/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz పార్లమెంటు ఎన్నికలలోపు కులగణన ప్రకటన చేయాలి: బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ Miryala Kiran Kumar
పార్లమెంటు ఎన్నికలలోపు కులగణన ప్రకటన చేయాలి: బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ

పార్లమెంటు ఎన్నికలలోపు కులగణన ప్రకటన చేయాలి.

• ఫిబ్రవరి 5 - 6 తేదీలలో బీసీ బిల్లు పెట్టాలని చలో ఢిల్లీ

పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, జనగణలో కులగణన చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో

రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర బడ్జెటులో బి.సి అభివృద్ధికి 2 లక్షల కోట్లు కేటాయించాలి. డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5,6వ

తేదీలలో చలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేసి పార్లమెంట్ వద్ద వేలాదిమంది భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షులు నీల వెంకటేష్ ముదిరాజ్ తెలిపారు. ఈరోజు నల్గొండ జరిగిన జిల్లా మీటింగ్ కు జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ చలో ఢిల్లీ ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది బీసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. ప్రతి బి.సి ఈ ఉధ్యమంలో పాల్గొనాలని పిలుపు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టారని గత 30 సంవత్సరాలుగా ఢిల్లీ పార్లమెంటు వద్ద 102 సార్లు ధర్నాలు జరిపాము. 66 సార్లు ప్రధాన మంత్రులను కలిసి చర్చలు జరిపాం. వందలాది పార్లమెంటు సభ్యులను, ప్రతిపక్ష

పార్టీలను కలిసి విజ్ఞప్తి చేశాము. కేంద్ర ప్రభుత్వానికి 18 డిమాండ్లు సమర్పించగా 2 డిమాండ్లను 1. జాతీయ బిసి కమిషన్ కు రాజ్యాంగబద్ధమైన హోదా, 2. కేంద్ర ఓబిసి రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించడానికి అంగీకరించారు. జీవోలు జారీ చేశారు. ఇంకా అంగీకరించిన నాలుగు డిమాండ్లలో రెండు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, కేంద్ర బడ్జెటు బీసీ విద్యార్ధులకు స్కాలర్ షిప్ పూర్తి ఫీజురియంబర్స్ మెంట్ డిమాండ్లు పరిష్కారం కాలేదు. బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్ లో 2 లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని కోరారు. జాతీయస్థాయి తెలుగు రాష్ట్రాలలో ఉన్న మాదిరిగా పూర్తి ఫీజుల రియంబర్స్ మెంట్, ప్రతి విద్యార్థికి 20 వేల స్కాలర్ షిప్ పథకం పెట్టాలి. అలాగే నాణ్యమైన విద్య కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ పాఠశాల స్కీం, హాస్టళ్ళు మంజూరు చేయాలని కోరారు. అలాగే ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. బీసీల అభివృద్ధికి ఎలాంటి పథకం పెట్టకుండా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

ఇది ప్రజస్వామ్యదేశం అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి, వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి. అప్పుడ oలో సమైక్యత, సమగ్రత, శాంతి ఉంటుంది. అందుకోసం బి.సి లకు రావలసిన వాటా కోసం మరోసారి అధ్యయనం జరుగా లకు రాజ్యాంగబద్దమైన హక్కులు-వాటా కల్పించవలసిన సమయం ఆసన్నమైనది.

ఏ వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ బీసీ కులగణన, పార్లమెంటులో బీసీ బిల్లు పెడతామని ప్రకటిస్తుందో ఆ పార్టీకే బీసీలు మద్దతు ఇస్తారు అన్నారు. కేంద్ర ప్రభుత్వం గత 76 సంవత్సరాలుగా బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించకుండా అన్యాయం చేస్తున్నాయి. 76 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీలకు చట్టసభలలో బి.సి బిల్లు పెట్టాలని ఉద్యమాలు చేస్తుంటే బీసీ వర్గానికి చెందిన ప్రధానమంత్రి యుండి కూడా బీసీ బిల్లు పెట్టకపోతే చరిత్రలో ఎవరు కూడా చేయరని అన్నారు. అందుకే బీసీలు ఉద్యమాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చాం. ప్రతి బీసీ బీసీ ఉద్యమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.బిజెపి పార్టీ బీసీ వర్గానికి చెందిన నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేస్తుంది. కానీ దేశంలోని 75 కోట్ల మంది ప్రజల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదు. కనీసం ప్రధానమంత్రి అంగీకరించిన ప్రత్యేక మంత్రిశాఖ ఇంత వరకు బీసి

ఏర్పాటు చేయక పోవడం అన్యాయం. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వాలు గత 75 సంవత్సరాల గా బీసీలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాటా ఇవ్వలేదు. ఉద్యోగ రాజకీయ ఆర్థిక సామాజిక రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదు ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో అన్ని సామాజిక కులాలకు వారి వారి జనాభా ప్రకారం అన్ని రంగాలలో వాటా ఇవ్వాలి కానీ 70 సంవత్సరాలు గడిచిన వాటా ఇవ్వడం లేదు. బి.సి లంటే ఉత్పత్తి కులాలు. దేశ సంపద సృష్టిస్తున్నారు. కాని సంపద అనుభవించే హక్కు లేదు. అవకాశం లేదు. పన్నులు కట్టి దేశ బడ్జెట్ ఇస్తున్నారు. కాని బడ్జెట్ లో కనీస వాటా లేదు. ఓట్లు వేసి అధికారం ఇస్తున్నారు. కాని అధికారులు బి.సి లకు వాటా ఇవ్వడం లేదు. ఈ దేశం లో బి.సిలకు ఇలా

అన్యాయం జరుగుతుందన్నారు.

రాజకీయ రంగంలో బి.సి ల ప్రాతినిద్యం 14శాతం దాటలేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వా

సింది. కేంద్రమంత్రి వర్గంలో, రాష్ట్ర మంత్రి వర్గంలో, లోక్ సభ, రాజ్య సభ, రాష్ట్ర అసెంబ్లీ లు, కౌన్సిల్ల లో 75 సంవత్సరాల బి.

ప్రాతినిధ్యం సర్వే చేసి లెక్కించగా, 14 శాతం దాటలేదంటే బి.సి లకు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంత అన్యాయం జరిగిం బస్తుంది. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. డబ్బుల ప్రభావం ఎన్నికల మీద విపరీతంగా ఉంది. ఇలాంటి పరిస్థితులక ్బలు లేని బి.సి లు ఎన్నికలలో గెలవలేరు. 75 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో 56 శాతం జనాభా గల బి.సి ల కీయ రంగంలో 14 శాతం, ఉద్యోగ రంగంలో 9 శాతం. పారిశ్రామిక రంగంలో ఒక శాతం, ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలలో దం 27శాతం నుండి 56 శాతంకు పెందాలని కోరారుపంచాయతీరాజ్ సంస్థలో బి.సి. రిజర్వేషన్లను 22 శాతం నుంచి 5

30 ప్రాతినిథ్యం లేదంటే చట్ట సభలలో బి.సి లకు జనాభా ప్రకారం వాటా ఇవ్వవలిసిన ఆవశ్యకతను తెలుపుతుంది. పార్లమెంటులో బి.సి. బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీ లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని. బి.సి ఉద్యోగులక బాషన్లను రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బి.సి.ల జనాభ

వంకు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు. బి.సి.ల విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్ల పై ఉన్న క్రివి మరు తొలగించాలని కోరారు. బి.సి.లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బీసీల అభివృద్ధికి ప్రత్యేక స్కీములన పొందించాలని కోరారు. ఎస్సీ / ఎస్టీ అట్రా సిటీ యాక్ట్ మాదిరిగా బి.సి.లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బి.సి క్ట్ను తీసుకురావాలని కోరారు. ప్రపంచీకరణ సరళీకృత, ఆర్ధిక విధానాలు రావడం పారిశ్రామికీకరణ వేగవంతంగా జరగడ టు రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. అందుకే ఎస్సీ / ఎస్టీ / బి.సి.లకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాల

"రు. సుప్రీం కోర్టు- హై కోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ/ ఎస్టీ బి.సి.లకు రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. కేంద్రంలో బి.సి.లక > మెట్రిక్స్ స్కాలర్ షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ స్కీము విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 8.

"చింగ్ గ్రాంట్ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భ

మాలని కోరారు. కేంద్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ బి.సి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, జనాభా లెక్కల లో బి.సి. కులా ఏ లెక్కలు సేకరించాలని కోరారు. ఈ 14 డిమాండ్లు పై జాతీయ స్థాయి ఉద్యమామ్ చేపట్టాలని నిర్ణయించారు.

ఈ సమావేశానికి నీల వెంకటేష్

రాష్ట్ర అధ్యక్షులు - బి.సి యువజన సంఘం

 పీలం వెంకటేష్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు రాష్ట్ర అధ్యక్షులు సింగం లక్ష్మి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కదిరి జిల్లా కార్యదర్శి బక్కతట్ల వెంకన్న యాదవ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఖమ్మంపాటి దుర్గా వల్ల కీర్తి శ్రీనివాస్ పగిళ్ల కృష్ణ పున్న వీరేశం వనం లలిత సతీష్ యాదవ్ చెరుపల్లి సదానందు కర్నాటి మచ్చ గిరి గడ్డం దశరథ గోడ శివ కల్లూరి రమణ తదితరులు పాల్గొన్నారు.

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంకు కేసీఆర్‌కి ఆహ్వానం...

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంకు కేసీఆర్‌ను ఆహ్వానించిన శ్రీరామ జన్మభూమి ట్రస్ట్

 

ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా బీఆర్‌ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ తరఫున ఆహ్వానం పంపించారు.

దేశవ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలకు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సహా ప్రముఖులందరిని ట్రస్ట్‌ ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌కు కూడా ఆహ్వానపత్రం పంపించారు. అయితే, ఆయనకు ఇటీవలే తుంటి ఎముక ఆపరేషన్‌ జరిగినందున కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన నేతలు..

అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన నేతలు..

సీఎంవోకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్.. మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు 

గడికోట శ్రీకాంత్ రెడ్డి, బియ్యపు మధుసూధన్, శ్రీనివాసులు.

జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై దాడి అమానుషం.. పెండెం ధనుంజయ్ నేత

జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై దాడి అమానుషం.. పెండెం ధనుంజయ్ నేత 

హాస్పిటల్ వెళ్లి పరామర్శించిన  

 పెండెం ధనుంజయ్ నేత

పంజాగుట్టలో జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై జరిగిన దాడిని బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెండెం ధనుంజయ్ త్రీవంగా ఖండించారు ప్రజాస్వామ్యం లో పత్రిక స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల గొంతు నొక్కడమేనన్నారు ఓ వైపు ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ.. మరోవైపు ప్రశ్నించే జర్నలిస్టులను బెదిరించడం నీచమైన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వం స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోని, మరోసారి పునవురావృతం కాకుండా చూడాలని కోరారు, ప్రశ్నించే గొంతుకలకు BRS పార్టీ అండగా ఉంటుందని, చిలుక ప్రవీణ్ పై దాడి జరిగిన వెంటనే మాజీ మంత్రులు హరీష్ రావు మరియు జగదీశ్ రెడ్డి గార్లు చిలుక ప్రవీణ్ ను పరామర్శించారని వారికి అండగా ఉంటామని వారు తెలిపినట్లు ధనుంజయ్ తెలియజేశారు.

నేడు వైయస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు

నేడు వైయస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు 

వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజా రెడ్డి ఎంగేజ్మెంట్ వేడుక నేడు హైదరాబాద్‎లో జరుగనుంది.

గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ వైఎస్ రాజా రెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ మహోత్సవానికి వేదికైంది. సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ మంగళకార్యానికి వైఎస్ షర్మిల అన్న, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి భారతి హాజరుకానున్నారు.

ఈమధ్యనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితుల య్యారు. దీంతో అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ శుభకార్యానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ లను కలిసి వివాహానికి హాజరు కావల్సిందిగా శుభలేఖ అందజేశారు

వైఎస్ షర్మిల. ఈ కార్యక్రమానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

ఈనెల 21న ఏపీసీసీ ప్రెసిడెంట్‎గా బాధ్యతలు చేపడుతున్న తరుణంలో ఈ శుభకార్యం జరగడంతో చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

పాత పరిచయాలన్నింటికీ కుమారుడి ఎంగేజ్మెంట్ వేదిక కానుంది...

బాలకృష్ణలు ఎంతమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏం చేయలేరు

బాలకృష్ణలు ఎంతమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏం చేయలేరు

 

కొడాలి నాని

టిడిపి జాతీయ కార్య‌దర్శి లోకేష్‌ కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు తొలగింపుపై ఆయన స్పందిస్తూ.. వాళ్లది నీచాతినీచమైన బుద్ధి అంటూ వ్యాఖ్యానించారు.

  

వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఏం చేయలేర‌ని తేల్చి చెప్పారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ చేయలేర‌ని అంటూ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్‌ వర్ధంతి చేస్తారా?” అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు.

ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్‌ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను తొలగించారు.

బ్రేకింగ్ న్యూస్:NTR ఘాట్‌ దగ్గర జూ. ఎన్టీఆర్‌ ఫ్లెక్సీల తొలగింపు..

NTR ఘాట్‌ దగ్గర జూ. ఎన్టీఆర్‌ ఫ్లెక్సీల తొలగింపు

బాలకృష్ణ ఆదేశాల మేరకే ఫ్లెక్సీల తొలగింపు

బాలకృష్ణ వచ్చివెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీల తొలగింపు

తీయించండి ఇప్పుడే అని అనుచరులకు చెప్పిన బాలకృష్ణ

హైదరాబాద్‌: బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో వింగ్స్ ఇండియా 2024ను ప్రారంభించిన కేంద్రమంత్రి ..

హైదరాబాద్‌: బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో వింగ్స్ ఇండియా 2024ను ప్రారంభించిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా..

పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏవియేషన్ రంగ నిపుణులు.. 4 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌కి దేశ విదేశాల ప్రతినిధులు హాజరు.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం బోయింగ్ 777-9 విమానంతో పాటు అనేక విమానాల ప్రదర్శన

నేడు దావోస్ నుండి లండన్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి..

నేడు దావోస్ నుండి లండన్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి నేడు దావోస్ నుంచి లండన్ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు లండన్‌లో ఆయ‌న ప‌ర్య‌టించ‌నున్నారు.

వివిధ అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరపనున్నారు. ఈ నెల 23న రాష్ట్రానికి తిరిగి రానున్నారు.

ఇదిలా ఉండ‌గా బుధ‌వారం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు ఎంవోయూ కుదుర్చుకొన్నాయి.

అదానీ గ్రూప్‌సహా ఆరు కంపెనీలు మొత్తం రూ.37,600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క

రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు నిర్వహిం చనుంది.

ఇందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇవాళ్టి నుంచి ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సమావేశమవుతారు.

మధ్యాహ్నం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన శాఖల ప్రతిపాదనలను భట్టి సమీక్షిస్తారు. 19వ తేదీన సీతక్క, దామోదర రాజనర్సింహలకు చెందిన శాఖల సమీక్ష ఉంటుంది.

20వ తేదీన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు.. 22వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ.. 23వ తేదీన పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులకు సంబంధించిన శాఖల సమీక్ష ఉంటుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు 24, 25, 27వ తేదీల్లో జరగనున్నాయి.