/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లి పర్యటనలో అపశ్రుతి Mane Praveen
TS: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లి పర్యటనలో అపశ్రుతి

యాదాద్రి భువనగిరి జిల్లా:

• రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లి పర్యటనలో అపశ్రుతి

• హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గాలికి ఎగిరిపడ్డ పోలీసులు.

• ఈ ఘటనలో ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీకి చెయ్యి విరగగా, ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలు

యాదాద్రి జిల్లాలో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము

యాదాద్రి: ఐదు రోజుల పర్యటనలో భాగంగా నేడు రాష్ట్రపతి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి లో పర్యటించనున్నారు. అక్కడి జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత, స్పిన్నింగ్ యూనిట్‌ను సందర్శించనున్నారు. దీనితోపాటు అక్కడే ఏర్పాటుచేసిన థీమ్ పెవిలియన్ పార్క్ ను సందర్శించనున్నారు.

రాష్ట్రపతితో కలిసి కేవలం ఆరుగురికి మాత్రమే సభావేదికపై ఆహ్వానం ఉంటుంది. గవర్నర్ తమిళి సై, రాష్ట్ర మంత్రులు సీతక్క ,తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇద్దరు అధికారులకు అవకాశం ఉండనుంది.

భూ దానోద్యమకారులైన ఆచార్య వినోభాభవే, భూదాత వెదిరే రాంచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాల వేయనున్నారు. చేనేత కార్మికులతో రాష్ట్రపతి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలుసుకోనున్నారు. చేనేత మాస్టర్ వీవర్ శివ కుమార్‌ తోను ప్రత్యేక సమావేశం కానున్నారు. తర్వాత మగ్గాలు పరిశీలించి 350 ప్రత్యేక ఆహ్వానితులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మొత్తంగా సుమారు 45 నిమిషాలపాటు పోచంపల్లిలో పర్యటించనున్నారు..

TS: 20 మంది ఐ.పీ.ఎస్‌ ల బదిలీ

తెలంగాణ డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు.. రోడ్‌సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా అంజనీకుమార్.. ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్.. రైల్వే డీజీగా మహేష్ భగవత్‌.. సీఐడీ చీఫ్‌గా శిఖాగోయల్.. జైళ్లశాఖ డీజీగా సౌమ్యామిశ్రా.. ఎస్‌ఐబీ చీఫ్‌గా సుమతి.. సీఐడీ డీఐజీగా రమేష్‌నాయుడు.. సెంట్రల్‌జోన్‌ డీసీపీగా శరత్‌చంద్ర.. కార్‌ హెడ్‌క్వార్టర్స్‌ జాయింట్‌ సీపీగా సత్యనారాయణ.. అప్పా డైరెక్టర్‌గా అభిలాష్.. మల్టీ జోన్‌ ఐజీగా తరుణ్‌జోషి.. ప్రొబేషన్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌గా కమలాసన్ రెడ్డి.. హోంగార్డ్స్‌ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర.. పోలీస్‌ హౌసింగ్‌ బోర్డ్ ఎండీగా రాజీవ్‌ రతన్.. టీఎస్‌పీఎస్సీ డీజీగా అనిల్‌ కుమార్.. ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్.. ఐజీ పర్సనల్‌గా చంద్రశేఖర్‌ రెడ్డి.. పోలీస్ హౌసింగ్ బోర్డ్ అడిషనల్ డైరెక్టర్‌గా ఎం.రమేష్.. ఎం.శ్రీనివాసులును డీజీపీ ఆఫీస్‌కి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

TS: సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఓయూ ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్

హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ కారులను గుర్తించి తగిన ప్రాధాన్యత కల్పిస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. మైనారిటీ మహిళా నాయకురాలు, ఓయూ మలిదశ ఉద్యమ నాయకురాలు డా.రేష్మా హుస్సేన్ ఓయూ ఆర్ట్స్ కళాశాల వేదికగా మంగళవారం కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఓయూ ఉద్యమ నాయకులు శంకర్, ఈశ్వర్ లాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించడం లో విఫలమైందని విమర్శించారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమ కారులను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని తెలపడం చాలా ఆనందదాయకమన్నారు. తగిన అర్హత కలిగిన ఉద్యమ కారులకు జాబ్ లలో రిజర్వేషన్, నామినేటెడ్ పదవులు కూడా కల్పించాలి అని వారు కోరారు.

TS: న్యూ ఇయర్‌ వేడుకలు రాత్రి ఒంటి గంట వరకే !

న్యూ ఇయర్‌ వేడుకలపై హైదరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు.

రాత్రి ఒంటి గంటలోపే ముగించాలని కోరారు. 

ఈవెంట్‌ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు.

అశ్లీల నృత్యాలకు అనుమతి లేదన్న పోలీసులు.. వేడుకల్లో 45 డెసిబుల్స్‌ కంటే ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలన్నారు. 

TS: 15 లక్షల ‘గృహ లక్ష్మి’ దరఖాస్తులు రద్దు

HYD: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 15 లక్షల ‘గృహ లక్ష్మి’ దరఖాస్తులను ప్రభుత్వం రద్దు చేసింది.

గృహ నిర్మాణాల కోసం రూ .3 ల‌క్ష‌లు ఇచ్చేందుకు ఈ ప‌థ‌కాన్ని ఎన్నిక‌ల ముందు అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తులు వెల్లువెత్తాయి.

తాజాగా గృహలక్ష్మి పథకం కోసం బీఆర్ఎస్ హయాం లో సేకరించిన 15లక్షల పైచిలుకు దరఖాస్తులను పరిగణించకూడదని కాంగ్రెస్ సర్కారు నిర్ణయించింది.వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలని భావిస్తోంది. ఆ పథకానికి వచ్చిన మొత్తం పిటిషన్లలో 12 లక్షలు అర్హమైనవిగా అధికారులు గుర్తించారు.

ప్ర‌తి గ్రామంలోనూ గ్రామ స‌భ‌లు నిర్వ‌హించి అక్క‌డే ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించాల‌ని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. త్వ‌ర‌లోనే గ్రామ స‌భ‌ల తేదీల‌ను ప్ర‌క‌టించేందుకు కసరత్తు చేయనుంది.

NLG: గెస్ట్ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నల్లగొండ: ఎన్జీ కళాశాల నందు తెలుగు -01, బిబిఎ (ఈ-కామర్స్)- 01 ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టుల కొరకు.. పీజీ లో 55 % మార్కులు ఉన్నవారు, ఎస్సీ ఎస్టీ 50% మార్కులు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ తెలిపారు. నెట్/సెట్/పిహెచ్డి, బోధనా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. అభ్యర్ధులు తమ దరఖాస్తు ఫారాలను కళాశాలలో అందజేయడానికి చివరి తేది ఈ నెల 22. ఇంటర్వ్యూ ఈనెల 23న ఉంటుందని చెప్పారు. దరఖాస్తుకు సంబంధిత విద్యార్హత ల సర్టిఫికెట్ చేయాలని తెలిపారు. 

TS: టాలెంట్ ఆఫ్ ది ఇయర్ 2023లో.. పది రికార్డులు సొంతం చేసుకున్న దళిత రత్న బుర్రి వెంకన్న

నల్గొండ జిల్లా, పిఏ పల్లి మండలం, దుగ్యాల గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, దళిత రత్న బుర్రి వెంకన్న.. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ తో 10 వరల్డ్ రికార్డ్స్ అవార్డ్స్ ల పురస్కారాలను మయూరి ఆర్ట్స్ ద్వారా అందుకున్నారు.

హైదరాబాదులోని భారతీయ విద్యా భవన్ లో మయూరి ఆర్ట్స్ అధినేత రాధా మరియు దత్తు నేతృత్వంలో, టాలెంట్ ఆఫ్ ది ఇయర్ 2023 కార్యక్రమంతో 

ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్,

ఇంటర్నేషనల్ కోహినూర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్,

ఇంటర్నేషనల్ డైమండ్ వరల్డ్ రికార్డ్,

ఇంటర్నేషనల్ గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్,

ఇంటర్నేషనల్ జై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్,

ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు,

ఇంటర్నేషనల్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్,

ఇంటర్నేషనల్ విశ్వం వరల్డ్ రికార్డ్,

ఇంటర్నేషనల్ స్టేట్స్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా,

ఇంటర్నేషనల్ ప్లాటినం బుక్ ఆఫ్ రికార్డ్స్ తో 

మయూరి ఆర్ట్స్ ప్రతిష్టాత్మకంగా ఇంటర్నేషనల్ స్థాయిలో చరిత్రను సృష్టిస్తూ.. అత్యున్నత స్థాయిలో ప్రతిష్టాత్మకంగా, ఈ పది వరల్డ్ రికార్డ్స్ గౌరవ పురస్కార అవార్డులు 290 మందికి వివిధ రంగాలలో ప్రతిభ మరియు సేవలను అందిస్తున్న వ్యక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. లైన్ సాయి వెంకట్, సీనియర్ తెలుగు సినిమాల ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ డా. బింగి నరేందర్ గౌడ్ ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియన్ చీప్ కోఆర్డినేటర్, డా.సుభాషిని హైకోర్టు సీనియర్ న్యాయవాది విశ్వం వరల్డ్ రికార్డ్ కోఆర్డినేటర్ సాయి ప్రియ గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్ చీఫ్ కోఆర్డినేటర్ ల చేతుల మీదుగా.. దళిత రత్న బుర్రి వెంకన్న ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర శాఖ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు, మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని వారి జయంతి కార్యక్రమాల ద్వారా చరిత్ర పోరాటాలను సమాజానికి పరిచయం చేస్తూ, ప్రజా హక్కుల పరిరక్షణ కొరకు న్యాయబద్ధంగా పోరాట కార్యక్రమాలు, అంబేద్కర్ ఆశ సాధన కోసం సామాజిక ఉద్యమ కార్యక్రమాలు, నిర్వహిస్తున్నందుకు గాను, గతంలో దళిత రత్న అవార్డు మరియు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డు లను అందుకొని ముందుకెళుతున్న బుర్రి వెంకన్న సేవా కార్యక్రమాల్ని పరిశీలించి.. ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు తో పది వరల్డ్ రికార్డ్స్ గౌరవ అవార్డు పురస్కారాన్ని వెంకన్న కు అందించి ఘనంగా సన్మానించారు. ఈ అవార్డ్స్ ను అందుకున్న దళిత రత్న బుర్రి వెంకన్న సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ అవార్డ్స్ అందించిన మయూరి ఆర్ట్స్ సంస్థ వారికి వివిధ వరల్డ్ రికార్డ్స్ అధినేత లకు అభివందనాలతో కృతజ్ఞతలు తెలిపారు.

TS: నేడు సింగరేణి ఎన్నికలపై హైకోర్టు లో విచారణ

హైదరాబాద్: సింగరేణి ఎన్నికలపై నేడు హైకోర్టు లో విచారణ. ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారం ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు జరగాల్సివుంది, అయితే 27న జరిగే సింగరేణి ఎన్నికలను వాయిదా వెయ్యాలని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ చేయనుంది.

NLG: త్వరలో నల్గొండలో చత్రపతి శివాజీ క్రికెట్ క్లబ్ ను ప్రారంభిస్తాం: గిరిబాబు

గ్రామీణ ప్రాంతాలలోని క్రికెట్ క్రీడాకారులకు చేయూతనిచ్చి వారిని వెలుగులోనికి తీసుకురావాలనే ఉద్దేశంతో త్వరలో.. నల్గొండలో చత్రపతి శివాజీ క్రికెట్ క్లబ్ ను ప్రారంభిస్తున్నామని చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబుతెలిపారు. నల్గొండ ఫ్రీడమ్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో గ్రాస్ రూట్ లో క్రికెట్ క్రీడాకారులను తయారు చేస్తామని వారు తెలిపారు. గత 10 సంవత్సరాల క్రితం చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ను స్థాపించి ఎంతోమంది కబడ్డీ, ఫుట్బాల్ క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో వెలుగులోకి తీసుకురావడమే కాకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అకాడమీ క్రీడాకారులను తయారు చేశామని ఆయన తెలిపారు.