలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది .భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు ప్రమాదానికి కారణ వివరాలు తెలియాల్సి ఉంది. పోలీస్ ,ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. గోదాములలో ఉన్న పత్తి పూర్తిగా దగ్ధమైనది.

జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రూపొందించిన పార్లమెంట్ ఎన్నికల కరపత్రాలు ఆవిష్కరించిన భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రూపొందించిన పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో..డోర్ టూ డోర్ కరపత్రాలు అవిస్కరించిన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు పట్టణ అధ్యక్షుడు కూర వెంకటేష్. పార్లమెంట్ ఇంఛార్జి యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలిమినేటి సురేష్ జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్. నియోజకవర్గ అధ్యక్షుడు అవేజ్ చిస్తి. జిల్లా ప్రధాన కార్యదర్శి చేగురి బాలు సోషల్ మీడియా కార్యదర్శి నితిన్ కుమార్ సూపర్ శ్రీ కోఆర్డినేటర్ శ్రీలత ,సాయి తదితరులు ఉన్నారు.

విద్యార్థుల కు స్కాలర్షిప్ ,ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి: మల్లం వెంకటేశం గౌడ్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి


హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద ఆదివారం సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని సొంత భవనాలు కట్టించాలని, స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని , విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలు పెంచాలని వేలాదిమంది విద్యార్థులతో ఆదివారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మల్లం వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ... విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన బీసీ విద్యార్థి సంఘం నేతలు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేక వలిగొండ మేజర్ గ్రామపంచాయతీ అస్తవ్యస్యం; దంతూరి సత్తయ్య గౌడ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా టెలికం బోర్డు మెంబర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని మేజర్ గ్రామపంచాయతీ వలిగొండ లో రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేక ఇంచార్జి కార్యదర్శితో పాలన సాగిస్తున్న గ్రామపంచాయతీ వలిగొండ మేజర్ గ్రామపంచాయతీ వలిగొండ పరిధిలోని వివిధ పనులను అస్తవ్యస్తంగా ఇంచార్జి పాలనలో నడిపిస్తున్న రని ఆదివారం రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ఉమ్మడి నల్లగొండ జిల్లా టెలికం బోర్డు మెంబర్ దంతూరి సత్తయ్య పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వలిగొండ మండలం జిల్లాలోని 37 గ్రామపంచాయతీలు గల పెద్ద మండలం అని అందునా వలిగొండ మేజర్ గ్రామపంచాయతీ కావడం మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇళ్ల నిర్మాణాలు తదితర పనుల నిమిత్తం వలిగొండలో నివసిస్తూ ఉంటారు. ఈ మేజర్ గ్రామపంచాయతీకి గత రెండు సంవత్సరాలుగా ఇంచార్జి కార్యదర్శి తో పాలనను జిల్లా అధికారులు నడిపిస్తున్నరని ఆయన అన్నారు.

వలిగొండ మేజర్ గ్రామపంచాయతీలో పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పట్టించుకోని అధికారులని ఆయన అన్నారు. వేసవికాలంలో నీటి ఎందడి ఏర్పడుతుందని ఈ విషయంపై భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఇప్పటికైనా వలిగొండ మేజర్ గ్రామపంచాయతీకి రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని నియమించి మేజర్ గ్రామపంచాయతీలో గల పలు సమస్యలపై దృష్టి సారించి నీటి ఎందడి నివారించగలరని ఆయన అన్నారు. వలిగొండ మేజర్ గ్రామపంచాయతీలో వివిధ గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఈ ఇళ్ల నిర్మాణాల అనుమతిలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని ఈ అవకతవకలను అరికట్టాలంటే మేజర్ గ్రామపంచాయతీ అయిన వలిగొండకు రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను నియమించాలని ఆయన అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సొంత గ్రామమైన వలిగొండ మేజర్ గ్రామపంచాయతీకి రెగ్యులర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియమించి వలిగొండ గ్రామ పంచాయతీలో అవకతవకలు జరగకుండా పాలనను సజావుగా నడిపించే విధంగా చూడాలని ఆయన కోరారు.

వలిగొండ : నాగారం బట్టి మైసమ్మ ఆలయం లో హుండీ లెక్కింపు


బట్టి మైసమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు 

వలిగొండ : మండలంలోని నాగారంలోగల శ్రీ బట్టి మైసమ్మ ఆలయంలో గల హుండీలను ఆదివారం లెక్కించగా ఒక సంవత్సర కాలానికి గాను 1,16,600 రూపాయలు లభించినట్లు గ్రామస్థులు తెలిపారు.ఈ కార్యాక్రమంలో బెలిదె నాగేశ్వర్,BSR శ్రీనివాస్, గోళ్ల పెద్ద బిక్షపతి, పోలు నాగయ్య,బర్ల సత్తయ్య, మైసోళ్ల సత్యం, అల్లి వెంకటేశం,ఎల్లంకి స్వామి, తదితరులు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట: ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి


 దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం యాదగిరిగుట్ట డిపో దగ్గర కార్మికులు యూనియన్ల కు అతీతంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ టీ ఎస్ ఆర్టీసీ ని, ప్రభుత్వం లో విలీనం చేసి కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలని, పెండింగ్ లో ఉన్న రెండు పీఆర్సీల డబ్బులు వెంటనే చెల్లించాలని, ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన బంద్ కాలం నాటి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్టీసీ కార్మికుల సమస్యలను తెలియజేయుట కొరకే ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టామని వారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్మికుల పక్షపాతిగా, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో యాదగిరిగుట్ట డిపో ఆర్టీసీ కార్మికులు మురళి, కృష్ణయ్య, కుమార్, రమేష్ ,యాదగిరి, నగేష్, వెంకటేష్, కార్మికులు పాల్గొన్నారు.

నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిద్దాం ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్


NEP కి వ్యతిరేకంగా AISF ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఐదు కోట్ల సంతకాల సేకరణలో భాగంగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డ గూడూరు మండలం గట్టుసింగారం గ్రామంలో సంతకాల సేకరణకు మద్దతు తెలిపి అడ్డగూడూరు మండలంలో సంతకాల సేకరణను ప్రారంభించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గారు*

అనంతరం ఎమ్మెల్యే సామేల్ గారు మాట్లాడుతూ అణగారిన వర్గాలకు విద్యను దూరం చేసే నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

 అనంతరం ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ ....

విద్యా కాషాయీకరణ, విద్యా ప్రైవేటీకరణ కోసమే నూతన విద్యా విధానాన్ని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు. 

 రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం-2020 సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు తిరస్కరించాలని కోరారు. 

విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలని అన్నారు.

ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర అమలు చేస్తున్నారని, దానిలో భాగమే కేంద్రంలో నూతన జాతీయ విద్యావిధానం-2020 తీసుకొచ్చారని విమర్శించారు. విద్యా కార్పొరేటికరణ, కాషాయికరణ చేయాలని కేంద్రం కుట్ర పన్నుతోందని అన్నారు. దేశంలో జాతీయ విద్యా విధానం వల్ల దాదాపు 90% విద్యార్థులు నాణ్యమైన విద్య పొందే హక్కును కోల్పోతారని, విద్యా వ్యాపారీకరణ వలన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు సామాజిక న్యాయం దూరం చేసే విధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వానికి బదులు హిందుత్వ రాజ్యాన్ని స్థాపించడానికి బాటలు వేస్తున్నారని ఆరోపించారు. 

ఈ కార్యక్రమంలో టిపిసిసి నాయకులు ఇటుకల చిరంజీవి గారు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పోలేబోయిన లింగయ్య యాదవ్ , వివిధ గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వంశీ, అడ్డగూడూరు మండల నాయకులు కళ్యాణ్, లోకేష్ , వంశి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సర్నెని గూడెం గ్రామంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు నుండి జారిపడి గీత కార్మికుడు మృతి


ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి పడి ప్రాణాలు కోల్పోయిన కల్లుగీత కార్మికుడు రామన్నపేట మండలం సర్నేని గూడెం గ్రామానికి చెందిన నీల నరసింహ వయసు 62 సంవత్సరాలు అతనికి భార్య ముగ్గురు పిల్లలు ఒక్క కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారుఇతని కుటుంబాన్ని కిప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి ప్రభుత్వం ఆదుకోవాలని కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాయగిరి కిష్టయ్య కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కార్యదర్శులు ఎర్ర రవీం దర్ పులి బిక్షం అంకిటి శీను తానిషా కోరారు