/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz నేడు దావోస్ నుండి లండన్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. Miryala Kiran Kumar
నేడు దావోస్ నుండి లండన్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి..

నేడు దావోస్ నుండి లండన్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి నేడు దావోస్ నుంచి లండన్ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు లండన్‌లో ఆయ‌న ప‌ర్య‌టించ‌నున్నారు.

వివిధ అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరపనున్నారు. ఈ నెల 23న రాష్ట్రానికి తిరిగి రానున్నారు.

ఇదిలా ఉండ‌గా బుధ‌వారం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు ఎంవోయూ కుదుర్చుకొన్నాయి.

అదానీ గ్రూప్‌సహా ఆరు కంపెనీలు మొత్తం రూ.37,600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క

రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు నిర్వహిం చనుంది.

ఇందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇవాళ్టి నుంచి ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సమావేశమవుతారు.

మధ్యాహ్నం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన శాఖల ప్రతిపాదనలను భట్టి సమీక్షిస్తారు. 19వ తేదీన సీతక్క, దామోదర రాజనర్సింహలకు చెందిన శాఖల సమీక్ష ఉంటుంది.

20వ తేదీన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు.. 22వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ.. 23వ తేదీన పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులకు సంబంధించిన శాఖల సమీక్ష ఉంటుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు 24, 25, 27వ తేదీల్లో జరగనున్నాయి.

మేడారం వెళ్లే మహిళ భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ : మంత్రి సీతక్క

మేడారం వెళ్లే మహిళ భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ : మంత్రి సీతక్క

 

తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మల జాతర మహా కుంభమేళను తలపిస్తుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు యావత్ దేశం నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.

ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి మేడారం జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్ ల సౌకర్యం ఉంటుందని మంత్రి సీతక్క వెల్లడించారు.

అలాగే ఈ సారీ మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉండటంతో రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సుల సంఖ్యను పెంచామన్నారు.

ఇప్పటికే తెలంగాణలోని బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలదు. అయితే జాతర సమయంలో ఈ ఫ్రీ బస్ సర్వీస్ వర్తిస్తుందో లేదో అని సందేహం నెలకొంది.

దీంతో మేడారం లో జరుగుతున్న పనులను పరిశీలించిన తర్వాత మంత్రి క్లారిటీ ఇచ్చారు.

ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్..

ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

 

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యక జారీ చేసిన జీవో 47ను సవాలు చేస్తూ ఎ.హరేందర్‌కుమార్‌ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభు త్వానికి లేదని, ఇది వివక్షతో కూడిన నిర్ణయమని అన్నారు.

ఉచితంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో, అవసరాల కోసం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవు తున్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ప్రతివాదులుగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఛైర్మన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల ప్రచార సమయం లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహి ళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే.

నేడు నుంచి రైతు ఖాతాల్లో రైతుబంధు

నేడు నుంచి రైతు ఖాతాల్లో రైతుబంధు 

ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు.

నిజామాబాద్ జిల్లా, నందిపేట మండలం, ఆంధ్రానగర్‌లో ది వంగత నందమూరి తారక రామారావు విగ్రహా న్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడు తూ…ఎన్ని ఇబ్బందులున్నా రైతు డిక్లరేషన్‌ను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, రై తాంగ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తా మని అన్నారు. నందమూరి తారకరామారావు ఆశీస్సు లతో రాజకీయా లలోకి వచ్చిన తామంతా, ఆ మహానుభావుని ఆశయా లకు అనుగుణంగా అదే నిబద్దత, నిజాయితీగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాలు నేడు దేశమంతటా అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. రైతుల అవస రాలు, కష్టాలు తెలిసిన వ్య క్తిగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు.

ఇప్పటికే రెండకరాల లో పు వ్యవసాయ భూమి కలిగిన 29 లక్షల మం ది రైతులకు రైతుబంధు అందించామని, మి గతా రైతులకు కూడా గురువారం నుండే వారి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఈ నెలాఖరులోపు రైతులందరి ఖాతాల్లో రైతుబంధు నిధులు పడతాయని స్పష్టం చేశారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు నిండి ఏటీసీ వరకు క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,964 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 27,657 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు

ఆంధ్ర లో తెలంగాణ పందెం కోడి..

ఆంధ్ర లో తెలంగాణ పందెం కోడి

సంక్రాంతి సందర్భంగా ఏపీలో జరిగే కోడి పందేలకు హైదరాబాద్‌ పాత నగర శివారు ప్రాంతాలకు విడదీయరాని బంధం ఉంది.

జల్‌పల్లి మున్సిపల్‌ పరిధిలో పందెం కోళ్ల కూతలు వినిపిస్తాయి. ఎర్రకుంట, షాహిన్‌నగర్‌, కొత్తపేట, సలాల పరిసరాల్లో కాకి, డేగ, నెమలి, అస్లీ తదితర మేలు జాతి కోడి పుంజులను పెంచుతారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలకు ఇక్కడి నుంచి కోళ్లను ఎగుమతి చేస్తుంటారు.

కోట్లాది రూపాయలు వెచ్చించి పోటీలకు కొనుగోలు చేస్తుంటారు.

విచారణకు హాజరుకాలేను: కవిత

విచారణకు హాజరుకాలేను: కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత ఈడీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. కేసు తేలే వరకు హాజరుకాకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో గతేడాది మార్చిలో మూడు రోజుల పాటు కవితను ఈడీ విచారించింది.

నేటి మార్నింగ్ ముచ్చట్లు..

మార్నింగ్ ముచ్చట్లు...

సత్యసాయి జిల్లాలో పర్యటించనున్న మోదీ, జగన్

దావోస్‌లో కొనసాగుతున్న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

చంద్రబాబు పిటిషన్‌పై తీర్పుఇవ్వనున్న సుప్రీంకోర్టు

భక్తుల కోసం 'దివ్య్అయోధ్య' యాప్‌ను ప్రారంభించిన UP

రెండు రష్యన్ కమాండ్ విమానాలను కూల్చేసిన ఉక్రెయిన్

అమెరికా షిప్‌పై హౌతీ రెబల్స్ మిస్సైళ్లతో దాడి

గాజా-ఇజ్రాయెల్‌ దాడులతో 24,100కు చేరిన మరణాల సంఖ్య

ఐస్‌ల్యాండ్‌లో బద్దలైన అగ్నిపర్వతం,పలు ఇళ్లు దగ్ధం

సెలక్టర్‌ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానించిన BCCI

ఎంసెట్ పేరులో మార్పు?

ఎంసెట్ పేరులో మార్పు?

 

హైదరాబాద్:జనవరి 15

రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్ష పేరును మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2017 నుంచి ఎంసెట్‌లో మెడికల్ సీట్ల భర్తీని తొలగించి, ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సులను నీట్ ద్వారా భర్తీ చేస్తోంది. అయినా ఎంసెట్ పేరులో ఎం మెడికల్ అనే పదం అలాగే కొనసాగుతూ వస్తోంది.

ఈ నేపథ్యంలో మెడికల్ పేరు తొలగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గవర్నమెంట్‌కు ప్రతిపాదనలు పంపింది. ఎంసెట్‌లో ఎం అక్షరాన్ని తీసేసి.. టీఎస్ఈఏ సెట్ లేదా టీఎస్‌ఈఏపీ సెట్‌గా మార్చాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.

ఎంసెట్ ద్వారానే బీఫార్మసీ సీట్లను భర్తీ చేస్తున్నందున పీ అక్షరాన్ని తాజాగా పోటీ పరీక్ష పేరుకు చేర్చునున్నట్లు తెలిసింది..