/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: నామినేటెడ్ పదవుల బరిలో ముస్లిం మైనారిటీ నుండి ఓయూ తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్ Mane Praveen
TS: నామినేటెడ్ పదవుల బరిలో ముస్లిం మైనారిటీ నుండి ఓయూ తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్

HYD: తెలంగాణ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో బుల్లెట్ గాయాల పాలైన ఉద్యమకారిణి డాక్టర్ రేష్మ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

2010 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న సందర్భంలో ఆమెకు ఉస్మానియా యూనివర్సిటీలో బుల్లెట్ గాయాలయ్యాయి. ఆవిధంగా ఆమె డేరింగ్, డాషింగ్ మహిళగా బుల్లెట్ రాణిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా నామినేటెడ్ పదవులు భర్తీ చేపట్టే దిశగా వార్తలు వస్తున్న నేపథ్యంలో, నిజామాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ రేష్మ హుస్సేన్.. ముస్లిం మైనార్టీ నుండి నామినేట్ పదవి ముస్లిం మైనారిటీ చైర్మన్, టీఎస్పీఎస్సీ చైర్మన్, టిఎస్పిఎస్సి బోర్డు మెంబర్ వంటి ఏదైనా ఒక పదవి ఆశిస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు ఏ పదవి ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.

ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో స్థిరపడ్డారు. చిన్నప్పటి నుండి ఆమెకు చదువుల పట్ల ఉన్న ఆసక్తి తో కెమిస్ట్రీ లో ఎమ్మెస్సీ, తెలుగులో ఎంఏ, ఎంఈడి, రసాయన శాస్త్రంలో  పిహెచ్డి వంటి ఉన్నత విద్యలను ఉస్మానియా యూనివర్సిటీ నుండి పూర్తిచేసింది. ఆమె గత ఐదు సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, ఐదు సంవత్సరాలు ప్రిన్సిపాల్ గా మైనారిటీ గురుకుల విద్యా సంస్థలలో విధులు నిర్వహించి విద్యార్థులను ఉన్నత స్థాయిలలో స్థిరపడే విధంగా కృషి చేస్తున్నారు. ఇటీవల మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు లను రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని మంత్రులను కోరినట్లు ఆమె తెలిపారు.

డా. రేష్మ హుస్సేన్ తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో విద్యార్థిని గా ఉద్యమంలో కీలకంగా పని చేయడం, ఆ తర్వాత కూడా విద్యార్థుల కోసం గురుకులాలలో అధ్యాపకురాలుగా ప్రిన్సిపాల్ గా పనిచేయడం, పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం, ఉన్నత విద్యావంతురాలు కావడం, గత ప్రభుత్వం లో విద్యార్థులకు నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని పలు కార్యక్రమాల ద్వారా, మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు కూడా ఆమె పేరును నామినేటెడ్ పదవులకు పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చండూరు: బీఎస్పీ నియోజకవర్గ సమీక్ష సమావేశం

నల్లగొండ జిల్లా:

ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మునుగోడు నియోజకవర్గ సమీక్ష సమావేశం, చండూరు పట్టణంలో జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ అభినేత్రి బెహన్ జి కుమారి మాయావతి పుట్టినరోజు ఈనెల 15 సందర్భంగా.. కళ్యాణ్కరి

దివస్ కొరకు ముఖ్యఅతిథిగా నల్లగొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజారావు రావడం జరిగింది. వారు మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో సర్పంచ్, వార్డు మెంబర్లను బరి లోనికి దింపాలని, గ్రామాలలో నీలి జెండా ఎగరవేద్దామని.. ఇందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరూ ఏకం కావలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో చండూరు మండల పార్టీ అధ్యక్షుడు నేరళ్ల ప్రభుదాస్, బీఎస్పీ అసెంబ్లీ అధ్యక్షుడు గండు నాగేంద్రబాబు, శంకర్, వినోద్ కుమార్, వెంకటేశం, సామ్రాట్ కిరణ్, సైదులు యాదవ్, శివ, చంద్రశేఖర్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

టీవీ ఛానెళ్ల ప్యాకేజీ ధరల పెంపు..!

దేశంలోని ప్రముఖ బ్రాడ్ కాస్టర్ లు అయినటువంటి జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్, వయాకామ్18 సంస్థలు తమ ఛానెళ్ల ప్యాకేజీ ధరలను పెంచాయి.

వయాకామ్ 18 తమ ప్యాకేజీల ధరలను 20-25శాతానికి పెంచగా, జీ 9-10%, సోనీ 10-11% పెంచాయి.

త్వరలో డిస్నీ స్టార్ కూడా కొత్త ధరలను ప్రకటించనుంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని బ్రాడ్కాస్టర్లు పేర్కొన్నాయి.

ఈ పెంపు టీవీ ఛానెల్ బిల్లులపై ప్రభావం చూపనుంది.

TS: రేపు తెలంగాణ క్యాబినెట్ భేటీ

తెలంగాణ క్యాబినెట్ సమావేశము రేపు జరగనుంది. నెలరోజుల పాలన, అభయ హస్తం 6 గ్యారంటీలు సహా పలు కీలక అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పలు కార్పొరేషన్ల చైర్మన్ పదవులు ఖాళీగా ఉండడంతో, వీటి భర్తీ కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

TS: స్కిల్ యూనివర్సిటీ లను నెలకొల్పుతాం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులకు స్కిల్స్ నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీ అన్నారు.

యువతను గత ప్రభుత్వం మాదిరిగా భారంగా భావించడం లేదని.. వారిని పరిశ్రమల అభివృద్ధిలో పాలుపంచుకునే మానవ వనరులుగా భావిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

NLG: జాతీయ యువజన ఉత్సవాలలో వక్తృత్వ పోటీలో పాల్గొని.. జిల్లా స్థాయిలో మొదటి బహుమతి అందుకున్న NG కళాశాల విద్యార్థిని

నల్గొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థిని తేజస్విని, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ యువజన ఉత్సవాలలో వక్తృత్వ పోటీలో పాల్గొని జిల్లా స్థాయిలో మొదటి బహుమతి అందుకున్నదని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉపేందర్ తెలిపారు. కళాశాల గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. 'మై భారత్ - వికసిత్ భారత్' అనే అంశంపై తేజస్విని వక్తృత్వపోటీలో పాల్గొన్నదని, ఆమె రాష్ట్రస్థాయి పోటీలకు కూడా ఎంపికైందని తెలిపారు. బహుమతిని నెహ్రూ యువ కేంద్రం ప్రవీణ్ సింగ్, జ్యూరీ మెంబర్స్ యాదగిరి రెడ్డి, దుర్గాప్రసాద్, వేణు, కొండ నాయక్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ ను అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని ని పలువురు అధ్యాపకులు అభినందించారు.

2000 రూపాయల నోట్లు పై ఆర్బీఐ కీలక ప్రకటన

2000 రూపాయల నోట్లు ప్రతీ గ్రామంలో వున్న పోస్ట్ ఆఫీస్ ల ద్వారా మార్చుకోవచ్చు అని ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోట్లు మార్పిడి కోసం మరియు డిపాజిట్ కోసం ప్రజలు తమ కార్యాలయాల వద్ద బారులు తీరడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆన్లైన్ లో లభించే అప్లికేషన్ నింపి పోస్ట్ ఆఫీస్ కు అందజేసి వారి ద్వారా ఆర్బీఐ యొక్క19 ఇష్యూ కార్యాలయాలకు తమ దగ్గర వున్న 2000 రూపాయల నోట్లు చేర్చాలని తెలిపింది.

NLG: ఫిష్ పాండ్ సందర్శించిన ఎన్జీ కళాశాల పీజీ జువాలజీ విద్యార్థులు

నల్గొండ పట్టణానికి చెందిన నాగార్జున ప్రభుత్వ కళాశాల జువాలజి డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం MSC జువాలజి  విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా గంధ వారి గూడెం లోని ఎమ్మెస్ దేషి మర్రెల్ ఫిష్ పార్మింగ్ ని , చేపల పెంపకాన్ని విద్యార్థులు ప్రత్యక్షంగా సందర్శించడం జరిగింది.

చేపల పెంపకం నకు సంబంధించిన ప్రేరిత, ప్రజననం, మరియు వివిధ యాజమాన్య పద్దతులను విద్యార్థులకు విపులంగా ఫామ్ యజమాని ఎమ్.డి.మజీద్ వివరించడం జరిగింది.

జంతుశాస్త్ర విభాగాధిపతి శ్రీనాథ్ పటేల్ ఆధ్వర్యంలో అధ్యాపకులు డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ మోదాల మల్లేష్ , సంతోష్ కుమార్ , సరిత, మహేశ్వరి ఈ పర్యటనలో పాల్గొన్నారు.

NLG: మర్రిగూడ లో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ: మండలంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం నీలకంఠం రాములు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు జరిగిన ప్రజల వద్దకు పాలన సంక్షేమ కార్యక్రమంలో ప్రజల వద్ద తీసుకున్న దరఖాస్తులను పరిష్కరించి ప్రభుత్వ వాగ్దానాలు అమలు చేయాలని, పేదలకు 6 గ్యారంటీ లను వంద రోజుల్లో పూర్తి చేస్తామన్న ప్రభుత్వం, ఆ విధంగా పూర్తి చేయాలని ఆయన అన్నారు.

అట్లాగే చర్లగూడెం ముంపు బాధితులకు నష్టపరిహారం ఇచ్చి పనులు పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య, ఉప్పునూతల వెంకటయ్య, మైల సత్తయ్య, గిరి వెంకటయ్య, నీలకంఠ యాదయ్య, ఎడ్ల అంజయ్య, మాడుగుల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

NLG: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో జై భీమ్ నినాదం సృష్టికర్త ఎల్ ఎన్ హరిదాసు జన్మదిన వేడుకలు

నల్గొండ జిల్లా:

కొండమల్లేపల్లి: అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో జై భీమ్ నినాదం సృష్టికర్త ఎల్ ఎన్ హరిదాసు జన్మదిన కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న పాల్గొని మాట్లాడుతూ.. మహారాష్ట్ర నాసిక్ లో కాలరామ్ దేవాలయ ప్రవేశ ఉద్యమ సందర్భంలో, సత్యాగ్రహాన్ని ఉత్తేజ పరచడానికి ఇచ్చిన నినాదం 'జై భీమ్- బల్ భీమ్' అని తెలిపారు. ఎవరైనా మనకు జై భీమ్ చెబితే తిరిగి ప్రతిగా బల్బీమ్ అనాలని, కట్టర్ అంబేద్కర్ వాది సమత సైనికులు నాగపూర్ ప్రధాన కార్యదర్శి 24 సెప్టెంబర్ 1932 న పూనా ఒప్పంద పత్రంలో సంతకం చేసిన ప్రముఖుడు ఎల్ ఎన్ హర్ దాస్ అని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ నాయకులు అంబేద్కర్, ధర్మపురం శ్రీను, ఎమ్మార్పీఎస్ కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పెరిక విజయ్ కుమార్, జిల్లా రాములు, అందుగుల పరమేష్, ఎల్ల స్వామి, యాకోబు, తదితరులు పాల్గొన్నారు