TS: మేక సంజీవరెడ్డి కి నివాళులర్పించిన నల్లగొండ కార్మిక సంఘం అధ్యక్షుడు నగేష్ నాయక్
![]()
తెలంగాణ రాష్ట్ర ధరణి కమిటీ సభ్యులు అడ్వకేట్ భూమి సునీల్ కుమార్ తండ్రిగారైన మేక సంజీవరెడ్డి ఈనెల 5వ తేదీన పరమపదించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులు మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం, అయ్యగారి పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన పెద్దకర్మ కార్యక్రమానికి.. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నల్లగొండ కార్మిక సంఘం అధ్యక్షుడు కేలావత్ నగేష్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మేక సంజీవరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ భూమి సునీల్ కుమార్, అడ్వకేట్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.








నల్గొండ పట్టణంలోని మాధవ నగర్ జేబీఎస్ ప్రభుత్వ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించే క్రమంలో ఉదయం మరియు సాయంత్రం పూట విద్యార్థుల్లో శక్తిని పెంపొందించేందుకుగాను, ఈరోజు లయన్స్ క్లబ్ ఎస్పిటి ప్లాటినం నల్గొండ సభ్యులు మరియు జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్టబత్తుల సత్యనారాయణ - ఆండాలు వివాహ వార్షికోత్సవం సందర్భంగా లయన్ జెల్లా దశరథ ఆధ్వర్యంలో దాదాపు 10 వేల రూపాయల స్నాక్స్ అందజేశారు.












నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు శాఖ సహాయ ఆచార్యులు డాక్టర్. మహమ్మద్ హసేన రచించిన" తదేక" సాహిత్య విమర్శ వ్యాసాల సంపుటి పుస్తకాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు దార్ల వెంకటేశ్వరరావు చేతిలో మీదుగా, హైదరాబాదులో ఆచార్య రవ్వ శ్రీహరి వేదిక పై మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్టర్ మహమ్మద్ హసేన రాసిన ఇరవై ఒక్క వ్యాసాలు పుస్తకం రూపంలో ప్రచురించారని తెలిపారు.


Feb 15 2024, 20:12
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
13.9k