/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇచ్చిన టిడిపి నాయకులు Mane Praveen
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇచ్చిన టిడిపి నాయకులు
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం:
అసెంబ్లీ ఎన్నికలు నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గ టిడిపి ఇంచార్జీ జక్కలి ఐలయ్య యాదవ్ అధ్యక్షతన, చౌటుప్పల్ లోని టిడిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టీడీపీ శ్రేణుల ఆహ్వానం మేరకు  చౌటుప్పల్ లోని టిడిపి కార్యాలయానికి వెళ్లిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాజగోపాల్ రెడ్డి వ్యక్తిత్వం చూసి పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి ఆయనను గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఎన్నికలో నా మీద అభిమానంతో వ్యక్తిగతంగా నాకు సహకరించిన వారికి మరియు తెలుగుదేశం పార్టీ తరపున నాకు మద్దతు ప్రకటిస్తున్న వారికి పేరు పేరునా అందరికీ ధన్యవాదాలు రాజ్ గోపాల్ రెడ్డి అని తెలిపారు.
TS: కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తమ్ముడు పై దాడి.. కంటతడి పెట్టిన బర్రెలక్క...

నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ నియోజక వర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క (శిరీష).. తమ్ముడు పై నిన్న దాడి జరిగింది. ఒక 25 ఏళ్ల నిరుద్యోగి, పేదింటి బిడ్డ, అనేక రకాల కష్టాలు చవిచూసిన విద్యార్థిని, ఉద్యోగం కోసం పరీక్షలకు ప్రిపేర్ అవుతూ, కొంతకాలం హైదరాబాద్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుని హాస్టల్లో ఉండి చదువుకున్నా.. నోటిఫికేషన్లు సరిగా రాకపోవడం, వచ్చిన నోటిఫికేషన్లు కొన్ని రద్దు కావడం, పలు కారణాలతో విసిగివేసారిన ఈ అమ్మాయి.. ఎమ్మెల్యే నోటిఫికేషన్ పడిందని అప్లై చేసుకొని కొల్లాపూర్ ఎమ్మెల్యే బరిలో నిలిచింది. 

కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శిరీష సోషల్ మీడియాలో గతంలో చేసిన ఓ వీడియో బాగా వైరల్ అయి బర్రెలక్క గా పేరుపొందింది. ఆ వీడియో ద్వారా ఆమె పబ్లిక్ లో విశేష ఆదరణ పొందింది. ఎమ్మెల్యే బరిలో దిగిన ఈమెకు విద్యార్థులు, నిరుద్యోగుల నుండి బాగా మద్దతు లభించింది. ప్రచారానికి స్వచ్ఛందంగా కొంతమంది చందాలు సైతం ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే బరిలో ఉన్న తనను మానసికంగా దెబ్బతీయాలని తన తమ్ముడి పై ప్రత్యర్ధులు దాడి చేశారని మీడియాతో నిన్న ఆమె వెల్లడించారు. 

నియోజకవర్గ సమస్యల పైన, రాష్ట్ర సమస్యల పైన అవగాహన తనకు ఉందని, నియోజకవర్గ ప్రజల ప్రధాన సమస్యలను తను తీరుస్తానని తనను గెలిపించాలని ప్రచారం మొదలు పెట్టిందో లేదో ఆమె తమ్ముడు పై దాడి జరిగింది. అయితే తన ఎదుగుదలను చూసి తట్టుకోలేకనే ప్రత్యర్ధులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు ఆమె అన్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని నిన్న రాత్రి పోలీసులను కోరారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

NLG: బెహన్ జీ కుమారి మాయావతి సభకు బయలుదేరిన బిఎస్పి సాగర్ నియోజకవర్గ నాయకులు

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా, నేడు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బెహన్ జీ కుమారి మాయావతి.. సూర్యాపేట లో జరిగే బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న సందర్భంగా సాగర్ నియోజకవర్గం హాలియా పట్టణ కేంద్రం నుండి సూర్యాపేట కు బీఎస్పీ నాయకులు బయలుదేరారు.

ఈ సందర్భంగా బిఎస్పీ సాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లు ... మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లో పేద , బడుగు , బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పని చేసే నిజమైన పార్టీ కేవలం బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే అని అన్నారు. సాగర్ నియోజకవర్గం లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఏనుగు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బత్తుల ప్రసాద్, నియోజకవర్గ సహాయ కార్యదర్శి కుక్కముడి ముత్యాలు, నియోజకవర్గ మహిళా కన్వీనర్ బైరాగి విజయ, గుర్రంపోడు మండల అధ్యక్షుడు కొమ్ము రమేష్ , అనుముల మండల అధ్యక్షుడు జిల్లా మధు, నియోజకవర్గ సొషల్ మీడియా ఇన్చార్జ్ మామిడి నరేందర్ ,సంగారం గ్రామ శాఖ అధ్యక్షుడు తరి రవి తదితరులు పాల్గొన్నారు.

NLG: బిజెపికి రాజీనామా చేసిన జిల్లా కిసాన్ మోర్చ మాజీ ప్రధాన కార్యదర్శి

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం: లెంకలపల్లి గ్రామానికి చెందిన జిల్లా కిసాన్ మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి కొల్లూరు శ్రీనివాసరావు, ఈరోజు బిజెపి పార్టీకి రాజీనామా చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 16 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగినానని, క్రియాశీలకంగా పనిచేశానని, అనుకున్న స్థాయిలో పార్టీ విజయాలు సాధించలేదని మనస్తాపం చెంది తను రాజీనామా చేసినట్లు తెలిపారు. తదుపరి కార్యాచరణను త్వరలో తెలుపనున్నట్లు ప్రకటించారు.

TS: కాంగ్రెస్ లో చేరిన చేర్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాల లో వివిధ పార్టీ నాయకులు బిజీ అయ్యారు. అదేవిధంగా వివిధ పార్టీల ప్రధాన నాయకుల సమక్షంలో, పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేర్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన వివరాలు...
తెలంగాణలో 10 నియోజకవర్గాలలో  ఎన్నికల ప్రచారానికి..కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ  షెడ్యూల్ ఖరారు అయింది. నవంబర్ 24న పాలకుర్తి, హుస్నాబాద్, ధర్మపురి
నవంబర్ 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర
నవంబర్ 26 న మునుగోడు, దేవరకొండ, గద్వాల్ లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పబ్లిక్ మీటింగ్ లలో పాల్గొననున్నారు.
తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన వివరాలు...
తెలంగాణలో 10 నియోజకవర్గాలలో  ఎన్నికల ప్రచారానికి..కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ  షెడ్యూల్ ఖరారు అయింది. నవంబర్ 24న పాలకుర్తి, హుస్నాబాద్, ధర్మపురి
నవంబర్ 25న పాలేరు, ఖమ్మం, వైరా, మధిర
నవంబర్ 26 న మునుగోడు, దేవరకొండ, గద్వాల్ లలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పబ్లిక్ మీటింగ్ లలో పాల్గొననున్నారు.
NLG: మాలల ఐక్యత చాటి చూపిద్దాం: నాగిల్ల మారయ్య

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండల కేంద్రంలో మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో, ఈరోజు నాగిల్ల మారయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా మాల కులస్తులకు అన్యాయం జరుగుతుందని, ముఖ్యంగా మాలలను ఓట్లు వేయడానికి మాత్రమే వినియోగించుకుంటున్నారు. సీట్లు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. రిజర్వేషన్స్ స్థానాలలో కూడా పెత్తందారులు కలగజేసుకుని మాలలను చిన్నచూపు చూడడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మాలలకు 2,50,000 ఓట్లు ఉన్నా, అదేవిధంగా మునుగోడు నియోజకవర్గంలో 21,000 ఓట్లు ఉన్నా.. మునుగోడు నియోజకవర్గంలో పదివేల ఓట్లు ఉన్నట్లు తప్పుడు లెక్కలు చూపిస్తూ.. విద్యావంతులు, మేధావులు అయినటువంటి వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ జరగడానికి ముఖ్య కారణం మాలలో ఐక్యత లోపించడమేనని మాలలు ఐక్యంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. మాలల ఐక్యత వర్ధిల్లాలని మాలల వ్యతిరేక శక్తుల్లారా ఖబర్దార్ అని హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోరే సాయిరాం, ఇండిపెండెంట్ అభ్యర్థి కోరే యాదయ్య, మరో అభ్యర్థి వి ఆర్ పి ఎమ్మేల్యే అభ్యర్థి నూనె సురేష్, శ్రీకాంత్, మహిపాల్, ఈద అభి సందేశ్, వంపు చరణ్, రవి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RR: కాంగ్రెస్ పార్టీలో చేరిన కురిమిద్ద గ్రామ సర్పంచ్ బందే రాజశేఖర్ రెడ్డి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం:

యాచారం మండలం కురుమిద్ద గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ బందే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు

TS: బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రైతుబంధు రూ.16,000 చేస్తాం: సీఎం కేసీఆర్

నల్లగొండ: సీఎం కేసీఆర్ నేడు, నల్లగొండ పట్టణంలో ప్రజా ఆశీర్వాద సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే హక్కు.. మీ ఓటు, ఆ ఓటు సద్వినియోగం అయితే రాష్ట్రానికి మీకు మంచి జరుగుతుందని, ఆలోచించి ఓటు వేయాలని కోరారు. రాయి ఏదో రత్నమేదో గుర్తించండి. అభ్యర్థులు వారి వెనకున్న పార్టీల చరిత్ర చూడాలి. గతంలో నల్లగొండలో ఆముదం పంటలే ఉండేవి, ఇప్పుడు బ్రహ్మాండంగా వరి పంటలు పడుతున్నాయి. ప్రస్తుత 10 ఏళ్ల పాలన, గతంలోని 50 ఏళ్ల పాలన ను బెరోజి వేసుకోవాలని కోరారు.

నల్లగొండను కెసిఆర్ దత్తత తీసుకున్నట్లు ప్రజలకు గుర్తు చేశారు. నల్లగొండ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి.. 1400 కోట్ల నిధులతో ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారని, నల్లగొండకు ఐటి టవర్, మెడికల్ కాలేజ్ ని తీసుకొచ్చారని, అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కెసిఆర్ తెలిపారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తయిందని, ఉదయసముద్రం గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉందో ఆలోచించాలని కోరుతున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రైతుబంధు రూ.16,000 చేస్తామని అన్నారు. ధరణి వల్ల డైరెక్ట్ గా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయని చెప్పారు.

ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి పేదలకు మంచినీళ్లు ఇస్తున్నట్లు చెప్పారు. నల్లగొండ నియోజకవర్గ ఇంకా తన దత్తత లోనే ఉందని, రాబోయే రోజుల్లో పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని కెసిఆర్ అన్నారు. ఆర్టీసీ ని గవర్నమెంట్ లో కలిపినాము, తమ ప్రభుత్వం వస్తె, ఆటో వాళ్లకు ఫిట్నెస్ టాక్స్ రద్దు చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని కెసిఆర్ తెలిపారు.