/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz ఘనంగా పి.ఆర్.టి.యు సీనియర్ కార్యకర్త, సర్వేల్ పాఠశాల ఉపాధ్యాయునీరాలు ఎస్. విజయలక్ష్మి కి సన్మానం Mane Praveen
ఘనంగా పి.ఆర్.టి.యు సీనియర్ కార్యకర్త, సర్వేల్ పాఠశాల ఉపాధ్యాయునీరాలు ఎస్. విజయలక్ష్మి కి సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా:

నారాయణపూర్: మండల వనరుల కేంద్రంలో ఈరోజు, పిఆర్టియు సీనియర్ కార్యకర్త, సర్వేల్ పాఠశాల టీచర్ ఎస్. విజయలక్ష్మిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పిఆర్టియు నాయకులు మాట్లాడుతూ.. పి ఆర్ టి యు కార్యకర్త విజయలక్ష్మి ఏప్రిల్ మాసంలో పదవీ విరమణ కాబోతున్న సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి, ఘనంగా సన్మానించామని తెలిపారు. కార్యక్రమంలో మండల నోడల్ అధికారి జి.శ్రీనివాస్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రమ, మండల ప్రధాన కార్యదర్శి దోర్నాల రాము, రాష్ట్ర బాధ్యులు సురేందర్ రెడ్డి, హరి కిషన్ రెడ్డి, జిల్లా బాధ్యులు చొల్లేటి శ్రవణ్ కుమార్, యాదిరెడ్డి, మండల కార్యదర్శి పబ్బు దేవేందర్, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

NLG: ఎంపీ బరిలో జానారెడ్డి తనయుడు.. గెలిపించుకుంటామన్న స్థానిక నాయకులు

నల్లగొండ: మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత కుందూరు జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి నల్గొండ పార్లమెంటు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జానారెడ్డి చిన్నకుమారుడు జయవీర్ రెడ్డి, ఇటీవల హైదరాబాద్ గాంధీభవన్ లో తన అన్న రఘువీర్ రెడ్డి తరపున అప్లికేషన్ అందజేశారు. 

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమవుతోంది. ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరణ కూడ ముగియడంతో 6న పిసిసి ఎన్నికల కమిటీ వాటిని పరిశీలించనుందని సమాచారం, నల్లగొండ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి ఇప్పటికే పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు సన్నిహితుడు గా ఉంటూ ప్రజల మన్ననలను పొందారు. 

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పేరొందిన యువ నాయకుడు గా గుర్తింపు పొందారు. బడుగు బలహీన వర్గాల ప్రజల మన్ననలు పొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డి తమ్ముడు జయవీర్ రెడ్డి అధిక మెజార్టీ తో గెలిచారు. ఇదే తరహాలో రఘువీర్ రెడ్డికి కూడా ఎంపీ టికెట్ కేటాయిస్తే కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలందరూ సన్నద్ధమై అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలిపించుకుంటామంటున్నారు

ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరపున నల్లగొండ కార్మిక సంఘం అధ్యక్షులు కెలావత్ నగేష్ నాయక్ నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ.. రఘువీర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఎంపీ టికెట్ కేటాయించినట్లయితే విజయం సాధించడానికి తామంతా కృషి చేసి గెలిపించుకుంటామని తెలిపారు.

కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం కోసం కార్యకర్తలు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NLG: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల

నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 2023-24 విద్యా సంవత్సరం నుండి స్వయం ప్రతిపత్తి పొందినది. కళాశాలకు స్వయం ప్రతిపత్తి వచ్చిన తరువాత మొదటి సారిగా మొదటి సెమిస్టర్ పరీక్షలు 2023 డిసెంబర్ లో నిర్వహించటం జరిగినది. ఈ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సోమవారం నాడు కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్ శ్యాం, కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి (COE) డాక్టర్ ఆర్. నరేష్ ల సమక్షంలో  మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ G. ఉపేందర్ రెడ్డి విడుదల చేశారు. 

విద్యార్థినిలు కళాశాల వెబ్ సైట్ (https://gdcts.cgg.gov.in/ramagiri.edu) లో ఫలితాలు పొందవచ్చని వారు తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 766 విద్యార్థినిలు హాజరు కాగా, 267 మంది ఉత్తీర్ణులు కాగా 499 మంది విద్యార్థినిలు ప్రమోట్ అయినట్లు పేర్కొన్నారు. కళాశాల మొత్తం ఉత్తీర్ణత 34.86% గా ఉండగా బి. కామ్ విభాగంలో అత్యధికంగా 50.25% ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. పునర్ మూల్యాంకనం (రీ వాల్యుయేషన్) ప్రకటన త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణ అధికారి (ACOE) త్రిపురం భాస్కర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కె.దేవవాణి, లైబ్రేరియన్ డాక్టర్ యస్. రాజారామ్, వివిధ విభాగాల అధిపతులు, పరీక్షల విభాగ సభ్యులు, పరీక్షల నియంత్రణ అధికారి (COE) కార్యాలయం సిబ్బంధి సునీత, వహీద్, అలివేలు పాల్గొన్నారు.

NLG: తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయాలి: ఎస్ఎఫ్ఐ

ఫిబ్రవరి 10,11న నల్లగొండ లో జరిగే తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యురాలు నేనావత్ ఉమా అన్నారు. ఈ రోజు దేవరకొండలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కరపత్రాలు విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థీనీలపై జరిగే దాడులను అరికట్టేందుకు అన్ని రంగాలలోని విద్యార్థులు, మహిళలు ఏకం కావాలని అన్నారు. డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రామావత్ లక్ష్మణ్, బుడిగ వెంకటేష్,గర్ల్స్ నాయకురాలు పాల్గొన్నారు.

నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక

నల్గొండ మున్సిపల్ చైర్మన్ గా 32వ వార్డు కౌన్సెలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో.. బుర్రి శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్ గా హాజరైన మెజారిటీ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. గత నెల జనవరి 8న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది.

TS: గురుకుల విద్యా సంస్థల కార్యదర్శిగా కే. సీతా లక్ష్మి ని నియమించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. గురుకుల విద్యా సంస్థల కార్యదర్శిగా ఉన్న నవీన్ నికోలస్ ను.. టీఎస్పిఎస్సీ కార్యదర్శిగా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఆయన స్థానంలో గురుకుల విద్యా సంస్థల కార్యదర్శిగా కే. సీతా లక్ష్మి ని తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

HYD: మూసీనది రివర్ ఫ్రంట్ ఎండీ గా ఆమ్రపాలి

హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్, హెచ్‌జీసీఎల్, మేనేజింగ్ డైరెక్టర్, అవుటర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్ అదనపు బాధ్యతలను ప్రభుత్వం హెచ్‌ఎండీఏ జాయింట్ కమిషనర్ కె.ఆమ్రపాలికి అప్పగించింది.

ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, మెట్రోపాలిటన్ కమిషనర్ డాక్టర్ ఎం. దాన కిశోర్‌ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం ఆమ్రపాలి హెచ్‌ఎండీఏ ఐటీ, ఎస్టేట్ విభాగాలతో పాటు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎండీగా ఉన్నారు.

TS: హైదరాబాద్ లో నలుగురు చిన్నారుల కిడ్నాప్ కలకలం

హైదరాబాద్ శివారు మైలార్దేవ్ పల్లిలోని ఓవైసీ హిల్స్ వద్ద నలుగురు చిన్నారుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఇంటి బయట ఆడుకుంటున్న ముగ్గురు బాలికల ను, ఓ బాలుడిని గుర్తు తెలియని దుండగులు ఆదివారం కిడ్నాప్ చేసినట్టు తెలిసింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

NLG: ప్రమాదంలో మరణించిన హమాలీ లకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: ఏర్పుల యాదయ్య

ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె లో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య కార్మికులను కోరారు. మర్రిగూడ మండలం శివన్నగూడెం లో యాదయ్య మాట్లాడుతూ.. 50 సం.లు వయసు పైబడిన హమాలీ లకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని, ప్రమాదంలో మరణించిన హమాలీ లకు 10 లక్షల నష్టపరిహారం సహజ మరణానికి 5 లక్షల ఇవ్వాలని వారి పిల్లల చదువులకు స్కాలర్షిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అట్లాగే హమాలీ లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 

దేశంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు బిజెపి పాలన వల్ల ఎన్నో ఇబ్బందులతో పోరాడుతున్నారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26,000/- అమలు చేయాలని, ఉద్యోగ భద్రత, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనికి వెళ్లే కూలీలకు 200 రోజులు పని కల్పించాలని రోజువారి కూలీ 600 రూపాయలు ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు అప్పనగోని యాదయ్య, మేడ ప్రకాష్, పానకత్తుల వెంకటయ్య, మానుపాటి యాదయ్య, ఒట్టుకోటి నరసింహ, ఏర్పుల సావిత్రి, గుణగోని సోమయ్య, తదితరులు పాల్గొన్నారు

మర్రిగూడెం మండలంలో సర్పంచ్ లకు ఆత్మీయ సమ్మేళనం

నల్లగొండ జిల్లా: 

మర్రిగూడెం మండలంలో స్థానిక జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్ లతో శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్లకు సన్మానం నిర్వహించారు. 

ముందుగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లెంకలపల్లి సర్పంచ్ పాక నగేష్ యాదవ్ ను శాలువాతో సత్కరించి సన్మానించారు. అనంతరము వివిధ గ్రామాల సర్పంచ్ లకు సన్మానం నిర్వహించారు. 

ఈ సందర్భంగా పాశం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్ ల 5 సం.ల పదవీకాలం పూర్తి చేసిన సందర్భంగా వారి సేవలను కొనియాడారు.

పలువురు సర్పంచులు మాట్లాడుతూ.. ఐదేళ్ల కాలంలో వారు ప్రజా క్షేత్రంలో ప్రజలకు సేవలందించిన విధానాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాసులు, ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, ఎస్సై రంగా రెడ్డి, డిప్యూటీ తాహసిల్దార్ తారక రామన్, ఏపీవో వెంకటేశం, వివిధ హోదాలలో ఉన్న అధికారులు , సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.