/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz HYD: రైలు పట్టాలపై గొడవ, రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి Mane Praveen
HYD: రైలు పట్టాలపై గొడవ, రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి

హైదరాబాద్: వారిద్దరూ ఫ్రెండ్స్ మద్యం తాగడం, గంజాయి పీల్చడం వారి హాబీ, తరచూ గొడవలు పడుతుంటారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం వారి మధ్య మళ్లీ వివాదం మొదలైంది. దీంతో రైలు పట్టాలపైకి వెళ్లారు. అక్కడ ఘర్షణ పడ్డారు. ఇదే క్రమంలో రైలు దూసుకొచ్చింది. దీంతో ట్రైన్ ఢికొని.. వారిద్దరూ అక్కడే దుర్మరణం చెందారు.

ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ పాతబస్తీ భవానీ నగర్‌లో కలకలం రేపింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. రైలు పట్టాలపై కొంతమంది గొడవ పడుతున్న సమయం లో ఒక్కసారిగా రైలు వచ్చి ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటన తర్వాత మరి కొంతమంది అక్కడ నుంచి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భవాని నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

రైల్వే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మృత దేహాలను మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

నేడు అయోధ్యకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ

న్యూ ఢిల్లీ: అయోధ్యలో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య లో వేల కోట్ల అభివృద్ధి పనులను జాతికి అంకితం చేయనున్నారు.ప్రధాని మోదీ, ఇవాళ అయోధ్యలో పర్యటించనున్నారు.15 వేల కోట్ల విలువైన అభివృద్ది పనులను ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన సందర్భంగా అయోధ్యలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారం అవుతోంది. జనవరి 22న జరిగే విగ్రహా ప్రతిష్ఠాపన కు సర్వం సిద్దమవుతోంది. ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.

అయోధ్య రామాలయం ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానిలో భాగంగా, ఇవాళ అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 11గంటల 15 నిమిషాలకు అయోధ్య ధామ్‌ రైల్వేస్టేషన్‌, మధ్యాహ్నం 12గంటల15 నిమిషాలకు ఎయిర్‌పోర్ట్‌ ను ప్రారంభించనున్నారు.

ఒంటి గంట తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోదీ. అక్కడి నుంచే సుమారు 15వేల 700 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు.ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్య నగరం విద్యుత్‌ కాంతుల్లో మెరిసిపోయింది.

TS: సీఎం రేవంత్ విదేశీ పర్యటన

జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్ లో జరిగే దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓ లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు వెళ్లనున్నారు.

TS: లోక్ సభ ఎన్నికలకు గులాబీ పార్టీ సన్నద్దం

జనవరి మూడో తేదీ నుంచి బిఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు

లోక్ సభ ఎన్నికలకు గులాబీ పార్టీ సన్నద్దం

వచ్చే నెల నుంచి సన్నాహక సమావేశాలు

• 3న ఆదిలాబాద్

• 4న కరీంనగర్

• 5న చేవెళ్ల

• 6న పెద్దపల్లి

• 7న నిజామాబాద్

• 8న జహీరాబాద్

• 9న ఖమ్మం

*10న వరంగల్

• 11న మహబూబాబాద్

• 12న భువనగిరి 

• 16న నల్గొండ

• 17న నాగర్ కర్నూలు

• 18న మహబూబ్ నగర్

• 19న మెదక్

• 20న మల్కాజ్ గిరి

• 21 సికింద్రాబాద్ మరియు హైదరాబాద్

ఢిల్లీ: ఖైదీలకు పిల్లల్ని కనే హక్కు కల్పించిన హైకోర్టు

వంశాన్ని నిలబెట్టుకునే హక్కు ఖైదీలకు ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

హత్య కేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న వ్యక్తికి.. నాలుగు వారాల పాటు పెరోల్‌ మంజూరు చేసింది. తన భర్త ద్వారా సంతానాన్ని పొందే అవకాశం కల్పించాలన్న అతని భార్య, అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటూ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

భార్య వయసు 38 ఏళ్లు, భర్త వయసు 41 ఏళ్లను ప్రస్తావిస్తూ, శిక్షా కాలం పూర్తయ్యాక ఆ దంపతులకు సంతానాన్ని పొందే వయసు మీరి పోతుందని వయో భారం వారి ఉమ్మడి ఆకాంక్షకు అవరోధంగా మారుతుందని జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ అభిప్రాయ పడ్డారు.

తన భర్త ద్వారా సంతానాన్ని పొందాలన్న భార్య హక్కును ప్రభుత్వం అడ్డుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత కేసులోని పూర్వాపరాలను పరిశీ లించిన తర్వాత ఖైదీకి తన వంశాన్ని నిలుపుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తీర్పులో వివరించారు.

అయితే దాంపత్య జీవనం కోసం అనుమతివ్వడం లేదని.. కేవలం వంశాన్ని నిలబెట్టుకోవాలన్న భార్య ఆకాంక్షను, హక్కును గౌరవిస్తున్నట్లు తెలిపారు. ఖైదీ ఇప్పటికే 14 ఏళ్లుగా జైలులో ఉన్న విషయాన్నీ న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రస్తావించారు.

పెరోల్‌ కోసం రూ.20 వేలకు వ్యక్తిగత బాండును సమర్పించడంతో పాటు ఒకరి పూచీకత్తు ఇవ్వాలని షరతు విధించారు. కోర్టు ష‌ర‌తులు పూర్తి చేయడంతో జైలు నుంచి ఆ ఖైదీని పెరోల్ పై విడుద‌ల చేశారు.

NLG: జనవరి 3న జరిగే సిపిఎం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలి: సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

జనవరి 3న నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగే సిపిఎం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శుక్రవారం చండూరు లో సిపిఎం మండల కమిటీ సమావేశం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికలలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేయాలని కోరారు.

శివన్నగూడెం: ప్రజా పాలన దరఖాస్తుకు.. భారీ సంఖ్యలో హాజరైన జనం

నల్లగొండ జిల్లా: 

మర్రిగూడెం మండలం శివన్నగూడెం గ్రామం ఈరోజు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజల వద్ద నుండి ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరించి రసీదులు అందజేస్తున్నారు.

ఎమ్మార్వో మరియు ఎంపీడీవో ఆఫీస్ అధికారులు శివన్నగూడెం గ్రామంలో కౌంటర్లు ఏర్పాటుచేసి ప్రజల వద్ద నుండి దరఖాస్తుల స్వీకరిస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు.

NLG: షెడ్యూల్ ప్రకారం రోజుకు నాలుగు గ్రామాలలో దరఖాస్తుల స్వీకరణ

నల్లగొండ జిల్లా: 

మర్రిగూడెం మండలంలో రెవిన్యూ, ఎంపీడీవో ఆఫీస్ అధికారులు రెండు టీం గా ఏర్పడి ఉదయం ఒక గ్రామంలో మధ్యాహ్నం ఒక గ్రామంలో.. మొత్తంగా రోజుకు నాలుగు గ్రామాలలో ప్రభుత్వ ఆరు గారంటీ పథకాల దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

ఈ ప్రక్రియ వచ్చే నెల ఆరవ తేదీ వరకు ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయా గ్రామాలలో దరఖాస్తులు స్వీకరించి రసీదులు ఇస్తామని అధికారులు తెలుపుతున్నారు.

NLG: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మేల్యే బాలునాయక్ కు వినతి పత్రం

నల్లగొండ జిల్లా:

దేవరకొండ: ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మేల్యే నేనావత్ బాలునాయక్ కు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, మెస్ ఛార్జీలు విడుదల చేయాలని వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రామావత్ లక్ష్మణ్, బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 7792 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని సంక్షేమ హాస్టల్లో బకాయిలో ఉన్న మెచ్చార్జీలు విడుదల చేయాలని, తెలంగాణ నూతన ప్రభుత్వం పెంచిన మెస్ కాస్మోటిక్ చార్జీలు అమలు చేయాలని, మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద విద్యార్థులకు బస్ పాస్ ఉచితంగా అందించాలని, రాష్ట్రంలో అద్దె భవనాలలో ఉన్న గురుకులాలు కస్తూర్బాలు, సంక్షేమ హాస్టల్ లకు సొంతభవనాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు .హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు ట్రంక్ బాక్సులు పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు అందించాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కృష్ణ, అనిల్, కోటేష్, అఖిల్ సంతోష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

చౌటుప్పల్: ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

చౌటుప్పల్ పట్టణంలోని 1,2,3 వార్డులో గురువారం ప్రజాపాలన కార్యక్రమాన్ని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారథ్యంలో.. అభయ హస్తం 06 గ్యారంటీల పథకాలు ప్రజలందరీకి చెందుతాయి అన్నారు. ప్రజా పాలన కోరుకుని, ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.

మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయ హస్తం ఆరు గ్యారెంటీల పై తొలి సంతకాన్ని చెసింది మన ప్రభుత్వం, కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారెంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజా పాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నామని అన్నారు.

చివరి వరుసలో ఉన్నా పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్టం, దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రజా పాలన ఉద్దేశము నిస్సహాయులకు సాయం చేయటమే.. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ వార్డుకి, మీ ఇంటికి వచ్చింది.. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతీ ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి, ACP మొగిలయ్య, CI దేవేందర్, RDO జగన్నాథం, విద్యుత్ శాఖ DE విజయభాస్కర్ రెడ్డి, AE శ్యామ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్ కొరగొని లింగస్వామీ, బత్తుల రాజ్య, బండమీద మల్లేష్, కొయ్యడ సైదులు, సుల్తాన్ రాజు, ఉబ్బు వెంకటయ్య, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, అంతటి బాలరాజు, కామిషెట్టి భాస్కర్, నాయకులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి నరసింహా, మాజీ సర్పంచి దొనకొండ ఈదయ్య, దొనకొండ క్రిష్ణ, నరసింహా, మరియు వివిధ శాఖల ఆఫీసర్స్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.