/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz సైన్స్ ఫెయిర్ విద్యార్థుల్లో శాస్త్ర ,సాంకేతిక రంగాల పట్ల అవగాహన: మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్, న్యాయవాది: కొండూరు బాలరాజు Vijay.S
సైన్స్ ఫెయిర్ విద్యార్థుల్లో శాస్త్ర ,సాంకేతిక రంగాల పట్ల అవగాహన: మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్, న్యాయవాది: కొండూరు బాలరాజు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని montessori లో

 సైన్స్ ఫేర్ లతో విద్యార్థులలో శాస్త్ర, సాంకేతిక రంగాల పట్ల అవగాహన పెరుగుతుందని పాఠశాల డైరెక్టర్,న్యాయవాది

 కొండూరు బాలరాజు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో

జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ సర్ సీవీ రామన్ రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న రోజు ఫిబ్రవరి 28న ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పాఠశాలలో జరుపుతారనీ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన పర్యావరణ, అటవీ,గ్లోబల్ వార్మింగ్ , చంద్రాయన్ అంతరిక్ష నమూనాలతో పాటు వివిధ సైన్స్ ప్రదర్శనలను విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించగా సైన్స్ ఫెయిర్ లోని నమూనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం.థామస్ అబ్రహం, అనూప్, సాండ్రా, మహేష్, జేరిన్, మనూ, డార్లి, కావ్య, స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా పోతంశెట్టి వెంకటేశ్వర్లు ఎన్నిక

యాంకర్ పార్ట్; భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను బుధవారం 11 గంటలకి నిర్వహించారు. బీఆర్ఎస్ కు చెందిన చైర్మన్ ,వైస్ చైర్మన్ లపై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఈరోజు నిర్వహించిన భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో భువనగిరి పట్టణం 29 వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనారు. భువనగిరి మున్సిపాలిటీలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉండగా చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు కి 18 మంది చేతులెత్తి మద్దతు తెలిపినారు. పోతంశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్ గా ఎన్నికల అధికారి డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ ప్రకటించారు. ఈ సందర్భంగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చైర్మన్ వెంకటేశ్వర్లు కు అభినందనలు తెలియజేశారు.

వెలువర్తి గ్రామంలో కిడ్నాపర్ల భయాన్ని తొలగించి, అవగాహన కల్పించిన వలిగొండ ఎస్సై మహేందర్ లాల్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో మంగళవారం రాత్రి వలిగొండ ఎస్సై డి మహేందర్ లాల్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజల్లో కిడ్నాపర్ల గురించి భయాన్ని తొలగించి, నేరాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...ఈరోజు ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు గ్రామంలో తిరుగుతుంటే గ్రామస్తులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కి అప్పగించారని అన్నారు. కిడ్నాపర్ల గురించి గ్రామస్తుల్లో ఉన్న భయాన్ని తొలగించడానికి ..గ్రామస్తులు, యువకులతో కలిసి గ్రామంలో తిరిగామని అన్నారు. ఇటీవల దొంగతనాలు పెరిగాయని దొంగతనాలు పట్ల , నేరాలు సైబర్ నేరాల గురించి ప్రజలకి అవగాహన కల్పించామని అన్నారు .ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య


రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు రాష్ట్ర,ఆలేరు నియోజకవర్గ ప్రజల తరపున రాష్ట్ర ప్రభుత్వనికి,గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి,మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మంగళవారం రోజు రాష్ట్ర సచివాలయంలో 500కే గ్యాస్,200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య గారు పాల్గొన్నారు.

ఆరు గ్యారెంటీల్లో మరో రెండు గ్యారెంటీలను అమలు చేసినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు.జీవో రిలీస్ చేసినందుకు గ్యారెంటీల అమలుకు దశ దిశ నిర్దేశం చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

స్వరాజ్య పాదయాత్ర స్ఫూర్తితో రాజ్యాధికారాన్ని సాధించుకుందాం :. ధర్మసమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ నల్ల నరేందర్


ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారాధన్ మహారాజ్ చేసిన 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర స్ఫూర్తితో బిసి,ఎస్సి,ఎస్టీలు రాజ్యాధికారాన్ని సాధించాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వినర్ నల్ల నరేందర్ అన్నారు. స్వరాజ్య పాదయాత్ర జిల్లా కేంద్రానికి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నందున స్థానిక హైదరాబాద్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన శిలా పలకానికి పులు వేశారు. ఈ సందర్బంగా నరేందర్ మాట్లాడుతూ రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సగాలని తెలిపారు. వేల సంవత్సరాలుగా అణచివేతకు గురైన కులాల ప్రజలకు రాజ్యాధికారం వల్ల మాత్రమే వారికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుందని అన్నారు. భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేస్తే భారత దేశం భూతల స్వర్గం అవుతుందని అన్నారు. కాని ఈ అగ్రవర్ణ పార్టీలు ఎప్పటికి ఆ పని చేయవన్నారు. అందుకే 93 శాతంగా ఉన్న మనమంతా ఏకమైతే మన స్వరాజ్యం ఏర్పడితుందని, అప్పుడు మనమే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసుకునే వీలుంటుందన్నారు. రాజ్యాధికార లక్ష్యంతొనె ధర్మ సమాజ్ పార్టీ ఏర్పడిందన్నారు. డిఎస్పీ పార్టీలో చేరి మన బావి తరాల భవిష్యత్ మార్చుందన్నారు. ఈ కార్యక్రమంలొ జిల్లా కో కన్వినర్ సందేల మహేష్, జిల్లా నాయకులు వెల్వర్థి శ్రీకాంత్, జమ్ముల శ్రీకాంత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 28 నుండి జరుగు ఇంటర్ పరీక్షలకు విద్యార్థుల పరీక్ష సమయానుకూలంగా బస్సులు నడపాలి: వేముల నాగరాజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు


భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు పాల్గొని మాట్లాడుతూ

ఈనెల 28 నుండి జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు సమయానుగుణంగా బస్సులు గ్రామాల నుండి పట్టణాల వరకు నడపాలన్నారు కనీసం కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం ఉన్న రానట్టి పరిస్థితి ఉన్నది ప్రభుత్వం వెంటనే ఇది సరి చేయాలన్నారు పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పరీక్షలు అయిపోయేంతవరకు అన్ని గ్రామాలకు పరీక్షల సమయానుకూలంగా మరిన్ని బస్సులు నడపాలని ఎస్ఎఫ్ఐ విద్యార్ధి సంఘంగా తెలిపారు .

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేముల జ్యోతిబాస్, మైసొల్ల నరేందర్ ఫర్దిన్ తదితరులు పాల్గొన్నారు.

భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోయి నష్టపోతున్న రైతంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి :ఎండి జహంగీర్ సిపిఎం జిల్లా కార్యదర్శి


భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు .

మంగళవారం రోజున మండల కేంద్రంలోని సిపిఎం మండల కార్యాలయంలో మద్దెల రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో జహంగీర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇటీవల కాలంలో బునాది గాని కాలవ లో నీరు లేకపోవడం వల్ల దానిపై ఆధారపడ్డ సుమారు 10 గ్రామాల్లో వరి పంటను సాగు చేస్తున్న రైతులు నీరు లేక భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోయి నష్టపోతున్న రైతులందరిని ఆదుకోవాలని  మరొకవైపున నీరు సక్రమంగా లేకపోవడంతో మోటార్లు కాలిపోతున్నాయని ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన రైతులందరినీ గుర్తించి ఎకరానికి 20 వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ డిమాండ్ చేశారు బీబీనగర్ మక్తఅనంతారం గ్రామం వద్ద మూసి నీటిని బునాది గాని కాలువలోకి మళ్లించి పొట్ట దశలో ఉన్న పంటలను కాపాడాలని కరెంటు కోతలు లేకుండా 9 గంటల కరెంటును ఇవ్వాలని డిమాండ్ చేశారు.

...ఫిబ్రవరిలోనే నీటి ఎద్దడి ఈరకంగా ఉందిని మార్చి ఏప్రిల్ లో మరింత ఎక్కువవుతుందని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని రైతాంగానికి సాగునీటితో పాటు ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశాన్ని దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు అమ్మకానికి పెడుతున్న మోడీ బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు

ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపళ్లి అనురాధ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,మండల కార్యదర్శివర్గ సభ్యులు చీర్క శ్రీశైలం రెడ్డి, తుర్కపల్లి సురేందర్, కల్కూరి రామచంద్రర్, గణపతి రెడ్డి,మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్య, మొగిలిపాక గోపాల్, గాజుల ఆంజనేయులు,వాకిటి వెంకటరెడ్డి,కందడి సత్తిరెడ్డి ఏలే కృష్ణ,కల్కూరి ముత్యాలు,కర్ణకంటి యాదయ్య,బుగ్గ చంద్రమౌళి,దుబ్బ లింగం,కవిడే సురేష్,భీమనబోయిన జంగయ్య,తదితరులు పాల్గొన్నారు.

తుమ్మల నర్సయ్య సేవాసమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత


,

వలిగొండ మండలం అరూరు గ్రామంలో తుమ్మల కంశమ్మ అనారోగ్యంతో మరణించినందున, మంగళవారం వారి కుటుంబ సభ్యులకు, తుమ్మల నరసయ్య సేవా సమితి ఆధ్వర్యములో పదివేల ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బండారు నరసింహారెడ్డి ,తుమ్మల శ్రీనివాస్, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.

బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా కొప్పుల యాదిరెడ్డి నియామకం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామానికి చెందిన కొప్పుల యాదిరెడ్డి బిజెపి జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ...గతంలో వర్కట్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షునిగా, యువమోర్చా మండల అధ్యక్షునిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట యువమోర్చా అసెంబ్లీ కన్వీనర్ గా, యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షులుగా బాధ్యత నిర్వహించడం జరిగిందని ఇప్పుడు జిల్లా కార్యదర్శిగా నియమించిన యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ కి నా నియామకానికి సహకరించిన రాష్ట్ర జిల్లా సీనియర్ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి సహాయ సహకారాలతో పార్టీని బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.

రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి అందుకున్న కొలనుపాక విద్యార్థులు


తెలంగాణ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్పెల్ విజార్డ్, డ్రామా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు డ్రామా పోటీల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతిని అందుకున్నారు. సోమవారం హైదరాబాద్ లోని జోడిమెట్ల అనురాగ్ యునివర్సిటీ లో

 జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థులు కుమారి రక్షిత, కుమారి దీపిక, కుమారి రుచిత, కుమారి సాహితీ, మరియు కుమారి శ్రావణి లు డ్రామా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. రామచంద్రయ్య , పాఠశాల ఉపాధ్యాయులు హసీనా బేగం, స్వరూపరాణి, మరియు ఇతర ఉపాధ్యాయులను రాష్ట్ర స్థాయిలో బహుమతిని పొందిన పాఠశాల విద్యార్థులను ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ అభినందించారు.