/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz అయోధ్య రామయ్య సన్నిధిలో అన్నదానానికి భారీ విరాళం వితరణ Miryala Kiran Kumar
అయోధ్య రామయ్య సన్నిధిలో అన్నదానానికి భారీ విరాళం వితరణ

అయోధ్య రామయ్య సన్నిధిలో అన్నదానానికి భారీ విరాళం వితరణ

అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి 200 క్వింటాళ్ల బియ్యం వితరణ

200 క్వింటాల బియ్యం (10 లక్షలు) అందజేసిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమనరసయ్య)

అయోధ్య, అయోధ్య, అయోధ్య ఏ నోట విన్న ఏ మాట విన్న అయోధ్య రాముడి మాటే తప్ప వేరే మాట వినపడటం లేదు. దేశ మొత్తం ఎదురుచూస్తున్న రామయ్య ప్రతిష్ట మహోత్సవం దగ్గర పడుతున్న శుభ సమయంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్య రామయ్య సన్నిధిలో నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కు సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య 200 క్వింటాల బియ్యం (సుమారు పది లక్షల రూపాయలు విరాళం) శనివారం తిరుమలగిరిలోని ఆయన నివాసంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఇమ్మడి సోమన్నరసయ్య మాట్లాడుతూ అయోధ్యలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుటకు నా వంతుగా సహాయ సహకారం అందించడం ఆనందంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటున్నారని వారికి అన్నదానం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అందులో నేను సైతం పాలుపంచుకోవడం పూర్వజన్మ సుకృతమన్నారు.ఈ కార్యక్రమంలో అమర్నాథ్ సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ చికోటి మధుసూదన్ నిర్వాహకులు నల్ల చంద్రం, కాశం విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు...

తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మచ్చ ప్రభాకర్ రావు గారి అకాల మరణం పద్మశాలి సమాజానికి తీరని లోటు: పెండం ధనుంజయ

తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ మచ్చ ప్రభాకర్ రావు గారి అకాల మరణం చాలా బాధాకరం అన్నగారు తమరు లేని లోటు ఊహించడానికి చాలా బాధేస్తుంది తమరు మన కుల సమాజానికి చేసిన సేవలు మరువలేనివి మీతో మాకు మంచి అనుబంధం ఉన్నది మీతో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొని పద్మశాలీల అభ్యున్నతి కోసం మేము కూడా పని చేశాము, పద్మశాలీలు రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి మీతో కలిసి ఎవరైతే యువకులు రాజకీయాల్లో ఉన్నారో వాళ్లందర్నీ కలుపుకొని అనేక మీటింగ్లను నిర్వహించి అన్ని పార్టీల కార్యాలయాల చుట్టూ తిరిగాము, ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులను ముఖ్య నాయకులను కలిశాము, మీ యొక్క లక్ష్యం పద్మశాలీలు రాజకీయాల్లో ఉండాలని చట్టసభల్లో ఉండాలని లక్ష్యాన్ని నెరవేర్చడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాము అన్నగారు తమరి పవిత్ర ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని మరియు ఈ పరిస్థితుల నుండి మీ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకొని, సాధారణ జీవితంలోకి రావాలని వారికి కావలసిన మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ *బాధాతత్వ హృదయంతో. మీ పెండెం ధనుంజయ్ నేత అధ్యక్షులు నల్లగొండ జిల్లా పద్మశాలి యువజన సంఘం.

నాపై హత్యాయత్నం జరిగింది, నరకం అనుభవించా: కేఏ పాల్ సంచలన వాక్యాలు


  • నాపై హత్యాయత్నం జరిగింది, నరకం అనుభవించా: కేఏ పాల్ సంచలనం


విశాఖపట్నం: తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రజా శాంతి పార్టీ (Praja Shanti Party) చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనపై హత్యాయత్నం జరిగిందని పిడుగు లాంటి వార్త చెప్పారు. క్రిస్మస్ వేడుకల సమయంలో డిసెంబర్ 25న తనను చంపే ప్రయత్నం జరిగిందని కేఏ పాల్ (KA Paul) ఆరోపించారు. క్రిస్మస్ పండుగ సమయంలో టార్గెట్ చేసుకుని తనకు ఫుడ్ పాయిజన్ అయ్యేలా చేశారని పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విశాఖపట్నంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేఏ పాల్..

ఫుడ్ పాయిజనింగ్ తరువాత ప్రస్తుతం కోలుకుంటున్నానని కేఏ పాల్ తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని పేర్కొన్నారు. దేవుడి దయ వల్ల తాను ప్రాణాలతో బతికి బయటపడ్డానని చెప్పారు.

ఈ విషయం చెప్పొచ్చో లేదోనని ఇన్ని రోజులు తాను మౌనంగా ఉన్నానని పేర్కొన్నారు. పది రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నానని, కాన్ఫిడెన్షియల్ గా చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.

SB news లో ప్రకటనకై సంప్రదించండి...

ప్రతిరోజు లక్షకు పైగా ప్రేక్షకులు వీక్షించే మా SB News(streetbuzz) లో మీ వార్తలు ముద్రించుటకై మరియు మీ యొక్క అన్ని రకాల ప్రకటనలు ముద్రించడానికి కాల్ చేయండి

మిరియాల కిరణ్ కుమార్

Ph no:8341186182

వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి...

వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి. కనిగిరి అభివృద్ధి బాధ్యత తీసుకుంటా. ఈ ఐదేళ్లలో ఎవరికైనా న్యాయం జరిగిందా.? అభివృద్ధి, సంక్షేమం టీడీపీ సిద్ధాంతం. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ట్రాన్స్‌ఫర్లు ఉంటాయని ఎప్పుడూ ఊహించలేదు. ఒక ఊరిలోని చెత్తను మరో ఊరిలో వేస్తున్నారు. -చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డికి రోడ్డు ప్రమాదం.. అటుగా వెళుతున్న జానీ మాస్టర్ స్పందించి సహకారం...

రోడ్డు ప్రమాదంలోఎమ్మెల్సీ పర్వతరెడ్డికి తీవ్ర గాయాలు ఒకరు మృతి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాలతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, పర్వతరెడ్డి పీఏ వెంక టేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు ఆ దారిలో వెళ్తున్న డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ వెంటనే స్పందించి వారికి తోడుగా సహకరించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లాలోని రేగడిచెలిక దగ్గర ఆగి ఉన్న కంటైనర్‌ లారీని ఆయన కారు వేగంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో పర్వ తరెడ్డికి తీవ్రంగా గాయ పడగా.. కారులో ఉన్న ఆయన పీఏ వెంకటేశ్వర్లు ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. ఇక, వారు విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది...

భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఆదాని

భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఆదాని 

 ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దేశంలో నెం.1 సంపన్నుడిగా నిలిచాడని బ్లూమ్బిర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.

 ఈ మేరకు అదానీకి అనుకూలంగా సుప్రీంలో తీర్పు రావడంతో ఆయన కంపెనీల షేర్లు ఒక్కసారిగా పెరిగాయి.

 దీంతో ఇవాళ ఉ.9.30 గంటలకు అదానీ సంపద 97.6 బిలియన్ డాలర్లకు చేరడంతో ఈ ఘనత సాధించారు.

ఈ క్రమంలోనే ముకేశ్ అంబానీ ఆదాయం 97 బిలియన్ డాలర్ల వద్ద ఉండటంతో స్వల్పంగా వెనుకబడి ఉన్నారు.

భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఆదాని..

భారత్ దేశంలో అత్యంత సంపన్నుడిగా ఆదాని 

హజ్రత్ సయ్యద్ షావలి ఉల్లా ఉత్సవాలలో పాల్గొని, భవిష్యత్తులో దర్గా అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేసిన ఉర్స్ కమిటీ అధ్యక్షులు కట్టెల శివకుమార్

హజ్రత్ సయ్యద్ షావలి ఉల్లా ( సయ్యద్ సాబ్ ) వారి ఉర్సు ఉత్సవాలు సందర్భంగా స్థానిక తాలూదారి మజీద్ పాత కలెక్టరేట్ నల్గొండ నుండి గంధం భక్తి శ్రద్ధలతో ఉరుసు ఉత్సవాల కమిటీ అధ్యక్షులు అయిన గౌరవ శ్రీ కట్టెల శివకుమార్ గారి ఆధ్వర్యంలో గంధం ప్రారంభించబడి,ఊరేగింపుగా మునుగోడు రోడ్డు ఈద్గా దర్గా సయ్యద్ షావలి దర్గాకి రాత్రి 8 గంటలకు చేరుకుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని 2 రోజు ఈద్గా నందు హజ్రత్ సయ్యద్ షావలి ఉల్లా దర్గా నందు ప్రత్యేక ప్రార్థనలు దీపారాధన చేసి జుమా నమాజ్ తర్వాత భోజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఉర్స్ కమిటీ అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో దర్గా అభివృద్ధికై తోడ్పడుతానని రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడిపంటలు పండాలని తెలిపారు. కట్టెల శివకుమార్ గారి అధ్యక్షతన అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగినందున భక్తులకు మరియు దర్గా కమిటీ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గుత్తా అమిత్ రెడ్డి వారు దర్గాని సందర్శించి చాధర్,పూలచాదర్ సమర్పించి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలుచేశారు.

మాతావలి అహ్మద్ : షేక్ హాబీ బ్రదర్స్ అడ్వకేట్ మస్యుద్దీన్ మాజీ జిల్లా దర్గా అధ్యక్షులు సయ్యద్ జాఫర్ ఖాన్ పట్టణ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు 

 మాజీ మున్సిపల్ vise చైర్మన్ అషం కౌన్సిలర్స్ అభిమన్యు శ్రీనివాస్ ఇంతియాజ్ అలీ మొయిన ఉర్దూ డైరెక్టర్ జియా బాయ్ మామిడి కార్తీక్ ఇర్ఫాన్ హెజాజ్ సంగం రాష్ట్ర నాయకులు కొండేటి నరేష్ కుమార్ బిక్షం నాగయ్య అల్లం పెళ్లి కొండల్ సుధీర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ: ప్రజా సమస్యల పరిష్కారమే ఏ జండగా పనిచేస్తాం: సిపిఎం పార్టీ

ప్రజా సమస్యల పరిష్కారమే      ఏ జండగా పనిచేస్తాం

పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీని విస్తరించాలి

    కమ్యూనిస్టులకు ఓట్లు సీట్లు ముఖ్యం కాదని ప్రజా సమస్యల పరిష్కారమే ఏజండగా ముందుకు వెళ్లాలని సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం పిలుపునిచ్చారు

      గురువారం రాత్రి నల్లగొండ పట్టణంలోని 11వ వార్డు కతాలగుడెంలో సిపిఎం 11వ వార్డు శాఖ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ తెలంగాణలో నియంత పాలన అంతరించి ప్రజా పాలన ప్రారంభం కావడం అభినందనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఐదు అమలు చేయడానికి తీసుకుంటున్న దరఖాస్తులు విచారణల పేరుతో కాలయాపన చేయకుండా తక్షణమే అర్హులందరికీ అమలు జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి పొందుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఆధార్ కార్డు ప్రాతిపదికన నగదు చెల్లింపు వ్యవస్థ తీసుకురావడం ద్వారా ఉపాధి కూలీలు పనికి అర్హత కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ పట్టణ ప్రాంతాలకు విస్తరింపజేసి పట్టణ పేదలకు ఉపాధి కల్పించాలని కోరారు.

   సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో 552 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు డ్రా ద్వారా ఎంపిక చేసి అర్హులను గుర్తించారని వారికి వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు స్వాధీనపరచాలని విజ్ఞప్తి చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని, కతాల గూడెం లోని స్మశాన వాటిక లో మౌలిక వసతులు కల్పించి, రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. సాగర్ రోడ్ నుండి కొత్తపెల్లి కాల్వ వరకు నాలుగో వరుసల రోడ్లు, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ,కతాలగూడెం నుండి మామిల్లగూడెం మీదుగా గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వరకు రెండు వరుసల తారు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాలనీలలో అంతర్గత సిసి రోడ్లు నిర్మాణం చేసి డ్రైనేజీ నిర్మించకపోవడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. వార్డు విస్తీర్ణానికి అనుగుణంగా మున్సిపల్ కార్మికుల సంఖ్య పెంచాలని అధికారులను కోరారు.

      ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యురాలు దండెంపల్లి సరోజ, 11వ వార్డు శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య,శాఖ సభ్యులు దండెంపల్లి మారయ్య, యాదయ్య ,పల్లె నగేష్, కృష్ణ, చంద్రబాబు, జానమ్మ,తదితరులు పాల్గొన్నారు