/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: ధర్మబిక్షం గౌడ్ విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి: జనార్దన్ గౌడ్ Mane Praveen
NLG: ధర్మబిక్షం గౌడ్ విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి: జనార్దన్ గౌడ్

 

నల్లగొండ: మాజీ పార్లమెంటు సభ్యుడు, కామ్రేడ్ బొమ్మగాని ధర్మబిక్షం గౌడ్ విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ అన్నారు. ఈ రోజు ధర్మ బిక్షం గౌడ్ 102 వ జయంతి సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్లో ధర్మ భిక్షం చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడ హైవే కి బొమ్మగాని ధర్మబిక్షం గౌడ్ పేరును నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 

బడుగు బలహీన వర్గాల కోసం పేదల కోసం గీత కార్మికుల కోసం అనేక విధాలుగా పోరాటం చేసి వారి యొక్క హక్కులను కాపాడినటువంటి గొప్ప నాయకుడు ధర్మబిక్షం గౌడ్ అన్నారు.

ఉమ్మడి జిల్లా ప్రజలు ధర్మబిక్షం గౌడ్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారిని స్ఫూర్తిగా తీసుకొని పోరాట పటిమను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేఖల భద్రాద్రి, యువజన నాయకుడు చంద్రశేఖర్ గౌడ్, కారింగు నరేష్ గౌడ్ , చింతల యాదగిరి గౌడ్, కొంపెల్లి రామన్న గౌడ్, పుల్లెంల యాదగిరి గౌడ్, మాద శ్రీనివాస్ గౌడ్, గజ్జి నరేష్ యాదవ్, చింతల విజయ్ కుమార్ గౌడ్, కారింగ్ శంకర్ గౌడ్, జేరిపోతుల లింగయ్య గౌడ్ , తదితరులు పాల్గొన్నారు.

TS: మేక సంజీవరెడ్డి కి నివాళులర్పించిన నల్లగొండ కార్మిక సంఘం అధ్యక్షుడు నగేష్ నాయక్

తెలంగాణ రాష్ట్ర ధరణి కమిటీ సభ్యులు అడ్వకేట్ భూమి సునీల్ కుమార్ తండ్రిగారైన మేక సంజీవరెడ్డి ఈనెల 5వ తేదీన పరమపదించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, అయ్యగారి పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన పెద్దకర్మ కార్యక్రమానికి.. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నల్లగొండ కార్మిక సంఘం అధ్యక్షుడు కేలావత్ నగేష్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మేక సంజీవరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ భూమి సునీల్ కుమార్, అడ్వకేట్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.

NLG: నూతన ఎంపికైన గ్రంథపాలకులకు అభినందనలు తెలిపిన తెలంగాణ గ్రంధాలయ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు

నల్లగొండ: గురుకుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన లైబ్రేరియన్ పోస్టులపై, రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్మెంట్ ప్రక్రియ కంప్లీట్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈరోజు హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం ఎంతో శుభసూచకమని గ్రందపాలకుడు డాక్టర్ రాజారామ్ అన్నారు.

సాధించుకున్న తెలంగాణలో గ్రంథాలయాల సేవలు గ్రంథ పాలకుల ద్వారా సాధ్యమని, విద్యార్థుల డెవలప్మెంట్ గురించి పోటీ పరీక్షలపై అవగాహనను కల్పించడం కొరకు జ్ఞానాభివృద్ధి కోసం గ్రంథాలయాలు ఎంతగానో తోడ్పడుతాయని డాక్టర్ రాజారామ్ తెలిపారు. ఈరోజు నల్గొండలో తెలంగాణ గ్రంధాలయ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు డాక్టర్ రాజారామ్ (మహిళా కళాశాల గ్రంథ పాలకులు), డాక్టర్ దుర్గాప్రసాద్ (నాగార్జున ప్రభుత్వ కళాశాల గ్రంథపాలకులు) నూతనంగా ఎంపికైన గ్రంథపాలకులను అభినందించారు.

NLG: విద్యార్థులకు స్నాక్స్ అందజేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఎస్ పి టి ప్లాటినం సభ్యులు

నల్గొండ పట్టణంలోని మాధవ నగర్ జేబీఎస్ ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించే క్రమంలో ఉదయం మరియు సాయంత్రం పూట విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకుగాను, ఈరోజు లయన్స్ క్లబ్ ఎస్పిటి ప్లాటినం నల్గొండ సభ్యులు మరియు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్టబత్తుల సత్యనారాయణ - ఆండాలు వివాహ వార్షికోత్సవం సందర్భంగా లయన్ జెల్లా దశరథ ఆధ్వర్యంలో దాదాపు 10 వేల రూపాయల స్నాక్స్ అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నిర్మల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ.. ప్రభుత్వ జేబీఎస్ పాఠశాలలోని విద్యార్థులకు గత 3 సంవత్సరముల నుండి లయన్స్ క్లబ్ ఆఫ్ ప్లాటినం ఎస్ పి టి నల్గొండ ఆధ్వర్యంలో ఈ యొక్క స్నాక్స్ అందజేస్తున్నామని, దాతలు అందించిన సహకారంతో విద్యార్థులు పట్టుదలతో కృషిచేసి 10వ తరగతిలో ఉన్నతమైన మార్కులు సంపాదించి ముందుకు వెళ్లాలని, తద్వారా మంచి భవిష్యత్తును పొందవచ్చునని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జెల్లా దశరథ, పుట్టా వెంకన్న, దాసోజు శ్రీనివాసచారి, మాధగోని స్వామి, మామిడి శ్రవణ్ కుమార్, జెల్లా లవన్ కుమార్,పాఠశాల ఉపాధ్యాయులు ఎస్ నాగిరెడ్డి ఆర్ నరసింహారెడ్డి కే సంపత్ కుమార్ బి.రూప, ఎన్. శ్రీనివాస్, బొమ్మపాల గిరిబాబు, కే.ప్రతిమ, జీ.రత్నమాల, పి. వెంకట్రావు, ఏవీఆర్ వినాయక్ తదితరులు పాల్గొన్నారు.

NLG: గౌరవ డాక్టరేట్ పొందిన దళిత నాయకుడికి సన్మానం

నల్లగొండ జిల్లాకు చెందిన తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కత్తుల రవి సామాజిక రంగంలో కృషి చేసినందుకు గాను, చెన్నైలోని గ్లోబల్ యూనివర్సిటీ వారు ఇటీవల ఆయనకు గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేశారు.

డాక్టరేట్ ని పొంది బుధవారం నల్లగొండకు వచ్చిన సందర్భంగా ఆ సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు పాల్గొన్నారు.

NLG: మార్చి 27, 28 తేదీల్లో ఎన్జీ కళాశాలలో జాతీయ సదస్సు

నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో మార్చి 27, 28 తేదీల్లో తెలుగు నాటక సాహిత్యం- సమాజం అను అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించబడుతుందని కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సముద్రాల ఉపేందర్ అన్నారు.

బుధవారం జాతీయ సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ ఆయన మాట్లాడారు. జాతీయ సదస్సులను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సాహిత్యం పట్ల ఆసక్తిని పెంపొందింపచేయడమే కాకుండా వారిలో దాగివున్న సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి ఉపయోగపడుతుందని, అదేవిధంగా సాహిత్య పరిశోధకులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సయ్యద్ మునీర్, డాక్టర్ అంతటి శ్రీనివాసులు, ఐక్యు ఏసి కోఆర్డినేటర్ వైవిఆర్ ప్రసన్నకుమార్, అకడమిక్ కోఆర్డినేటర్ వి. శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి వి. నాగరాజు, తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య , తెలుగు అధ్యాపకులు డాక్టర్ ఎన్. దీపిక, ఎన్. లవేందర్ రెడ్డి, డాక్టర్ వెల్దండి శ్రీధర్, జి. గోవర్ధనగిరి, ఎస్. ప్రభాకర్, ఎం.లింగస్వామి, గ్రంథపాలకులు డాక్టర్ ఆనందం దుర్గాప్రసాద్, వ్యాయామ అధ్యాపకులు కె.మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

TS: తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర గ్రంధాలయ సంఘం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల గురుకుల పాఠశాల, కళాశాలలో లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయడానికి గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ జారీ చేయగా, ఈ ప్రభుత్వంలో త్వరితగతిన రిజల్ట్స్ ఇచ్చినందుకు గురుకుల విద్యా సంస్థకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు, తెలంగాణ గ్రంధాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంకా గురుకుల విద్యా సంస్థలలో మిగిలి ఉన్న లైబ్రరీ పోస్టులను భర్తీ చేసి పాఠశాలల్లో, కళాశాలలో గ్రంథాలయాల ప్రాధాన్యతను పెంపొందించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు వారు తెలిపారు.

అదేవిధంగా 434 పాఠశాల, 150 జూనియర్ కళాశాల గ్రంథాలయ పోస్టులు భర్తీ చేయడానికి ఫలితాలు విడుదల చేసినందుకు ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సుంకరి రాజారాం, డాక్టర్ దుర్గాప్రసాద్ లు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

NLG: నల్లగొండలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి నగరోత్సవం

నల్లగొండ: 

శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి చెరువుగట్టు జాతర నేపథ్యంలో.. స్వామి వార్లకు పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అలంకరణ చేసి ఘనంగా పూజలు నిర్వహించి రామగిరి నుండి క్లాక్ టవర్ మీదుగా ఊరేగింపు గా బయలుదేరారు.

ఈ నగరోత్సవ కార్యక్రమం పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

తదుపరి చెరువుగట్టు గ్రామంలో నగరోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దీంతో చెరువుగట్టు జాతర ఈరోజు నుండి మొదలు అయింది.

NLG: నల్లగొండ సబ్ డివిజన్ డిఎస్పీ గా శివరాం రెడ్డి

నల్లగొండ సబ్ డివిజన్ లో డిఎస్పీ యం.శ్రీదర్ రెడ్డి సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ కి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో యాదాద్రి రాచకొండ ఏసిపి గా పనిచేస్తున్న కె.శివరాం రెడ్డిని నల్లగొండ సబ్ డివిజన్ డిఎస్పీ గా కేటాయించగా నేడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా శివరాం రెడ్డి మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

TS: 'తదేక' సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి పుస్తక ఆవిష్కరణ

నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు శాఖ సహాయ ఆచార్యులు డాక్టర్. మహమ్మద్ హసేన రచించిన" తదేక" సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి పుస్తకాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు చేతిలో మీదుగా, హైదరాబాదులో ఆచార్య రవ్వ శ్రీహరి వేదిక పై మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్టర్ మహమ్మద్ హసేన రాసిన ఇరవై ఒక్క వ్యాసాలు పుస్తకం రూపంలో ప్రచురించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు సూర్య ధనుంజయ్, ప్రసిద్ధ కవి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, నవతెలంగాణ ఎడిటర్ కె. ఆనందాచారి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ ల సంఘం రాష్ట్ర బాధ్యులు పి. మధుసూదన్ రెడ్డి, ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ల సంఘం రాష్ట్ర బాధ్యులు డాక్టర్ ఎస్. రాజారామ్, కవి యాకుబ్, స్కై బాబా గారు, డాక్టర్ వెల్దండ శ్రీధర్, అనంతోజు మోహన్ కృష్ణ, గ్రంథ పాలకులు దుర్గ ప్రసాద్, బూర్గు గోపికృష్ణ, పల్లె సతీష్ తదితరులు పాల్గొన్నారు.