/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz జేసీఐ పురస్కారాలకు సామాజిక సేవకులు పలువురు ఎంపిక Yadagiri Goud
జేసీఐ పురస్కారాలకు సామాజిక సేవకులు పలువురు ఎంపిక

పెద్దపల్లి జిల్లా జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ జేసీఐ సంస్థ ప్రతి సంవత్సరం వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురిని ప్రోత్సహిస్తూ.. పురస్కా రాలు అందజేయడంలో జేసీఐ సంస్థ ఎప్పుడు ముందుంటుంది

దీనిలో భాగంగా 2023 సంవత్సరంలో పలు రంగాలలో సామాజిక సేవా దృక్పథంతో విశిష్ట సేవలు అందిస్తున్న పెద్దపల్లి జిల్లాలోని పలువురు సంఘ సేవకులు, వివిధ వృత్తు లలో రాణిస్తున్న వారిని అవార్డులకు ఎంపిక చేసినట్లు జేసీఐ మంచి ర్యాల జిల్లా ఛాంబర్ అధ్యక్షులు ఆర్మూర్ల రాజు తెలిపారు.

ఎంపికైన వారిలో గోదావరిఖనికి చెందిన మురళీధర్ యాదవ్, సామాజిక విశ్లేషకులు, మాజీ పోలీస్ కానిస్టేబుల్, దళిత రత్న దేవి లక్ష్మీ నరసయ్య, బూస ప్రదీప్ - శ్రావణి దంపతుల ను పురస్కా రానికి ఎంపిక చేసినట్లు తెలిపారు.

అలాగే కాటారం మండలం లోని విలాసాగర్ ప్రైమరీ స్కూల్ లో ప్రధానోపా ధ్యాయురాలు గా విధులు నిర్వహిస్తున్న గోదావరిఖని పట్టణనికి చెందిన శాంతి లత, విద్యారత్న అవార్డుకు ఎంపికయ్యారు. ఆమె రెండో సారి ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం...

యువరత్న అవార్డుకు దేవి రోహిత్, రాముల కార్తీక్, మంథని కి చెందిన పొట్ల శ్రీకాంత్ లను ఎంపిక చేసినట్లు తెలిపారు. త్వరలోనే వీరిని పురస్కా రాలతో ఘనంగా సత్కరిం చనున్నట్లు తెలిపారు.

జేసీఐ అవార్డులకు ఎంపికైన వీరిని పలువురు అభినందిస్తున్నారు..

Revanth Reddy: నేడు ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించే అవకాశం ఉంది..

ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. రూ.500కే సిలిండర్ పథకాలను సీఎం ప్రకటించే ఛాన్స్ ఉంది. మూడు పథకాల జాబితాను అధికారులు రెడీ చేశారు. 200 యూనిట్లు వాడే కుటుంబాలు 90 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు..

అయితే, ఇంద్రవెల్లి గడ్డను సీఎం రేవంత్‌రెడ్డి సెంటిమెంట్‌గా తీసుకున్నారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే తొలి సభ నిర్వహించారు. అప్పుడు 'దళిత, గిరిజన దండోరా' పేరిట నిర్వహించిన సభకు లక్ష మందికి పైగా జనం విచ్చేశారు. సభ గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో రేవంత్‌ రెడ్డి ఇక వెనుదిరిగి చూసుకోలేదు..

ఆ తర్వాత రాష్ట్రంలో పలు సభలు నిర్వహించారు. అప్పటి నుంచే కాంగ్రెస్‌ వైపు ప్రజల్లో పెరిగిందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. ఇక, దానికి తగ్గట్టుగానే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో పాటు రేవంత్‌రెడ్డిగా సీఎం కావడం జరిగిపోయింది. తాజాగా పార్లమెంట్‌ ఎన్నికల నగారాను కూడా ఇంద్రవెల్లి నుంచే స్టార్ట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు..

500కు సిలిండర్, ఉచిత విద్యుత్ పై సీఎం రేవంత్ నేడు కీలక ఆదేశాలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మరో 2 గ్యారంటీలు అమలు చేద్దామని చెప్పారు.

రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల గ్యారంటీల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.

ఇందుకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినెట్ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామని అన్నారు.....

కాటాపూర్ సర్పంచ్ ను ఘనంగా సన్మానించిన మహిళలు

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపూర్ సర్పంచ్ పుల్లూరి గౌరమ్మ తో పాటు ఉపసర్పంచ్ మేడిశెట్టి పుష్ప లకు గురువారం ఘనంగా సన్మానించారు.

గ్రామపంచాయతీ పాలకవర్గం పదవి కాలం ముగింపు సందర్భంగా అంగన్వాడీ మహిళలు సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ పుష్ప లకు పూలమాలలతో శాలు వాలు కప్పి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ కాలంలో చేసిన సేవలను కొనియాడారు. కాటాపూర్ గ్రామానికి ప్రత్యేకత తీసుకొచ్చారని సర్పంచ్ గౌరమ్మను అభినందిం చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కురేందుల సమ్మక్క, సరిత, సుజాత, నిర్మల, శ్రీకళ, వెంకటలక్ష్మి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు...

తెలంగాణ గవర్నర్ పై ఉపాసన ప్రశంసల జల్లు

టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లిస్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన ల పేర్లు కూడా ఉంటాయి.

ఇక రామ్ చరణ్ తన సినిమాలతో బిజీగా ఉన్నా.. మరో పక్క ఉపాసన తన బిజినెస్ లతో.. సేవా కార్యక్రమాలతో బిజీగా గడుపుతుంటుంది.

ఇక ఇన్ట్సాలో కూడా ఉపాసన యాక్టింగ్ గానే ఉంటుంది. తన ఇన్ట్సా ద్వారా పలు ఆసక్తికర వియాలను పంచు కుంటుంది.

ఇప్పుడు తాజాగా మరో వార్తను పంచుకున్నారు ఉపాసన. తాజాగా ఆమె తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఈరోజు సౌందరారాజన్ ను కలిసినట్టు తెలిపింది.

ఈనేపథ్యంలోనే ఆమె ట్రైబల్ వెల్ ఫేర్ కోసం చేస్తున్న పనులు నా మనసును హత్తు కున్నాయి.. మీరు చేస్తున్న పనికి ధన్యవాదములు మేడం అంటూ తన పోస్ట్ లో పేర్కొంది... ఉపాసన

పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా బంగారం స్వాధీనం

ఎటువంటి బిల్లులు లేకుండా 6 కేజీలకు పైగా బంగారం తరలిస్తున్న 10 మంది ముఠా సభ్యులను పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ బంగారం విలువ రూ.3.85 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. భీమవరంలో గురువారం మధ్యాహ్నం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

కారు అనుమానాస్పదంగా ఉండటంతో సోదాలు చేశారు. ఈ సోదాల్లో 6 కేజీలకు పైగా బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు.

బిల్లులు చూపకపోవడంతో 10 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ బంగారం ఎక్కడి నుంచి తెస్తున్నారు.. ఎవరికి ఇస్తున్నారనే విషయాలు మాత్రం బయటకు రాలేదు.

నిందితులు ఎలాంటి విషయాలు చెప్పలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

ఉద్యోగుల‌కు 7 ల‌క్ష‌ల ఆదాయం వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాంపు: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలక్క

వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ రిలీఫ్ కల్పించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్ ప్రతిపాదిస్తూ.. వేతన జీవులకు కొత్త ఆదాయం పన్ను విధానం ప్రకటిం చారు.

ఇంతకుముందు పాత ఆదాయం పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50 వేల వరకు మినహాయింపు ఉండేది. దాన్ని రూ.25 వేల వరకు పొడిగించారు. అంటే రూ.2.50 లక్షల నుంచి రూ.3.25 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.

ఇక కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల ఆదాయం వరకూ పన్ను రాయితీ అమలవుతుంది. కార్పొరేట్ సంస్థల ఆదాయంలో పన్ను చెల్లింపు 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష ప‌న్ను చెల్లింపులు య‌థాత‌థం

ఇక ప్రత్యక్ష, పరోక్ష పన్ను చెల్లింపుల విధానం యథాతథంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వానికి రూ.23.24 లక్షల కోట్ల ఆదాయం లభించిందన్నారు.

ఎగుమతి, దిగుమతి సుంకాల విధానం యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. ఇక ప్రత్యక్ష పన్ను వసూళ్లు మూడు రెట్లు పెరిగినట్లు వెల్లడించారు...

ఈ ఏడాది సమ్మక్క భక్తులకు ఎన్విరాన్మెంట్ పన్ను లేనట్లే

త్వరలో జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా జాతర ముగిసే వరకు అక్కడ అటవీశాఖ వసూలు చేస్తున్న పర్యావరణ రుసుమును నిలిపివేస్తు న్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని మంత్రి తెలిపారు.

ఫిబ్రవరి 2 నుంచి 29 దాకా పర్యావరణ రుసుము ఎన్విరాన్ మెంట్ ఇంపాక్ట్ ఫీజు వసూలు నిలిపి వేస్తున్నట్లు అటవీ శాఖ తెలిపింది. చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో జాతరకు వచ్చే వాహనాలు, రద్దీ నియంత్రణ కూడా కొంత మేరకు సులువు అయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ములుగు జిల్లా అటవీ అధికారి తక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు.

ఏటూరు నాగారం అభయారణ్యం పరిధిలో పస్రా, తాడ్వాయి, ఏటూరు నాగారంల నుంచి వచ్చే వాహనాల నుంచి నామమాత్రపు పర్యావరణ రుసుమును ఇప్పటిదాకా అటవీ శాఖ వసూలు చేస్తోంది.

ఇలా వచ్చే ఆదాయంలో అటవీ ప్రాంతాల రక్షణకు, ప్లాస్టిక్‌ను తొలగించేందుకు, వన్యప్రాణుల రక్షణకు అటవీ శాఖ వినియో గిస్తోంది. అయితే వివిధ వర్గాల నుంచి విజ్జప్తి మేరకు జాతర ముగిసే దాకా ఈ ఫీజు వసూలు నిలిపివేస్తున్నారు.

జాతరకు వచ్చే భక్తులు అటవీ ప్రాంతాన్ని వీలైనంత పరిశుభ్రంగా ఉంచాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అటవీశాఖ కోరింది...

ములుగు జిల్లాలో మావోయిస్టు దంపతులు లొంగుబాటు

మావోయిస్టు దంప‌తులు ఈరోజు పోలీసుల స‌మ‌క్షం లో లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి చెందిన నూప బీమా అలియాస్ సంజు, మచ్చకి దుల్దో అలియాస్ సోనీ దంపతులు ములుగు జిల్లా కేంద్రంలో గురువారం ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ ముందు లొంగిపోయారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ సిద్దాంతాలు నచ్చక పోవడం, పార్టీపై ప్రజల్లో ఆదరణ సన్నగిల్లడం, ఆనారోగ్య సమస్యలతో కీలక నాయకులు లొంగిపోతున్నారని అన్నారు.

లొంగిపోయిన బీమా, సోనీ దంపతులకు ప్రభుత్వం నుంచి రివార్డులు, పున రావాసం అందిస్తా మన్నారు.

మావోయిస్టు పార్టీలోని వారు లొంగిపోతే ప్రభుత్వం నుంచి పునరావసం కల్పిస్తామని ములుగు జిల్లా ఎస్పీ సూచించారు....

మగవారి కోసం ప్రత్యేక బస్సులు?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఆరు గ్యారెంటీల ఫైల్ మీదనే సంతకం చేసింది. ఆ వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. డిసెంబర్ 9 నుంచి ఈ పథకం ప్రారంభమైంది.

మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తోన్న ఉచిత ప్రయాణం పథకం కింద తెలంగాణలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కిడికైనా ఫ్రీగా ప్రయాణించొచ్చు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో జీరో టికెట్‌తో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.

ఈపథకానికి రాష్ట్రవ్యా ప్తంగా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజూ ప్రయాణం చేసే మహిళా ప్రయాణికులు 12-14 లక్షలు ఉండగా.. ఇప్పుడు వారి సంఖ్య 30 లక్షలు దాటుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

బస్సుల్లో పురుషులకు కేటాయించిన సీట్లలోనూ మహిళా ప్రయాణికులే కూర్చుంటున్నారు. దాంతో చాలా మంది మగవారు.. తమ కోసం ప్రత్యేక బస్సులు నడపాలని.. లేదంటే అదనపు సర్వీసులైనా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ మేరకు పలువురు.. ఆర్టీసీ బస్సుల్లో రద్దీ, మగవారికి సీట్లు లేకపోవడం వంటి ఘటనలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తమ గోడు పట్టించుకోవాలని ఆర్టీసీ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకోనుం దని,వార్తలు వస్తున్నాయి. బస్సుల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని.. అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ ఆలోచన చేస్తోన్నట్లు తెలుస్తుంది.

పురుషులుకు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపుపైనా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఉచిత ప్రయాణం వల్ల విద్యార్థులు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో వారి కోసం కొన్ని మార్గాల్లో మరీన్ని సర్వీసులు నడిపే విషయంపై ఉన్నతాధి కారులు చర్చిస్తున్నారట.

అలాగే సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక సీట్లలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది. సమయాల వారీగా రద్దీపై సమగ్ర సమాచారం వచ్చాక పురుషులకు, విద్యార్థులకు స్పెషల్ బస్సులు నడపడంపై ఉన్నతాధి కారులు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.