/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz నల్లగొండ:బిల్ కిస్ బానో కేసు తీర్పుపై హర్షం :ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి Miryala Kiran Kumar
నల్లగొండ:బిల్ కిస్ బానో కేసు తీర్పుపై హర్షం :ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి

బిల్ కిస్ బానో కేసు తీర్పుపై హర్షం ....ఐద్వా

గుజరాత్ రాష్ట్ర మంత్రివర్గం రాజీనామా చెయ్యాలి.....

   పాలడుగు ప్రభావతి కేంద్ర కమిటీ సభ్యురాలు (AIDWA)

     భారత సుప్రీంకోర్టు బిల్ కిస్ బానో కేసుపై తీర్పునిస్తూ ఆ కేసులో ముద్దాయిలైన 11 మంది విడుదల అవటానికి కారణమైన గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. రెండు వారాలలోగా 11 మంది ముద్దాయిలను విడుదల అయిన జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సిందిగా ఆదేశాలిచ్చిందని ఈ తీర్పును అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం కేంద్ర కమిటీ సభ్యురాలు పాలడుగు ప్రభావతి హర్షం వ్యక్తం చేశారు.

     న్యాయమూర్తులైన జస్టిస్ నాగరత్నమ్మ, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ల సుప్రీంకోర్టు బెంచ్ 2002 నాటి గుజరాత్ లో జరిపిన అత్యాచారాల హంతక ముద్దాయిలకు శిక్షాకాలంలో రెమిషన్ ఇవ్వవచ్చుననే నిర్ణయంతో సిఫార్సు చేసిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ చర్యను తప్పు పట్టిందని అన్నారు. ఆ సిఫార్సుని ఆధారం చేసుకుని ఒకానొక సుప్రీంకోర్టు బెంచ్ యావత్ జీవకారాగార శిక్ష అనుభవిస్తున్న వారిని 2022 ఆగస్టు 15న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అసలు అలాంటి రెమిషన్ యధాలాపపు (Sterio type) నిర్ణయమని, అలాంటి నిర్ణయం గైకొనే అర్హత గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని వివరించారు.

2002లో గోధ్రా రైలులో సంభవించిన మారణకాండ సాకుతో, నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉండిన గుజరాత్ రాష్ట్రంలో ప్రపంచ మానవాళి సిగ్గుపడేలా అమాయక ముస్లిం ప్రజానీకం పై ఘోరమైన హత్యాకాండ, మహిళలపై అత్యాచారాలు రోజుల తరబడి జరిగాయని అలాంటి దాడుల నుండి తప్పించుకోవటానికి 2002 మార్చి 3వ తేదీన అహ్మదాబాద్ కు దగ్గరలోని రంధిక్ పూర్ అనే గ్రామం విడిచి పోతున్న వారిలో ఐదు నెలల గర్భవతిగా ఉన్న బిల్ కిస్ బానో అనే 21 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిపి ఆమె మూడేళ్ల పసి బాలికతో సహా 7గురు కుటుంబ సభ్యులను హత్య గావించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంవత్సరం నుండి ఆ కేసు పలు మలుపులు తీసుకుంది. సి.బి.ఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిపారు. గుజరాత్ రాష్ట్రంలో విచారణ జరపటానికి వీలులేదని మహారాష్ట్రలో దానిని సాగించగా దాని బొంబాయి ట్రయల్ కోర్టు 11 మంది ముద్దాయిలకు 2008లో యావజ్జీవ కారాగార శిక్షను విధించింది . 2017లో బొంబాయి హైకోర్టు వారి శిక్షను ఖరారు చేసింది. 2019లో సుప్రీంకోర్టు బిల్ కిస్ బానోకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించమని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని అన్నారు.

 ఈ కేసులో ముద్దాయిలకు మరణశిక్ష విధించ దగినప్పటికీ దానిని యావత్ జీవకారాగార శిక్షగా మార్పు చేశారని,  

కొన్ని కోర్టు సవరణలను అడ్డం పెట్టుకుని 14 ఏళ్ల శిక్షకాలం తరువాత వారికి రెమిషన్ అవకాశాన్ని గుజరాత్ ప్రభుత్వం ఇచ్చింది. వాస్తవానికి కేసు విచారణ జరిగిన, శిక్ష విధించిన మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే రెమిషన్ గురించిన సిఫారసు చేసే అవకాశం ఉన్నది. కానీ, ఆ హక్కును అడ్డం పెట్టుకొని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రెమిషన్ సిఫారసు చేసింది. ఆ విధంగా భయంకర నేరానికి పాల్పడిన 11మంది ముద్దాయిలకు 75 ఏళ్ల స్వాతంత్ర అమృతకాలం అని పేరుపొందిన 2022 ఆగస్టు 15న విడుదల అయ్యే అవకాశం లభించింది. వారిని గుజరాత్ రాష్ట్ర బిజెపి నాయకులు దండలతో అభినందనలతో స్వాగత సత్కారాలు నిర్వహించటం విజయోత్సవాలు జరిపటం సిగ్గుచేటు అన్నారు.

ఈరోజు తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు, తనకు లేని అధికారాలను ఉపయోగించుకుని బిల్ కిస్ కేసులో ముద్దాయిలకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం రెమిషన్ వచ్చేట్లు చేయటాన్ని తప్పు పట్టిన దృష్ట్యా, తక్షణమే గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం రాజీనామా చేయాలన్నారు. నేడు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ చర్యను పూర్తిగా ఖండిస్తూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడం ఐద్వా హర్షం వ్యక్తం చేస్తుందని తెపారు. గుజరాత్ రాష్ట్ర క్యాబినెట్ రాజీనామా చేయాలని ఐద్వా తరుపున డిమాండ్ చేస్తున్నారు.

సూర్యాపేట శ్రీ వాసవి దేవాలయంలో మహిళల గాజుల పండుగ..

శ్రీ వాసవి దేవాలయం లో మహిళల గాజులు పండుగ

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సోమవారం మహిళలు గాజుల పండుగ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఒక్క మగ బిడ్డ తల్లి, ఇద్దరు మగ పిల్లలు ఉన్న తల్లితో గాజులు వేసుకోవాలని ప్రచారం జరగడంతో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని గాజులు తొడి గించుకున్నారు. సంక్రాంతికి ముందు గాజులు వేసుకోవాలని లేనిచో కీడు జరుగుద్ది అనే ప్రచారం ఉండడంతో ఒకరికొకరు గాజులు వేసుకొని అలంకరించుకున్నారు. ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్టను పురస్కరించుకొని అయోధ్య అక్షితలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గుండా శ్రీదేవి, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు పసుపర్తి జ్యోతి, వాసవి జిల్లా మొదటి మహిళా రాచర్ల లక్ష్మి, తోట కమల, గుండా సుధా మాధురి, రాచర్ల ప్రేమలత, గజ్జి నీలిమ, గుండా సువర్ణ, ఈగ శారద, భాగ్యలక్ష్మి, నల్లపాటి రమాదేవి, వెంపటి విజయ, కక్కిరెని పద్మ, పోతుగంటి సునిత తో పాటు 50 మంది మహిళలు పాల్గొన్నారు.

ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ

ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ

వాహనాల అద్దె విషయంలో కాంట్రాక్టర్‌ వద్ద నుంచి రూ.12,500 రూపాయల లంచం తీసుకుంటూ ట్రాన్స్‌కో ఏఈ ఈరోజు ఏసీబీ చిక్కాడు.

వివరాల్లోకి వెళ్తే..కామారెడ్డి 33 /11 కేవీ సబ్ స్టేషన్‌లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రాజు వాహనాల అద్దె విషయంలో కాంట్రాక్టర్‌ డ్రైవర్ భైరవ స్వామి వద్ద నుంచి లంచం డిమాండ్‌ చేశాడు.

దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయిం చాడు. వారి సూచనల మేరకు కామారెడ్డి సబ్‌ స్టేషన్‌లో రూ.12,500 ఇస్తుండగా ఏసీబీ అధికా రులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అమరావతి: ఇవాళ, రేపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన..

అమరావతి: ఇవాళ, రేపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన.. రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ, సన్నద్ధత వంటి అంశాల పరిశీలన.. నిన్న రాత్రే విజయవాడ చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని టీమ్‌.. ఈ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం.. మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష

తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం...

తిరుమల: ఒక కంపార్ట్‌మెంట్‌లో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 61,511 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 20,777 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు

కొడుకుంటే కీడట..

కొడుకుంటే కీడట...

కీడుకు రారాజు గాజులట

తెలంగాణలో "గాజుల కానుక" ప్రచారం కలకలం రేపుతోంది. ఒక్కరు లేదా ఇద్దరు కొడుకులు ఉన్న మహిళలు...ఐదుగురి వద్ద డబ్బులు తీసుకుని,ఐదు రకాల గాజులు వేసుకోవాలనే మూఢ నమ్మకం ట్రెండింగ్ లో కొచ్చింది.ఈ సంప్రదాయం ఫాలో కాని ఎడల కీడు జరుగుతుందనే ప్రచారం ఊపందుకోవడంతో....ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు ఆడ పడుచులు.ఇప్పుడు తెలంగాణ లో ఎక్కడ చూసినా....గాజుల ఇష్యూ చర్చే సాగుతోంది.దాంతో మూఢ నమ్మకాల పుణ్యమాని గాజుల దుకాణ దారులకు భలే గిరాకీ తగిలింది. గాజులకు కూడా డిమాండ్ పెరిగింది.కాగా ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు నిపుణులు.ఇలాంటి మూఢ నమ్మకాలని నమ్మొద్దని సూచిస్తున్నారు.ఏదేమైనా ట్రెండ్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు మహిళలు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో సీతారాముల కల్యాణ వేడుకలు

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో సీతారాముల కల్యాణ వేడుకలు 

అయోధ్యలో జనవరి 22వ తేదీన శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో..దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. ఈ క్రమంలో హైదారాబాద్ మహానగరం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో సీతారాముల కల్యాణం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

వేడుకకు త్రిదండి చిన జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకుని పులకించిపోయారు.A

రాముడు కేవలం భారతదేశానికే కాదు..ప్రపంచానికే రాజుని త్రిదండి చినజీయర్‌ స్వామి తెలిపారు. సుమారు 5 వందల ఏళ్ల తర్వాత రాముడు తన జన్మస్థలానికి చేరుకుంటున్న క్షణం.. దేశ చరిత్రలోనే అద్భుతమన్నారు.

దేశం మొత్తం రామనామ స్మరణ మార్మోగుతున్న వేళ.. రాముడు అయోధ్య కు తిరిగి వస్తున్నాడన్నారు చినజీయర్ స్వామి. అయోధ్య లో రాముడు ప్రతిష్ఠ సందర్భంగా సీతారాముల కల్యాణం నిర్వహించి తన భక్తిని చాటుకోవడమే కాకుండా ఎంతోమంది సీతారాముల కళ్యాణం మహోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించిన కొమురయ్య దంపతులను చినజీయర్ స్వామి అభినందించారు.

 అలాగే జనవరి 20 నుండి మార్చి 11 వరకు ముచ్చింతల సమతామూర్తి రెండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సీతారాముల కల్యాణం నిర్వహించడం ద్వారా తమ జన్మ చరితార్ధమైందన్నారు డీపీఎస్ చైర్మన్ కొమురయ్య. ఈ సందర్భంగా 5 లక్షల ఇళ్లకు శ్రీరాముడి చిత్ర పటాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

సంక్రాంతి సెలవులు రాకముందే విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయించి ఇంటికి పంపిస్తున్న ప్రభుత్వ వార్డెన్ల మీద చర్యలు తీసుకోవాలి: కట్టెల శివకుమార్

సంక్రాంతి సెలవలు 4 రోజులు మాత్రమే ప్రభుత్వం నిర్ణయించింది  షెడ్యూల్ కులముల అభివృద్ధి వసతి గృహాల వార్డెన్లు 7 రోజుల ముందే విద్యార్థులని మీకు పరీక్షలు పూర్తి అయినాయి ప్రభుత్వ నియమ నిబంధనకు వ్యతిరేకంగా విద్యార్థులను హాస్టల్లో నుంచి వెళ్లగొట్టడం జరుగుతుంది. దీనివలన బహుజన విద్యార్థులు చదువుకు దూరం కావడంతో పాటు ఉన్నత విద్యకు దూరం కావడం జరుగుతుంది.వారం రోజుల ముందే విద్యార్థులను ఎల్లగొడుతున్న వార్డెన్స్ ఎవరైనా సరే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థులకు న్యాయం జరిగిన చూడాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ డిమాండ్ చేశారు.

అయోధ్య రామయ్య సన్నిధిలో అన్నదానానికి భారీ విరాళం వితరణ

అయోధ్య రామయ్య సన్నిధిలో అన్నదానానికి భారీ విరాళం వితరణ

అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి 200 క్వింటాళ్ల బియ్యం వితరణ

200 క్వింటాల బియ్యం (10 లక్షలు) అందజేసిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనరసయ్య)

అయోధ్య, అయోధ్య, అయోధ్య ఏ నోట విన్న ఏ మాట విన్న అయోధ్య రాముడి మాటే తప్ప వేరే మాట వినపడటం లేదు. దేశ మొత్తం ఎదురుచూస్తున్న రామయ్య ప్రతిష్ట మహోత్సవం దగ్గర పడుతున్న శుభ సమయంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్య రామయ్య సన్నిధిలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కు సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య 200 క్వింటాల బియ్యం (సుమారు పది లక్షల రూపాయలు విరాళం) శనివారం తిరుమలగిరిలోని ఆయన నివాసంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇమ్మడి సోమన్నరసయ్య మాట్లాడుతూ అయోధ్యలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుటకు నా వంతుగా సహాయ సహకారం అందించడం ఆనందంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నారని వారికి అన్నదానం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అందులో నేను సైతం పాలుపంచుకోవడం పూర్వజన్మ సుకృతమన్నారు.ఈ కార్యక్రమంలో అమర్నాథ్ సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ చికోటి మధుసూదన్ నిర్వాహకులు నల్ల చంద్రం, కాశం విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు...

తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మచ్చ ప్రభాకర్ రావు గారి అకాల మరణం పద్మశాలి సమాజానికి తీరని లోటు: పెండం ధనుంజయ

తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ మచ్చ ప్రభాకర్ రావు గారి అకాల మరణం చాలా బాధాకరం అన్నగారు తమరు లేని లోటు ఊహించడానికి చాలా బాధేస్తుంది తమరు మన కుల సమాజానికి చేసిన సేవలు మరువలేనివి మీతో మాకు మంచి అనుబంధం ఉన్నది మీతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొని పద్మశాలీల అభ్యున్నతి కోసం మేము కూడా పని చేశాము, పద్మశాలీలు రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి మీతో కలిసి ఎవరైతే యువకులు రాజకీయాల్లో ఉన్నారో వాళ్లందర్నీ కలుపుకొని అనేక మీటింగ్లను నిర్వహించి అన్ని పార్టీల కార్యాలయాల చుట్టూ తిరిగాము, ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులను ముఖ్య నాయకులను కలిశాము, మీ యొక్క లక్ష్యం పద్మశాలీలు రాజకీయాల్లో ఉండాలని చట్టసభల్లో ఉండాలని లక్ష్యాన్ని నెరవేర్చడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాము అన్నగారు తమరి పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని మరియు ఈ పరిస్థితుల నుండి మీ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకొని, సాధారణ జీవితంలోకి రావాలని వారికి కావలసిన మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ *బాధాతత్వ హృదయంతో. మీ పెండెం ధనుంజయ్ నేత అధ్యక్షులు నల్లగొండ జిల్లా పద్మశాలి యువజన సంఘం.