/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా టీజేఎస్ నాయకులు Mane Praveen
NLG: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా టీజేఎస్ నాయకులు

నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం ను తెలంగాణ జన సమితి నల్గొండ జిల్లా శాఖ కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగినది. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, కార్యదర్శి పులి పాపయ్య విద్యార్థి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధీరావత్ వీర నాయక్ టీజేఎస్ జిల్లా నాయకులు ఎన్ బచ్చిరెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

TS: ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ సస్పెన్షన్ ఎత్తివేత

TS: ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా, ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగానే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని, డీజీపీ హోదాలో ఉన్న అంజనీ కుమార్ కలుసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆయనతో చర్చ జరపడంతో ఈసి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితంగా ఈసీ అంజనీ కుమార్ ను సస్పెండ్ చేసింది. దీనిపై ఈసీకి వివరణ ఇచ్చుకున్న ఆయన ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లానని, మరోసారి ఇలా జరగదని అంజనీకుమార్ హామీ ఇచ్చారు. దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ సమాచారం ఇచ్చింది. అయితే ఆయన ఏ హోదాలో ప్రభుత్వంలో కొనసాగుతారో వేచి చూడాల్సిందే.

NLG: నాగార్జునసాగర్ నియోజకవర్గ ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా అన్వరుద్దీన్

నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి ,ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు అంబటి సోమన్న లు మంగళవారం నాగార్జునసాగర్ నియోజకవర్గ ఐఎన్టియుసి అధ్యక్షుడిగా హాలియా పట్టణానికి చెందిన షేక్ అన్వరుద్దీన్ కు నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా అన్వరుద్దిన్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి,ఐఎన్టియుసి జాతీయ అధ్యక్షులు జి.సంజీవరెడ్డి, ఐఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుందూరు రఘువీర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కర్ణాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి మరియు నియోజకవర్గ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు అని తెలిపారు. ఐఎన్టీయూసీ, కాంగ్రస్ పార్టీ బలోపేతానికి, కృషి చేస్తానని మరియు సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు మోయుద్దిన్, నియోజకవర్గ ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షులు సాజిద్, మైనార్టీ నాయకులు షకీల్ బాబా, శర్ఫుద్దిన్, అబ్దుల్ బిన్ సోహెల్ పాషా తదితరులు పాల్గొన్నారు.

TS: పోలీస్ కమిషనర్లకు స్థానచలనం..రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబు

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నియమించింది. అదేవిధంగా సైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా అవినాష్ మహంతి, రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబును నియమించింది. అయితే హైదరాబాదు పాత సీపీ సందీప్ శాండిల్య ను నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇక సైదరాబాద్, రాచకొండ ప్రస్తుత సిపి లైన స్టీఫెన్ రవీంద్ర, చౌహన్ లను డిజిపి ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

HYD: యశోద ఆస్పత్రిలో కెసిఆర్ ను పరామర్శించిన మెగాస్టార్ చిరంజీవి
TS: భారమైన హృదయంతో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన కోమటిరెడ్డి

తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు తన పార్లమెంటు సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటూ రాజీనామా పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.భువనగిరి ఎంపిగా తాను ప్రజలకు చేసిన సేవలు, అభివృద్ధి పనులు, 5 ఏళ్ళు గా పార్లమెంట్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఈ క్రమంలో తనకు సహకరించిన అందరినీ తలుచుకుని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

చింతపల్లి ఎస్ఐ పై సస్పెండ్ వేటు

నల్లగొండ జిల్లా, దేవరకొండ డివిజన్, 

చింతపల్లి పీఎస్ పరిధి లోని పాలెం తండాకు చెందిన సూర్య నాయక్ అనే వ్యక్తిని, భూ సంబంధిత వ్యవహారంలో చింతపల్లి ఎస్సై సతీష్ రెడ్డి జోక్యం చేసుకొని చావబాదినట్లు మృతుడి బంధువులు ఆరోపించారు.

ఎస్సై దాడితో సూర్య నాయక్   అక్కడిక్కడే మృతి చెందగా హడావిడిగా పోలీస్ వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పోస్టుమార్టం ను అడ్డుకొని మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన నిన్న జరగగా, నేడు ఎస్సై సతీష్ రెడ్డి పై సస్పెండ్ వేటు పడింది.

భూ వివాదంలో తలదూర్చి అతి ఉత్సాహం చూపించిన ఎస్సై ని ఐ.జి.పి ఆదేశాల మేరకు సస్పెండ్ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ వివాదాలు, సివిల్ విషయాలలో పోలీసులు జోక్యం చేసుకోవద్దని, ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని అన్నారు.

NLG: ఎం.జి యూనివర్సిటీ ఫుట్బాల్ జట్టు కెప్టెన్ గా బొమ్మపాల సాయి చంద్ర సిద్ధార్థ ఎంపిక
నల్లగొండ: ఈనెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఫుట్బాల్ పోటీలలో పాల్గొనే మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఫుట్బాల్ టీం కెప్టెన్ గా.. నల్గొండ పట్టణంలోని చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు బొమ్మపాల సాయి చంద్ర సిద్ధార్థ ఎన్నికయ్యాడని, ఎం.జి.యూ  ఫిజికల్ డైరెక్టర్ మురళి మరియు శ్రీనివాసరెడ్డి లకు క్లబ్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని హెడ్ కోచ్ మద్ది కరుణాకర్ తెలిపాడు.

సాయి చంద్ర సిద్ధార్థ గతంలో ఒకసారి జూనియర్ నేషనల్స్, మరియు SGF U/19 నేషనల్స్ పోటీలలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుట్బాల్ అకాడమీ కు సెలెక్ట్ కావడం జరిగిందని, కర్నూల్ అకాడమి కోచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ క్రీడలో ప్రతిభ కనబరిచి, గతంలో 3సార్లు 2020, 2021, 2022 సంవత్సరాలలో కూడా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఫుట్బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడని మద్ది కరుణాకర్ తెలిపారు.

ఈ సందర్భంగా చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మ పాల గిరిబాబు మరియు సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు సాయి చంద్ర సిద్దార్ధ ను ప్రత్యేకంగా అభినందించారు.
TS: తెలంగాణలో 54 కార్పొరేషన్ల ఛైర్మన్‌ ల నియామకాలు రద్దు

హైదరాబాద్‌: రాష్ట్రంలో పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

డిసెంబరు 7న తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నియమించిన కార్పొరేషన్‌ ఛైర్మన్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

TS: ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచే!

తెలంగాణలో ఇంటర్ పరీక్షలను ఈ ఏడాది కాస్త ముందుగానే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్ పరీక్షలను మార్చి 1 నుంచి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.

పార్లమెంట్ ఎన్నికలు, ఇంటర్ తర్వాత 10వ తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండడంతో పాటు పలు కారణాలతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రి ఆమోదం తర్వాత షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే చాన్స్ ఉంది.