/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz 100 ఎకరాల్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం Yadagiri Goud
100 ఎకరాల్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం

తెలంగాణ లో కొత్త ప్రభు త్వం ఏర్పడిన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి అలోక్‌ ఆరాధే, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఎంసీ హెచ్‌ఆర్‌డీలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు.

ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవ డంతో.. కొత్తది నిర్మించా ల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి వారు తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి రేవంత్ సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

వీటిని రాజేంద్రనగర్ పరిధిలోని వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సి టీల్లోని స్థలంలో నిర్మించ డానికి అనుమతి ఇచ్చింది.

శిథిలావస్థకు చేరుకున్న తెలంగాణ హైకోర్టు భవనం

వ్యవసాయ, హార్టికల్చర్ వర్సిటీలో కొత్తగా నిర్మాణం

త్వరలోనే శంకుస్థాపన చేయనున్న రేవంత్ సర్కారు

హైకోర్టు నూతన భవన సముదాయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం ప్రేమావతిపేట, బుద్వేలు గ్రామాల పరిధిలోని ఆచార్య జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చరల్, కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివ ర్సిటీలకు చెందిన 100 ఎకరాల భూమిని న్యాయ శాఖకు కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

బుద్వేలులోని 2,533 ఎకరాలను వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాల యాలకు 1966లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది.

పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండి

హైకోర్టు నూతన భవన నిర్మాణ అవసరాల దృష్ట్యా ఆ భూమిలోని 100 ఎకరా లను కొత్త భవనానికి కేటా యించాలని నిర్ణయించి నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి.. హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, న్యాయమూర్తులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా నూతన భవన సముదాయం నిర్మాణ ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. భవన నిర్మాణం ప్రతిపాదనలు, 100 ఎకరాలు అవసరం, వాటి కేటాయింపుల గురించి ఇరువురు చర్చించారు. దీనికి అనుగుణంగా భూకేటాయింపులపై సీఎం హామీ ఇచ్చారు

అస్సాంలో భూకంపం

అస్పాంలో భూకంపం సంభవించింది. మోరిగన్ లో శుక్రవారం రాత్రి 11.30గంట ల సమయంలో భూప్రకంప నలు చోటుచేసు కున్నాయి.

రిక్టర్ స్కేలుపై 3.1తీవ్రతతో భూమి కంపించినట్లు నేషన ల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. మోరిగన్ లో 10 కిలోమీటర్ లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో ఏలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. స్వల్పం గా ఆస్థి నష్టం జరిగినట్లు అధికారులు చెప్పారు. ఈ భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తిరుపతిలో శనివారం తగ్గిన భక్తుల రద్దీ

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ తగ్గింది.

ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో మాత్రమే వేచి చూస్తున్నారు.

స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడు తుందని టిటిడి అధికారులు తెలిపారు. భక్తులుస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించకుం టున్నారు.

కాగా, శుక్రవారం శ్రీవారి 57,441మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమ లలో నిన్న 20,878 మంది భక్తులు నిన్న శ్రీవారికి తల నీలాలు సమర్పించారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదా యం రూ.3.66కోట్లు వచ్చిం దని టిటిడి అధికా రులు వెల్లడించారు...

జాతీయ పక్షుల దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన: మంత్రి కొండ సురేఖ

ప్రతి సంవత్సరం జనవరి 5వ తేదీని జాతీయ పక్షుల దినోత్సవంగా జరుపు కుంటున్నామని అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొండ సురేఖ అన్నారు.

పర్యావరణ పరిరక్షణ శిక్షణ , పరిశోధనా సంస్థ ( EPTRI ) పక్షు జాతులు ఎదుర్కొంటున్న సవాళ్లపై మంత్రి ముఖ్యమైన విష యాలను ప్రస్తావించారు.

పర్యావరణ సమ తుల్య తను కాపాడు కోవడంలో పక్షులు పోషించే కీలక పాత్ర, అవి ఎదుర్కొనే సమస్య లను పరిష్కరించాల్సిన ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు.

ఆ దిశగా అవగాహన పెంచడం కొరకు ఈ రోజును జనవరి 5వ తేదీ జరుపు తున్నామని మంత్రి అన్నా రు. దీనికి సంబంధిం చిన అవగాహన, విజ్ఞాన పోస్ట ర్‌ను పర్యావరణ పరిరక్షణ శిక్షణ , పరిశోధనా సంస్థ సిద్ధం చెయ్యడం జరిగిం దన్నారు.

ఆ పోస్టర్‌ను తన చేతుల మీదుగా ఆవిష్కరిం చడం చాలా సంతోషంగా వుందని మంత్రి కొండా సురేఖ అన్నారు...

హైజాక్‌కు గురైన నౌకలోకి భారత నేవీ కమాండోలు..!

హిందూ మహా సముద్రంలో లైబీరియా జెండా కలిగి ఉన్న ఓ నౌక (MV LILA NORFOLK) గురువారం సాయంత్రం హైజాక్‌కు గురైంది. ఈ విషయం తెలుసుకున్న భారత నావికాదళం ఐఎన్‌ఎస్‌ చెన్నై యుద్ధ నౌకను రంగంలోకి దింపింది..

హెలికాప్టర్‌ ద్వారా హైజాకర్లకు హెచ్చరికలు జారీ చేశామని అధికారులు తెలిపారు. బందీలను విడిపించేందుకు నేవీ కమాండోలు హైజాక్‌కు గురైన నౌకలోకి ప్రవేశించి, కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

గురువారం సాయంత్రం గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి అక్రమంగా ప్రవేశించారని యూకే మారిటైమ్‌ ఏజెన్సీకి సందేశం పంపడంతో ఈ హైజాక్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నౌకలోని 15 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది..

Chandrababu: రాష్ట్రాన్ని కాపాడుకుందాం రా.. కదలిరా!: చంద్రబాబు

కనిగిరి: రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపితేనే తెలుగుజాతికి పూర్వ వైభవం వస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. జనసేనతో (Janasena) కలిసి సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం పార్టీ (TDP) శ్రీకారం చుట్టింది..

'రా.. కదలి రా..' (Ra kadali Ra) పేరుతో శుక్రవారం ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని కనిగిరిలో నిర్వహించిన సభకు చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సైకో ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి మళ్లీ మంచి రోజులు రావాలని సంకల్పం చేయాలని కొత్త ఏడాది సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ''ఆనాడు ఎన్టీఆర్‌ తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలి రా! అని పిలుపునిస్తే ఒక ప్రభంజనమైంది. ఈరోజు మీ అందరి సహకారం అడుగుతున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా.. కదలిరా! అని పిలుపునిస్తున్నా. నేను.. పవన్‌ కల్యాణ్‌ మాత్రమే కాదు.. రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి సమష్టి బాధ్యత..

ఎమ్మెల్యేలు.. ఎంపీలకు బదిలీలు ఉంటాయా?

''రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలే. ఒక్క ఛాన్స్‌ అన్నారని జగన్ మాయలో పడ్డారు. పాదయాత్రలో అందరికీ ముద్దులు.. ఇప్పుడేమో పిడిగుద్దులు. కుటుంబ పెద్ద బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. మేం ఐటీ ఆయుధం ఇస్తే.. జగన్‌ రూ.5వేల ఉద్యోగం ఇచ్చారు. పాలన సమర్థంగా ఉంటే కరెంట్‌ ఛార్జీలు పెంచే అవసరం లేదు. ఎక్కడ చూసినా పన్నుల భారం పెరిగింది. తెదేపా పాలనలో ఇసుక ఉచితంగా ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ ప్రజలే కట్టాలి. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు బదిలీలు ఉంటాయని ఊహించలేదు. యర్రగొండపాలెంలోని చెత్త.. కొండపిలో బంగారం అవుతుందా? మన రాష్ట్రంలో అద్భుతమైన వనరులు ఉన్నాయి. 2029 నాటికి ఏపీ నంబర్‌ వన్ కావాలని ప్రణాళికలు రచించాం. నా అనుభవంతో రాష్ట్రాన్ని బాగుచేస్తా'' అని చంద్రబాబు తెలిపారు..

మహబూబ్‌నగర్‌ ప్రమాదం.. ఆరుగురు మృతి, ఉద్రిక్తత

మహబూబ్‌నగర్‌ జిల్లా: వారం సంత దినం కావడంతో కూరగాయలు, సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది..

ఇందులో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా బైక్‌పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో చోటు చేసుకుంది..

చౌరస్తాలో పోలీసు సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో ఈ ప్రమాదానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. మృతులంతా మండలంలోని మోతి ఘనాపూర్ గ్రామానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..

ఈ సంఘటనలో చిన్న పిల్లలు సైతం ప్రమాదానికి గురై మృత్యువాత పడటంతో హృదయ విదారక దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. డీసీఎం వాహనం హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళ్తుండగా నడి చౌరస్తాపై ఆటోను అత్యంత వేగంగా ఢీకొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు..

ఉద్రిక్తత.. డీసీఎంకు నిప్పు..

బాలానగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఆరుగురు మరణానికి కారణమైన డీసీఎంకు స్థానికులు నిప్పుపెట్టారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా 5 కిల్లోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి..

వైఎస్సార్సీపీ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా

చిత్తూరు జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం తనకు సీటు లేదని బయటకు పంపించేశారు. నాకు నమ్మించి మోసం చేశాడని, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

నేను రాయదుర్గం నుంచి, నా భార్య కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తామని ప్రకటించారు.

రక్తంతో సంబంధం లేకుండా చెమటతో సుగర్ టెస్ట్

సాధారణంగా షుగర్ టెస్ట్ చేయాలంటే రక్తం అనేది అవసరం. కానీ రక్తం అవసరం లేకుండా మానవుని చెమటను పరీక్షించి నిమిషంలోనే సుగర్ టెస్ట్ రిజల్ట్ తెలుసుకునే ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు కనుగొన్నారు.

ఈ పరికరం పనితీరు రెండేళ్ల పాటు పరీక్షించిన ఇండియన్ పేటెంట్ అథారిటీ ఇటీవల శ్రీనివాసరావుకి పేటెంట్ హక్కులు జారీ చేసింది.

జీవ రసాయన శాస్త్రంలో పీహెచ్డీ చేసిన ఈయన ప్రస్తుతం ఐఐటి కాన్పూర్లో సైంటిస్ట్ గా పని చేస్తున్నారు. నాలుగేళ్లు కష్టపడి ఈ పరికరాన్ని తయారు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు.

దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ

వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి దేశంలో నెం.1 సంపన్నుడిగా నిలిచారు.

అదానీకి అనుకూలంగా సుప్రీం తీర్పు రావడంతో ఆయన కంపెనీల షేర్లు పెరిగాయి.

ఇవాళ ఉ.9.30 గంటలకు అదానీ సంపద 97.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.

ఇదే సమయంలో ముకేశ్ అంబానీ ఆదాయం 97 బిలియన్ డాలర్ల వద్ద ఉంది.

అటు ప్రపంచ సంపన్నుల లిస్టులో అదానీ 12, అంబానీ 13వ స్థానాల్లో ఉన్నారు.