భద్రాచలం: చర్ల:ఢిల్లీ సరిహద్దులలో రైతులపై టియార్ గ్యాస్ ఉపయోగించడాన్ని కండిoచండి: న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్
ఢిల్లీ సరిహద్దులలో రైతులపై టియార్ గ్యాస్ ఉపయోగించడాన్ని కండిoచండి న్యూడెమోక్రసీ
కేంద్ర పోలీసు బలగాలు వెనక్కి తగ్గాలి న్యూడెమోక్రసీ
ఢిల్లీలో జరిగే రైతు ఉద్యమాన్ని శాంతి ఉతంగా జరగనివ్వాలి న్యూడెమోక్రసీ నాయకులు ముసలి సతీష్
![]()
నిన్నా 13 తారీకు వెలాదిగా రైతులు తరలి ఢిల్లీ సరిహద్దు పంజాబ్,హర్యానా శంభూ సరిహద్దు దగ్గర శాంతియుతంగా రైతాంగ ఉద్యమాన్ని కొనసాగిస్తుంటే కేంద్ర పోలీసు బలగాలు భారీకేర్డుతో అడ్డగించడం రైతాంగంపై టియర్ గ్యాస్ ఉపయోగించటాన్నీ సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఖండింస్తుంది
ఈరోజు నిరసనగా భద్రాద్రి జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా చర్ల మండలం బట్టీగూడెం గ్రామంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా CPI (ML) న్యూడెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ పాల్గొని మాట్లాడుతూ
మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతాంగానికి కనీసం మద్దతు ధర ఇవ్వాలని రైతాంగం పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఉద్యమంలో రైతుల చావుకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశీస్ మిశ్రాలపై కేసు నమోదు చేయాలని రైతు కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని రైతాంగం మొత్తం శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం వారిపై ఉక్కు పాదం మోపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు అందుకే దేశవ్యాప్తంగా రైతాంగం మరియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో 16వ తారీకు నాడు గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ బంధు కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అదేవిధంగా రానున్న పార్లమెంటు ఎన్నికలలో మోడీ ప్రభుత్వాన్ని గద్దేదించే వరకు ప్రజలు ప్రజాస్వామ్యత వాదులు ఓటు హక్కు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో నగేష్ బీమా రాజు నాగారత్నం జాన్సీ రూప రోజా కమల సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.




ఐఐటి మెడికల్ అకాడమీలో శ్లోకా ప్రభంజనం
ఢిల్లీలో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

ఉత్తమ్ ప్రెజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్లో ఉంది-KTR





యువత సంక్షేమానికి గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ లోనే యువజనుల సర్వీసు శాఖకు సరైన బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడం అన్యాయం.2021-22 బడ్జెట్ లో 188 కోట్లు,2022-23 బడ్జెట్లో 176 కోట్లు,2024-25 బడ్జెట్లో 173 కోట్ల 93లక్షలు మాత్రమే కేటాయింపులు ఉన్నవి. ఈ కొద్దిపాటి నిధులతో రాష్ట్రంలో యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది.
యువజన సంక్షేమాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎన్నికల ముందు పేర్కొన్న మాదిరిగా నిరుద్యోగ భృతి చెల్లింపు విషయంలో స్పష్టత ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ప్రకటన, 2 లక్షల ఉద్యోగాలపై నామమాత్ర ప్రస్తావననే తప్ప స్పష్టత లేదు. ఉద్యోగ నియామకాలపై అసెంబ్లీ సమావేశాల ముందు ప్రకటించిన మాదిరిగా సత్వరమే జాబ్ క్యాలెండర్ ప్రకటించి, గడువులోపు రెండు లక్షల ఉద్యోగాలుభర్తీ చేయాలి. యువజనులు క్రీడలు శారీరక నైపుణ్యం కేంద్రాలు పెంచాలి. యువత నైపుణ్య శిక్షణ అభివృద్ధి కొరకు ప్రత్యేక యూనివర్సిటీ నిర్మిస్తామని చెప్పిన మాటలకు బడ్జెట్లో మాత్రం ప్రస్తావించలేదు. విద్యారంగానికి ఆశించిన మేరకు బడ్జెట్ కేటాయింపులు లేవు పాఠశాల, ఉన్నత విద్య యూనివర్సిటీలు మరింత సంక్షోభంలో ఉన్నవి.బడ్జెట్ లో యువతని విస్మరించడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.
వైష్ణవి మృతిపై విచారణ జరిపి,నిందితులను కటినంగా శిక్షించాలి.
ఈ మధ్యనే భువనగిరిలో వార్డెన్ వేదింపులు తట్టుకోలేక ఇద్దరు అమ్మాయిలు ఆత్మహత్యా చేసుకుంటే విచారణ పెరుతో కాలయాపన చేస్తూ చర్యలు తీసుకోలేదు అన్నారు.నేడు సూర్యాపేట ఇమాంపేట గురుకుల కళాశాలలో వైష్ణవి అత్మహత్య ఇందులో భాగమేనని అన్నారు. చాలా హాస్టల్లో వసతులు సరిగా లేక అరకొర వసతులతో బాలికలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అని అన్నారు. అదేవిధంగా పురుగుల పడ్డ, చెడిపోయిన ఆహార పదార్డాలను పిల్లలకు అందిస్తుంటే,పిల్లలు ఇదేంటని అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే, ప్రశ్నించిన పిల్లల మీద అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కక్షగట్టి పిల్లల్ని ఇబ్బందుల గురిచేస్తుంటే మనస్థాపానికి గురై తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.ప్రభుత్వ ఉన్నత అధికారులు తక్షణమే కల్పించుకొని అమ్మాయిలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వైష్ణవి ఆత్మహత్య పై విచారణ జరిపి,కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.లేనియెడల ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.


Feb 15 2024, 20:51
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.7k