/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినీలకు మీడియా, సినిమాటోగ్రఫీ పై ప్రత్యేక శిక్షణ Mane Praveen
NLG: ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినీలకు మీడియా, సినిమాటోగ్రఫీ పై ప్రత్యేక శిక్షణ

నల్లగొండ: ఆర్ అండ్ బి మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచనల మేరకు, ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల నందు నీలగిరి నిపుణ సౌజన్యంతో.. మీడియా, సినిమాటోగ్రఫీ సంబంధిత 30 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఎర్పాటు చేశారు. అందుకు సంబందించిన పోస్టర్ ను ఈ రోజు ఆవిష్కరణ చేశారు. ప్రభుత్వ మహిళ కళాశాల విద్యార్థులకు 30 రోజులపాటు డిజిటల్ సినిమాటోగ్రఫీ, డబ్బింగ్ మరియు వాయిస్ ఓవర్ స్కిల్స్, ఆడియో ప్రొడక్షన్, నాన్ లీనియర్ ఎడిటింగ్, ప్లే బ్యాక్ లైవ్ సింగింగ్ స్కిల్స్, డిజిటల్ డిజైనింగ్ మరియు సోషల్ మీడియా మేనేజ్మెంట్ డిస్క్ జాకీ మరియు లైవ్ సౌండ్ తదితర అంశాలపై శిక్షణ కల్పిస్తామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో స్పేస్ సీఈఓ శశి ప్రీతం , టీవీ సీరియల్ మరియు సినిమా నటుడు లోహిత్ కుమార్, మాట్లాడుతూ.. ఈ రంగాలలో విద్యార్థులకు ఉచితంగా నైపుణ్యం కల్పించడం జరుగుతుందని కళాశాల విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమం లో పాల్గొని, ఈ రంగాలలో తమ యొక్క నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. 

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గన్ శ్యామ్ మాట్లాడుతూ.. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేరు కాబట్టి, ఇటువంటి రంగాలలో నైపుణ్యత సాధించి జీవితంలో స్థిరపడాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్, హౌసింగ్ బోర్డ్ పిడి రాజకుమార్ కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ నరసింహారాజు, మెంబర్స్ డాక్టర్ సుంకరి రాజారామ్, జి. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

NLG: ఫిబ్రవరి 16 న జరిగే దేశ వ్యాప్త కార్మికుల సమ్మె ను జయప్రదం చేయండి: చాపల శ్రీను

మునుగోడు: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 16న దేశ వ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి నల్లగొండ జిల్లా గౌరవ అధ్యక్షులు చాపల శ్రీను పిలుపునిచ్చారు. సీపీఐ కార్యాలయం లో ఏఐటీయూసీ నాయకులతో కలిసి సమ్మె వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. కేంద్రం గత 10 సం.ల పాలనలో దేశంలో కార్మిక, రైతు సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు. 

బిజెపి అధికారంలోకి వస్తే 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని అమలు చేయలేదని అన్నారు. కార్పోరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ, పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. మోడీ పాలనలో జరిగిన రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల వలన జరుగుతున్న నష్టంపై ఫిబ్రవరి 16న దేశ వ్యాప్తంగా సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు, రైతులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షకార్యదర్షులు బెల్లం శివయ్య, దుబ్బ వెంకన్న , భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు ఈద యాదయ్య ఇతర రంగాల కార్మిక నాయకులు దొమ్మటి గిరి, బోల్లు సైదులు, మద్ది అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

NLG: కెసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి: గుత్త అమిత్ రెడ్డి

ఈ నెల 13 న నల్గొండ లో కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభను విజయవంతం చేయాలని గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి అన్నారు. నల్లగొండలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కె ఆర్ ఎం బి లో జరిగిన మీటింగ్స్ లలో కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ అప్పనంగా కేంద్రానికి అప్పజెప్పారని,కృష్ణా నది మన జిల్లాకు వరప్రదాయిని 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని అలాంటి కృష్ణా జలాలను కేంద్రానికి అప్పజెప్పారు అని విమర్శించారు.


  

కె ఆర్ ఎం బి కి కృష్ణా ప్రాజెక్టులు పోతే తాగు నీటికి కూడా కటకట ఏర్పడుతుందని, మన అధీనంలో ఉంటే ఎప్పుడంటే అప్పుడు నీటిని విడుదల చేసుకున్నాం అని,ఇక నుంచి ఈ వెసులుబాటు ఉండదు అన్నారు. విద్యుత్ ఉత్పత్తి కి కూడా ఆటంకం ఏర్పడుతుంది. రాష్ట్ర హక్కులను కేంద్రానికి అప్పజెప్పడం దుర్మార్గపు చర్య, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే అవాస్తవాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్లు టిఆర్ఎస్ పై పై బురద జల్లుతున్నారు అని, పదేళ్లు ఎంత ఒత్తిడి చేసిన కేసీఆర్ కేంద్రానికి తలొగ్గలేదన్నారు.

పార్టీ ఆదేశిస్తే నల్గొండ, భువనగిరి నియోజకవర్గ లాలల్లో ఎక్కడినుంచైన పోటీ చేస్తాను, పార్టీ నిర్ణయమె ఫైనల్..

 ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. ప్రజల్లో ఉండటమే నాకు ఇష్టం అన్నారు. ఈ కార్యక్రమములో జడ్పీటీసీ కనగల్ చిట్ల వెంకటేశం, అయితగాని స్వామి గౌడ్,శ్రీరామదాసు హరి కృష్ణ,నాగులవంచ వెంకటేశ్వర రావు,కంచరకుంట్ల గోపాల్ రెడ్డి ,పజ్జుర్ సర్పంచ్ మోయిజ్, మాజి జడ్పీటీసీ సంజీవ, చిలకరాజు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

NLG: నల్లగొండ జిల్లాకు కెసిఆర్ చేసింది ఏమీ లేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ: జిల్లాకు కేసీఆర్ చేసింది ఏమీ లేదని రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్ ఎల్ బి సి ని కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానన్న కెసిఆర్ మాట తప్పాడని, సభలో నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే కెసిఆర్ ప్రసంగించాలని, కెసిఆర్ మాట తప్పడంపై నల్లగొండ పట్టణంలో సభ రోజు వినూత్న నిరసన చేస్తామని అన్నారు.

నల్లగొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఅర్..

కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండ రావాలి..

కేసీఆర్ కోసం కుర్చీ ,పింక్ టవల్ ఎల్ ఈడి స్క్రిన్ ను పోలీసు పర్మిషన్ తో పెడతాం..

రాష్ట్ర బడ్జెట్ ప్రజా యోగ్యమైంది..

కేఆర్ఎంబి ఫైళ్ల పై సంతకం పెట్టిందే కేసీఆర్, హరీష్ రావు..

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదు..

బిఆర్ఎస్ ప్రభుత్వ అప్పులకు కూడా బడ్జెట్ కేటాయించాం..

కాళేశ్వరం మేడిగడ్డపై చర్చా వేదికలో అందరూ పాల్గొనాలని అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

  

SRPT: అనుమానాస్పద స్థితిలో ఇంటర్ గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి

సూర్యాపేట: మండలంలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల/ కళాశాలలో శనివారం రాత్రి ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పట్టణానికి చెందిన వెంకన్న, భాగ్యమ్మ ల కుమార్తె దగ్గుపాటి వైష్ణవి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. శనివారం సాయంత్రం ఫేర్వెల్ డే లో పాల్గొన్నది. అయితే ఈ కార్యక్రమం జరుగుతుండగానే వైష్ణవి గదిలోకి వెళ్ళిపోయింది. గంట తర్వాత తోటి విద్యార్థులు వెళ్లి చూడగా వైష్ణవి అపస్మారక స్థితిలో ఉంది. సూర్యాపేట జనరల్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా పలు అనుమానాలు ఉన్నాయని మృతురాలి తల్లిదండ్రులు అంటున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

NLG: 18 అడుగుల అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహానికి ఘనంగా అభిషేకాలు

నల్గొండ: పట్టణంలోని హనుమాన్ నగర్ పాత బస్తి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో 4వ రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా, ఈ రోజు ఉదయం మండప దేవత పూజలు, హోమాలు చేయడం జరిగింది.

18 అడుగుల అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహానికి మహాస్నాపనము అని 36 జలాలతోని, ధాన్యాలతోని స్వామివారికి అభిషేకము మహాస్నాపనము చేయడం జరిగింది.

*కేరళ ప్రభుత్వంపై కేంద్రం నిరంకుశ ధోరణి మానుకోవాలి* : *సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం*

కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు..

       శుక్రవారం సిపిఎం చండూరు మండల కమిటీ సమావేశం సిపిఎం సీనియర్ నాయకులు చిట్టి మల్ల లింగయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళ ప్రభుత్వం పై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ అణిచివేత ధోరణి అవలంబిస్తుందని అన్నారు. కేరళలో విపత్తులు, కష్టకాలంలో కూడా సహాయం చేయకుండా కేంద్రం మొండి చేయి చూపిందన్నారు. ఎల్ డి ఎఫ్ ప్రభుత్వాన్ని అన్ని విధాల ఆటంకాలు కలిగిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు. కేరళ ప్రభుత్వం ఆదాయం ఉత్పత్తి లో ముందంజలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాల వలన సంక్షోభం ఏర్పడిందన్నారు. 2021- 22 లో కేరళ రుణ పరిమితి తగ్గించిందని అన్నారు.

జీఎస్టీ వంటి ఆదాయ వనరును తగ్గించిందని అన్నారు. ప్రతిపక్ష నేతలపై ఈడి ,సిబిఐ ,ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లను ఉపయోగించడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలలో కేంద్రం జోక్యం చేసుకొని దుర్వినియోగం చేయడం, ప్రభుత్వ వ్యవహారాలలో గవర్నర్ జోక్యం చేసుకొని మితిమీరి వ్యవహరించడం ,ప్రభుత్వ పని విధానం పై ప్రభావం పడుతుందని అన్నారు. విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం విద్విశ్ పూరిత వైఖరి అవలంబించడం సరికాదని ఇది మేధావులు, ప్రజలు, ప్రజాతంత్ర వాదులు ఖండించాలని వారన్నారు..

 

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, సిపిఎం మండల కమిటీ సభ్యులుకొత్తపల్లి నరసింహ, సిపిఎం నాయకులుకంచర్ల రవి, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు

YDD: పంతంగిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పారిశుద్ధ్య వారోత్సవాల సందర్భంగా, చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చినుకు శివప్రసాద్ శుక్రవారం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిల్వ ఉన్న నీటితొట్లను శుభ్రపరిచి వాటి ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బోయ ఇందిర సంజీవ, సీహెచ్వో జ్యోతి పాల్గొన్నారు.

NLG: ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి

నెహ్రు యువ కేంద్రం నల్గొండ మరియు నల్లగొండ కి చెందిన తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్ర సంఘం ఆధ్వర్యంలో శక్రవారం మహిళా డిగ్రీ కాలేజీ సెమినార్ హాల్ లో ఎయిడ్స్ పై యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ దేవవాని ముఖ్య అతిధిగా విచ్చేసి యువత ఇలాంటి అవగాహన సదస్సులను ఉపయోగించుకోవాలని ప్రోత్సహించారు. యువత తమ తమ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. 2030 నాటికి ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలన్నారు.  

లైంగిక వ్యాధులు, ఎయిడ్స్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్ర సంఘం నల్గొండ జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుధాకర్, సంపతయ్య వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు వ్యాస రచన, డ్రాయింగ్, క్విజ్ పోటీలు నిర్వహించి మొదటి, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు మరియు ప్రశంస పత్రాలు అందజేశారు.

ఈ సదస్సులో జిల్లా ఎన్ వై కే యువజన అధికారి ప్రవీణ్, కళాశాల గ్రంధాలయ శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ సుంకరి రాజారామ్, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ సరిత, శైలజ, వనజ అధ్యాపకులు స్వామి, డాక్టర్ మట్టయ్య మరియు కొండా నాయక్, నవీన్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

NLG: నల్లగొండ ఎంపీ స్థానం కోసం కాంగ్రెస్ నుండి 9 మంది అభ్యర్థులు దరఖాస్తు

నల్లగొండ ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ నుండి 9మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, సూర్యాపేటకు చెందిన పటేల్ రమేష్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి, యరగాని నాగన్న, పాశం నర్సిరెడ్డి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, ఏలగందుల రాము, జైపాల్ రెడ్డి, వల్లి నారాయణ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.