/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: తెలంగాణలో MLA కోటా MLC ఎన్నికల నోటిఫికేషన్ విడుదల Mane Praveen
TS: తెలంగాణలో MLA కోటా MLC ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ను విడుదల చేసింది.బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు శాసన సభ ఎన్నికల్లో గెలుపొందడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నెల 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. 18వ తేదీన నామినేషన్ల గడువు ముగియనుంది. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఇస్తారు. 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

YBD: ప్రజా పాలన ద్వారా సంక్షేమ పథకాలను పేదలకు: మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

యాదాద్రి జిల్లా:

చౌటుప్పల్: పట్టణ కేంద్రంలోని

17,18 వార్డులో ప్రజా పాలన అభయహస్తం 06 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి, సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారథ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలన ప్రవేశ పెట్టడం జరిగింది. దరఖాస్తుల స్వీకరణ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

అర్హులైన ప్రతి పేద కుటుంబం కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాలు అందరికీ చెందుతాయని అన్నారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తె అభివృద్ధి జరుగుతుంది అని నమ్మి ప్రజలు అవకాశం ఇచ్చారు, ఇచ్చిన మాట ప్రకారం ప్రజల వద్దకు రావడం జరిగినది అన్నారు.

మహాలక్ష్మీ పథకం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఉచిత కరెంట్, 500 రూ.ల గ్యాస్, గృహ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ప్రతి పేద కుటుంబం బాగుపడుతుంది అని అన్నారు..

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి, ఎస్ఐ ధనుంజయ, కౌన్సిలర్ గోపగొని లక్ష్మణ్, కామిశెట్టి శైలజ భాస్కర్, నాయకులు పెద్దగొని రమేష్, వీరమల్ల సతయ్య, తడక అమర్, రహీమ్, చప్పిడి శ్రీనివాస్ రెడ్డి, ఆరిఫ్, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

Mane Praveen

కోర్టు లైవ్ లో మహిళా జడ్జి పై దాడి.. అమెరికాలోని ఓ కోర్టులో విచారణ జరుగుతుండగా ముద్దాయి రెచ్చిపోయాడు. తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని ఏకంగా మహిళా జడ్జి పై దాడికి దిగాడు. తీర్పు ఇచ్చిన వెంటనే కోర్టులోన

Viral video: కోర్టు లైవ్ లో మహిళా జడ్జి పై దాడి
కోర్టు లైవ్ లో మహిళా జడ్జి పై దాడి.. అమెరికాలోని ఓ కోర్టులో విచారణ జరుగుతుండగా ముద్దాయి రెచ్చిపోయాడు. తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని ఏకంగా మహిళా జడ్జి పై దాడికి దిగాడు. తీర్పు ఇచ్చిన వెంటనే కోర్టులోనే జడ్జి పైకి అమాంతం దూకి దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆ వ్యక్తిని పక్కకు లాగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
NLG: చలో ఢిల్లీ.. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చలో పార్లమెంట్ ముట్టడి కరపత్రాల ఆవిష్కరణ

నల్లగొండ జిల్లా, దేవరకొండ డివిజన్:

కొండమల్లేపల్లి : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ చలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రామావత్ లక్ష్మణ్,బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. భారతదేశ విద్య రంగాన్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడాలనే లక్ష్యంతోటి, జనవరి 12న ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

భారత దేశంలో బిజెపి అధికారంలో వచ్చిన తర్వాత ఉన్నత విద్య పై ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంటుందని, బిజెపి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం, రాజ్యాంగ స్ఫూర్తి కి భావవ్యక్తీకరణ భిన్నంగా నూతన విద్యా విధానం పేరుతో విద్యారంగాన్ని కాషాయకరణం కొరకు ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. సిలబస్ మార్పులు చేసి ఆర్ఎస్ఎస్ భావజాలతో పాఠ్యాంశాలు నింపే ప్రయత్నం చేస్తున్నారని, విద్యారంగంలో అన్ని కీలకమైన పోస్టులలో ఆర్ఎస్ఎస్ బిజెపి సంబంధించిన వ్యక్తులను నింపుతున్నారని.. అందుకే ఈ సవాళ్లను స్వీకరిస్తూనే దేశంలో విద్యార్థి ఉద్యమాల ఊపును కొనసాగించడం అత్యవసరం, అందుకే దేశంలో లౌకిక ప్రజాస్వామ్య ప్రగతిశీల 16 విద్యార్థి సంఘాల అన్ని ఒకే వేదికపై వచ్చి యునైటెడ్ స్టూడెంట్ ఆఫ్ ఇండియా పేరుతో యునైటెడ్ స్టూడెంట్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి, భారత దేశంలో విద్యా ఉపాధి రంగాన్ని రక్షించే పోరాటాన్ని బలోపేతం చేయడంలో చేతులు కలపాలని విద్యార్థుల్లోకానికి పిలుపునిస్తున్నామని అన్నారు.

అదేవిధంగా భారత ప్రజాస్వామాన్ని రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్న విద్యార్థి లోకానికి, ఈ పార్లమెంట్ మార్చ్ నిర్వహణకు ఆర్థిక, హార్దిక సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కొండమల్లేపల్లి మండల అధ్యక్ష కార్యదర్శిలు జై చరణ్, కొర్ర లక్ష్మణ్ నాయక్, మండల ఉపాధ్యక్షులు రామావత్ గోపి, రోహిత్, వికాస్, రాకేష్, మానస, మహేశ్వరి, లలిత, సంధ్య, శివ గణేష్, రాహుల్, నవీన్, సాయి, టిల్లు, వరుణ్, తదితరులు పాల్గొన్నారు.

TS: వీఆర్ఏ లకు తీపి కబురు తెలిపిన ప్రభుత్వం

తెలంగాణ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులకు వరుస తీపి కబుర్లు అందజేస్తుంది. ప్రతి నెల 05 లోపు జీతాలు అందజేస్తామని చెప్పినట్లే, ఈ నెల జీతాలు వారి ఖాతాల్లో వేసి వారిలో సంతోషం నింపింది. ప్రభుత్వం ఇప్పుడు వీఆర్ఏ లకు తీపి కబురు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగులో ఉన్న వీఆర్ఏ ల జీతాలకు క్లియరెన్స్ ఇచ్చింది. వివిధ శాఖల్లో విలీనమైన 15,560 మంది, రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరీ పోస్టుల ద్వారా పని చేస్తోన్న వారందరికీ.. పెండింగులో ఉన్న ఏడు నెలల వేతనాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను సీసీఎల్ఏ ఆదేశించారు.

బుధవారం ఇందుకు సంబంధించి మెమో జారీ చేశారు. జీవో నం. 81, 85 ల ద్వారా వివిధ శాఖల్లో గ్రేడ్ సర్వీసెస్/రికార్డు అసిస్టెంట్స్/ జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. వారందరికీ రెగ్యులర్ పే స్కేల్‌ని అమలు చేయాలని నిర్ణయించారు. కొన్ని నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వీఆర్ఏలకు ఉపశమనం లభించింది.

TS: పాఠశాల లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా పాఠశాల లకు సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు జనవరి 12 నుండి 17 వరకు ఉంటాయని తెలిపింది.

మిషనరీ స్కూల్స్ మినహా అన్ని పాఠశాలలకు ఈ సెలవులు ఉంటాయని పేర్కొంది. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి 16న కనుమ పండుగలు ఉన్నాయి.

NLG: ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ కందుకూరి వెంకటేశ్వర్లు

నల్లగొండ: ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఆరు వార్డులలో ప్రజా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం 25, 26, 27, 28, 29, 30 వార్డులలో వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు.

మున్సిపల్ కమిషనర్ కందుకూరి వెంకటేశ్వర్లు వార్డ్ నెం.25 అబ్బాసియా కాలనీలోని అంగన్వాడి సెంటర్ దగ్గర నిర్వహించిన ప్రజా పాలన వార్డు సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా వార్డ్ నెం. 26 గాంధీ పార్క్, వార్డ్ నెం.27 షేర్ బంగ్లా, వార్డ్ నెం.28 యాదవ సంఘం, వార్డ్ నెం. 29 లైన్ వాడి అర్బన్ హెల్ప్ సెంటర్ దగ్గర మరియు వార్డ్ నెం.30 కమ్యూనిటీ హాల్ లలో వార్డు సభ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈరోజు ప్రజా పాలనలో 5565 దరఖాస్తులను ప్రజల వద్ద నుంచి స్వీకరించారు. ఇప్పటివరకు మొత్తం

26854 దరఖాస్తులు ప్రజల వద్ద నుండి స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వార్డ్ ఆఫీసర్లు దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. కొత్త రేషన్ కార్డుల గూర్చి ప్రభుత్వం వద్ద నుంచి ఎటువంటి ఫార్మేట్ రాలేదని, వాట్స్అప్ లలో వచ్చే ఫార్మేట్ ను ప్రజలు ఎవరు నమ్మొద్దని స్పష్టం చేశారు.

జిరాక్స్ సెంటర్లకు వెళ్లి ఇందుకు సంబంధించి ఎటువంటి దరఖాస్తు ఫారాలను తీసుకోవద్దని సూచించారు. అందుబాటులో కావలసినన్ని దరఖాస్తులను ఉంచామని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.  

6వ తేదీ వరకు ప్రజా పాలన కొనసాగుతుందని ప్రజలు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు సంబంధిత వార్డు కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు, వార్డ్ ప్రజలు మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

NLG: YRP ఫౌండేషన్ - చత్రపతి శివాజీ క్రికెట్ క్లబ్ ప్రారంభోత్సవం

ఈరోజు నల్గొండ పట్టణంలోని YRP ఫౌండేషన్ కార్యాలయంలో నూతన క్రికెట్ క్లబ్ ను ప్రారంభించారు.

వై ఆర్ పి ఫౌండేషన్ మరియు చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా క్రికెట్ క్లబ్ ను ఆరంభించి, ఫ్రీడమ్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో గ్రాస్ రూట్ లెవెల్ క్రికెట్ క్రీడాకారులను తయారు చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంత క్రికెట్ క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేయడానికే ఈ క్లబ్ ను ప్రారంభించడం జరిగింది.

నూతన క్రికెట్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైఆర్పి ఫౌండేషన్ నల్గొండ జిల్లా కన్వీనర్ యామ దయాకర్ పాల్గొని లోగో ను ఆవిష్కరించి, క్రీడాకారుల మధ్యన కేక్ కట్ చేసి క్రికెట్ క్లబ్ ను ఆరంభించి, అనంతరం మాట్లాడుతూ.. మా యొక్క వైఆర్పి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మరియు గ్రామీణ నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకై ఆర్థిక సహాయం, అనారోగ్యం బారినబడిన నిరుపేద వారికి హాస్పటల్ ఖర్చులకు చేయూత నివ్వడమే, కాకుండా ఫుట్బాల్, కబడ్డీ క్రీడాకారులకు గత 5 సంవత్సరాలుగా సహకారం అందిస్తున్నామని, ఆ క్రమంలోనే ఈరోజు క్రికెట్ క్లబ్ ను ప్రారంభించామని తెలిపారు.

నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్ గా హరిచందన ఐఏఎస్

నల్లగొండ జిల్లాకు కలెక్టర్ గా దాసరి హరిచందన, ఐఏఎస్ ను ప్రభుత్వం నియమించింది. గతంలో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన ఆర్ వి కర్ణన్ ఐఏఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ కు డైరెక్టర్ గా బదిలీ చేసింది. ఈయన స్థానంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గా హేమంత్ కేశవ్ పాటిల్, ఐఏఎస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

ఇటీవల జిల్లా ఎస్పీగా చందనా దీప్తి, ఐపీఎస్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం 2010 ఐఏఎస్ బ్యాచ్ చెందిన దాసరి హరిచందన ను జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. నల్లగొండ జిల్లాకు కలెక్టర్ మరియు ఎస్పీ ఇద్దరూ మహిళలు కావడం విశేషం.

NLG:వేళకు రాని నాన్ స్టాప్ బస్సులు.. క్యూ లైన్లో వేచి ఉన్న ప్రయాణికులు

నల్లగొండ: పట్టణంలోని బస్టాండ్ లో హైదరాబాద్ కు వెళ్లే నాన్ స్టాప్ బస్సుల కోసం జనం భారీగా క్యూలైన్లు కట్టారు. దాదాపు ఒక్కొక్క లైన్ లో 60 నుంచి 70 మంది ప్రయాణికులు రెండు క్యూలైన్లలో టికెట్ల కోసం క్యూ కట్టారు. నాన్ స్టాప్ బస్సులు సరిగా అందుబాటులో లేవని సరియైన వేళలలో బస్సులు రావట్లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

ఈ పరిస్థితి ఇంతకుముందు లేదని, గత పది రోజులుగా ఉందని, ఇకనైనా ఆర్టీసీ అధికారులు స్పందించి నాన్ స్టాప్ బస్సులను సరైన వేళలకు నడిపించాలని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతున్నారు.