/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TSPSC బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి Mane Praveen
TSPSC బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి

TSPSC బోర్డు ఛైర్మన్‌గా నియమితులైన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. 

TSPSC కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. 

ఆయనతో పాటు బోర్డు సభ్యులు అనితా రాజేంద్ర, పాల్వాయి రజని కూడా డ్యూటీ ఎక్కారు.

NLG: లెంకలపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు బహుమతులు ప్రధానం

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం

లెంకలపల్లి: ప్రాథమికోన్నత పాఠశాలలో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలాపించారు.

అనంతరం ఏఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఏర్పుల నగేష్ ఆధ్వర్యంలో.. వివిధ పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు సర్పంచ్ పాక నగేష్ యాదవ్,ఎంపీటీసీ ఏర్పుల శ్రీశైలం, హెడ్మాస్టర్ యాదగిరి, ఫౌండేషన్ సభ్యుడు ఏర్పుల చంద్రశేఖర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

NLG: లెంకలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

నల్లగొండ జిల్లా: మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా, గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఉమాదేవి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశం 1950 జనవరి 26న స్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిందని అన్నారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

TS: తెలంగాణను పునర్‌నిర్మించే మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్‌: కార్యకర్తల శ్రమ వల్లే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్‌స్థాయి కన్వీనర్ ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

రాహుల్‌గాంధీ పాదయాత్ర తోనే కర్ణాటకలో, తెలంగాణలో అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాలేదు.. హామీలు అమలు ఎక్కడ అని భారాస నేతలు అడుగుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో మరో రెండు హామీలు అమలు చేస్తాం. ఫిబ్రవరి ఆఖరు వరకు రైతు భరోసా నగదు అందిస్తాం. భారాస అమలు చేశారా? పదేళ్లలో కేసీఆర్‌ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దాలి. కొందరు నన్ను మేస్త్రి అని విమర్శిస్తున్నారు. అవును తెలంగాణను పునర్‌నిర్మించే మేస్త్రీనే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

అవినీతిపరులు, కోటీశ్వరులను కేసీఆర్‌ రాజ్యసభకు పంపించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బలహీన వర్గాల బిడ్డలు మందుల శామ్యూల్‌, వెడ్మ బొజ్జుకి కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇచ్చి గెలిపించింది. రైతు బిడ్డనైన నేను కాంగ్రెస్‌లో సీఎం అయ్యాను. కాంగ్రెస్ పార్టీలో అందరికీ అవకాశాలు ఉంటాయి. లోక్‌సభ ఎన్నికలు అత్యంత కీలకం. భారాసను మొన్న ఎన్నికల్లో ఓడించాం, పార్లమెంట్‌ ఎన్నికల్లో తరిమికొడదాం. పులి వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పులి వస్తే బోనులో పెట్టి బొందపెడతాం. మోదీ, కేసీఆర్‌ వేరువేరు కాదు. అభ్యర్థులను మారిస్తే గెలిచే వాళ్లమని భారాస నేతలు అంటున్నారు. మార్చాల్సింది అభ్యర్థులను కాదు.. కేసీఆర్‌ కుటుంబాన్ని అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

YBD: యాదాద్రి జిల్లాలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా వ్యక్తులు.. విలేఖరి పై దాడి

యాదాద్రి భువనగిరి జిల్లా:

వలిగొండ మండల కేంద్రంలో ఓ విలేకరి పైన అక్రమ ఇసుక మాఫియా దారులు కత్తులు, గొడ్డలితో దాడి చేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. 

వలిగొండ పట్టణ పోలీసులు రెండు రోజుల క్రితం అక్రమ ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేయడంతో, క్రిస్టఫర్ అనే విలేకరి ఆ టాక్టర్ ని పట్టించాడనే ఉద్దేశంతో అతనిపై ఇసుక మాఫియా వ్యక్తులు దాడి చేశారు. దాడిలో తలకు తీవ్ర గాయాలైన క్రిస్టఫర్ ను భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

NLG: 'గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలి'

దేవరకొండ: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని మరియు రాజ్యాంగ ప్రతిని తప్పకుండా ఉంచి జాతీయ జెండా ఎగర వేయాలని ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఆర్డిఓ ఆఫీస్ లో మెమోరండం సమర్పించారు

1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు ను పురస్కరించుకొని స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిన ఆరోజును మనం ప్రతి ఏటా భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని బుర్రి వెంకన్న అన్నారు.

కావున జనవరి 26 న నిర్వహించే గణతంత్ర వేడుకల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని మరియు రాజ్యాంగ ప్రతిని తప్పకుండా ఉంచి జాతీయ జెండా ఎగరేయాలని ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కంబాలపల్లి వెంకటయ్య, రాములు, రాజ్ కుమార్, పెద్దయ్య, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

NLG: రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 29 చలో కలెక్టరేట్: SFI

నల్లగొండ జిల్లా

దేవరకొండ: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, నల్లగొండ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం SFI జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. 

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా SFI రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు హాజరై మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా SC,ST,BC సంక్షేమ హాస్టల్ ‌విద్యార్థుల మెస్ చార్జీలు ‌విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈనెల 29చలో కలెక్టరేట్ ఎదుట ‌ఆందోళనకు రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చిందని తెలిపారు.

జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ లో వుండే SC,ST,BC సంక్షేమ ‌వసతి గృహాల్లో వుంటు చదువుకుంటున్న ‌పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వం గత సంవత్సరం మార్చి నుంచి విద్యా సంవత్సరం 2023 - 2024 జనవరి వరకు ఒక్క పైసా కూడా విడుదల చేయకుండా వుండడం వల్ల ‌సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందడం లేదని అన్నారు.

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి గత సంవత్సరం బకాయి లో వున్న మెస్ చార్జీలు, స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ రమావత్ లక్ష్మణ్,బుడిగ వేంకటేష్, కుర్ర సైదా నాయక్, కోరె రమేష్, రవీందర్, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

NLG: లెంకలపల్లి లో జాతీయ ఓటరు దినోత్సవం

నల్లగొండ జిల్లా: 

నేడు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో సర్పంచ్ పాక నగేష్ యాదవ్, గ్రామపంచాయతీ కార్యదర్శి ఉమాదేవి బిఎల్ఓ చాపల పద్మ ఆధ్వర్యంలో.. ఓటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆశాలు ఏర్పుల పద్మ, సైదాబీ, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

SRPT: మద్యం బాటిళ్లు సీజ్, కేసులు నమోదు

సూర్యాపేట: సిసిఎస్, స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సూర్యాపేట రూరల్, పట్టణం, చివ్వెంల పోలీసు స్టేషన్ ల పరిధిలో జాతీయ రహదారి వెంట ఉన్న దాబా హోటల్స్, కిరణాలు పై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాల మేరకు ఆకస్మికంగా రైడ్స్ నిర్వహించారు. మద్యం అమ్మకాలు, అక్రమ సిట్టింగులు, అసాంఘిక కార్యకలాపాల పూర్తి సమాచారం మేరకు 21 దాబా హోటల్స్ పై తనిఖీలు నిర్వహించి మద్యం బాటిళ్లు సీజ్ చేసి, 11 దాబాల పై కేసుల నమోదు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

జాతీయ రహదారి పై అసాంఘిక చర్యలను అదుపు చేయడం, రోడ్డు వెంట భద్రత కల్పించడం, రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా చర్యలు తీసుకున్నట్లు, రైడ్ నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

NLG: ముళ్ళ పొదల్లో పసి బాలుడు.. అక్కున చేర్చుకున్న స్థానికులు

నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి:

నవ మాసాలు మోసిన ఓ తల్లి మానవత్వాన్ని మరిచిపోయి పేగు తెంచుకుని పుట్టిన పసికందును ముళ్ళ పొదల్లో వదిలేసింది. ఈ ఘటన కొండమల్లేపల్లిలో చోటుచేసుకుంది. ముళ్ళ పొదల్లో కనిపించిన మగ శిశువును స్థానికులు వెంటనే అక్కున చేర్చుకుని మానవత్వాన్ని చాటారు. స్థానిక అంగన్వాడి టీచర్ కు సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్ అధికారులు వెంటనే దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.