/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz రామన్నపేట: నూతన సిఐ ని సన్మానించిన బీఎస్పీ నాయకులు Mane Praveen
రామన్నపేట: నూతన సిఐ ని సన్మానించిన బీఎస్పీ నాయకులు

బీఎస్పీ మండల పార్టీ ఆధ్వర్యంలో రామన్నపేట పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షులు మేడి సంతోష్, ఉపాధక్షులు గుని రాజు, ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నర్సింహా, మండల మహిళా కన్వీనర్ బందెల అనిత, బిఎస్పి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

YBD: పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మున్సిపల్ చైర్మన్

యాదాద్రి జిల్లా:

చౌటుప్పల్: పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటు పనులను మున్సిపల్ చైర్మన్ వెన్‌ రెడ్డి రాజు పరిశీలించారు. మధ్యాహ్నం సమయం అవడంతో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ, విద్యార్థులతో ముచ్చటిస్తూ భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని పదవ తరగతిలో 10/10 సాధించిన ప్రతి విద్యార్థికి పది వేల రూపాయలను బహుమతిగా ఇస్తానని చెప్పారు.

సీనియర్ అడ్వకేట్ తాడూరి పరమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

NLG: ప్రభుత్వ జేబీఎస్ హైస్కూల్ లో విద్యార్థులకు శారీరకదారుఢ్య కార్యక్రమాలు

నల్గొండ పట్టణంలోని మాధవ్ నగర్ జేబీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు

బొమ్మపాల గిరిబాబు సారథ్యంలో, విద్యార్థుల కొరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు విద్యార్థుల్లో శారీరక ఆరోగ్యం, శారీరక ఎదుగుదల, మానసిక పరిపక్వత కొరకు ప్రతిరోజు స్వచ్ఛందంగా వ్యాయామ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో ఈరోజు ప్రత్యేకంగా చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్, కబడ్డీ, క్రికెట్ క్రీడాకారులు మరియు జే బీఎస్ పాఠశాల విద్యార్థులు తో కలిపి వివిధ రకాల శారీరకదారుఢ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం ముందరనే విద్యార్థులు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అద్భుతమైన శారీరక, మానసిక పరిపక్వత సాధించవచ్చునని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, దాదాపు 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

NLG: ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో చేరుటకు గడువు తేదీ పొడిగింపు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరుటకు గడువు తేదీని పొడిగించడం జరిగింది. ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఈ అవకాశం ఉంది. కావున విద్యార్థులు, విద్యార్థినిలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజా రామ్ ఒక ప్రకటనలో తెలిపారు.

NLG: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ పై అవగాహన

నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈరోజు సైబర్ క్రైమ్ పై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. 

నల్గొండ సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నాగార్జున, నల్గొండ టూ టౌన్ ఎస్సై నాగరాజు సహకారంతో కళాశాల విద్యార్థిని లకు సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు. 

వారు మాట్లాడుతూ.. ఈ మధ్య సోషల్ మీడియా, ఫేస్బుక్ మరియు వాట్సాప్ లలో జరుగుతున్న వివిధ రకాలైన నేరాల పై అవగాహన పెంచుకోవాలని, వాటిని అధిగమించాలని, గుర్తు తెలియని వ్యక్తులు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినట్లు ఐతే స్పందించ కూడదని, వాట్సప్ మిగతా సోషల్ మీడియా సైట్లకు టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థినులకు సైబర్ క్రైమ్ నేరాలకు సంబంధించిన సలహాలు వివరంగా తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఘన్ శ్యామ్, వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి, అధ్యాపకులు మంజుల, సుంకరి రాజారామ్ మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ జ్యోతి, శైలజ, సరిత, వనజ తదితరులు పాల్గొన్నారు.

TS: నంది అవార్డుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

సినీ కళాకారులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన నంది అవార్డుల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

కళారంగంలో ప్రముఖ ప్రజా కవి గద్దర్ చేసిన సేవలకు గుర్తింపుగా.. ఇకనుంచి తెలంగాణ రాష్ట్రంలో నంది అవార్డుల పేరును గద్దర్ పేరు మీదగా ఇస్తామని కీలక ప్రకటన చేశారు.

హైదారాబాద్ లో రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. దీనిపై త్వరలోనే జీవో జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

TS: ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా గద్దర్ జయంతి వేడుకలు

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం తెలంగాణ విప్లవకారుడు, ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి వేడుకలను తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకురాలు డాక్టర్. రేష్మ హుస్సేన్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఒక విప్లవ కారుని కోల్పోయిందని అటువంటి ప్రజా గాయకుడు నేడు మన రాష్ట్రంలో లేకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఆయన పాడిన పాటలు, విప్లవ గీతాలు ఎన్నటికీ మరువలేని స్మృతులని ఆమె బాధతృప్త హృదయముతో ఆవేదన వ్యక్తపరిచారు. ఆయన చేసిన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ట్యాంకుబండ్ పై  విగ్రహాన్ని నిర్మిస్తానని అనడం సంతోషకరమైనటువంటి విషయమని ఆమె అన్నారు.

అదేవిధంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వ లాంఛనాలతో ఆయన జయంతిని జరుపుతామని తెలపడం తెలంగాణ రాష్ట్రం గర్వించదగిన విషయమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

TS: గత ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో.. తప్పులున్న వాటిని నిలిపివేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికను ఏఐసీసీకి అప్పగించినట్టు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికకు సీఈసీ కమిటీని నియమించినట్టు వివరించారు..

అభ్యర్థులు అప్లపికేషన్లను గాంధీ భవన్‌లోనే సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు మరో 100 రోజులు ఉందని.. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి నుంచి.. ప్రచారానికి సమరశంఖం మోగిస్తున్నటు ప్రకటించారు..

గత ప్రభుత్వం ఇచ్చిన కొన్ని జీవోల్లో తప్పులున్న జీవోలను నిలిపివేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వాటిపై విచారణ సంస్థలు విచారణ చేపట్టాయని... ప్రజాస్వామ్యయుతంగా పద్దతిగా ప్రాసెస్ జరుగుతుందని జరిగిన తప్పులను ఇన్వెస్టిగేటీవ్ ఏజెన్సీలు తేల్చుతాయన్నారు. గత ప్రభుత్వంలో తప్పులున్న జీవీలోను తమ ప్రభుత్వం దృష్టికి వచ్చిన జీవోలను వెంటనే నిలిపేస్తున్నామని స్పష్టం చేశారు.

TS మల్లు రవి ని మర్యాదపూర్వకంగా కలిసిన మలిదశ విద్యార్థి ఉద్యమ నాయకురాలు

తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవిని, గాంధీభవన్ లో మంగళవారం, తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె 2012 తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంలో ఆమెకు బుల్లెట్ గాయాలైన విషయాలు ఆయనకు వివరించారు.

ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. అదేవిధంగా డాక్టర్ రేష్మ హుస్సేన్ విద్యా నేపథ్యాన్ని అడిగి తెలుసుకుని ఉన్నత విద్యలు చదివిన ఆమెను అభినందించారు.

TS: కొరత లేకుండా తెలంగాణ లో నిరంతర విద్యుత్తు: ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్క

హైదరాబాద్: తెలంగాణ లో విద్యుత్తు స‌ర‌ఫ‌రా పై త‌ప్పుడు ప్ర‌చారం మానుకోకుంటే, బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్ర‌జ‌లే బుద్ది చెప్తారని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్ర‌మార్క‌ అన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించిన కొంత మంది సోషల్ మీడియా వీరులు, కరెంటు స‌ర‌ఫ‌రాపై తప్పుడు ప్రచారం చేస్తూ.. తెలంగాణ ప్రజలను తప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు.

తెలంగాణ ప్రజలకు నాణ్య‌మైన విద్యుత్తు తో పాటు ఎటువంటి కోత‌లు లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా జరుగుతుందని, దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్రం చీకట్లో ఉండాలని కలలు కంటున్న బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియా వీరుల ఆశలను, అసలు స్వరూపాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇందిర‌మ్మ రాజ్యం ప్రజల ప్రభుత్వమ‌ని, ప్రజల కలలు నిజం చేయడమే తమ ధ్యేయమ‌న్నారు.

ఫేక్‌ లీడర్స్, సోషల్‌ మీడియా లీడర్స్‌ తెలంగాణలో విద్యుత్తు కోత‌లు ఉంటే బాగుంటుందని కలలు కంటున్నారని, వారి కలలు వికృతి కలలని, అటువంటి వారికి తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారనన్నారు.

తెలంగాణలో విద్యుత్ సరఫరా గత సంవత్సరంతో పోలిస్తే 2023 డిసెంబర్ 07 నుండి గణనీయంగా మెరుగుపడిందని వివ‌రించారు.

2023 డిసెంబర్ నెలలో రాష్ట్రంలో ప్రతి రోజు సగటున 207.7 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశామ‌ని, 2022 డిసెంబర్ లో సగటున 200 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేశార‌ని తెలిపారు.