/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఈనెల 28 నుండి జరుగు ఇంటర్ పరీక్షలకు విద్యార్థుల పరీక్ష సమయానుకూలంగా బస్సులు నడపాలి: వేముల నాగరాజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు Vijay.S
ఈనెల 28 నుండి జరుగు ఇంటర్ పరీక్షలకు విద్యార్థుల పరీక్ష సమయానుకూలంగా బస్సులు నడపాలి: వేముల నాగరాజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు


భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు పాల్గొని మాట్లాడుతూ

ఈనెల 28 నుండి జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు సమయానుగుణంగా బస్సులు గ్రామాల నుండి పట్టణాల వరకు నడపాలన్నారు కనీసం కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం ఉన్న రానట్టి పరిస్థితి ఉన్నది ప్రభుత్వం వెంటనే ఇది సరి చేయాలన్నారు పరీక్షలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పరీక్షలు అయిపోయేంతవరకు అన్ని గ్రామాలకు పరీక్షల సమయానుకూలంగా మరిన్ని బస్సులు నడపాలని ఎస్ఎఫ్ఐ విద్యార్ధి సంఘంగా తెలిపారు .

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేముల జ్యోతిబాస్, మైసొల్ల నరేందర్ ఫర్దిన్ తదితరులు పాల్గొన్నారు.

భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోయి నష్టపోతున్న రైతంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి :ఎండి జహంగీర్ సిపిఎం జిల్లా కార్యదర్శి


భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు .

మంగళవారం రోజున మండల కేంద్రంలోని సిపిఎం మండల కార్యాలయంలో మద్దెల రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో జహంగీర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇటీవల కాలంలో బునాది గాని కాలవ లో నీరు లేకపోవడం వల్ల దానిపై ఆధారపడ్డ సుమారు 10 గ్రామాల్లో వరి పంటను సాగు చేస్తున్న రైతులు నీరు లేక భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోయి నష్టపోతున్న రైతులందరిని ఆదుకోవాలని  మరొకవైపున నీరు సక్రమంగా లేకపోవడంతో మోటార్లు కాలిపోతున్నాయని ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన రైతులందరినీ గుర్తించి ఎకరానికి 20 వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ డిమాండ్ చేశారు బీబీనగర్ మక్తఅనంతారం గ్రామం వద్ద మూసి నీటిని బునాది గాని కాలువలోకి మళ్లించి పొట్ట దశలో ఉన్న పంటలను కాపాడాలని కరెంటు కోతలు లేకుండా 9 గంటల కరెంటును ఇవ్వాలని డిమాండ్ చేశారు.

...ఫిబ్రవరిలోనే నీటి ఎద్దడి ఈరకంగా ఉందిని మార్చి ఏప్రిల్ లో మరింత ఎక్కువవుతుందని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని రైతాంగానికి సాగునీటితో పాటు ప్రజలకు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశాన్ని దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు అమ్మకానికి పెడుతున్న మోడీ బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు

ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపళ్లి అనురాధ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,మండల కార్యదర్శివర్గ సభ్యులు చీర్క శ్రీశైలం రెడ్డి, తుర్కపల్లి సురేందర్, కల్కూరి రామచంద్రర్, గణపతి రెడ్డి,మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్య, మొగిలిపాక గోపాల్, గాజుల ఆంజనేయులు,వాకిటి వెంకటరెడ్డి,కందడి సత్తిరెడ్డి ఏలే కృష్ణ,కల్కూరి ముత్యాలు,కర్ణకంటి యాదయ్య,బుగ్గ చంద్రమౌళి,దుబ్బ లింగం,కవిడే సురేష్,భీమనబోయిన జంగయ్య,తదితరులు పాల్గొన్నారు.

తుమ్మల నర్సయ్య సేవాసమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత


,

వలిగొండ మండలం అరూరు గ్రామంలో తుమ్మల కంశమ్మ అనారోగ్యంతో మరణించినందున, మంగళవారం వారి కుటుంబ సభ్యులకు, తుమ్మల నరసయ్య సేవా సమితి ఆధ్వర్యములో పదివేల ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బండారు నరసింహారెడ్డి ,తుమ్మల శ్రీనివాస్, కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.

బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా కొప్పుల యాదిరెడ్డి నియామకం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామానికి చెందిన కొప్పుల యాదిరెడ్డి బిజెపి జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ...గతంలో వర్కట్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షునిగా, యువమోర్చా మండల అధ్యక్షునిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట యువమోర్చా అసెంబ్లీ కన్వీనర్ గా, యువమోర్చ జిల్లా ఉపాధ్యక్షులుగా బాధ్యత నిర్వహించడం జరిగిందని ఇప్పుడు జిల్లా కార్యదర్శిగా నియమించిన యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ కి నా నియామకానికి సహకరించిన రాష్ట్ర జిల్లా సీనియర్ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి సహాయ సహకారాలతో పార్టీని బలోపేతానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.

రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి అందుకున్న కొలనుపాక విద్యార్థులు


తెలంగాణ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్పెల్ విజార్డ్, డ్రామా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు డ్రామా పోటీల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతిని అందుకున్నారు. సోమవారం హైదరాబాద్ లోని జోడిమెట్ల అనురాగ్ యునివర్సిటీ లో

 జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థులు కుమారి రక్షిత, కుమారి దీపిక, కుమారి రుచిత, కుమారి సాహితీ, మరియు కుమారి శ్రావణి లు డ్రామా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా కొలనుపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. రామచంద్రయ్య , పాఠశాల ఉపాధ్యాయులు హసీనా బేగం, స్వరూపరాణి, మరియు ఇతర ఉపాధ్యాయులను రాష్ట్ర స్థాయిలో బహుమతిని పొందిన పాఠశాల విద్యార్థులను ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ అభినందించారు.

ఈనెల 28న వరంగల్ లో జరిగే ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి


అఖిల భారత యువజన సమాఖ్య(ఏ ఐ వై ఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 28న వరంగల్, LB కళాశాల జయసేన ఆడిటోరియంలో వాయిస్ ఆఫ్ యంగ్ ఇండియా నినాదంతో ఏ ఐ వై ఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా "దేశ పాలకుల విధానాలు - నేటి యువత కర్తవ్యం" అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నారు

ఆత్మకూరు మండల కేంద్రంలోని కరపత్రం,గోడపత్రిక ఆవిష్కరణ ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ మాట్లాడుతూ 8 దశాబ్దాల స్వాతంత్య్రంలో కేంద్ర ప్రభుత్వం యువత శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేశాయన్నారు. దేశంలో 45 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని నేషనల్ సర్వే ఆర్గనైజేషన్లు లెక్కలు చెబుతున్నాయని, పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న వినాశకర ఆర్థిక విధానాల ఫలితంగా చదువుకు తగ్గ ఉద్యోగాలు రావడం లేదన్నారు. డిగ్రీలు, పి.జి.లు, పిహెచ్.డి.లు, బి.టెక్, ఎం.టెక్, ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., లా కోర్సులు చదివినవారు కూడా చివరకు రైల్వే గ్యాంగ్మెన్ ఉద్యోగాలకు,పోలీస్ కానిస్టేబుల్, హెూమ్ గార్డ్ ఉద్యోగాలకు లక్షల్లో పోటీపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఉద్యోగాలులేక, ఉపాధి అవకాశాలులేక వలసలు పోయే వారు కొందరైతే, మరికొంతమంది నిరాశ, నిస్పృహలతో డ్రగ్స్, కొకైన్, హెరాయిన్ లాంటి మత్తుమందులకు బానిసలవుతున్నారన్నారు. దేశానికి గొప్ప సంపదగా నిలవాల్సిన యువశక్తిని ప్రభుత్వాలు నేరస్థులుగా, ఉగ్రవాదులుగా, విచ్ఛిన్నకారులుగా మారుస్తున్నారని, తద్వారా రాజకీయాలపట్ల విముఖత కలిగేటట్లు యువతను తయారుచేస్తూ సంఘవిద్రోహ శక్తులు, అవినీతిపరులు, దోపిడీదారులు రాజకీయాల్లోకి ప్రవేశించి దేశాన్ని, ప్రజలను దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకున్న దేశ భవిష్యత్తును నవయవ్వనంతో తొణికిసలాడే యువత సరికొత్త భారతాన్ని నిర్మించడానికి ముందుకు రావాలని ఏ ఐ వై ఎఫ్ ఈ సదస్సు ద్వారా పిలుపునివ్వబోతున్నదని వారు స్పష్టంచేశారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు నరేంద్ర మోదీ ప్రభుత్వ కాషాయీకరణను జతచేసి వీటిని వేగంగా అమలుచేయుటకు కేంద్ర ప్రభుత్వం "జాతీయ విద్యా విధానం - 2020” ప్రవేశపెట్టి అమలుచేస్తున్నదని, విద్యార్థుల మెదళ్ళను మొద్దుబార్చి, విద్వేషపు మత్తులో ముంచుటకు అశాస్త్రీయ అంశాలను పాఠ్యాంశాల్లోకి చొప్పించి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదని,అందుకే పాఠ్యపుస్తకాలలో శాస్త్రీయ ప్రజాస్వామ్య అంశాలను తొలగిస్తున్నదని ధ్వజమెత్తారు.రాజకీయ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, రాజకీయ పార్టీల పై చేస్తున్న కక్ష సాధింపు చర్యలను దేశ ప్రజలంతా తిప్పికొట్టాలని, విభజించు పాలించు అనే నినాదంతో పబ్బం గడపాలనే మోడీ దుష్ట నీచ రాజకీయాలకు, మత రాజకీయాలకు వ్యతిరేకంగా భారతదేశ యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనదని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పల ముత్యాలు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి మారుపాక వెంకటేష్, సలగంజి వీరస్వామి,కూరెళ్ళ మచ్చ గిరి, మారుపాక మల్లేష్, సోమనబోయిన నరసింహ, బుర్ర వెంకటేష్, మారుపాక అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ మండల కేంద్రంలో లారీ ఢీకొని వెలువర్తి గ్రామానికి చెందిన వ్యక్తి మృతి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకి టీవీఎస్ ఎక్సెల్ మీద వెళ్తున్న వ్యక్తిని లోడ్ తో వెళుతున్న లారీ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామానికి చెందిన మంత్రి స్వామిగా గుర్తించారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

సాక్షర భారత్ మండల, గ్రామ కోఆర్డినేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేత


యాదాద్రి భువనగిరి జిల్లాలో వయోజన విద్యాశాఖ లోని మాజీ సాక్షర భారత్ మండల, గ్రామ కో-ఆర్డినేటర్లను తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాక్షర భారత్ వలిగొండ మండల అధ్యక్షులు బుగ్గ బీరప్ప మాట్లాడుతూ.. సాక్షర భారత్ కార్యక్రమాలలో పనిచేసిన గ్రామ ,మండల కోఆర్డినేటర్లు పూర్తిస్థాయి కాంట్రాక్టు ఉద్యోగులుగా 2010 నుండి 2018 మార్చి 31 వరకు అనగా తొమ్మిది సంవత్సరాలు అక్షరాస్యత కార్యక్రమాలతో పాటు ,అన్ని రకాల ప్రభుత్వ, సంక్షేమ ,అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని ప్రభుత్వానికి సేవలు అందించామని అన్నారు. ప్రభుత్వం తిరిగి సాక్షర భారత్ కోఆర్డినేటర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ .భాగ్యలక్ష్మి, ఏం మాధవి ,జి మానస , పీ లత ,కే లూర్దమ్మ,సిహెచ్ జ్యోతి, ఆర్ అనిత , జ్ సువర్ణ ,కే చైతన్య ,ఎం ధనమ్మ ఎం అనిత ,తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కి స్వాగతం పలికిన ఎన్ ఎస్ యూ ఐ జిల్లా ఉపాధ్యక్షులు నోముల తరుణ్


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కి స్వాగతం పలికిన ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు నోముల తరుణ్. శ్రీ సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకుని హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో భువనగిరి వివేరా హోటల్ వద్ద ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కి ఎన్ ఎస్ యు ఐ నాయకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు ,మండల నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.

గోకారంలో అర్ధరాత్రి అక్రమ ఇసుక రవాణా... ప్రత్యేక దాడులు నిర్వహించి పట్టుకున్న వలిగొండ ఎస్సై మహేందర్ లాల్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని గోకారం గ్రామంలో శుక్రవారం రాత్రి వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ ఆకస్మికంగా ప్రత్యేక దాడులు నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గోకారం గ్రామంలో అక్రమంగా నిలువ చేసిన ఇసుక డంప్ లను మరియు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుకొని సీజ్ చేశామని వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు. మండలంలో మూసి పరివాహక ప్రాంతం గోకారం, నాగారం ,వేములకొండ గ్రామాలలో పలుసార్లు దాడులు నిర్వహించి ట్రాక్టర్లను పట్టుకుని, సీజ్ చేసిన కూడా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.