/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz విద్యారత్న అవార్డు అందుకున్న ప్రధానోపాధ్యాయురాలు శాంతిలత Raghu ram reddy
విద్యారత్న అవార్డు అందుకున్న ప్రధానోపాధ్యాయురాలు శాంతిలత

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం విలాసాగర్ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయురాలు గా విధులు నిర్వహిస్తున్న శాంతి లత కు జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ జేఐసి స్వేచ్ఛాంద సంస్థ ప్రకటించిన విద్యారత్న అవార్డును మంచిర్యాల జిల్లా సీనియర్ అడ్వకేట్ KV, ప్రతాప్ ఆదివారం అందజేసి సాలువతో ఆమెను ఘనంగా సన్మానించారు.

మంచిర్యాల జిల్లా కేంద్రం లోని నస్పూర్ కాలనీ నరసయ్య భవన్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి జేసీఐ 3వ ఇన్ఫోలేషన్ శిరోమణి సెమినార్ ను జెసిఐ చైర్మన్ అరుముళ్ల రాజు. ఆధ్వర్యంలో నూతన జిల్లా అధ్యక్షులు పి వెంకటేష్ నాయకత్వంలో సెమినార్ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు

ఈ కార్యక్రమానికి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ జోన్ ప్రెసిడెంట్ గోవింద్ డాక్టర్ వెంకటేష్ పాలాకుల విపి ఆయుష్ కంపటి అనిల్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గావిచ్చేసిన మంచిర్యాల జిల్లా ఎంప్లా యిమెంట్ ఆఫీసర్ కౌశిక వెంకట్ రమణహాజరై ఆయన ప్రసంగించారు

విద్యారత్న అవార్డుకు ఎంపికైన శాంతిలతను ఆమె బంధువులు స్నేహితులు, తోటి ఉపాధ్యాయులు, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడునిసత్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

భారత మాజీ ఉప రాష్ట్రపతి పద్మ విభూషన్ అవార్డు గ్రహీత వెంకయ్య నాయుడిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి మంత్రి జూపల్లి కృష్ణారావు శుభాకాంక్షలు చెప్పి సన్మానం చేశారు

అంతేకాదు ఫిబ్రవరి 4వ తేదీన పద్మ పురస్కార విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సన్మాన కార్యక్రమం ఉంటుందని దానికి తప్పక హాజరు కావాలని వెంకయ్యను మంత్రి ఆహ్వానించారు

అంతేకాదు ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవినీ జూపల్లి కలిశారు అనం తరం శుభాకాంక్షలు చెప్పి శాలువాతో సత్కరించారు సత్కార కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు

కాగా ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాల‌కు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రముఖ సినీనటుడుమెగాస్టార్‌ చిరంజీవి ప‌ద్మ శ్రీ పుర‌స్కారాల‌కు ఎంపికైన బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య తోపాటు

సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య కేతావత్‌ సోమ్‌లాల్‌శిల్పకారుడు స్తప‌తి ఆనందాచారిని రాష్ట్ర ప్రభుత్వం ఘ‌నంగా స‌త్కరించ‌నుందిఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హ‌రికృష్ణ ఉన్నారు

దూకుడు పెంచిన కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు

కరీంనగర్ లో రోడ్డు ప్రమాదాల నివారణపై కరీంనగర్ పోలీసులు శుక్రవారం దృష్టిసారించారు. ప్రమాదాలు అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి స్కూల్ వాహనాలను పరిశీలిస్తు న్నారు

స్కూల్ బస్‌లు ఆటోల ఫిట్‌నెస్ చెక్ చేయడంతో పాటు ఇన్స్యూరెన్స్ డ్రైవర్ ట్రాక్‌ను చెక్ చేస్తున్నారు స్కూల్ వాహనాలపై గతంలో ఏమైనా యాక్సి డెంట్ కేసులు నమోదు అయ్యాయా డ్రైవర్‌పై చరిత్రపై ఆరా తీస్తున్నారు

అలాగే సదరు వాహనాల పెండింగ్ చలాన్లను పరిశీలి స్తున్నారు. ఇన్స్యూరెన్స్ క్లియర్ చేయని వాహనా లను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదలైన ఈ స్పెషల్ డ్రైవ్ 10 గంటలవరకు కొనసాగింది

తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు మరోసారి స్పెషల్ డ్రైవ్ ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు

గ్రామాల్లో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన

గ్రామాల్లో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనకొనసాగింది. ఈ నేపథ్యంలో

గ్రామపంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామాల్లో నేటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారులు ప్రత్యేక అధికారులుగా కొనసాగ నున్నారు

మండలంలోని కేశవపట్నం కొత్తగట్టు రాజాపూర్ లో ఎంపీడీవో శ్రీవాణి

మొలంగూర్ వంకాయ గూడెంలో ఎమ్మార్వో అనుపమ

లింగాపూర్ తాడికల్ చింతగుట్ట మఖ్తలో ఎంపీఓ బషీరుద్దీన్

మిగతా గ్రామాల్లో వివిధ అధికారులు రానున్నారు

రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి బదిలీ

తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్‌లు ఈరోజు బదిలీ అయ్యారు. రామగుండం సీపీగా పనిచేస్తున్న రెమా రాజేశ్వరిని వుమెన్‌ సేఫ్టీ వింగ్‌ డీఐజీగా బదిలీ చేశారు

ఆమె స్థానంలో తెలంగాణ మల్టీ జోనల్‌-2 ఐజీపీగా పనిచేస్తున్న తరుణ్‌ జోషిని రామగుండం సీపీగా నియమించారు

ఈ మేరకు డీజీపీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు

మెగా కంపెనీలో స్థానిక మహిళా ఉద్యోగుల నిరసన

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన పార్వతీ పంప్ హౌస్ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న మెగా కంపెనీ మరియు దాని సబ్ కాంట్రాక్టర్ గా ఉన్న పాల్కన్ కంపెనీ మరియు సెక్యూరిటీ కంపెనీలలో శ్రమదోపిడితో పాటు తక్కువ వేతనాలు ఇవ్వడమే కాకుండా స్థానిక ఉద్యోగులను మహిళలను అకారణంగా ఉద్యోగాల నుండి తొలగిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారనీ, ఫాల్కన్ కంపెనీకి సంబంధించిన మహిళల ఉద్యోగులను అకారణంగా తొలగించడంతో సంవత్సరం నుండి కంపెనీ చుట్టూ తిరుగుతున్నారని, రెండుసార్లు నిరసన తెలుపగా కంపెనీ యజమాన్యం, మెగా కంపెనీ వారు తిరిగి ఉద్యోగాలకు తీసుకుంటానని హామీ ఇచ్చి తీరా ఉద్యోగానికి వచ్చేసరికి పని కల్పించకుండా మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు

 అంతేకాకుండా మహిళలను అక్కడ ఉన్న సూపర్వైజర్ మానసికంగా వేధిస్తూ అవమానాలకు గురి చేస్తున్నాడని మహిళలు కంపెనీ వారికి ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదు

 ఈ విషయంపై గురువారం మళ్లీ మెగా కంపెనీలో తొలగించబడిన మహిళలు నిరసన చేపట్టారు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కన్నుమూత

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పి. న‌ర్సారెడ్డి(92) క‌న్నుమూశారు

గ‌త కొంత‌కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డు తున్న ఆయ‌న సోమ‌వారం తెల్ల‌వారు జామున తుదిశ్వాస విడిచారు

న‌ర్సారెడ్డి మృతి ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు సంతాపం ప్ర‌క‌టించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

న‌ర్సారెడ్డి స్వ‌స్థ‌లం నిర్మ‌ల్ జిల్లా మ‌ల‌క్‌చించోలి గ్రామం. 1970-71 మ‌ధ్య కాలంలో పీసీసీ అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు

కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా కూడా ప‌ని చేశారు న‌ర్సారెడ్డి

రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో మరోసారి పోలీస్ అధికారుల బ‌దిలీలు

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 25 మంది ఇన్‌స్పెక్టర్లుఆరుగురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ సీపీ సుధీర్‌ బాబు శనివారం ఉత్తర్వులు జారీచేశారు

గతకొంత కాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్న చైతన్యపురి పీఎస్‌ ఎస్‌హెచ్‌వోగా జీ.వెంకటేశ్వర్లును నియమించారు

బొమ్మలరామారం ఎస్‌గా ఉన్న జీ.శ్రీనివాస్‌ రెడ్డిని చైతన్యపురి పీఎస్‌కు బదిలీ చేశారు. అదేవిధంగా హయత్‌నగర్‌ ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లును మహేశ్వరం పోలీస్‌ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు

మంత్రి సీతక్కను కలిసిన కామారెడ్డి జిల్లా గ్రామ సర్పంచ్ లు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ సర్పంచులు మంత్రి సీతక్కను కలిసి వారి బాధలను తెలిపారు. తమ పదవీ కాలాన్ని పొడిగించాలని సర్పంచులు మంత్రికి విజ్ఞప్తి చేశారు

గత ప్రభుత్వంలో సర్పంచులకు జరిగిన ఇబ్బందుల గురించి చర్చించడం జరిగింది. అలాగే కరోనా సమయంలో గ్రామపంచాయతీలకు అభివృద్ధి పనులు అందించ లేకపోయాము. గ్రామాభి వృద్ధిలో ప్రజల మన్ననలు పొందలేకపో యామన్నారు

గ్రామపంచాయతీ అభివృద్ధి చేసినటువంటి బిల్లులు ఇప్పటివరకు కూడా చెల్లింపులు జరగలేదని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు

ప్రభుత్వం ఇప్పటికైనా సర్పంచుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని పదవీ కాలం పొడిగించాలని మంత్రిని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి సర్పంచుల సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామన్నారు

మంత్రి సీతక్క హామీతో సర్పంచ్ లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి రఫిక్, మాజీ ఎంపీటీసీ పతివద్దీన్, మాలోత్ తండా సర్పంచ్ సునీత ప్రకాష్ నాయక్, నడిమి తండా సర్పంచ్ వినోద్ కుమార్ పాల్గొన్నారు

రోడ్డు విస్తరణ కోసం సొంత ఇంటిని కూల్చేసిన కామారెడ్డి ఎమ్మెల్యే

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. గత ఏడాది జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్ళలో చెప్పినట్టుగానే రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చేసి మాట నిలబెట్టుకున్నారు. మిగతా వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు కోసం సహకరించా లని కోరారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేటు వరకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 30 ఫీట్లు మాత్రమే ఉంది.

రోడ్డు వెడల్పు చేయడానికి వీలు లేకుండా అనేక మంది తమ నివాస గృహాలు నిర్మించుకున్నారు. ఇళ్ల ముందు కుళాయి గుంతలు, షెడ్డులు ఏర్పాటు చేసుకున్నారు.

అయితే రోడ్డు వెడల్పు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు వెడల్పు తన ఇంటి నుంచే మొదలు పెట్టాలని అడ్డుగా ఉన్న తన ఇంటిని కూల్చేసి ఆ స్థలాన్ని అధికారులకు అప్పగిం చారు.

నేడు ఉదయం ఆర్‌అండ్‌బి, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు ఆధ్వర్యంలో జేసీబీలతో దగ్గరుండి ఇంటిని కూల్చేయించారు. అదే రోడ్డులో పంచముఖి హనుమాన్ ఆలయం కూడా ఉండటంతో అలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు

అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, వారం రోజుల్లో రోడ్డుపై ఉన్న కుళాయి గుంతలు, షెడ్డులు ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు.

నెల రోజుల్లో ఇప్పుడున్న రోడ్డుకు అదనంగా మరొక 24 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు

అయితే ఎమ్మెల్యే ఇంటినుంచి పాత బస్టాండ్ వరకు చేపట్టబోయే రోడ్డు వెడల్పులో ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసం కూడా ఉంది. దాంతో ఆయన స్పందనపై ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు