/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం... Miryala Kiran Kumar
విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం...

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. స్టీల్‌ ప్లాంట్‌లోని బీఎఫ్‌-3లో చెలరేగిన మంటలు.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది.

తెలంగాణ సీఎంకు ఇద్దరు వీఆర్ఓల నియామకం...

సీఎంకు ఇద్దరు పీఆర్వోల నియామకం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇద్దరు పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

బొల్గం శ్రీనివాస్, మామిడాల శ్రీధర్ ను పీఆర్వోలుగా నియమించింది.

విశాఖలో సాగర తీరాన కలకలం రేపిన మానవ అస్థిపంజరం...

విశాఖలో సాగర తీరాన కలకలం రేపిన మానవ అస్థిపంజరం. 

పెదగంట్యాడ మండలం అప్పికొండ సముద్ర తీరంలో అస్థిపంజరం లభ్యం.  

సముద్రంలో నుంచి కొట్టుకు వచ్చిందా? లేదా ఎవరైనా పాతిపెట్టారా అనేది మిస్టరీగా మారింది.

ఆత్మహత్యా? హత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

అమరావతి: వైసీపీ మూడో జాబితా విడుదల..

అమరావతి: వైసీపీ మూడో జాబితా విడుదల.. 23 మందితో వైసీపీ మూడో జాబితా.. సూళ్ళూరుపేట- తిరుపతి ఎంపీ గురుమూర్తి , పెడన - ఉప్పాల రాము, పెనమలూరు - జోగి రమేష్, చిత్తూరు-విజయానంద రెడ్డి, మార్కాపురం -జంకె వెంకట రెడ్డి, రాయదుర్గం - మెట్టు గోవింద్ రెడ్డి, పూతలపట్టు - డా. సునీల్, తిరువూరు - నల్లగట్ల స్వామి దాస్.

హైదరాబాద్‌: అయోధ్య ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరిస్కరించడం సరికాదు: కిషన్ రెడ్డి

హైదరాబాద్‌: అయోధ్య ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరిస్కరించడం సరికాదు.. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక ధోరణి మరోసారి బయటపడింది.. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌లో భాగంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది.. జనవరి 22 కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది.. అయోధ్య కేసు విచారణ సమయంలో కాంగ్రెస్ వితండవాదం చేసింది.. అసలు రాముడు ఉన్నాడా అంటూ కోర్టులో వాదనలు వినిపించింది.. బహిష్కరించడం కాంగ్రెస్‌కు అలవాటైంది. -కిషన్‌ రెడ్డి

అమరావతి: నేడు జగనన్న తోడు పథకం లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్..

అమరావతి: నేడు జగనన్న తోడు పథకం లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కార్యక్రమం.. చిరు వ్యాపారస్తులు, చేతి వృత్తుల వారికి వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి 10 వేల రూపాయల రుణం లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం

ప్రజాపాలన దరఖాస్తులను తప్పుగా నిర్వహించినందుకు ప్రభుత్వ అధికారిని సస్పెండ్ ...

ప్రజాపాలన దరఖాస్తులను తప్పుగా నిర్వహించినందుకు ప్రభుత్వ అధికారిని సస్పెండ్ చేశారు

 ప్రజల నుంచి సేకరించిన ప్రజాపాలన దరఖాస్తు ఫారమ్‌లను పక్కదారి పట్టించారనే ఆరోపణలపై హయత్‌నగర్ ట్యాక్స్ సెక్షన్ సర్కిల్-3 సూపర్‌వైజర్ ఎం. మహేందర్‌ను జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ మంగళవారం సస్పెండ్ చేశారు.

బాలానగర్ ఫ్లైఓవర్‌పై బైకర్ పడవేయడంతో రోడ్డుపై చెల్లాచెదురుగా ఉన్న ఫారమ్‌లు కనిపించిన వైరల్ వీడియో ఆధారంగా ఈ చర్య జరిగింది.

బాటసారులు వెంటనే వీడియోను రికార్డ్ చేసి, ఈ ఫారమ్‌లు ఎందుకు ఉన్నాయని ఆ వ్యక్తిని ప్రశ్నించగా, అతను డేటా ఎంట్రీ ఉద్యోగం ఇచ్చిన ఏజెన్సీలో పనిచేశాడని రికార్డ్ చేశారు.

ధరణి పోర్టల్ అధ్యాయానికి ఐదుగురు సభ్యులతో కమిటీ

ధరణి పోర్టల్ అధ్యాయానికి ఐదుగురు సభ్యులతో కమిటీ

ధరణి పోర్టల్‌పై అధ్యయ నానికి ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. కాంగ్రెస్‌ అనుబంధ కిసాన్‌ సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, అడ్వకేట్‌ సునీ ల్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ రేమండ్‌ పీటర్‌, రిటైర్డ్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ బీ మధుసూదన్‌ ఈ కమిటీలో ఉన్నారు.

దీనికి సీసీఎల్‌ఏ సభ్య కార్యదర్శిగా వ్యవహరిం చనున్నారు.ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

పోర్టల్‌కు సంబంధించిన సమస్యల అధ్యయనం, పరిష్కారం కోసం కమిటీని నియమిస్తున్నట్టు తెలిపా రు. రెవెన్యూ శాఖ అధికా రులు, కలెక్టర్లు ఈ కమిటీకి సహకరించాలని సూచిం చారు.

చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురి..

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రమాదానికి గురైంది. డెడ్‌ఎండ్ గోడను ఢీకొనడంతో మూడు బోగిలు S2, S3, S6 పక్కకు ఒరిగాయి. రైలు చెన్నై నుంచి నాంపల్లి చేరుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ట్రైన్‌ చాలా తక్కువ స్పీడ్‌తో ఉన్న కారణంగా పెద్ద ప్రమాదమే తప్పింది. దిగడానికి సిద్ధంగా ఉన్న వారు గాయపడ్డారు. క్షతగాత్రులను లాలాగూడ ఆస్పత్రికి తరలించారు. వారు పూర్తిగా కోలుకునేంత వరకు హాస్పిటల్‌లోనే చికిత్స అందిస్తామని దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేశ్ తెలిపారు. మరోవైపు నాంపల్లి రైల్వే స్టేషన్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద అనంతరం అక్కడ మరమ్మతులు కొనసాగుతున్నాయి. రైల్వే సిబ్బంది రెస్స్యూ ఆపరేషన్ చేపట్టారు.అలాగే ఈ ప్రమాదంపై ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు.

నల్లగొండ:A P అంగన్వాడి ల పై ఎస్మా అన్యాయం,ప్లే కార్డులతో నిరసన..

A P అంగన్వాడి ల పై ఎస్మా అన్యాయం

ప్లే కార్డులతో నిరసన

    పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచమని అడిగితే ఎస్మా లు ఉపయోగిస్తారా అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (CITU )అనుబంధం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి లు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

       మంగళవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ సిడిపిఓ ఆఫీస్ ముందు నల్ల జెండాలు, ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ వేతనాల కోసం సమ్మె చేస్తున్న ఏపీ అంగన్వాడీలపై ఏస్మా పేరుతో జీవో నెంబర్ రెండు తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.అధికారంలోకి వచ్చిన నాడు ఏపీ జగన్మోహన్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువజీతాలు పెంచుతానని చెప్పిన మీ మాటలు ఎటు పోయాయి అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఎంపీలకు ముఖ్యమంత్రులకు లక్షల్లో జీతాలు పెంచుకునే మీకు నిరంతరం పేద ప్రజల కోసం దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే పిల్లలను తీర్చిదిద్దే వారికి మెరుగైనటువంటి పౌష్టికాహారం అందించేటువంటి అంగన్వాడీ టీచర్స్ కు ఎందుకు జీతాలు పెంచడంలేదని ప్రశ్నించారు.పదివేల జీతం టీచర్స్ కు, హెల్పర్స్ ,మినీ టీచర్స్ కు 7000 రూపాయల జీతంతో ఎలా అంగన్వాడీలు బతుకుతారని, వాళ్ళ కుటుంబ పోషణ ఎలా సాగుతుందని ప్రశ్నించారు.కడుపు కాలీ సమ్మె చేస్తుంటే జీతాలు పెంచకుండా ఎస్మా ఉపయోగించడం ప్రభుత్వ చేతగానితనం అన్నారు కార్మికులకు సమ్మెకు జన్మ హక్కు అని దాన్ని కాలరాసే ఏ ప్రభుత్వానికైనా తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు గతంలో అంగన్వాడీ టీచర్లను గుర్రాలతో తొక్కించిన చంద్రబాబు శంకరగిరి మాన్యాలు పట్టారని గుర్తు చేశారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులతో చర్చలు జరిపి వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్మిక వర్గం ఎక్కడ పోరాటాలు చేసిన వారికి అండగా సంఘీభావంగా సిఐటియు ఉంటుందని వారు తెలిపారు

   ఈ కార్యక్రమంలో సునంద, సముద్రమ్మ, సరిత ,రేణుక , అనిత, శ్రీలక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు

   

 .