/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz అసెంబ్లీలో ప్రాజెక్టులపై ప్రారంభమైన వాడీ వేడి చర్చ Raghu ram reddy
అసెంబ్లీలో ప్రాజెక్టులపై ప్రారంభమైన వాడీ వేడి చర్చ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ మయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేవాల్లో ఇవాళ ప్రాజెక్టులపై నోట్ ప్రవేశపెడుతోంది.

రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ పై మాట్లాడుతున్నారు.కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడాన్ని వ్యతిరే కిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు.

ఇరిగేషన్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు.

ఎస్బీ న్యూస్

నేడు జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు

ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ -1 ఫలితాలు సోమవారం విడుదలకానున్నాయి.

ఈ ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ,ఎన్టీఏ ప్రకటించనున్నది. ఇప్పటికే జేఈఈ సెషన్‌ -1 ప్రాథమిక కీని విడుదల చేసి విద్యార్థు ల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. సోమవారం ఫలితాలతోపాటు తుది కీ"ని సైతం ఎన్టీఏ విడుదల చేయనున్నది.

దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్‌ -1 పరీక్షలు జరిగాయి.పేపర్‌ -1కు 12, 21,615 మంది దరఖాస్తు చేసుకోగా, 11,70,036 (95.8 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు.

ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆరిటెక్చర్‌ (బీఆర్క్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ (బీ ప్లానింగ్‌, వంటి సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్‌-2 పరీక్షకు 74,002 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 55,493,75శాతం, మంది పరీక్షకు హాజరయ్యారు.

ఈ ఫలితాల కోసం https://jeemain.nta.ac.inను సంప్రదించండి

వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన కరెంట్ కంచేకు కానిస్టేబుల్ మృతి

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తో ఆదివారం సాయంత్రం ఓ కానిస్టే బుల్ మృతి చెందాడు.

వన్యప్రాణాల కోసం ఏర్పాటుచేసిన కరెంటు వైర్లు తగిలి విధి నిర్వహ ణలో ఉండగానే ప్రాణాలు కోల్పోయాడు. కాటారం మండల పరిధిలోని నస్తూర్ పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్ పల్లి గ్రామ అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్ కు అందింది. 

దీంతో కానిస్టేబుల్ ప్రవీణ్ అడవిలో మరికొందరు సిబ్బందితో కలిసి కూబింగ్ కు వెళ్ళాడు. ఈ క్రమంలో వణ్యప్రాణులు వేట కోసం ఏర్పాటు చేసిన కరెంటు వైర్లు తగిలి ప్రవీణ్ స్పాట్ లోనే ప్రాణాలు వదిలారు.

ఈ మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని కరెంట్ షాక్ ట్రాప్ ను పెట్టిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.

చెత్త కుప్పలో నన్ను ఎందుకు పారేసావ్ ఈ సమాజంలో జీవించే హక్కు నాకు లేదాఅమ్మ

సమాజంలో రోజు రోజుకి మానవతా విలువలు నశించిపోతున్నాయి. రక్త సంబంధానికి, పేగు బంధా నికి అర్థం లేకుండా పోతుం ది. నవమాసాలు మోసి కన్న బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చెత్త కుప్పలలో, నడిరోడ్డు పైన పడేసి వెళుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

అప్పుడే పుట్టిన నవజాత శిశువుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు సైతం సభ్య సమాజాన్ని సిగ్గుతో తల దించుకునేలా చేస్తున్నాయి. తాజాగా అటువంటి అమానుష ఘటన కృష్ణా జిల్లాలో ఈరోజు చోటు చేసుకుంది.

అవ‌నిగ‌డ్డ‌లో అప్పుడే భూమ్మీద పుట్టిన పసి కందును అవనిగడ్డ ఒకటో వార్డులోని చర్చి వెనక పడేసి వెళ్లారు. అదే సమ యంలో బయటికి వెళ్లి వచ్చిన పాస్టర్ కు పాప ఏడుపు వినిపించి వెంటనే అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించాడు.

ప్రస్తుతం పాపను ఉన్నత వైద్యం కోసం మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేపట్టారు.లోకం పోకడ తెలియని ఆ పసికందుపై అమానవీయంగా ప్రవర్తిం చారు.

పిల్లలు లేక ఎంతోమంది తల్లిదండ్రులు కంటికి కడివెడు రోదిస్తున్న పరిస్థితి ఉంది. తమకు ఒక బిడ్డ పుడితే చాలు అని తపస్సు చేస్తున్న దంపతులు ఎంతో మంది జంటలు ఉన్న నేటి రోజుల్లో, పుట్టిన బిడ్డలు వద్దని పారేసి వెళుతున్న ఘటనలు సమాజంలో ప్రతి ఒక్కరికి ఆవేదన కలిగిస్తు న్నాయి.

కంటికి రెప్పలా కాపాడు కోవాల్సిన తల్లిదండ్రులే ఈ విధమైన ఘటనలకు పాల్పడుతుండటంతో ఈ ఘటనలు రక్త సంబం ధాలను సైతం ప్రశ్నిస్తు న్నాయి

తెలంగాణ అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టుపై నేడు చర్చ

తెలంగాణ రాష్ట్రంలోఇవాళ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి.

ముఖ్యంగా నేటి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం పెట్టనున్నారు.ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ జరుగు తుంది.

అలాగే, తెలంగాణ రాష్ట్రం లోని ఇరిగేషన్ ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా వేడి వాడిగా చర్చ జరిగే అవకాశం ఉంది

Sb news

ఏసీబీ ఉచ్చులో చిక్కుకున్న మునిసిపల్ టౌన్ ఏ ఈ

మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న టౌన్ ఏఈ పృథ్వి శనివారం ఏసిబి అధికారులకు పట్టుబడ్డాడు

ఏసీబి డిఎస్పి కృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ కాంట్రాక్టర్ పి. యాదయ్య నుంచి 50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టణంలోని మెట్టుగడ్డ సమీపంలో ప్రత్యక్షంగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు.

కాంట్రాక్టర్ గత సంవత్సరం మున్సిపాలిటీకి సంబం ధించి రెండు పనులకు ఆన్లైన్లో టెండర్ వేసి 11 లక్షలకు దక్కించుకున్నాడని తెలిపారు

ఈ పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ యాదయ్య ఆ పనులకు సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో ఎంవి రికార్డు చేయాలని ఏఈ పృద్విని కోరగా లంచం డిమాండ్ చేశాడని తెలిపారు

ఈ విషయాన్ని కాంట్రాక్టర్ యాదయ్య ఈనెల 7వ తేదీన ఎసిబికి ఫిర్యాదు చేశాడని చెప్పారు.. పథకం ప్రకారం ఏఈ పృద్వికి ఒప్పుకున్న 50 వేల రూపాయలు పట్టణంలోని మెట్టుగడ్డ సమీపంలో యాదయ్య ఇస్తుండగా ప్రత్యక్షంగా పట్టుకొని అతనిపై కేసు నమోదు చేశామని తెలిపారు.

అనంతరం విచారణ నిమి త్తం నిందితుడిని మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చి అందుకు సంబంధించిన ఫైల్స్ పరిశీలించామని, రేపు ఏసిబి స్పెషల్ కోర్టు నాం పల్లిలో అప్పగిస్తా మని పేర్కొన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని లేదా నేరుగా మహబూబ్నగర్ కార్యాలయంలో స‌మాచా రం ఇవ్వ‌వ‌చ్చ‌ని వెల్లడిం చారు

Vijayawada: ధర్నాచౌక్‌లో PET అభ్యర్థుల ధర్నా

Vijayawada: విజయవాడ ధర్నాచౌక్‌లో PET అభ్యర్థుల ధర్నాకు దిగారు. మెగా డీఎస్సీలో ఒక్క PET పోస్ట్ లేకపోవడంపై అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే

కేవలం 6వేల100 పోస్టులు విడుదల చేయడం అన్యాయమన్నారు. మూడేళ్లుగా లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నామని.. డీఎస్సీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూశామన్నారు అభ్యర్థులు. జగనన్న మా ఆశలు ఆడియాసలు చేశాడని.. 6వేల100 పోస్టుల్లో PET పోస్టులు ప్రకటించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు అభ్యర్థులు

చేతి’కి చిక్కిన మహేందర్‌రెడ్డి చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా సునీతారెడ్డి

హైదరాబాద్: పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‏కు భారీ షాక్‌ తగిలింది. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డితోపాటు ఆయన భార్య వికారాబాద్‌ జడ్పీచైర్‌పర్సన్‌ సునీతారెడ్డి గురువారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో మంచిపట్టున్న మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ గూటికి చేరడం బీఆర్‌ఎస్‏కు పెద్ద దెబ్బేనని చెప్పాలి. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు బీఆర్‌ఎస్‌ తాండూరు టిక్కెట్‌ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్‌ వైపు చూశారు. పలు దఫాలు ఆయన పార్టీ ముఖ్యనేతలతో చర్చలు కూడా జరిపారు. అయితే ఇది గమనించిన బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఎన్నికలకు ముందు ఆయనకు మంత్రి పదవి ఇచ్చి బుజ్జగించింది. దీంతో ఆయన పార్టీ మారే యోచన విరమించుకున్నారు. మహేందర్‌రెడ్డిని ఎలాగైనా కాంగ్రెస్ కు రప్పించాలని రేవంత్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. ఎన్నికల తేదీకి వారం రోజుల ముందుకూడా ఆయనకు భారీ ఆఫర్‌ ఇచ్చారు. కానీ, అప్పటి పరిస్థితుల్లో ఆయన బీఆర్‌ఎస్‏లోనే కొనసాగాలని నిర్ణయించారు. ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్‌ నేతలు పలుమార్లు జరిపిన చర్చలు సఫలం కావడంతో చివరకు మహేందర్‌రెడ్డి ఆయన భార్య సునీతారెడ్డి కాంగ్రెస్‏లో చేరాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే మహేందర్‌రెడ్డి కుటుంబం చేరిక వెనుక బలమైన కారణమే ఉంది. మహేందర్‌రెడ్డి భార్య వికారాబాద్‌ జడ్పీచైర్‌పర్సన్‌ సునీతారెడ్డికి చేవెళ్ల పార్లమెంట్‌ సీటు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఈ మేరకు వారి కుటుంబానికి స్పష్టమైన హామీ కూడా లభించడంతో కాంగ్రెస్‏లో చేరేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్‌ స్థానంలో బీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలోకి దిగుతుండడంతో అధికార కాంగ్రెస్‌ కూడా ఆర్థిక, అంగబలం ఉన్న వారిని పోటీలో దింపేయత్నం చేస్తోంది. మహేందర్‌రెడ్డి కుటుంబంతో పాటు ఆయన అనుచరులు ఈనెల 11వ తేదీలోగా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు.

 మల్కాజిగిరిపై తర్జనభర్జనలు

మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానానికి కూడా కాంగ్రెస్‏లో పోటీ ఉన్నప్పటికీ ఆర్థికంగా బలంగా ఉన్న వారి కోసం కాంగ్రెస్‌ ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. మల్కాజిగిరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన మైనంపల్లి హన్మంతరావు కూడా పోటీకి సై అంటున్నట్లు సమాచారం. అలాగే సీనియర్‌ నేత కుసుమకుమార్‌తోపాటు హరివర్ధన్‌రెడ్డి తదితరులు ఆసక్తిగా ఉన్నారు. ప్రధానంగా బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పేరు కూడా కొద్ది రోజులుగా వినిపిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ హామీ ఇవ్వలేదు.

 ఎమ్మెల్యేలపై గురి

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు వలసలకు గేట్లు తెరవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ముఖ్యంగా నగర శివార్లలోని ఎమ్మెల్యేలను పూర్తిగా తమవైపు తిప్పుకునేందుకు ఇప్పటికే యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవల రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. ఇక మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి త్వరలో తాను కూడా సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తానని, కీసర ఆలయానికి రావాలని ఆహ్వానిస్తానని చెప్పారు. తాజాగా మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నగర శివార్లలోని మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌ గూటికి చేరనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈనెల 11వ తేదీలోగా బీఆర్‌ఎ్‌సలో భారీ కుదుపులు ఉంటాయనే ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పట్టం మహేందర్ రెడ్డి దంపతులు, మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, షాద్ నగర్ సీనియర్ నేత తాండ్ర కాశీనాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

రాష్ట్ర పోటీలకు పెద్దపల్లి జిల్లా విద్యార్థులు ఎంపిక

ఈనెల 10న భద్రాద్రి కొత్త గూడెంలో జరిగే రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీ లకు పెద్దపల్లి పట్టణానికి చెందిన ప్రభుత్వ బాలుర పాఠశాల, ఎంపీ యుపిఎస్ విద్యార్థులు వర్షిణి, కావేరీ ఎంపిక య్యారు.

జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో షాట్ పుట్, 600 మీటర్ల పరుగు పోటీలో మొదటి రెండు స్థానాల్లో నిలిచి రాష్ట్ర పోటీలకు అర్హత సాధించగా, శుక్రవారం ఎంఈఓ, హెచ్ఎం సురేంద్ర కుమార్, ప్రైమరీ హెచ్ఎం మంజులత అభినందిం చారు

Vijayawada: గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం

విజయవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు

శతాబ్ధి ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను వికర్‌ జనరల్‌ మోన్సిన్యోర్‌ మువ్వల ప్రసాద్‌ ఆవిష్కరించారు. గుణదల ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్ర గురువులు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

మత పెద్దలు ప్రత్యేక ప్రార్ధనలు, దివ్య బలిపూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తుతో పాటు, ట్రాఫిక్ మళ్ళిస్తూ సీపీ ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు. గుణదల కొండ వరకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంది.